'పుల్వామా ఘటన తెలిసి మోడీ తినలేదు, మంచినీళ్లు ముట్టలేదు'
ఓ వైపు పుల్వామా ఘటన జరిగి యావత్ భారతం బాధలో ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన కర్తవ్యం మరిచి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద సినిమా షూటింగులో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. పుల్వామా దాడి విషయం తెలియగానే మోడీ ఏమీ తినలేదని, తాగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వీయప్రచారం కోసం మోదీ టెలివిజన్ ఫిల్మ్ రూపకల్పనలో మునిగిపోయారని కాంగ్రెస్ చేసిన ప్రచారం అర్థరహితమని చెప్పారు. పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి ప్రధాని ఏమీ తినలేదన్నారు.