తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
ఈ సందర్బంగా ఆస్పత్రి ముందు మీడియాతో మాట్తాడారు చంద్రబాబు.
ప్రస్తుతం తారక రత్నకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ.. అక్కడికంటే బెంగళూరులో ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. తారక రత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.