వామ్మో 126 శాతం సుంకాలు, భారత సోలార్ ఉత్పత్తులపై ఉక్కుపాదం

భారతదేశం నుండి వచ్చే సోలార్ సెల్స్‌పై US కౌంటర్వెయిలింగ్ డ్యూటీలను విధిస్తుంది, అసెంబుల్ చేసిన ప్యానెల్‌లపై కాదు, ఇది భారతీయ సోలార్ తయారీదారులను మరియు స్టాక్ మార్కెట్‌లను ప్రభావితం చేస్తుంది, పాక్షిక రికవరీలు నమోదయ్యాయి.

మధ్యతరగతి మనసు దోచుకుంటున్న రిజ్తా

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఇప్పుడు ఈవీలే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. ఈ రేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2026 ప్రారంభంలో ఈ స్కూటర్ అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు సగటున 650 స్కూటర్లు అమ్ముడవుతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏథర్ ఎనర్జీ తాజాగా విడుదల చేసిన 2026 జనవరి విక్రయాల గణాంకాలు ఈవీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 20,155 యూనిట్ల రిజ్తా స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. గతేడాది అంటే 2025 జనవరిలో ఇదే స్కూటర్ కేవలం 11,978 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఏడాది కాలంలోనే అమ్మకాల్లో 68.27 శాతం భారీ వృద్ధి నమోదైంది. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఉండటం వల్లే రిజ్తాఇంతటి విజయాన్ని సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏథర్ రిజ్తా ఇంతటి సంచలనం సృష్టించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రస్తుతం ఇది రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తోంది. ఇందులో రిజ్తా ఎస్ (Rizta S), రిజ్తా జెడ్ (Rizta Z) అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది మరింత విశాలంగా ఉండటమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు (Maintenance Cost) కూడా చాలా తక్కువ. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ స్కూటర్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారు ముందుగా చూసేది రేంజ్. రిజ్తా ఇందులో ఎక్కడా తగ్గదు. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 123 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఏకంగా 160 కిలోమీటర్ల (IDC) మౌలేజీని అందిస్తుంది. ఇందులో వాడిన ఎలక్ట్రిక్ మోటార్ 4.3 kW పవర్, 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఏథర్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు. రిజ్తాలో 7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది, ఇది నావిగేషన్ నుంచి కాల్ అలర్ట్స్ వరకు అన్నీ చూపిస్తుంది. ఇందులో స్మార్ట్ (Smart), ఈకో (Eco), జిప్ (Zip) అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉండటం వల్ల హెల్మెట్ లేదా ఇతర సామాగ్రిని సులభంగా ఉంచుకోవచ్చు. డెక్కన్ గ్రే, సియాచిన్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. సేఫ్టీ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు రైడర్ కు మంచి కంఫర్ట్ ను ఇస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ రిజ్లాకు ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), బజాజ్ చేతక్ (Bajaj Chetak), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి స్కూటర్లు గట్టి పోటీనిస్తున్నాయి. అయినప్పటికీ, ఏథర్ అందించే బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని రేసులో ముందు ఉంచుతోంది. తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్ కావాలనుకునే వారికి ఇప్పుడు రిజ్లానే బెస్ట్ ఆప్షన్ గా మారింది.

ఆఫీస్ వెళ్లే వారికి బెస్ట్ బడ్జెట్ కార్లు

హైదరాబాద్, బెంగళూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల కోసం ఒక సొంత కారు ఇప్పుడు అవసరంగా మారింది. ఉదయం ట్రాఫిక్ హడావిడి, సాయంత్రం రద్దీ, అనూహ్యంగా పడే వర్షాలు, మండే ఎండ ఇలాంటి పరిస్థితుల్లో టూవీలర్ వాహనంతో ప్రయాణించడం కష్టసాధ్యం. అలాంటి సమయంలో ఒక చిన్న, నమ్మకమైన, ఇంధన పొదుపు కలిగిన కారు రోజువారీ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చగలదు. మీరు డైలీ యూజ్ కోసం కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌కు సరిపోయే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మోడల్స్‌ను ఎంపిక చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా పంచ్, మారుతి సుజుకి సెలెరియో కార్లు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ కార్ల గురించి ఈ కింది కథనంలో చూద్దాం.

