ఈ బైక్ ముందు సూపర్ కార్లు కూడా బలాదూర్

భారతీయ రోడ్లపై రాయల్ లుక్ కోసం పాకులాడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గెరిల్లా 450 మోడల్‌లో 2026 కోసం సరికొత్త అపెక్స్ (Apex) వేరియంట్‌ను లాంచ్ చేసింది. అస్సాంలోని గౌహతి ఘాట్ రోడ్లు, హైవేలపై ఈ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత తేలిన విశేషాలు, ఇందులో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక్కసారిగా ధరలు పెంచిన ఎంజీ.. ఏమైంది తెలుసా?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా వేగంగా ఎదిగిన బ్రాండ్‌లలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor India) ఒకటి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టిన తర్వాత, ఈ సంస్థ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. JSW Group తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత కంపెనీ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ పొత్తు ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మరింత దూసుకెళ్లిన ఎంజీ, తన బ్రాండ్ ఇమేజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది. అయితే ఈ అభివృద్ధి మధ్యలోనే కంపెనీ తాజాగా వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తను ప్రకటించింది. JSW MG Motor India ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

ఆటోగా మారిపోయే స్కూటర్.. ఇది నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరతీసింది. ఒకే వాహనం.. అవసరమైతే మూడు చక్రాల ఆటోగా, వద్దనుకుంటే రెండు చక్రాల స్కూటర్‌గా మారిపోయే అద్భుత టెక్నాలజీని మన ముందుకు తెచ్చింది. అదే హీరో సర్జ్ S32 (Hero Surge S32). ఈ వినూత్న వాహనానికి భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం లభించింది.

రేసింగ్ డీఎన్‌ఏతో కొత్త అపాచీ.. యువతకు ఫుల్ ట్రీట్!

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేలా ముందుకొచ్చింది. యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్‌కు 2026 సంవత్సరానికి సంబంధించిన అప్‌డేట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం చిన్న మార్పులతో మాత్రమే కాకుండా, మరింత ప్రాక్టికల్‌గా, స్టైలిష్‌గా, అలాగే టెక్నాలజీ పరంగా ముందంజలో ఉండేలా తీర్చిదిద్దడం విశేషం. ఈసారి కంపెనీ రెండు కొత్త వేరియంట్‌లను కూడా పరిచయం చేసింది. దీంతో వినియోగదారులకు తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం మరింత విస్తరించింది.
Advertisement

యూరప్ ఖండాన్ని శాసిస్తున్న మేడ్ ఇన్ ఇండియా బైక్

భారతీయ తయారీ రంగానికి, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది గర్వకారణమైన సమయం. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో తయారైన ఒక స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు యూరప్ దేశాల్లో, ముఖ్యంగా ఇటలీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏప్రిలియా (Aprilia) సంస్థకు చెందిన ఆర్ఎస్ 457 (RS 457) బైక్ ఇప్పుడు ఇటలీ మార్కెట్‌లో అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి- జాక్ పాట్ కొట్టినట్టే

వాస్తు పిరమిడ్లు ఇంటిలో లేదా కార్యాలయంలో సానుకూలత, ఏకాగ్రత, నిద్ర మరియు సంపద సామర్థ్యాన్ని పెంచడానికి సరసమైన శక్తి సమతుల్యతను ఎలా అందిస్తాయో అన్వేషించండి.

నేటి రాశి ఫలాలు 31 మార్చి 2026

నేటి రాశి ఫలాలు 31-Mar-2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. మంగళవారం నాడు కుజ గ్రహ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? కెరీర్, ఆరోగ్యం, మరియు ఆర్థిక అంశాలపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.

శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త!

శుక్ర సంచారం వల్ల తులా, కర్కాటక రాశుల వారికి ఆర్థిక సమస్యలు మరియు వైవాహిక జీవితంలో చిక్కులు ఉంటాయి. Venus transit warning: Libra and Cancer zodiac signs must stay alert for financial losses.

షాకింగ్: అమెరికా లక్ష్యంగా నార్త్ కొరియా మిసైల్ టెస్ట్.. కిమ్ అరాచకం..

ఉత్తర కొరియా ఆంక్షల మధ్య అధిక-శక్తి ఇంజన్ పరీక్షను నిర్వహించింది, బాలిస్టిక్ క్షిపణులు మరియు వ్యూహాత్మక ఆయుధ సామర్థ్యాలను రాష్ట్ర మద్దతుతో మెరుగుపరచడానికి ప్రణాళికలు వేసింది.

ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ ఆఫీస్ వద్దకే కారు సర్వీసింగ్ సెంటర్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన కస్టమర్ల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. కారు సర్వీసింగ్ కోసం గంటల తరబడి వర్క్‌షాపుల చుట్టూ తిరగడం, వీకెండ్స్ పాడు చేసుకోవడం వంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. మీ ఆఫీసు వద్దకే సర్వీస్ సెంటర్‌ను తీసుకువచ్చే క్విక్‌స్టాప్ (QuickStop) సేవలను ప్రారంభించింది.

సేఫ్టీలో దుమ్ములేపిన దేశం మెచ్చిన కారు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూ, ఇప్పుడు సేఫ్టీలోనూ తన సత్తా చాటింది. భారత్ NCAP (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ, దాని స్పోర్టీ వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ అద్భుతమైన పాయింట్లను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో ఈ కారు 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించింది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో జరిపిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ తల, మెడ భాగాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని తేలింది.

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ డిస్కౌంట్లు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజువారీ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనలో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేసే లక్షణాలు, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇవి కలిసి ఈవీలకు మంచి డిమాండ్‌ను తీసుకువస్తున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. సబ్సిడీలు, ట్యాక్స్ రాయితీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అనేక ప్రయోజనాలను ప్రకటిస్తూ ప్రజలను ఈవీల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేసింది.
Advertisement

జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ???

జూలియా బురులేవా జైపూర్ ఫోటో షూట్‌లో ఒక పింక్ ఏనుగు జంతు సంక్షేమానికి సంబంధించిన ఆందోళనలపై ఆన్‌లైన్ విమర్శలను ఎదుర్కొంది, అయితే సమర్థకులు స్థానిక పండుగ రంగులు మరియు భద్రతా చర్యలను పేర్కొన్నారు.

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా..? సైలెంట్ కిల్లర్, ఈ లక్షణాలు కనిపిస్తే..!!

డెస్క్‌పై ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కాలు సిరలకు హాని కలుగుతుంది. కదలిక, కంప్రెషన్ స్టాకింగ్స్ మరియు వర్క్‌స్టేషన్ మార్పులతో సహా సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు ఆచరణాత్మక చర్యలను తెలుసుకోండి.

ఇప్పుడు ఈ కారు బిల్డ్ క్వాలిటీ చూసి కాలర్ ఎగరేస్తారు

భారతదేశంలో సేఫ్టీ అనే పదానికి పర్యాయపదంగా మారిన టాటా మోటార్స్‌కే ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది. కియా ఇండియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్ (2026 మోడల్)తో భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టుల్లో అదిరిపోయే స్కోరు సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో కియా సెల్టోస్ 32 పాయింట్లకు గాను ఏకంగా 31.70 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో టాటా సవాల్ విసిరిన సియెర్రా (Tata Sierra) 31.14 పాయింట్లతో వెనుకబడిపోయింది. ఒకప్పుడు సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కియా, ఇప్పుడు నేరుగా టాటా కోటనే బద్దలు కొట్టడం విశేషం.

ఈ కారు లోపల ఉంటే కశ్మీర్ లో ఉన్నట్లే

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. కారులో ఏసీ ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత వల్ల సీట్లు వేడెక్కి ఒంటికి చెమటలు పట్టడం సహజం. ఇలాంటి సమయంలో మనల్ని చల్లగా ఉంచే అద్భుతమైన ఫీచరే వెంట్రిలేటెడ్ సీట్లు (Ventilated Seats). ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ సౌకర్యం, ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్న రెండు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టయోటా నుంచి భారీ EV సర్ప్రైజ్

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella EV) ను త్వరలో విడుదల చేయనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఈ మోడల్ ఈవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి వేగంగా పెరుగుతున్న సమయంలో, టయోటా ఈ కొత్త ఎస్‌యూవీతో పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, Maruti Suzuki తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'e Vitara'ను విడుదల చేసిన కొద్దికాలానికే, టయోటా కూడా తన సత్తాను చూపించేందుకు ముందుకు రావడం గమనార్హం.

కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే?

2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల సర్వే యొక్క సమగ్ర అవలోకనం, కాసరగోడ్ మరియు కన్నూర్‌లో LDF ఆధిక్యంలో ఉంది, అనేక జిల్లాల్లో UDF లాభాలు, మరియు మొత్తం ఓట్ల వాటాలు మరియు సీట్ల అంచనాలను చూపుతుంది.

