చలికాలంలో గుడ్లు తింటున్నారా..ఇది తెలుసుకోవాల్సిందే..!!

భారతదేశంలో శీతాకాలంలో రోజుకు రెండు గుడ్లు తినడం విటమిన్ D మరియు B లోపాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, అవసరమైన పోషకాహారాన్ని అందిస్తుంది.

రోజూ ప్రయాణించే వారికి బెస్ట్ కారు ఇదే! సెలెరియో ధరలు, EMI

మారుతి సుజుకి సెలెరియో (Maruti suzuki Celerio) భారత హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ పరిమాణం, ప్రతి రోజు ఉపయోగానికి ప్రాక్టికల్ డిజైన్, రాజీ పడని నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి సెలెరియోను కుటుంబాలు, కొత్త డ్రైవర్స్, బడ్జెట్‌లో మంచి కారును కోరుకునే వారికి ఒక నమ్మదగిన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, మారుతి సుజుకి బ్రాండ్‌ మీద ఉన్న విశ్వసనీయత కూడా సెలెరియోను మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం ఈ కారు బేస్ మోడల్ ధర రూ.4.70 లక్షలు మాత్రమే. టాప్ వేరియంట్ ధర రూ.6.73 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం

రూ.8లక్షల్లోపే దొరికే లగ్జరీ కార్లు ఇవే.

దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వినియోగదారులు కూడా ఒకరితో మరొకరు పోటీ పడుతూ ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా సరికొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ చెప్పిన మోడల్స్ బెస్ట్ ఆప్షన్లు కావొచ్చు. 8 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో మంచి మైలేజ్, 5-సీటర్ ఆప్షన్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో లభిస్తున్న 5 ప్రముఖ ఎస్‌యూవీల పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఒకే ట్రేడింగ్‌లో వచ్చిన డబ్బుతో ఏకంగా ఖరీదైన కారు కొనేశాడు

స్టాక్ మార్కెట్‌ అంటే ఇప్పుడంతా మాట్లాడే అంశమే... కానీ అదే సమయంలో చాలామందికి ఇది భయంకరమైన ఆటగా అనిపిస్తుంది. మార్కెట్‌ ఎలా మారుతుందో ముందుగానే చెప్పలేము కాబట్టి చాలా మంది దూరంగానే ఉంటారు. అయితే క్రమశిక్షణ, ఓపిక, సరైన స్ట్రాటజీ ఉంటే ట్రేడింగ్‌ ద్వారా రెగ్యులర్‌ ఆదాయం సంపాదించడం అసాధ్యం కాదు. నిజంగా మన చుట్టూ కూడా ట్రేడింగ్‌ను కెరీర్‌లా తీసుకుని, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారిలో బెంగాల్‌కు చెందిన యువ ట్రేడర్ సౌమిక్ సిన్హా రాయ్ ఒకరు. స్టాక్ మార్కెట్‌లో ఒకే ట్రేడ్ ద్వారా వచ్చిన భారీ లాభంతో అతను నేరుగా మహీంద్రా XEV 9E ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.
Advertisement

కార్లకు ఫైవ్ స్టార్ సేఫ్టీ కావాలంటే ఇక కష్టమే

ఈ రోజుల్లో కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లకు షోరూమ్‌లలో విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశం సొంత క్రాష్ టెస్ట్ అయిన భారత్ NCAP (New Car Assessment Program) వచ్చిన తర్వాత, అనేక వాహనాలు పరీక్షలు చేయించుకుని ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందాయి.

చిన్న కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ కారు

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) గత కొన్నేళ్లుగా భారత ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో తనదైన ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్టైలిష్ లుక్స్, బడ్జెట్‌-ఫ్రెండ్లీ ధర, సరిపోయే మైలేజ్ కారణంగా చాలా మంది మొదటి కారు కొనుగోలుదారులు క్విడ్‌ను మంచి ఎంపికగా భావిస్తారు. ఇదే కారణంగా ఈ కారుకు మంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలువడిన సేల్స్ గణాంకాలు కూడా ఈ విషయాన్నే మరొకసారి నిరూపించాయి. సెప్టెంబర్ 2025లో కేవలం 512 యూనిట్లను మాత్రమే విక్రయించిన రెనాల్ట్ క్విడ్, తదుపరి నెలలో అమ్మకాల పరంగా మరింత పుంజుకుంది. అక్టోబర్ 2025లో మొత్తం 554 యూనిట్లను విక్రయించి, గత నెలతో పోలిస్తే 42 కార్ల అదనపు అమ్మకాలను నమోదు చేసింది.

