పెద్ద, చిన్న ఫ్యామిలీ కోసం హ్యుందాయ్, కియా మాస్టర్ ప్లాన్
ఆటోమొబైల్స్
- 2 hr, 31 min ago
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ మొబిలిటీ వాహనాలకు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా పెట్రోల్ భారం తగ్గించే హైబ్రిడ్ కార్లపై భారతీయ కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ముందే పసిగట్టిన దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ (Hyundai), కియా (Kia) దేశీయ హైబ్రిడ్ వెహికల్ సెగ్మెంట్లో భారీ ఎంట్రీ ఇవ్వడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి రాబోయే 2027 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో సరికొత్త హైబ్రిడ్ కార్లను పరిచయం చేయబోతున్నాయి.