8 లక్షల బడ్జెట్‌లో అద్భుతమైన ఎస్‌యూవీలు ఇవే

మధ్యతరగతి భారతీయులకు కారు అనేది ఒక కల. ముఖ్యంగా నేటి కాలంలో సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ కంటే ఎస్‌యూవీ (SUV)లకే క్రేజ్ ఎక్కువగా ఉంది. స్టైలిష్ లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్ట్ కారణంగా అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, బడ్జెట్ విషయానికి వస్తే 8 లక్షల రూపాయల లోపు మంచి ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్ల కోసం జనం వేచి చూస్తుంటారు. 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా టైజర్, కియా సోనెట్ వంటి మోడల్స్ ఈ బడ్జెట్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. వీటి విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కుర్రాళ్లకు పిచ్చెక్కించే టాప్ 5 బడ్జెట్ స్పోర్ట్స్ బైక్స్

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, మెరుపు వేగం, గుండెలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్పోర్ట్స్ బైక్ కొనాలని చాలా మంది కలలు కంటారు. ఒకప్పుడు స్పోర్ట్స్ బైక్ అంటే లక్షల్లో పోయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ దిగ్గజ సంస్థలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా 125cc నుంచి 200cc లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ స్పోర్ట్స్ బైక్‌లను మార్కెట్లోకి తెచ్చాయి. కేవలం 89 వేల రూపాయల నుంచే స్టైలిష్ బైక్‌లు లభిస్తున్నాయి. అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

చిన్న ఫ్యామిలీకి చింత లేని కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులు నమ్మకంగా ఎంచుకునే హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో (Tata Tiago) ఒకటి. సరసమైన ధర, మంచి ఫీచర్లు, విశ్వసనీయమైన పనితీరుతో ఈ కారు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉండే మంచి ఎంట్రీ-లెవల్ ఎంపికగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. వాటి ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలలో Tata Motors మొత్తం 7,040 టియాగో కార్లను విక్రయించింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఈ సంఖ్య కొంత పెరుగుదల చూపించడం విశేషం.

రూ.3.70 లక్షలకే కారు.. 34 కి.మీ మైలేజ్

భారత కార్ల మార్కెట్లో సంవత్సరాలుగా మంచి గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఒకటి. చిన్న సైజు, తక్కువ ధర, మంచి మైలేజీ వంటి అంశాలతో ఈ కారు సాధారణ వినియోగదారుల మధ్య మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో SUV కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ హ్యాచ్‌బ్యాక్ తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటూ స్థిరమైన అమ్మకాలను కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి మొత్తం 9,787 ఆల్టో K10 కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.
Advertisement

లక్కీ నంబర్‌తో కొత్త హెల్మెట్

టూవీలర్ భద్రతలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే హెల్మెట్ కేవలం రక్షణ కోసం మాత్రమే కాకుండా, రైడర్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్ స్టేట్మెంట్‌గా కూడా మారుతోంది. ఈ ఆలోచనతోనే స్టీల్‌బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్ (Steelbird Hi-Tech India Limited) వినియోగదారుల కోసం ప్రత్యేకమైన 'న్యూమరాలజీ సిరీస్' హెల్మెట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సిరీస్‌లో రైడర్లు తమకు అదృష్టంగా భావించే లక్కీ నంబర్ లేదా వ్యక్తిగతంగా ఇష్టమైన ఫేవరెట్ నంబర్‌తో చెక్కబడిన హెల్మెట్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రూపొందించిన ఈ హెల్మెట్లు, రైడింగ్ సమయంలో అవసరమైన రక్షణను అందించడమే కాకుండా ప్రత్యేకమైన స్టైల్‌ను కూడా ఇస్తాయి.