దారిలో గుంతలున్నా రాళ్లున్నా డోంట్ కేర్.. దూసుకపోవడమే

దృఢమైన బాడీ, అదిరిపోయే ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు.. ఇవన్నీ కలిపి ఒకే కారులో ఉంటే చూడాలని ఎవరికి ఉండదు? అందుకే భారతీయ వాహన ప్రియుల కోసం టాటా, మహీంద్రా, రెనో కంపెనీలు సరికొత్త రగ్గడ్ (Rugged) ఎస్‌యూవీలను సిద్ధం చేస్తున్నాయి. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉండటంతో మార్కెట్లో ఇప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..!

తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీతో రాజకీయ ప్రవేశం చేసారు మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యర్థి జూలీ అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ప్రారంభంలోనే వివాదాలను ఎదుర్కొంటున్నారు.
Advertisement

సేల్స్ కౌంటర్ల వద్ద క్యూ కడుతున్న కస్టమర్లు

భారత స్కూటర్ మార్కెట్‌లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన యమహా రేజెడ్ఆర్ (Yamaha RayZR) మరోసారి వార్తల్లో నిలిచింది. నగర వీధుల్లో చురుకుదనంతో దూసుకుపోయే పనితీరు, యువతను వెంటనే ఆకర్షించే స్పోర్టీ డిజైన్ ఈ రెండింటి సమ్మేళనమే రే స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా, స్టైల్ స్టేట్‌మెంట్‌గా కూడా మారింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ సాధించిన అమ్మకాల గణాంకాలు చూస్తే, మార్కెట్‌లో దాని డిమాండ్ ఎంతగా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా మొత్తం 22,593 యూనిట్ల రే స్కూటర్లు పంపిణీ అయ్యాయి. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్‌లో రే స్కూటర్ దూసుకెళ్తున్న వేగానికి నిదర్శనం.

"మార్చి" రౌండప్.. అబ్బో ఒక్క నెలలోనే ఇన్ని అనుకోలేదుగా..?

భారతదేశం ప్రపంచ కప్ విజయం, పెరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు, వైరల్ ట్రెండ్‌లు మరియు ధురంధర్ 2 చిత్రం విజయం వంటి మార్చి 2026 ప్రపంచ సంఘటనల యొక్క సంక్షిప్త అవలోకనం.

Adani బిడ్‌కు న్యాయస్థానాల గ్రీన్ సిగ్నల్.. వేదాంత ఆరోపణలు వీగిపోయినట్లేనా?

IBC ఫ్రేమ్‌వర్క్, CoC మూల్యాంకనం మరియు కోర్టు ఆమోదాల విశ్లేషణ JAL దివాలా పరిష్కారం కోసం అదానీ గ్రూప్ బిడ్‌కు మార్గనిర్దేశం చేసింది, పారదర్శకత మరియు సక్రమమైన ప్రక్రియకు ప్రాధాన్యతనిచ్చింది.

34 నిమిషాల్లోనే 15 వేల ఆర్డర్లు..కార్ల మార్కెట్లో చైనా సంచలనం

స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన షియోమీ (Xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ తన జెండా పాతేసింది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 2026 Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు చైనా వీధుల్లో సందడి చేస్తోంది. మార్చి 19న లాంచ్ అయిన ఈ కారుకు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభించింది. విక్రయాలు ప్రారంభమైన కేవలం 34 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 15,000 ఆర్డర్లు రావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తుంటే టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలకు షియోమీ గట్టి పోటీని ఇస్తోందని అర్థమవుతోంది. కేవలం వారం రోజుల్లోనే 5 వేల యూనిట్లను డెలివరీ చేసి షియోమీ సీఈఓ లే జున్ (Lei Jun) అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ కారు మీ దగ్గర ఉందా? కీలక లోపం బయటపడింది

చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా ఆటో (Skoda Auto)కి చెందిన భారతీయ విభాగం స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటనతో వినియోగదారులను అప్రమత్తం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన స్కోడా కోడియాక్ (Skoda Kodiaq) లో సాంకేతిక లోపం గుర్తించిన నేపథ్యంలో, కొన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ రీకాల్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ముందు సీట్ల లోపలి ఫ్రేమ్‌లో ఉన్న నిర్మాణాత్మక లోపం. సాధారణంగా డ్రైవర్, కో-డ్రైవర్ సీట్లలో ఉండే ఈ ఫ్రేమ్ భాగం భద్రత పరంగా ఎంతో కీలకం. అయితే కొన్ని యూనిట్లలో ఈ ఫ్రేమ్ అంచు సరిగ్గా డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం గుర్తించారు.