టాటా ఎలక్ట్రిక్ కార్ల కోసం క్యూ కట్టిన కోట్లాది మంది భారతీయులు
ఆటోమొబైల్స్
- 2 month, 6 days ago
భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మహీంద్రా, హ్యుందాయ్ లేదా ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు రేసులో ఉన్నప్పటికీ, మెజారిటీ భారతీయులు మాత్రం టాటా ఈవీలకే పట్టం కట్టారు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) టాటా మోటార్స్ ఏకంగా 92,120 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతకుముందు ఏడాది అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కేవలం 64,276 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈ ఏడాది ఏకంగా 43 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యుత్తమ వార్షిక విక్రయాల రికార్డుగా నిలిచిపోయింది.