భారత్‌లో బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు ఇవే

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. రోడ్లపై చూసినా చాలా మంది ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉపయోగిస్తున్నారని సులభంగా గమనించవచ్చు. అయితే ఇంకా చాలా మంది సాధారణ పెట్రోల్ స్కూటర్లు లేదా బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని కంపెనీలు హైబ్రిడ్, CNG టూ-వీలర్లను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ వాహనాలు సాధారణ పెట్రోల్ టూ-వీలర్లతో పోలిస్తే మెరుగైన మైలేజీని అందిస్తాయి. అంతేకాకుండా ఇంధన ఖర్చు కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి కొత్త టెక్నాలజీతో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన మోడళ్లు ఉన్నాయి. ఈ కథనంలో హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో వచ్చిన టూ-వీలర్ల గురించి తెలుసుకుందాం.

ప్రతి నెలా వేల మంది ఇదే కారును కొంటున్నారు!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తయారు చేసిన విక్టోరిస్ (Victoris) క్రమంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్న మోడల్‌గా మారుతోంది. ప్రారంభంలోనే ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయ పనితీరు కారణంగా ఈ కారు మార్కెట్‌లో మంచి స్పందన పొందింది. కాలక్రమేణా ఈ SUVపై డిమాండ్ మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యువత, కుటుంబ వినియోగదారులు, మొదటిసారి SUV కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విక్రయ గణాంకాలు కూడా ఈ కారు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

రూ.50 వేలలో EV స్కూటర్లు.. కి.మీకు ఒక్క రూపాయి

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పద్ధతి ప్రస్తుతం భారతదేశంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో వాహనం కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీని పూర్తిగా కొనాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీని సేవగా ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు ఛార్జ్ చేసిన బ్యాటరీని తీసుకునే విధంగా ఉంటుంది. దీంతో వాహనం ప్రారంభ ధర తక్కువగా ఉండటంతో పాటు ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల చాలా ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు ఇప్పుడు BaaS మోడల్‌ను స్వీకరిస్తున్నాయి. సులభంగా చెప్పాలంటే, వాహనం బ్యాటరీ ఖాళీ అయితే దానిని తిరిగి ఇచ్చి, పూర్తిగా ఛార్జ్ చేసిన మరో బ్యాటరీని నిర్ణీత రుసుముతో పొందే విధానమే BaaS. ఈ విధానంతో అందుబాటులో ఉన్న కొన్ని టూవీలర్స్‌ను చూద్దాం.
Advertisement

మారుతి ఎర్టిగా పని అయిపోయినట్లేనా ?

భారతదేశంలో పెద్ద ఫ్యామిలీలకు ఎప్పుడూ మొదటి ఛాయిస్ 7-సీటర్ కార్లే. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో తక్కువ ధరకు వచ్చే ఎంబీవీ (MPV) కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు మారుతి సుజుకి ఎర్టిగా తిరుగులేని మహారాజుగా వెలుగొందుతోంది. అయితే, ఇప్పుడు ఎర్టిగా సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి టయోటా తన అమ్ములపొది నుంచి ఒక పవర్‌ఫుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. అదే టయోటా రూమియన్ (Toyota Rumion). ఈ కారులో తాజాగా అత్యంత తక్కువ ధరకే లభించే E (ఈ) వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు చూస్తుంటే, ఇకపై మారుతి కార్ల వైపు ఎవరూ చూడరేమో అనిపిస్తోంది.

రూ.5 లక్షల లోపు అదిరిపోయే టాప్ 5 కార్లు

భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కారు కొనాలనుకున్నప్పుడు మొదట చూసేది రెండు విషయాలు. ఒకటి.. ఆ కారు ధర మన బడ్జెట్‌లో ఉందా? రెండోది.. అది లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది? ఈ రెండు లెక్కలు సరిగ్గా కుదిరితేనే ఆ కారు ఇంటి ముందుకు వస్తుంది. 2026లో కార్ల ధరలు పెరుగుతున్నా, ఇప్పటికీ రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో అద్భుతమైన మైలేజీనిచ్చే కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం మైలేజీ మాత్రమే కాదు, ఇప్పుడు వస్తున్న బడ్జెట్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండటం విశేషం. మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన టాప్ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

