ఢిల్లీ పేలుళ్లకు వాడిన కారు బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?
ఆటోమొబైల్స్
- 4 month, 4 days ago
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన కారణంగా హ్యుందాయ్ ఐ20 కారు వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనలో ఇదే కారు ఉపయోగించారు.. ఈ సందర్భంగా 17 సంవత్సరాలుగా భారతీయ రోడ్లపై విజయవంతంగా నడుస్తున్న i20 కారు చరిత్ర, మార్పుల గురించి తెలుసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. 2008లో భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించబడిన i20 హ్యుందాయ్ గెట్జ్ స్థానంలో వచ్చి, కంపెనీని ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లోకి తీసుకెళ్లింది. తరాలు మారినా మార్కెట్లో దీని ఆధిపత్యం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం.