Short News

చుక్క పెట్రోల్ అవసరం లేదు.. సింగిల్ ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్

చుక్క పెట్రోల్ అవసరం లేదు.. సింగిల్ ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) మార్కెట్లోకి సరికొత్త ప్లేయర్ సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రికార్డులు తిరగరాస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ మొబిలిటీ (River Mobility) మార్కెట్లో ఉన్న దిగ్గజ బ్రాండ్లు టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj), ఓలా (Ola) వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ కంపెనీ మార్కెట్లో కేవలం ఒకే ఒక్క మోడల్ రివర్ ఇండి (River Indie) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అమ్ముతోంది. అయినప్పటికీ, దీని సేల్స్ గ్రాఫ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఈ స్కూటర్ ఏకంగా 43,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసింది. జూన్ 2026 నెలలో ఈ కంపెనీ 4,436 యూనిట్ల సేల్స్‌తో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. దేశంలోని మొత్తం 175 ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలలో రివర్ మొబిలిటీ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి (Q1 2026) త్రైమాసికంలో 8వ స్థానంలో ఉన్న ఈ స్టార్టప్.. ఏప్రిల్, మే, జూన్ (Q2 2026) నాటికి ఏడో స్థానానికి ఎగబాకింది.
రూ. 20 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు!

రూ. 20 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు!

Grab the best 5G smartphone deals under ₹20,000 this July 2026 with exclusive bank discounts. బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో తక్కువ ధరకే లేటెస్ట్ 5G ఫోన్లను సొంతం చేసుకోండి.
ఐటీఆర్ రీఫండ్ స్కామ్: వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఐటీఆర్ రీఫండ్ స్కామ్: వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Beware of fake ITR refund messages targeting taxpayers. ఐటీఆర్ రీఫండ్ పేరుతో వస్తున్న నకిలీ మెసేజ్‌లు, ఫిషింగ్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి, మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండి.
2026 తొలి 6 నెలల్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు

2026 తొలి 6 నెలల్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తా చాటింది. దేశీయ మార్కెట్లో సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతోందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, డిజైర్ మాత్రం అమ్మకాల పరంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన తొలి ఆరు నెలల అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మారుతి సుజుకి డిజైర్ మొత్తం 1,26,204 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే గత ఆరు నెలల వ్యవధిలోనే 1.26 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు ఈ సెడాన్‌ను కొనుగోలు చేశారు. ఈ గణాంకాలు డిజైర్‌పై భారతీయ వినియోగదారులు ఇప్పటికీ ఎంతటి నమ్మకం ఉంచుతున్నారో తెలియజేస్తున్నాయి.