బ్యాటరీ తీసి ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే స్కూటర్ లాంచ్

భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలో ఎలక్ట్రిక్ (ZELO Electric) మరో కొత్త ప్రత్యేక ఎడిషన్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ప్రీమియం ఫీచర్లను అందించడంలో పేరుగాంచిన ఈ కంపెనీ తాజాగా నైట్+ రాణి ఎడిషన్ (Knight+ Rani Edition) అనే లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేవలం 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా ఆకట్టుకునే బేబీ పింక్ కలర్ థీమ్‌తో రూపొందించిన ఈ స్కూటర్ స్టైలిష్ లుక్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

గరీబోళ్ల బండి.. లీటర్‌తో 90 కి.మీ మైలేజ్

భారతదేశంలో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్ గురించి మాట్లాడితే ముందుగా చాలా మందికి గుర్తుకు వచ్చే పేరు బజాజ్ ప్లాటినా (Bajaj Platina). నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూటర్ బైక్ ఎంతో ప్రజాదరణ పొందింది. చాలా సంవత్సరాలుగా మార్కెట్లో కొనసాగుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే వాహనంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. రోజువారీ ప్రయాణాల కోసం సరసమైన ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ప్లాటినా మంచి ఎంపికగా నిలుస్తుంది. ఉద్యోగానికి వెళ్లే వారు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చూసుకునే వారు ఇలా విభిన్న వర్గాల ప్రజలు ఈ బైక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Advertisement

మార్కెట్లో టాప్ 5 సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ (EV)ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ బైక్ అనగానే కేవలం స్లోగా వెళ్లే స్కూటర్లే కాదు, ఇప్పుడు రోడ్లపై చిరుతపులిలా దూసుకెళ్లే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓలా (Ola) నుంచి అల్ట్రావాయిలెట్ (Ultraviolette) వరకు మార్కెట్లో టాప్ స్పీడ్, అదిరిపోయే రేంజ్‌తో దూసుకుపోతున్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.

మారుతి 800తో లంబోర్గిని తయారు చేసిన మెకానిక్

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే మెకానిక్ తన ప్రతిభతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. సాధారణంగా అందరికీ తెలిసిన చిన్న హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతి 800 (Maruti 800) కారును ప్రపంచప్రసిద్ధ లగ్జరీ స్పోర్ట్స్ కారును పోలి ఉండేలా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా కోట్ల రూపాయల ఖరీదు చేసే సూపర్‌కార్‌లలో ఒకటైన లంబోర్గిని (Lamborghini) మాదిరిగా కనిపించేలా ఈ కారును రూపుదిద్దడంతో, అతని సృజనాత్మకతకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశీ లంబోర్గిని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

మోస్ట్ పాపులర్ కారును అతి తక్కువ ధరకే

భారతదేశంలో సామాన్యుల కారు కలలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) ఒకటి. ఒకప్పుడు భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 800 (Maruti 800)కు ప్రత్యామ్నాయంగా ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు, కంపెనీ కూడా ఊహించని స్థాయిలో వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకుంది. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా ఈ కారు చాలా మంది మధ్యతరగతి కుటుంబాల మొదటి కారుగా మారింది. అందుకే భారతీయులు ప్రేమగా ఈ కారును "లార్డ్ ఆల్టో" అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షలకుపైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయని అంచనా. ఈ గణాంకాలే ఈ కారు భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎంత ప్రత్యేక స్థానం సంపాదించుకుందో చూపిస్తున్నాయి.

మనదేశంలో టాప్..విదేశాల్లో మాత్రం ప్లాప్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. గత కొన్నేళ్లుగా ఈ కారు దేశీయ రహదారులపై రారాజులా ఏలుతోంది. అయితే, తాజాగా వెలువడిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే క్రెటాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ కారు మన దేశంలో ఎంతలా అమ్ముడవుతుందో, విదేశాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇంట్లో ఈ పులి.. బయట మాత్రం పిల్లి అన్నట్లుగా దీని పరిస్థితి తయారైంది. ఫిబ్రవరి 2026లో ఏకంగా 17,938 యూనిట్ల విక్రయాలతో దేశంలో టాప్-10 కార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన క్రెటా, విదేశీ మార్కెట్లలో మాత్రం కేవలం 608 యూనిట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Advertisement

సామాన్యుల కోసం తక్కువ ధరలో చిన్న కార్లు వస్తున్నాయి

భారతదేశంలో చిన్న SUVలు, ముఖ్యంగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVల విభాగం ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటి. కుటుంబ ప్రయాణాలకు సరిపోయే స్థలం, ఆకర్షణీయమైన డిజైన్, అలాగే తక్కువ ధరలో లభించడం వంటి కారణాల వల్ల ఈ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ SUVలు ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా మంచి క్యాబిన్ స్పేస్‌ను అందిస్తాయి. అందుకే చిన్న కుటుంబాల కోసం ఇవి ఉత్తమ ఎంపికగా మారాయి. నగర రహదారులపై సులభంగా నడపడం, పార్కింగ్ చేయడం కూడా వీటి మరో ప్రధాన ప్రయోజనం. ఇదిలా ఉంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో కూడిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVలను పలు కంపెనీలు సామాన్యులు కొనగలిగే ధరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఈ కథణంలో.

ఇది కారు కాదు రోడ్డుపై వెళ్లే బుల్లెట్ రైలు

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా దిగ్గజం BYD(Build Your Dreams), తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ BYD గ్రేట్ టాంగ్ (Great Tang)తో ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ఆకట్టుకున్న ఈ కారు మార్చి 5, 2026న అధికారికంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన ఇంటీరియర్ ఫోటోలు, ఫీచర్లు చూస్తుంటే, ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై వెళ్లే ఒక విలాసవంతమైన విల్లా అనిపిస్తోంది. ఏకంగా 950 కిలోమీటర్ల రేంజ్, 4 భారీ స్క్రీన్లు, లిడార్ (LiDAR) టెక్నాలజీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ కారు రూపొందింది. BYD గ్రేట్ టాంగ్ లోపలికి అడుగుపెడితే మనకు ఒక ఫ్యూచరిస్టిక్ ప్రపంచం కనిపిస్తుంది. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఇచ్చారు. అంటే మొత్తం ఏడుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. డాష్‌బోర్డ్‌పైనే మూడు భారీ స్క్రీన్‌లు అమర్చారు.

రూ.2.5 లక్షల అడ్వెంచర్ బైక్ రూ.1.49 లక్షలకే

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) మరో కీలక నిర్ణయంతో వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల తన X-47 అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసి మంచి స్పందన పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు వినియోగదారులకు మరింత సులభంగా బైక్ కొనుగోలు చేసేలా బ్యాటరీ ఫ్లెక్స్ (Battery-as-a-Service - BaaS) అనే కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ప్రారంభ ఖర్చు గణనీయంగా తగ్గి, మరింత సరసమైన ధరలో అధునాతన ఎలక్ట్రిక్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది.

తక్కువ ధరలో టాప్-5 సీవీటీ కార్లు ఇవే

ప్రస్తుత కాలంలో సిటీ రోడ్లపై వాహనం నడపడం అంటే మామూలు విషయం కాదు. విపరీతమైన ట్రాఫిక్, గంటల కొద్దీ నిరీక్షణ.. ఈ క్రమంలో మాన్యువల్ గేర్లు మార్చుతూ, పదే పదే క్లచ్ నొక్కుతూ డ్రైవర్లు విసిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు కార్లు కొనేవారు ఎక్కువగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహిళా డ్రైవర్లు, నగరాల్లో నివసించే వారు క్లచ్ లేని ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఆటోమాటిక్ కార్లలో ఏఎంటీ (AMT), డీసీటీ (DCT), సీవీటీ (CVT) అని రకరకాలు ఉంటాయి. వీటిలో ప్రయాణం చాలా స్మూత్‌గా సాగడానికి, ల్యాగ్ లేకుండా ఉండటానికి సీవీటీ(Continuously Variable Transmission) టెక్నాలజీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ సీవీటీ కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్

ఆటోమొబైల్ ప్రపంచంలో భారతీయ కంపెనీల జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో జపాన్, యూరప్ దిగ్గజాలకు మన దేశీ బ్రాండ్లు గట్టి పోటీనిస్తూ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇప్పుడు ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ల విక్రయాల్లో జపాన్ దిగ్గజం యమహా (Yamaha)ను అధిగమించి, గ్లోబల్ సేల్స్‌లో టీవీఎస్ మూడవ స్థానానికి చేరుకోవడం ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

MG కంపెనీకి భారీ ఊపు.. ఫిబ్రవరిలో 24% సేల్స్ జంప్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అనేక అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్లు భారత మార్కెట్లోకి తమ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి ముందుకొస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తున్న కంపెనీలలో ఒకటి ఎంజీ (MG Motor). ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. మొదట ఇంధనంతో నడిచే కార్లను పరిచయం చేసినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టుతోంది.

ఫిబ్రవరిలో 5 లక్షలకుపైగా డెలివరీలు!

హోండా మోటార్ సైకిల్ ఇండియా భారత టూవీలర్ వాహన మార్కెట్‌లో తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఈ కంపెనీ, 2026 ఫిబ్రవరిలో అద్భుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. వినియోగదారుల విశ్వాసం, విశ్వసనీయమైన ఇంజిన్ పనితీ, మంచి మైలేజ్ వంటి అంశాలు హోండా వాహనాలకు నిరంతర డిమాండ్ తీసుకొస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో హోండా మొత్తం 5,67,351 యూనిట్ల ద్విచక్ర వాహనాలను డెలివరీ చేయగా, గత సంవత్సరం ఇదే కాలంలో 4,22,449 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చితే సంవత్సర ప్రాతిపదికన (YoY) సుమారు 34 శాతం వృద్ధి నమోదైంది.

కారు లోపల సీట్లు తిరుగుతాయి

టాటా మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టాటా సియెర్రా రీ-ఎంట్రీతో మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ దేశీ దిగ్గజం, ఇప్పుడు మరింత విలాసవంతమైన, అత్యంత శక్తివంతమైన అవిన్యా (Avinya) అనే లగ్జరీ బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది. 2027లో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ బ్రాండ్ గురించి కంపెనీ ఇటీవలే కీలక వివరాలను వెల్లడించింది. టయోటాకు లెక్సస్, హ్యుందాయ్‌కు జెనెసిస్ ఎలాగో.. టాటా మోటార్స్‌కు అవిన్యా అలా ఒక ప్రీమియం గుర్తింపును తీసుకురాబోతోంది.
Advertisement

డస్టర్ తమ్ముడు డిఫెండర్ లుక్‌లో వస్తున్నాడు

భారతదేశంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చిన కార్లలో డస్టర్ (Duster) ఒకటి. ఈ SUV భారత మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా మంచి డిమాండ్‌ను పొందుతూ, కుటుంబాలకు అనువైన బలమైన వాహనంగా పేరు సంపాదించింది. తాజాగా ఈ డస్టర్‌ను కంపెనీ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి మళ్లీ పరిచయం చేసింది. ఈ కొత్త లుక్‌తో వచ్చిన డస్టర్ ఆటో ప్రియులలో మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉండగా, రెనాల్ట్ ఇప్పుడు భారత మార్కెట్ కోసం మరో కొత్త SUVపై పని చేస్తోంది. డస్టర్‌ను పోలిన డిజైన్‌తో, అయితే దానికంటే పెద్దదిగా ఉండే ఈ కొత్త వాహనం 7 మంది కూర్చునేలా రూపొందించబడుతోంది.