సీబీఐలో లంచాధికారులు... వెలుగులోకి సంచలన అవినీతి కేసు... ఇద్దరు అధికారుల సస్పెన్షన్...
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో మరోసారి ముడుపుల వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. గతంలో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ,సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా పరస్పరం అవినీతి,అధికార దుర్వినియోగ ఆరోపణలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో సీబీఐ విశ్వసనీయతపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఇద్దరు సీబీఐ అధికారులను సీబీఐ సంస్థ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు సీబీఐ అధికారులపై సంస్థాగత చర్యలకు ఉపక్రమించింది.