Short News

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్‌

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్‌

కేవలం రూ. 8999 ధరలో డ్యాష్‌క్యామ్‌ అందుబాటులోకి రానుంది. పూణే ఆధారిత సేఫ్‌క్యామ్స్ డిజిటల్ ఐ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఈ కెమెరాను తీసుకువచ్చింది. R2 పేరుతో సరికొత్త డాష్ కెమెరాను ఆ సంస్థ మార్కెట్‌లోకి తీసకువచ్చింది. భారతదేశంలో మెటల్ బాడీ కలిగిన మొదటి ఎంట్రీ లెవల్ డాష్ కెమెరాగా R2 అందుబాటులో ఉండనుంది.
గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్‌

గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్‌

ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన లారెన్స్‌.. టాలీవుడ్‌ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వివిధ భాషల్లో నటించడమే కాకుండా.. హారర్‌ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సామాజిక సేవలోనూ లారెన్స్‌ ముందుంటాడు.
5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు..

5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు..

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కండక్టర్‌, ప్రయాణికుల మధ్య చిల్లర విషయంలో వాదనలు, తగాదాలు చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు కొందరు ప్రయాణికులు వారికి రావాల్సిన చిల్లర తీసుకోకుండానే వెళ్లిపోతారు. మరికొందరైతే తమకు రావాల్సింది ఇచ్చే వరకూ వదలరు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
దేశంలో ఎక్కువగా అమ్ముడవతున్న టాప్‌ 3 కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు ఇవే..

దేశంలో ఎక్కువగా అమ్ముడవతున్న టాప్‌ 3 కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు ఇవే..

దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపైనే వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇందులో హ్యుందాయ్‌, మారుతి, కియాలకు చెందిన కార్లు మాత్రమే అమ్మకాల్లో రాణిస్తున్నాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీలను గమనిస్తే ఈ కంపెనీ కార్లు మాత్రమే సత్తా చాటాయి.