పేదవాడి కడుపు నింపే బైక్ ఇదే

మధ్యతరగతి భారతీయులకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక పొదుపు మార్గం కూడా. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని కోరుకునే సామాన్యులకు ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తోంది. అదే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి దిగ్గజ బైక్‌ల కంటే దాదాపు 10 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తూ, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఈ బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలో ఈ బైక్ సాధించిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఆటోమొబైల్ దిగ్గజాలే విస్తుపోతున్నాయి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కేవలం ధరలో మాత్రమే కాదు, అమ్మకాల్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా వెలువడిన 2026 జనవరి సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 71,690 బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025 జనవరి) తో పోలిస్తే ఇది 15.21 శాతం వృద్ధి. అంటే గతేడాది కంటే సుమారు 9,467 బైక్‌లు అదనంగా విక్రయించబడ్డాయి. ఈ ఘనతతో 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌ల జాబితాలో హెచ్ఎఫ్ డీలక్స్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ తర్వాత స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Advertisement

రాబోయే చైనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మరోవైపు వినియోగదారులను ఈవీ (EV)ల వైపు నడిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విభాగంలో దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి.

మార్చి నెలలో శుక్రుడి దయతో వీరికి లక్ష్మీ కటాక్షం.. సంపన్న యోగం!

శుక్రుడు రేవతి నక్షత్రంలో సుమారు 13-14 రోజులు సంచరిస్తాడు, ఇది వృషభం, మిథునం, కన్య మరియు వృశ్చిక రాశుల వారికి సంపద మరియు అవకాశాలను పెంచుతుంది, సానుకూల ఆర్థిక ఫలితాలు మరియు వృత్తిపరమైన లాభాలు ఉంటాయి.

Sasikala: తమిళనాట సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ

మాజీ AIADMK నాయకురాలు శశికళ తమిళనాడు ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రకటించారు, EPS మరియు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ న్యాయం కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు.

అమెరికా సైన్యానికి 'టాయిలెట్ వార్'.. ఆ తర్వాతే ఇరాన్ తో..

గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ క్యారియర్ వాక్యూమ్ మురుగునీటి వ్యవస్థ లోపం కారణంగా టాయిలెట్ల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఇది సాధారణ కార్యకలాపాలను నిలిపివేసి, వ్యూహాత్మక ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక పరిష్కారాల కోసం మిలియన్ల కొద్దీ ఖర్చు అవుతోంది.

ఉసిరిచెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉండే పవిత్ర ఏకాదశి- ఈ పనులు చేయాలి

అమలకి ఏకాదశి 2026 సమయాలు, ఉపవాస పద్ధతులు, విష్ణు పూజ, ప్రార్థనలు మరియు ఫిబ్రవరి 27న జరుపుకునే ఈ పవిత్రమైన రోజు యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

మటన్, బుడం దోసకాయ కూర.. తింటే అసలే వదిలిపెట్టరు!

రుచికరమైన మాంసాన్ని నిమ్మ దోసకాయ గుమ్మడితో కలిపి లోతు మరియు సమతుల్యత కోసం నెమ్మదిగా ఉడికించిన కుటుంబ ఇష్టమైన తెలంగాణ మటన్ బుడం దోసకాయ కూరను కనుగొనండి.

మరోసారి ఛాన్స్! డిమాండ్ కారణంగా మళ్లీ విడుదల!

అంతర్జాతీయంగా లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ జీప్ (Jeep) మరోసారి తన ఐకానిక్ మోడల్‌తో భారత మార్కెట్‌లో సందడి చేసింది. అడ్వెంచర్‌ను ఇష్టపడే కార్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్‌ (Jeep Wrangler Willys 41 Limited Edition)ను కంపెనీ మళ్లీ విడుదల చేసింది. ఇది సాధారణ ఎడిషన్ కాదు, చరిత్రను గుర్తు చేసే ఒక ప్రత్యేక అవతారం. 2025లో మొదటిసారి లాంచ్ చేసినప్పుడు, ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. పరిమిత యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచగా, అవన్నీ కూడా విడుదలైన 7 రోజుల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి.

కిమ్ బడా ప్లాన్.. సోదరికి కీలక పదవి కట్టబెట్టిన ఉత్తర కొరియా అధినేత !

కిమ్ కుటుంబం ఎలా అధికారాన్ని బలోపేతం చేస్తుందో విశ్లేషిస్తుంది, కిమ్ యో జోంగ్ పదోన్నతి మరియు ఉత్తర కొరియా మరియు దాని విధాన దిశకు రాబోయే వారసత్వ చిక్కులతో.
Advertisement

IT షేర్లు కుప్పకూలడానికి ఆ 'ఒక్క'వార్తే కారణమా?: Market Crash

గ్లోబల్ అనిశ్చితి మధ్య AI ఆధారిత IT అమ్మకాలు, చమురు ధరల పెరుగుదల మరియు డాలర్ బలం సెన్సెక్స్ మరియు నిఫ్టీపై ప్రభావం చూపడంతో భారత సూచీలు తక్కువగా ముగిశాయి.

ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సియెర్రా EV

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్ (Tata Motors), పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే EV సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన టాటా, ఇప్పుడు మరో ఐకానిక్ పేరును తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). సమాచారం ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కొత్త సియెర్రా EV అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముంది. అంటే 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ స్కూటర్‎ను జనవరిలో 19 వేల మంది కొన్నారు

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) తన రేజెడ్‎ఆర్(RayZR) హైబ్రిడ్ స్కూటర్‌తో భారత విపణిలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 స్కూటర్ల జాబితా బయటకు రాగా, యమహా రేజెడ్‎ఆర్ తనదైన శైలిలో దూసుకుపోయి పదో స్థానాన్ని కైవసం చేసుకుంది. యువతను ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన మైలేజీ, లేటెస్ట్ ఫీచర్ల కలయికే ఈ స్కూటర్ విజయానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నాటు గుడ్డు- ఫారం గుడ్డు: ఆరోగ్య పరంగా ఎవరికి ఏది మంచిది..!!

గుడ్ల పెంకు రంగు పోషణను ఎలా ప్రభావితం చేస్తుందో, పశువుల దాణా మరియు నిల్వ ఎందుకు ముఖ్యమో మరియు భారతదేశంలో సురక్షితమైన, సరసమైన గుడ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

Rail miles: రైల్వే బంపర్ ఆఫర్- ట్రైన్ ఎక్కితే రివార్డులు..!

సౌత్ సెంట్రల్ రైల్వే రైల్ మైల్స్ ను పరిచయం చేసింది, ఇది ప్రయాణీకులకు మరియు సరుకు రవాణాకు గ్రీన్ మైల్స్ మరియు స్థాయి ప్రయోజనాలతో హైదరాబాద్ డివిజన్ నుండి ప్రారంభించి రివార్డు చేస్తుంది.

లీటర్‌కు 90 కి.మీ మైలేజ్ బైక్

భారతదేశంలో మైలేజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి బజాజ్ ప్లాటినా (Bajaj Platina). నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతీ ఇంటికి సుపరిచితమైన ఈ కమ్యూటర్ బైక్ చాలా కాలంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వడం, మెరుగైన ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం వంటి లక్షణాలు ప్లాటినాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 2026 జనవరిలో ఈ బైక్ మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపించింది. ఒక్క నెలలోనే 33,520 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ కావడం చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక అమ్మకాల సంఖ్య కాదు, వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక.

రూ.10 లక్షల్లో టాప్ 5 టర్బో కార్లు ఇవే

సాధారణంగా కారు అనగానే ప్రతి ఒక్కరూ మైలేజ్ గురించి ఆలోచిస్తారు. కానీ కొంచెం స్పీడ్, అదిరిపోయే పికప్ కోరుకునే కుర్రాళ్లకు మాత్రం టర్బో పెట్రోల్(Turbo Petrol) ఇంజన్లే అసలైన కిక్కునిస్తాయి. తక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ సాధారణ ఇంజన్ల కంటే ఎక్కువ పవర్, వేగం అందించడం వీటి స్పెషాలిటీనే వేరు. గతంలో టర్బో ఇంజన్ కార్లు అంటే చాలా ఖరీదైనవి అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం రూ.10 లక్షల బడ్జెట్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే టర్బో కార్లు ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మైలేజ్, పవర్ కలబోసిన టాప్-5 టర్బో కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue Turbo)హ్యుందాయ్ వెన్యూ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పాపులారిటీ పొందిన మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తక్కువ ధరలోనే బెస్ట్ పవర్ ఆశించే వారికి ఇది ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. టెక్నికల్ పరంగా చూస్తే, ఇందులో 1.0 లీటర్ కాప్పా టర్బో GDi ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 120 hp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోడ్లపై అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

SIP మ్యాజిక్: నెలకు రూ.5 వేలతో కోటీశ్వరులు అవ్వొచ్చా?

భారతదేశంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయి, ఇది గృహాలను పొదుపు నుండి దీర్ఘకాలిక పెట్టుబడికి మార్చడం ద్వారా సంపద సృష్టిని పెంచుతోంది, దీనికి డిజిటల్ వేదికలు మరియు పెరిగిన ఆర్థిక అక్షరాస్యత సహాయపడుతున్నాయి.
Advertisement

ఇలా కూడా కారు ఉంటుందా?

భారత ఆటోమొబైల్ రంగంలో ఇటీవలి కాలంలో వేగంగా వినిపిస్తున్న పేరు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group). ఇప్పటికే ఎంజీ మోటార్ (MG Motor)తో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మంచి ప్రస్థానం సాగిస్తున్న ఈ గ్రూప్, ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కేవలం భాగస్వామ్యాలకే పరిమితం కాకుండా, భారతదేశంలో స్వతంత్ర ప్రయాణీకుల మొబిలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి JSW సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇది భవిష్యత్ EV మార్కెట్‌పై వారి గంభీర దృష్టిని చూపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Chery తో కూడా భాగస్వామ్యాన్ని ప్రకటించడం కీలక మలుపు. ఈ రెండు బ్రాండ్లు కలిసి భారత మార్కెట్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించాయి.

ఈ కారు అంటేనే జంకుతున్న జనం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఒకప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ఈ విభాగంలో రారాజుగా వెలుగొందేది. ఎండీవర్ నిష్క్రమణ తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసేందుకు, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ గ్లోస్టర్‎ను ఎంతో ఆశతో ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు గ్లోస్టర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎంజీ గ్లోస్టర్ ప్రస్థానం ముగియనుంది. గత రెండు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడంతో, ఈ మోడల్‌ను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.

ఎట్టకేలకు 12వ వేతన సంఘం నియామం, కొత్త ఛైర్మన్ గా - టైం ఫిక్స్...!!

కేరళ యొక్క 12వ వేతన సవరణ కమిషన్ రాష్ట్ర ఉద్యోగుల జీతాలను అధ్యయనం చేస్తుంది, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య మంత్రివర్గ ఆమోదం, బకాయిలు మరియు అమలు కాలక్రమాలను వివరిస్తుంది.

ప్రతిరోజూ 1,200 ఇదే స్కూటర్‌ను కొంటున్నారు

భారత ఎలక్ట్రిక్ రెండు చక్రాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీకి చెందిన టీవీఎస్ ఐక్యూబ్ (iQube) స్కూటర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులు పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో పాటు, పర్యావరణ హిత వాహనాలపై ఆసక్తి పెరగడం కూడా ఐక్యూబ్ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. 2026 జనవరి నెలలో iQube విక్రయాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయి. ఒక్క నెలలోనే మొత్తం 37,560 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం ఈ స్కూటర్‌పై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

రూ.100తో 450 కిమీ ప్రయాణం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తూ టాటా మోటార్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాటా పంచ్ ఇవి (Tata Punch EV) ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరిన్ని హంగులతో సిద్ధమైంది. కేవలం 100 రూపాయల ఖర్చుతోనే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా చెన్నై నుంచి మదురై వరకు ప్రయాణించే అద్భుతమైన అవకాశం ఈ కారుతో సాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.