ఉదయగిరి కొండల్లో బంగారం, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు; జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం జరుపుతున్న సర్వేపైనే ఉంది. కేంద్రం ఉదయగిరి ప్రాంతంలో గత కొంత కాలంగా ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుంది. ఫైనల్ గా ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం జరుపుతున్న పరిశీలనలతో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది.