మహీంద్రా కంపెనీకి శనిలా పట్టిన 7 సీటర్
ఆటోమొబైల్స్
- 20 min ago
భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. స్కార్పియో, థార్, ఎక్స్యూవీ 700 వంటి మోడళ్లతో మార్కెట్ను ఏలుతోంది. కానీ ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే, మహీంద్రా కంపెనీలో ఒక మోడల్ మాత్రం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. అది మరేదో కాదు, ఒకప్పుడు ఎంతో ఆశలతో విడుదల చేసిన ఎంపీవీ (MPV) మహీంద్రా మరాజో (Mahindra Marazzo). తాజా అమ్మకాల నివేదికల ప్రకారం, ఈ కారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. గత ఫిబ్రవరి 2026 నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. అంటే జీరో (0) సేల్స్ నమోదయ్యాయి.