ఒకేసారి రెండు సర్‌ప్రైజులు.. డిస్కౌంట్ + కొత్త వైబ్ ఎడిషన్!

భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) ఒకటి. సరసమైన ధర, స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు చాలా మంది కొనుగోలుదారుల మొదటి ఎంపికగా మారింది. ముఖ్యంగా, హ్యుందాయ్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరియు తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా ఈ కారుకు మంచి డిమాండ్ తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అమ్మకాలను మరింత పెంచేందుకు కంపెనీ ఈ ఏప్రిల్ నెలలో ఈ మోడల్‌పై ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మరింత సరసమైన డీల్‌గా మారింది. ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించిన ఈ కారు, ఇప్పుడు ఈ ఆఫర్ల వల్ల మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

కొత్తగా కొనేవారికి బెస్ట్! ప్రస్తుతం చాలా మంది ఇదే కావాలంటున్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ SUVల విభాగం రోజురోజుకూ మరింత పోటీగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లో వినియోగదారుల ఆకర్షణను గెలుచుకున్న మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) ఒకటి. 4 మీటర్ల లోపు సైజ్‌తో నగర డ్రైవింగ్‌కు అనువుగా ఉండటంతో పాటు, ఫీచర్లు, పనితీరు పరంగా కూడా ఈ SUV మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, 2026 మార్చి నెలలో Mahindra & Mahindra ఈ మోడల్‌ను ఏకంగా 9,199 యూనిట్లుగా విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం వృద్ధి కావడం గమనార్హం. అంటే, కేవలం ఒక ఏడాదిలోనే ఈ SUVపై డిమాండ్ ఎంతగా పెరిగిందో ఈ సంఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

స్టాక్ క్లియర్ చేయలేక తలపట్టుకుంటున్న ఉద్యోగులు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ అంటే ఒక తిరుగులేని బ్రాండ్. ముఖ్యంగా క్రెటా, వెన్యూ వంటి మోడళ్లతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ రారాజుగా వెలుగుతోంది. అయితే అదే హ్యుందాయ్ నుంచి వచ్చిన ఒక అత్యంత ఖరీదైన, అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు మాత్రం ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతుంది. టెక్నాలజీ పరంగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ కారును కొనేందుకు ప్రస్తుతం ఎవరూ ముందుకు రాకపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

లగ్జరీ కార్లలో ఎవరికీ అందని స్థాయి.. మెర్సిడెస్ టాప్‌లో

ప్రస్తుతం భారతదేశంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటికి ఒక బైకు ఉంటే సరిపోతుందని భావించిన రోజులు క్రమంగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు మాత్రం ప్రతి కుటుంబంలో కనీసం ఒక కారు ఉండాలనే ఆలోచన బలంగా పెరిగింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న ఆదాయ వనరులు, సౌకర్యాలపై ప్రజల ఆసక్తి కలిసి ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా మధ్యతరగతి నుంచి పై స్థాయికి ఎదుగుతున్న వినియోగదారులు ఇప్పుడు కేవలం అవసరానికి మాత్రమే కాదు, సౌకర్యం, ప్రతిష్ట కోసం కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్పు ప్రభావం కేవలం బడ్జెట్ కార్లపైనే కాకుండా, లగ్జరీ కార్ల మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో లగ్జరీ కార్లు చాలా మందికి అందని ద్రాక్షలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Advertisement

బడ్జెట్‌లో అదిరిపోయే టాప్ 5 ఎస్‌యూవీలను ట్రై చేయండి

మీరు చాలా కాలంగా పాత హ్యాచ్‌బ్యాక్ కారును వాడుతున్నారా? ఆ చిన్న కారులో ఇరుగ్గా కూర్చోలేక, ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతూ.. ఎప్పుడెప్పుడు ఒక మంచి ఎస్‌యూవీ (SUV)కి అప్‌గ్రేడ్ అవుదామా అని ఎదురుచూస్తున్నారా?.. సాధారణంగా మొదటి కారుగా హ్యాచ్‌బ్యాక్ కొన్నవారు, తమ నెక్ట్స్ కారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మైలేజీ తగ్గుతుందేమో, మెయింటెనెన్స్ భారమవుతుందేమో, అసలు సిటీ ట్రాఫిక్‌లో పెద్ద కారును తిప్పగలమా? ఇలాంటి ఎన్నో సందేహాలు వారిని వేధిస్తుంటాయి. పాత హ్యాచ్‌బ్యాక్ యజమానుల కోసం అత్యంత అనువైన 5 బెస్ట్ ఎస్యూవీలు ఇవే. ఈ కార్లు మీ బడ్జెట్‌లో ఉండటమే కాకుండా, మీకు ఒక లగ్జరీ అనుభూతిని కూడా అందిస్తాయి.

406 టన్నుల రైలును లాగిన SUV.. MG మెజెస్టర్ ప్రపంచ రికార్డ్!

జెస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India)కు చెందిన ఒక SUV ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా కార్ల గురించి మాట్లాడేటప్పుడు మైలేజ్, ఫీచర్లు లేదా ధరల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కారణంతో ఈ బ్రాండ్ వార్తల్లో నిలిచింది. అదే, తన బలాన్ని ప్రపంచానికి నిరూపించిన ఓ అసాధారణ ఘనత. ఎంజీ మెజెస్టర్ (MG Majestor) పేరుతో వచ్చిన ఈ SUV తాజాగా ఒక అద్భుతమైన సాహసం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రైల్వే పట్టాలపై నిలిచి ఉన్న భారీ రైలును లాగడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి ప్రయత్నాలు సాధారణంగా ప్రత్యేక యంత్రాలతోనే సాధ్యమవుతాయి. కానీ ఈసారి ఒక SUV ఈ సవాల్‌ను స్వీకరించి, విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రతి 3 SUVల్లో ఒకటి టాటాదే.. నెక్సాన్, పంచ్ సేల్స్ రికార్డ్!

గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ (Tata Motors) అమ్మకాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన మోడళ్లలో టాటా నెక్సాన్ (Tata Nexon),టాటా పంచ్ (Tata Punch) అగ్రస్థానంలో నిలిచాయి. కాంపాక్ట్ SUV విభాగంలో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ రెండు వాహనాలు వరుసగా మొదటి, రెండో స్థానాలను దక్కించుకోవడం విశేషం. నగర అవసరాలకు సరిపోయే డిజైన్, మంచి మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు, సరసమైన ధరల కలయికతో ఈ మోడళ్లు విస్తృతంగా ఆదరణ పొందాయి. ప్రత్యేకంగా చూసుకుంటే, ఈ రెండు మోడళ్లు కలిసి అమ్మకాల పరంగా ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నాయి. ఏడాది మొత్తం గణాంకాలను పరిశీలిస్తే, 4 లక్షల యూనిట్ల మార్కును ఎంతో సులభంగా దాటుతూ, మొత్తం 4,00,034 యూనిట్ల అమ్మకాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించాయి.

ఈ బైక్ ఒక్కసారి ఎక్కారంటే దిగాలనిపించదు

బ్రిటిష్ క్లాసిక్ బైక్ తయారీదారు ట్రయంఫ్ (Triumph), భారతీయ దిగ్గజం బజాజ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన స్క్రాంబ్లర్ 400 X ఒక సెన్సేషన్. అయితే, తాజాగా 2026 మోడల్‌లో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. 400సీసీ కేటగిరీలో ఉండాల్సిన ఈ బైక్, ఇప్పుడు 350సీసీ ఇంజిన్‌తో మన ముందుకు వచ్చింది. ఇంజిన్ తగ్గినా, మజా మాత్రం తగ్గలేదనేది ఈ బైక్ రైడ్ చేసిన వారి మాట. మరి ఈ మార్పు ఎందుకు జరిగింది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్న ఆసక్తికర విషయాలు రివ్యూలో చూద్దాం. ఈ మార్పుకు అసలు కారణం ఏంటి?భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమల్లోకి తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వాహన రంగాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ముఖ్యంగా మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే.. 350సీసీ లోపు ఉన్న బైక్‌లపై 18 శాతం పన్ను విధిస్తుండగా, ఆ మార్క్ దాటిన బైక్‌లపై ఏకంగా 40 శాతం పన్ను విధిస్తున్నారు. ట్రయంఫ్ 400 సిరీస్ బైక్స్ అన్నీ 398సీసీ ఇంజిన్‌తో ఉండటంతో వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఏర్పడింది. కస్టమర్లపై ఆ భారం పడకుండా ఉండాలని, బజాజ్-ట్రయంఫ్ కలిసి ఇంజిన్ కెపాసిటీని 349సీసీకి తగ్గించాలని నిర్ణయించాయి. అలా పుట్టుకొచ్చిందే ఈ 2026 ఎడిషన్ ట్రయంఫ్ రేంజ్.
Advertisement

పెద్ద ఫ్యామిలీలు దర్జాగా ప్రయాణించేందుకు పర్ఫెక్ట్ కారు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టయోటా పేరు వింటేనే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ వాల్యూ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఎంపీవీ(MPV) సెగ్మెంట్‌లో టయోటాకు ఎదురులేదని మరోసారి రుజువైంది. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటి, భారతీయ రోడ్లపై తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నవంబర్ 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇన్నోవా హైక్రాస్, కేవలం మూడున్నరేళ్ల లోపే (ఏప్రిల్ 2026 నాటికి) 2 లక్షల క్యుములేటివ్ సేల్స్ మార్కును దాటింది. భారతీయ కస్టమర్లు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు ఎంత వేగంగా మళ్లుతున్నారో ఈ గణాంకాలే నిదర్శనం. టయోటా గ్లోబల్ ప్లాట్‌ఫామ్ అయిన TNGA మీద ఆధారపడి తయారైన ఈ కారు, అటు ఎస్‌యూవీ (SUV) లాంటి పవర్, ఇటు ఎంపీవీ లాంటి సౌకర్యాన్ని కలగలిపి అందిస్తోంది. హైక్రాస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది దాని 5th జనరేషన్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్. ఇందులో 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 186 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ లోపల డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా దూరం వరకు ఈ కారు ఈవీ (EV) మోడ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గి, మైలేజ్ భారీగా పెరుగుతుంది.

ఫోన్ ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

నేటి కాలంలో డెలివరీ బాయ్స్, ఫీల్డ్ వర్క్ చేసే వారికి బైక్ ఎంత ముఖ్యమో, వారి స్మార్ట్‌ఫోన్ కూడా అంతే ముఖ్యం. గూగుల్ మ్యాప్స్ చూడాలన్నా, ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి. కానీ రోజంతా బయట తిరిగేవారికి ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం ఒక పెద్ద తలనొప్పి. పవర్ బ్యాంకులు మోయడం, ఎక్కడైనా హోటల్ దగ్గర ఛార్జింగ్ కోసం బతిమిలాడటం కంటే.. బైక్‌లోనే ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే, డెలివరీ పనుల కోసం ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 154 కి.మీ.. Flying Flea C6 మార్కెట్‌లో హల్‌చల్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పుడూ తన ప్రత్యేక శైలితో ముందుండే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా తన అడుగును బలంగా ముద్రించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ అధికారికంగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను కంపెనీ తన కొత్త సబ్-బ్రాండ్ అయిన Flying Flea కింద తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌లో వచ్చిన తొలి మోడల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) నిలవడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ విషయంలో చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్లాసిక్ DNA ను కొనసాగిస్తూ, ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌ను అందించారు. సిటీ రైడింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బైక్, లైట్‌వెయిట్ బాడీతో పాటు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది.

ఓలాను వెనక్కి నెట్టి నంబర్ 1 సీటెక్కిన టీవీఎస్

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. నిన్న మొన్నటి వరకు ఈవీ (EV) రంగం అంటే కేవలం కొత్త స్టార్టప్ కంపెనీలదే హవా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ, ఒక వెటరన్ కంపెనీ రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విక్రయాల గణాంకాలు పరిశీలిస్తే, టీవీఎస్ మోటార్స్ (TVS Motors) టాప్ ప్లేస్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఓలా, ఏథర్ వంటి కంపెనీలు మార్కెటును ఓ ఊపు ఊపగా, ఇప్పుడు టీవీఎస్ తన నమ్మకమైన సర్వీస్, అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్ల మనసు గెలుచుకుంది. కేవలం 365 రోజుల్లో 3.41 లక్షల స్కూటర్లను విక్రయించి, ఈ సెగ్మెంట్‌లో 3 లక్షల మార్కును దాటిన ఏకైక కంపెనీగా రికార్డు క్రియేట్ చేసింది.
Advertisement

ఒక్క ఏడాదిలో డబుల్ అయ్యిన సేల్స్.. హరియర్ మార్కెట్‌లో మళ్లీ రాజు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న టాటా మోటార్స్‌ (tata motors) లైనప్‌లో హారియర్ (harrier) ఎప్పటినుంచో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బలమైన బిల్డ్ క్వాలిటీ, అగ్రెసివ్ డిజైన్, ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ కలిపి ఈ SUVను వినియోగదారుల ఫేవరెట్‌గా నిలబెట్టాయి. నగర రోడ్లపై గానీ, హైవేలపై గానీ ఈ వాహనం కనిపిస్తే ప్రత్యేకంగా కనిపించే స్టైల్ దీనికి ఉంది. ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న ఈ SUVపై క్రేజ్ తగ్గేలా కనిపించలేదు. దీనికి నిదర్శనంగా ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. 2026 మార్చి నెలలో Tata Harrier మొత్తం 2,826 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం.

దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి కుటుంబం తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకునే మార్గాలను వెతుకుతోంది. ఈ పరిస్థితుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వినియోగదారులకు ఇంధన వ్యయం తగ్గించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది. అదృష్టవశాత్తూ, 2026లో భారత మార్కెట్లో ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండే పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు కేవలం మైలేజ్ పరంగానే కాకుండా, పనితీరు, నమ్మకంలో కూడా మంచి స్థాయిని అందిస్తున్నాయి. ముఖ్యంగా సీఎన్‌జీ (CNG) ఆప్షన్ ఉన్న మోడల్స్ వినియోగదారులకు భారీ ఆదా కలిగిస్తున్నాయి.ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన మోడల్స్‌లో మారుతి సెలెరియో, వ్యాగన్ ఆర్, ఆల్టో K10, స్విఫ్ట్ కార్లు బెస్ట్. వీటి గురించి ఈ కథనంలో చూద్దాం.

స్కూటర్ కొనే రేటులోనే కారుకు డౌన్ పేమెంట్

భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఎస్‌యూవీల మధ్య పోటీ పెరిగినప్పటికీ, తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోకుండా సరికొత్త హంగులతో సమ్మర్ ఎడిషన్‎ను (Hyundai Creta Summer Edition 2026) మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం ధర మాత్రమే కాదు, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అందించిన టెక్నాలజీ ఫీచర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కొత్త ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

కొత్త లుక్‌లో అదిరిపోయే టైగన్ ఫేస్‌లిఫ్ట్

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), భారతీయ మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో తన ప్రాధాన్యతను మరింత బలపరిచే దిశగా కొత్త అడుగు వేసింది. ఈ నేపథ్యంలో, టైగన్ ఫేస్‌లిఫ్ట్ (Taigun Facelift) వెర్షన్‌ను తాజాగా పరిచయం చేసింది. ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ఈ SUV, ఇప్పుడు మరింత ప్రీమియం లుక్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా అప్‌డేట్ చేయబడింది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముందు భాగంలో రిఫ్రెష్డ్ గ్రిల్, కొత్త స్టైల్ LED లైటింగ్, అప్‌డేటెడ్ బంపర్ డిజైన్ కలిసి కారుకు మరింత ఆకర్షణీయమైన, ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తున్నాయి. ఎక్స్‌టీరియర్‌తో పాటు, ఇంటీరియర్‌లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.
Advertisement

ఆఫీసుకెళ్లినా, అంగడికెళ్లినా హోండానే

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. దేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి హోండా కంపెనీ ఏకంగా కోటి (10 మిలియన్లు) వాహనాల విక్రయాలను పూర్తి చేసింది. ఈ ప్రాంతాల్లోని సామాన్యుడి రవాణా అవసరాలను తీర్చడంలో హోండా బ్రాండ్ ఎంతలా మమేకమైందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నగరాలే కాకుండా మారుమూల పల్లెల్లో కూడా హోండా వాహనాల హవా నడుస్తోంది. ఏ ఏ మోడల్స్ ఎంతలా క్లిక్ అయ్యాయో వివరంగా చూద్దాం.

49,089 కార్లు అమ్మిన Skoda Kylaq.. స్కోడాకు బిగ్ హిట్!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్కోడా ఆటో (Skoda Auto) సంస్థకు చెందిన స్కోడా కైలాక్ (Skoda Kylaq) ప్రస్తుతం వినియోగదారుల మధ్య విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా, స్కోడా బ్రాండ్ నుంచి అత్యంత సరసమైన ధరలో లభిస్తున్న కారుగా నిలవడం దీనికి పెద్ద ప్లస్‌గా మారింది. ఈ అందుబాటు ధర, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ డిజైన్ కలిపి ఈ కారును మధ్యతరగతి కొనుగోలుదారులకు మరింత దగ్గర చేసింది. ఫలితంగా, భారత మార్కెట్లో ఈ మోడల్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారుల్లో చాలామంది ఈ కారుపైనే ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ఈ కారు అమ్మకాలు మెరుగ్గా ఉండటం విశేషం.

ఐదు బైకులను తొక్కిపారేసి నంబర్ 2 స్థానానికి

బజాజ్ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు కేవలం స్కూటర్లకే పరిమితమైన బజాజ్, ఆ తర్వాత మోటార్ సైకిళ్లతో ప్రపంచాన్ని ఏలింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాలం వెనక్కి తిరిగినట్లు కనిపిస్తోంది. బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్, తన సొంత కంపెనీకి చెందిన ఐదు పాపులర్ మోటార్ సైకిళ్లను వెనక్కి నెట్టి సేల్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 2026 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, బజాజ్ పోర్ట్‌ఫోలియోలో చేతక్ ఒక సంచలనంగా మారింది.

మీరు ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే కొనవచ్చు

ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఖర్చు ఒక పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన వినూత్న విధానమే BaaS (Battery as a Service). ఈ స్కీమ్‌లో వాహనం ధరలో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీని వేరు చేస్తారు. దాంతో, కస్టమర్లు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ కోసం మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా చూస్తే "pay-as-you-use" మోడల్‌లా పని చేస్తుంది. అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా స్కూటర్ మొత్తం ధరలో దాదాపుగా సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ విధానంలో లభిస్తున్న కొన్ని స్కూటర్లను చూద్దాం.
Advertisement

ప్రపంచాన్ని ఏలుతున్న కార్లకు ఇండియాలో కోలుకోలేని దెబ్బ

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత మార్కెట్లో తొలి అడుగులు అంత ఆశాజనకంగా లేవు. ఎంతో హంగు ఆర్భాటాలతో ఎంట్రీ ఇచ్చిన అమెరికన్ దిగ్గజం, దేశీయ మార్కెట్లోని గట్టి పోటీని తట్టుకోవడంలో ప్రస్తుతం వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 2026 ఆర్థిక సంవత్సరానికి (FY26) సంబంధించిన అమ్మకాల లెక్కలు పరిశీలిస్తే, టెస్లా కేవలం 342 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ కంపెనీలు ఈవీ మార్కెట్లో దూసుకుపోతుంటే, ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా మాత్రం నామమాత్రపు అమ్మకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒక్క నెలలోనే 1400 యూనిట్లు అవుట్.. డస్టర్ మేనియా మొదలైంది

ఒకప్పుడు భారత రోడ్లపై డస్టర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మధ్యతరగతి ప్రజలకు ఎస్‌యూవీ (SUV) రుచి చూపించిన అసలైన బండి అది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, సరికొత్త అవతారంలో వచ్చిన రెనాల్ట్‎ డస్టర్ 2026 (Renault Duster 2026) ఇప్పుడు మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే రికార్డులు సృష్టిస్తోంది. సేల్స్ మొదలైన తొలి నెలలోనే వెయ్యి యూనిట్ల మార్కును దాటేసి, ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మార్చి 2026 నెలలో ఈ కారు సాధించిన విజయాలు, దీనిలోని అద్భుతమైన ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒక్కసారిగా డబుల్ జోరు.. హైరైడర్ సేల్స్ 93% పెరిగాయి!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. కంపెనీకి చెందిన మోడళ్లు వరుసగా మంచి అమ్మకాలు సాధిస్తూ, మార్కెట్లో తన బలాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా నిలుస్తోంది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder). ఈ SUV దేశవ్యాప్తంగా భారీ ఆదరణను సంపాదించుకుంటూ, టయోటా లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 2026 నెల ముగియగానే బయటకు వచ్చిన అమ్మకాల గణాంకాలు ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో హైరైడర్ మొత్తం 10,206 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది ఇదే మార్చి నెలలో ఈ కారు కేవలం 5,286 యూనిట్లకే పరిమితమై ఉండగా, ఈసారి అమ్మకాలు దాదాపు రెట్టింపు కావడం నిజంగా విశేషం.

దేశంలో అతితక్కువలో లభిస్తున్న 7 సీటర్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగం అందించే కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, ముఖ్యంగా 7 సీట్ల ఎంపికను తక్కువ ధరలో అందించడం వల్ల ఎంతోమంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ పెద్ద కుటుంబాలతో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక ప్రాక్టికల్, సరసమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ కారుకు ఉన్న డిమాండ్ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో ట్రైబర్ మొత్తం 2,011 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 1,552 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 30 శాతం వృద్ధిని సాధించడం నిజంగా విశేషం.
Advertisement

ఈ మూడు కార్లు వస్తే ప్రత్యర్థుల దుకాణం బందే

భారతీయ రోడ్లపై మారుతి సుజుకి హవా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన ఈ దిగ్గజ కార్ల తయారీ సంస్థ, ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ కార్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఎందుకంటే మారుతి సుజుకి నుంచి రాబోతున్న మూడు బ్లాక్ బస్టర్ కార్లు మీ ప్రయాణ అనుభవాన్ని మార్చేయనున్నాయి. ముఖ్యంగా బ్రెజ్జాలో రాబోతున్న 6-గేర్ల ఆప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.