ధూమ్ బైక్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు

సుజుకి సంస్థకు చెందిన సూపర్ బైకుల్లో హయబుసా (Hayabusa)కు భారతదేశంలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ధూమ్ సినిమా ద్వారా ఈ బైక్ ప్రేక్షకుల్లోకి వచ్చి అప్పటి యువతకు ఒక కలల బైకుగా మారింది. ఇప్పుడు సుజుకి తమ 2026 హయబుసా మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌లో దాని రూపం (డిజైన్) లేదా ఇంజన్ మెకానికల్స్‌లో పెద్ద మార్పులు చేయకుండా రోజువారీ ఉపయోగం కోసం మరింత సౌకర్యవంతంగా ఉండేలా కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లను అందించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, త్రాటిల్ రెస్పాన్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో చేసిన ఈ మెరుగుదలల వల్ల దీనికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

రూ.200 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముఠా గుట్టురట్టు !!

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు ఢిల్లీలో ప్రధాన మాదక ద్రవ్య నెట్‌వర్క్‌ను బయటపెట్టాయి, ₹200 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. కీలక అరెస్టులు జరిగాయి.

అదానీ గ్రూప్ భారత నాలెడ్జ్ గ్రాఫ్ ఇనిషియేటివ్‌కు మద్దతు ఇస్తోంది

గ్లోబల్ ఇండాలజీ కాన్క్లేవ్‌లో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ భారత నాలెడ్జ్ గ్రాఫ్‌కు రూ. 100 కోట్ల మద్దతును ప్రకటించారు, భారత నాగరికత జ్ఞానాన్ని పరిరక్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.

రూ.4.99 లక్షలకే 34 కి.మీ మైలేజ్

మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ ఆర్(Wagon R) కారు భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కారు ధర కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌లో 34 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది.

75లక్షల కారు కొన్న వరల్డ్ కప్ విన్నర్

క్రికెట్‌ను మతంలా భావించే భారతదేశం ఎందరో దిగ్గజాలను అందించింది. వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి సెహ్వాగ్ స్టైల్‌లోనే బ్యాటింగ్ చేసే మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఈ పొరపాట్లే కిడ్నీలో రాళ్లకు కారణం - జాగ్రత్తగా ఉండాల్సిందే..!!

మూత్రపిండ రాళ్లను నివారించడానికి సమతుల్య ఆహారం, హైడ్రేషన్, ఉప్పు మరియు ప్రోటీన్ పరిమితిని ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి. వ్యక్తిగత సలహాల కోసం నిపుణుడిని సంప్రదించండి.
Advertisement

తన పంచ్‎తో మార్కెట్‎ను షేక్ చేసిన టాటా

. టాటా కంపెనీకి చెందిన పంచ్ కారు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. 2025 సంవత్సరంలో ఈ కారు అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. తాజాగా గత జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు జరిగిన అమ్మకాల వివరాలు విడుదలయ్యాయి. ఈ పది నెలల్లో టాటా పంచ్ ఏకంగా 1.40 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. తక్కువ ధర, ఎస్‌యూవీ లాంటి లుక్, ఫ్యామిలీకి సరిపోయే స్పేస్, అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వంటి కారణాల వల్ల ప్రజలు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ఇది రోడ్డు మీద పోతున్న రాక్షసుడు

హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ఎల్ఏ ఆటో షో 2025లో తన కొత్త క్రేటర్ ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించి ఆటోమొబైల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పూర్తిస్థాయిలో ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది హ్యుందాయ్ XRT సిరీస్‌లో నెక్ట్స్ స్టెప్‎గా నిలుస్తుంది. దీనిని కేవలం రోడ్లపైనే కాకుండా ఎలాంటి కఠినమైన భూభాగంలోనైనా సులభంగా ప్రయాణించగలిగేలా తీర్చిదిద్దారు. హ్యుందాయ్ ఆఫ్-రోడ్ సెగ్మెంట్‌లో ఈ క్రేటర్ ఒక పెద్ద మార్పు తీసుకువస్తుందని అంచనా.

మార్కెట్‌ను షేక్ చేయబోతున్న మాన్ స్టర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motoverse 2025 ఈవెంట్ గోవాలోని వాగేటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తమ కొత్త Continental GT 750 రేస్ బైక్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇటలీలో జరిగిన EICMA 2025లో అంతర్జాతీయంగా పరిచయం అయిన తర్వాత, మన దేశంలోకి ఈ కొత్త మోడల్ రావడం ఇదే మొదటిసారి.

ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టంగా కొంటున్న కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే కియా మోటార్స్ దేశీయ కంపెనీలకు గట్టి పోటీగా నిలిచింది. ప్రత్యేకంగా డిజైన్, ఫీచర్లు, ప్రీమియమ్ క్వాలిటీ.. ఈ మూడు అంశాలను ఒకే ప్యాకేజీలో అందించడం కియాను వినియోగదారుల మధ్య వేగంగా పాపులర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌కు చెందిన కార్లు ప్రతినెలా స్థిరంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ, మార్కెట్‌లో తమ స్థాయిని మరింత బలపరుస్తున్నాయి. కియా లైనప్‌లో అత్యంత ప్రభావం చూపిన మోడళ్లలో సోనెట్ (Sonet) ఒకటి. సబ్-4 మీటర్ SUV విభాగంలోకి వచ్చినప్పటి నుండి ఈ మోడల్ తన రూపంతో, ఫీచర్లతో, ప్రీమియం ఫీలింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి బ్రెజ్జా వంటి బలమైన పోటీదారు ఉన్నప్పటికీ, సోనెట్ తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకట్టుకొని మంచి అమ్మకాల సంఖ్యను సాధిస్తోంది.

చికెన్ Vs గుడ్లు: బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?

బరువు తగ్గడానికి చికెన్ మరియు గుడ్ల ప్రయోజనాలను అన్వేషించండి, ప్రోటీన్ కంటెంట్, కాలరీలు, మరియు పోషక ప్రయోజనాలను పోల్చండి.

యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని రక్షించే టాప్ 5-స్టార్ రేటింగ్ కార్లు

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాల్లో ఒక భారీ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముందెప్పుడో కారు కొనుగోలు అంటే మైలేజ్ ఎంత వస్తుంది, ధర ఎంత తక్కువగా ఉంటుంది అనేదే ప్రధాన ప్రశ్న. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారతీయ కస్టమర్లు కార్ల బాడీ క్వాలిటీ, బిల్డ్ స్ట్రెంగ్త్, భద్రత, ఇవన్నింటినీ మొదటి ప్రాధాన్యంగా చూస్తున్నారు. కార్ల కంపెనీలు కూడా ఈ మార్పును గ్రహించి మెరుగైన బాడీ స్ట్రక్చర్ స్టాండర్డ్‌గా ఇవ్వడం మొదలు పెట్టాయి. ఇండియాలో కార్ల నిర్మాణ నాణ్యతను భారత్ NCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్ట్ చేయడం ద్వారా కొనుగోలుదారులకు కారు ఎంత సురక్షితమైనదో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో భారత్ NCAPలో మంచి రేటింగ్ సాధించిన కొన్ని కార్ల గురించి ఈ కథనంలో.

పిల్లల్లోనూ హైబీపీ, లక్షణాలు..కారణాలు - జాగ్రత్తలు..!!

భారతీయ పిల్లల్లో అధిక రక్తపోటు పెరుగుతోంది, 10% ప్రమాదంలో ఉన్నారు. ముందస్తు గుర్తింపు మరియు జీవనశైలి మార్పులు నివారణకు అవసరం.

బైజూస్ రవీంద్రన్‌కు యూఎస్ కోర్టు బిగ్ షాక్.. బిలియన్ డాలర్ల ఫైన్ !

డెలావేర్ కోర్టు బైజస్ వ్యవస్థాపకుడిని బైజస్ ఆల్ఫా పై లోన్ ఉల్లంఘనల కారణంగా డిఫాల్ట్ జడ్జ్‌మెంట్ తర్వాత USD 1 బిలియన్ చెల్లించమని ఆదేశించింది.
Advertisement

దేశంలో ప్రతి సామాన్యుడు కొనగలిగే కార్లు!

కొత్త కారు కొనడం అనేది చాలా మందికి జీవితంలో ఒక పెద్ద మైలురాయి. ఒకప్పుడు కలగా మాత్రమే అనిపించిన ఈ ప్రయాణం, ఇప్పుడు కుటుంబ అవసరాలు, బడ్జెట్, సౌకర్యం, సేఫ్టీ అన్ని కలిపి సరైన ఎంపికను తీసుకోవాల్సిన సమయంగా మారుతుంది. ముఖ్యంగా చిన్న కుటుంబాలు, ఉద్యోగస్తులు, మొదటిసారి కారు కొనబోయే వారు తమ బడ్జెట్‌ను దాటకుండా మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, విశాలమైన సీటింగ్ స్పేస్ ఒకే ప్యాక్‌లో దొరకే కార్లను వెతుకుతుంటారు. మీరు కూడా చౌక ధరలోనే మంచి ఫీచర్లతో ఉన్న కొత్త కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి అందించే హ్యాచ్‌బ్యాక్‌లు మీకు బెస్ట్ ఆప్షన్. అందులో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో K10, వ్యాగన్‌ఆర్, సెలెరియో కొత్తగా కారు కొనాలనుకునే వారి లిస్ట్‌లో టాప్‌లో నిలుస్తుంది. వీటి గురించిన వివరాలు ఈ కథనంలో.

ఈ బైక్‌ను చూస్తే హైవే‌లు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది!

గోవా సముద్రతీరాన జరిగే మోటోవర్స్ 2025 వేడుక ఈసారి ప్రత్యేకంగా బైక్ ప్రేమికులకు పండుగలా మారింది. ఎందుకంటే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వేళలో రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్(Meteor 350 Sundowner Orange) స్పెషల్ ఎడిషన్‌ను అద్భుతంగా ఆవిష్కరించింది. వేలాది మంది ఉత్సాహభరితమైన రైడర్లు, బైక్ అభిమానులు, కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో ఈ లాంచ్ జరగడంతో ఆ వేదిక ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. మీటియోర్ 350 ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. దాని క్రూయిజర్ డిజైన్, ఆహ్లాదకరమైన రైడింగ్ పోజిషన్, సున్నితమైన రైడ్ క్వాలిటీ దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఎండు ద్రాక్ష వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు

నల్ల ద్రాక్షల నీరు బరువు తగ్గడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

రోడ్లపై గర్జించడానికి బుల్లెట్ 650 వచ్చేసింది.. ఇదే ఫస్ట్ లుక్

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తాజాగా మోటోవర్స్ 2025లో తన తాజా మోడల్ బుల్లెట్ 650(Bullet 650) ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA 2025లో ప్రపంచానికి మొదటి సారి చూపించిన ఈ బైక్, కొన్ని వారాల వ్యవధిలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టడం విశేషం. కొత్త బుల్లెట్ 650 డిజైన్‌ను ఒకసారి చూసిన వెంటనే, ఇది ఎందుకు బుల్లెట్ అనిపిస్తుందో అర్థం అవుతుంది. పిన్‌స్ట్రిప్పింగ్‌తో అందంగా తీర్చిదిద్దిన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌ నుంచి ప్రారంభమై, క్లాసిక్ మోడళ్లను గుర్తు చేసే విధంగా కొద్దిగా పైకి లేచిన క్రోమ్ హ్యాండిల్‌బార్లు, స్క్వేర్డ్ రియర్ ఫెండర్ వంటి ప్రతి అంశంలోనూ సంప్రదాయ బుల్లెట్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది.

కిలోమీటర్ ప్రయాణ ఖర్చు కేవలం 60పైసలే

2020లో ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎంజీ ZS EV కంపెనీకి ఒక లక్కీ మోడల్. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఎవరూ పెద్దగా నెగిటివ్ మాట్లాడింది లేదు. దానికి తగ్గట్టుగానే, ప్రతి నెలా దీని సేల్స్ చాలా గౌరవప్రదంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అక్టోబరు నెలలో ఈ కారు సేల్స్‌లో ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో కేవలం 250 యూనిట్లు అమ్ముడవగా 2024 అక్టోబరులో 609 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది.