దేశం మొత్తం ఎదురు చూస్తున్న కారు ఇదే

ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా మారడానికి మహీంద్రా కంపెనీ (Mahindra) దూకుడు పెంచింది. ఈ క్రమంలో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అదే మహీంద్రా XEV 9S (ఎక్స్‌ఈవీ 9ఎస్). దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అత్యంత భారీ డిమాండ్ ఉన్న ఈ కారు ఈ నెల 27న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.

వెంటనే మీ కారును షోరూంకు తీసుకెళ్లండి

మారుతి సుజుకికి (Maruti Suzuki) అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ అయిన గ్రాండ్ విటారా (Grand Vitara)కు ఇప్పుడు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. రికార్డు అమ్మకాలతో కంపెనీ సంతోషంగా ఉన్న సమయంలో ఏకంగా 39,000 యూనిట్లను వెనక్కి పిలవాల్సిన (Recall) పరిస్థితి వచ్చింది. 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారు చేసిన యూనిట్లలో ఈ సమస్య తలెత్తింది. ఇంతకీ వాహనదారులకు భయాన్ని కలిగిస్తున్న ఆ సమస్య ఏంటో, మీ కారు రీకాల్ జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం.

బైక్ కంటే తక్కువ ధరకే హీరో కొత్త ఎలక్ట్రిక్ కారు!

హీరో మోటోకార్ప్ (hero motocorp) గురించి చెప్పుకుంటే, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నో దశాబ్దాలుగా పెట్రోల్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్లు అందిస్తూ లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన ఈ బ్రాండ్, ఇప్పుడు కొత్త యుగానికి సరిపోయేలా తన పాదాన్ని ఎలక్ట్రిక్ విభాగంలో కూడా బలంగా మోపుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో, హీరో మోటోకార్ప్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. అయితే, ఎలక్ట్రిక్ మోడళ్లను తన ప్రధాన బ్రాండ్ కింద కాకుండా, ప్రత్యేక గుర్తింపుతో విడుదల చేయడానికి VIDA అనే ప్రత్యేక EV బ్రాండ్‌ను రూపొందించింది.

దేశంలో సంచలనం సృష్టించబోయే కొత్త టాటా సియెర్రా ఇదే

దేశవ్యాప్తంగా ఆటోప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సియెర్రా బ్రాండ్ డేలో, ప్రతిష్టాత్మక టాటా సియెర్రా (sierra) ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌ను ఘనంగా ఆవిష్కరించింది. భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ ఐకానిక్ SUV ఇక కొత్త యుగానికి నాంది పలుకుతోంది. కొత్త తరానికి అనుగుణంగా పునర్ ఆవిష్కరించబడిన టాటా సియెర్రా, తన ఒరిజినల్ లెగసీ, ప్రత్యేకమైన డిజైన్ గుర్తింపును అలాగే కొనసాగిస్తూ మరింత కొత్తగా ముస్తాబై వచ్చింది. దీని రాకతో ఇతర కార్ల తయారీ కంపెనీలకు బలమైన పోటీ ఏర్పడినట్లయింది. 1991లో వచ్చిన ఒరిజినల్ టాటా సియెర్రా నుంచి పూర్తిగా కొత్త అవతారానికి చేరుకున్న ప్రయాణంలో, ఈ SUV డిజైన్ అభివృద్ధి, సాంకేతిక, దేశంలో కార్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Advertisement

ఎనర్జీ రంగంలో రూ.63వేల కోట్లు: అస్సాంలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..!

అదానీ గ్రూప్ అస్సాంలో ₹63,000 కోట్ల పెట్టుబడిని పెట్టడానికి సిద్ధంగా ఉంది, థర్మల్ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు 30,000 ఉద్యోగాలను సృష్టించడం.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్లే - ఇలా చేయండి..!!

జీవనశైలి మార్పుల కారణంగా భారతదేశంలో యువ వయోజనులను కిడ్నీ రాళ్లు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నిపుణులు ఆహారం మరియు హైడ్రేషన్‌ను ముఖ్యమైన అంశాలుగా పేర్కొంటున్నారు.

రూ.5.76 లక్షలకే 7 మంది ప్రయాణించగల కారు

భారతీయ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో 7 సీట్ల కారును కొనాలంటే ముందుగా గుర్తుకు వచ్చే మోడల్ రెనాల్ట్ ట్రైబర్. 2019లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, ప్రారంభం నుంచి బెస్ట్-వాల్యూ 7-సీటర్‌గా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కాలక్రమేణా పోటీ పెరగడం, పాత లుక్ కారణంగా ట్రైబర్ అమ్మకాలు కొంత మందగించడం ప్రారంభమైంది. కానీ పరిస్థితి చాలా వేగంగా మారింది. గత జూలైలో రెనాల్ట్ ట్రైబర్‌కి పూర్తిగా అప్డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఈ MPV మళ్లీ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, ఇంటీరియర్ మెరుగుదలలతో పాటు ఆకర్షణీయమైన ధర శ్రేణి పట్ల కస్టమర్ల స్పందన బాగానే వచ్చింది.

టాటా కంపెనీకి బంగారు గుడ్డులా మారిన కారు

టాటా మోటార్స్‌ (tata motors) లైనప్‌లో హారియర్ (harrier) ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం సంపాదించిన SUV. దీని బలమైన డిజైన్, నమ్మకమైన పనితీరు,ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ ఇప్పటికే వినియోగదారుల మన్ననలు పొందాయి. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, హారియర్‌ మీద ఉన్న ఈ క్రేజ్ ఎంతగానో పెరుగుతోందని స్పష్టమవుతోంది. అక్టోబర్ 2025లో టాటా హారియర్ 4,483 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ సంఖ్య చూస్తే సాధారణ పెరుగుదల కాదు, గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,947 యూనిట్లతో పోలిస్తే 130% వృద్ధి. ఒకే సంవత్సరంలో రాబడిన ఈ భారీ పెరుగుదల హారియర్‌ మార్కెట్లో మళ్లీ తన దమ్ము చూపించిందనే చెప్పాలి.

మహీంద్రా కార్ల షోరూమ్‌లకు పోటెత్తిన జనం

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన శక్తివంతమైన స్థిరత్వాన్ని చూపించింది. పండుగ సీజన్ ప్రారంభమైన దశలోనే కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తూ మార్కెట్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకుంది. ముఖ్యంగా, అక్టోబర్ 2025 మహీంద్రా కోసం చరిత్రలో నిలిచిపోయే నెలగా మారింది. మారుతి సుజుకి తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ తయారీదారుగా నిలిచిన మహీంద్రా, SUV సెగ్మెంట్‌లో తన అస్తిత్వాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. అక్టోబర్ నెలలో మహీంద్రా 71,624 యూనిట్ల దేశీయ అమ్మకాలు నమోదు చేయడం కంపెనీకి ఇప్పటివరకు వచ్చిన అత్యధిక నెలవారీ సంఖ్య. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నెలవారీ అమ్మకాలు ఈ స్థాయికి చేరడం అరుదు.

మారుతి బ్రెజ్జాను దాటేసిన మహీంద్రా కారు.. ఒక్క నెలలో 12,237

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన దూకుడు శైలిని నిరూపించింది. ఇప్పటికే కఠినమైన పోటీ ఉన్న SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీ తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ఆధునిక ఫీచర్లు, అత్యుత్తమ భద్రత ఈ కారణాల వల్లే మహీంద్రా బ్రాండ్‌కు వచ్చిన విశ్వసనీయత రోజురోజుకు మరింత బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి గర్వకారణంగా మారిన మోడల్ XUV 3XO. మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఈ కాంపాక్ట్ SUV వినియోగదారుల హృదయాలను దోచుకుంది. ప్రీమియం లుక్, ఆధునిక టెక్నాలజీలు, సేఫ్టీ స్టాండర్డ్స్ ఈ వాహనాన్ని తన సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా, అమ్మకాల పరంగా ఇది ఇప్పుడు నిజంగా గేమ్-చేంజర్‌గా మారింది.

ఈ కారును సెల్‌ఫోన్లు కొన్నట్టు కొంటున్నారు

మనం ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం. కానీ మహీంద్రా వారి బొలెరో కారును మాత్రం జనం సెల్‌ఫోన్ కొన్నంత ఈజీగా కొనేస్తున్నారు. పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు ఎలా ఉన్నా దూసుకుపోయే ఈ మాస్ కింగ్ కారు... మార్కెట్‌లో రిలీజ్ అయ్యి పాతిక సంవత్సరాలు దాటినా దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.

దేశంలోనే చౌకైన కారు..మైలేజ్ ఏకంగా 33కిమీ

మారుతి సుజుకి అక్టోబర్ 2025లో 2 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలతో రికార్డులు సృష్టించింది. ఈ విజయంలో ఒకప్పటి అత్యంత చౌకైన కార్ల స్థానంలోకి వచ్చి, అందరి దృష్టిని ఆకర్షించిన కారు మారుతి ఎస్-ప్రెస్సో (S-Presso). కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమలు చేయడంతో చిన్న కార్లపై పన్ను తగ్గి, ఎస్-ప్రెస్సో ధర అమాంతం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కొత్త కారు ధర, మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్ స్విఫ్ట్ కారు ధరకే లభిస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభిస్తున్న ఈ ఎస్‌యూవీష్ కారు ధర, మైలేజ్, అక్టోబర్ అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చిన్న కార్ల పై జీఎస్‌టీని 28% నుంచి 18%కి తగ్గించింది. ఈ జీఎస్‌టీ 2.0 నిర్ణయం వల్ల మారుతి ఎస్-ప్రెస్సో ధర అమాంతం తగ్గింది. గతంలో రూ. 4.27 లక్షలు ఉన్న స్టాండర్డ్ (O) వేరియంట్ ధరలో ఏకంగా రూ. 77,000 తగ్గింపు వచ్చింది. బేస్ వేరియంట్ ధర ఇప్పుడు కేవలం రూ. 3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. దీనితో ఇది దేశంలోనే అత్యంత చవకైన కారుగా మారుతి ఆల్టో K10 స్థానాన్ని భర్తీ చేసింది.
Advertisement

"ఆఫీస్ లవ్" స్టోరీస్‌పై సర్వే.. భారత్‌కి ఎన్నో ర్యాంక్ అంటే ?

ఒక కొత్త సర్వే ప్రకారం, 40% భారతీయ ఉద్యోగులు కార్యాలయ ప్రేమ సంబంధాలలో ఉన్నారని వెల్లడించింది, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. ఈ ఫలితాలను అన్వేషించండి.

ఫుల్ ట్యాంక్‌తో 1000కిమీ రేంజ్ ఇచ్చే కారు

భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్, పెట్రోల్ కార్ల హవా నడుస్తున్నప్పటికీ, డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే శక్తివంతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన మైలేజ్ రెండూ ఒకేసారి కావాలనుకునే డ్రైవర్లకు డీజిల్ ఇంజన్లే బెస్ట్ ఆప్షన్. మన దేశంలో ఉన్న గుంతల రోడ్లపైనా, ట్రాఫిక్‌లోనూ నమ్మకంగా దూసుకుపోవాలంటే, డీజిల్ కార్లంటేనే ఎక్కువమందికి కంపరం. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, పవర్ రెండూ అందించే టాప్ 5 డీజిల్ కార్ల వివరాలను వివరంగా తెలుసుకుందాం.

టాటా నుంచి బ్రహ్మాస్త్రం వస్తోంది

టాటా మోటార్స్ (Tata Motors) తమ లెజెండరీ SUVను మళ్లీ భారతీయ రోడ్లపైకి తీసుకురావడానికి సిద్ధమైంది. 1990లలో మార్కెట్‌లో అడుగుపెట్టిన మొదటి టాటా సియెర్రా అప్పటి తరానికే కాకుండా, ఇప్పటికీ గుర్తున్న ఐకానిక్ మోడళ్లలో ఒకటి. బలమైన బాడీ, వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన గ్లాస్ డిజైన్, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్... ఇవన్నీ కలిపి సియెర్రాను ఆ కాలంలో ఓ ప్రత్యేకమైన SUVగా నిలబెట్టాయి. ఇప్పుడు అదే మోడల్‌ను ఆధునిక కాలానికి అనుగుణంగా, పూర్తిగా కొత్త రూపంలో పునర్నిర్మించి టాటా మరోసారి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. రేట్రో స్టైల్‌కు మోడర్న్ టచ్ ఇచ్చి రూపొందించిన ఈ కొత్త సియెర్రా, టాటా BSUV లైనప్‌లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

ఏపీలో అదానీ గ్రూప్ రూ.లక్ష కోట్లు పెట్టుబడి - చంద్రబాబు విజన్‌కు ఫుల్ మార్క్స్..!!

ఆదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో ₹1 లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించింది, ఇందులో $15 బిలియన్ విశాఖ టెక్ పార్క్, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఉద్యోగ సృష్టి ఉన్నాయి.

దారుణంగా పడిపోయిన పంచ్ ప్రత్యర్థి సేల్స్

భారత మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒకటి. ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch) కారుతో ఇది గట్టి పోటీ ఇస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రారంభమై, కిలోకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు, అది కూడా ఎస్‌యూవీ లుక్‌తో కావాలనుకునే వారికి ఈ ఎక్స్‌టర్ ఒక మంచి ఆప్షన్. ఈ కారు ధరలు, ఫీచర్లు, అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం.

సేఫ్టీ కింగ్ పంచ్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది

టాటా పంచ్ (tata punch) గురించి మాట్లాడితే, భారతీయ వినియోగదారుల మనసుల్లో ఏర్పడిన విశ్వాసం, నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో చిన్న సైజ్‌లో వచ్చినప్పటికీ, భద్రత విషయంలో మాత్రం పెద్ద SUVలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం ఈ మోడల్‌కి ప్రధాన ఆకర్షణ. పంచ్‌ను రోడ్డుపై చూసిన చాలా మంది మొదట గుర్తుచేసేది అదే సేఫ్టీ. ప్రమాదాలు చోటుచేసుకునే సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను అతి ఉత్తమమైన రీతిలో రక్షించే మోడల్‌గా పంచ్ ప్రజాదరణ పొందింది. ఇది భారతీయ కుటుంబాల అవసరాలు, ముఖ్యంగా సేఫ్టీని ప్రాధాన్యతగా భావించే వారికి బాగా సరిపోయింది. ఈ నమ్మకం నేరుగా అమ్మకాల రూపంలో కూడా కనిపిస్తోంది. చక్కటి డిజైన్, ధర, చిన్నదైనా SUV ఫీలింగ్‌తో పంచ్ మార్కెట్‌లో విడుదలైనప్పటి నుంచి నిరంతరం మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తోంది.

ఫ్యామిలీ పెద్దదైనా జాలీగా టూర్లకు వెళ్లొచ్చు

మీరు మీ కుటుంబంతో కలిసి హిల్ స్టేషన్లకు సుదూర ప్రయాణాలు చేయాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, గ్రూప్ ట్రిప్‌లకు ఇన్నోవా వంటి ఖరీదైన ఎంపీవీలను కొని డబ్బు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రూ.15 లక్షల (ఆన్-రోడ్ అంచనా) బడ్జెట్‌లో, హైరేంజ్ కొండ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా దూసుకుపోయే కియా కారెన్స్ క్లావిస్ మోడల్‌ను మీరు ఎంచుకోవచ్చు.ఈ కియా కారెన్స్ క్లావిస్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

డాక్టర్లు, ఇంజనీర్లకు ఈ కారంటే చాలా ఇష్టం

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (maruti suzuki wagonr) గురించి చెప్తే, భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్ అని చెప్పే స్థాయిలో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. వైద్యులు, ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ నుంచి సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, గృహిణులు... ఇలా వివిధ వర్గాల వినియోగదారుల దృష్టిని ఒకే రకంగా ఆకర్షించగలిగిన అరుదైన మోడల్ ఇది. తక్కువ బడ్జెట్‌లో మంచి స్పేస్‌తో కూడిన, నమ్మదగిన కారును కోరుకునే వారి కోసం వ్యాగన్ఆర్ ఎప్పటి నుంచో సేఫ్ & సెన్సిబుల్ ఛాయిస్‌గా నిలుస్తోంది. చిన్న కుటుంబాల రోజువారీ అవసరాలకు, నగర డ్రైవింగ్‌కు, అలాగే కాస్తదూర ప్రయాణాలకు కూడా ఈ కారు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది.
Advertisement

ఈ బైక్ ధరతో లగ్జరీ కారు కొనొచ్చు

ప్రముఖ మోటారు తయారీ సంస్థ కవాసాకి ఇండియా(Kawasaki India), భారత మార్కెట్లో తన కొత్త Z1100 సూపర్ బైక్‌ను (Z1100 Superbike) లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈ సూపర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఏకంగా రూ. 12.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరలో ఒక లగ్జరీ ఎస్యూవీ కారును కొనుగోలు చేయవచ్చు. మునుపటి మోడల్ కంటే మెరుగైన డిజైన్, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ 2026 కవాసాకి Z1100 లో 1,099 సీసీ లిక్విడ్-కూల్డ్ నాలుగు-సిలిండర్ ఇంజిన్ శక్తినిస్తుంది. మరి ఈ బైక్ ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, రైడర్‌కు సహాయపడే అధునాతన ఎలక్ట్రానిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

వెన్యూ vs సోనెట్: రెండింటిలో ఏది మీకు బెస్ట్?

హ్యుందాయ్ (hyundai) తాజాగా విడుదల చేసిన 2025 వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కొత్తదనం తీసుకొచ్చింది. కియా సోనెట్‌తో తలపడే ఈ కొత్త వెర్షన్, స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో ప్రత్యేకతను సంతరించుకుంది. వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కొత్త టెక్నాలజీ, మెరుగైన రైడ్ క్వాలిటీ, కొత్త ఇంటీరియర్ ఫినిష్‌తో మరింత ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో, కియా సోనెట్ కూడా తన తాజా ఫేస్‌లిఫ్ట్ ద్వారా మరింత సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలను ఒకసారి చూద్దాం.

దేశమంతా ఎదురుచూస్తున్న కారు ఆ రోజున వచ్చేస్తోంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కొత్త టెక్నాలజీలతో ముందుకు వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారుతో ఆటో మార్కెట్లో కొత్త దిశను సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆ కారు పేరు మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki E-Vitara). ఈ ఎలక్ట్రిక్ కారు గురించి గత కొద్ది నెలలుగా ఆటో అభిమానులలో, కస్టమర్లలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారతీయ మార్కెట్లో ఇది మారుతి సుజుకి నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ SUV కావడం విశేషం. ఇప్పటివరకు కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను మాత్రమే అందిస్తుండగా, ఈసారి మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగుపెడుతోంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 : ప్రభుత్వం మారుతుందా..గత ఎన్నికల్లో ట్రెండ్ ఎలా ఉన్నింది..?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2023 యొక్క ముఖ్యమైన నియోజకవర్గాలు, అభ్యర్థులు మరియు ఓటింగ్ ధోరణులను అన్వేషించండి. ఆర్జేడీ మరియు బీజేపీ పోటీలపై అవగాహన.

అతిగా బీట్ రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా!

బీట్‌రూట్ జ్యూస్ డిటాక్స్ డైట్ల ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి మరియు సంభావ్య దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి. సురక్షితమైన వినియోగానికి మితిమీరడం కీలకం.