లంకలో ఆర్థిక సంక్షోభం నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలో రాజకీయ ప్రముఖులతోపాటు పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరులకు హాని కలిగించడం వంటి చర్యలకు పాల్పడినవారిపై కాల్పులు జరపాలని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ తన సాయుధ దళాలను, పోలీసులను ఆదేశించింది,
అంతకుముందు, మంగళవారం శ్రీలంకలోని ట్రింకోమలీ నేవల్ బేస్ ముందు ప్రాణాంతక నిరసనలు ప్రారంభమయ్యాయి.
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధం నుంచి ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. రష్యా తన దాడుల తీవ్రతను మరింత పెంచుతూనే ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది.