బడ్జెట్ ధరలో 30కిమీ మైలేజ్ ఇచ్చే మహింద్రా పవర్‌ఫుల్ కారు

దేశీ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా (Mahindra and Mahindra) నుంచి ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహింద్రా మొదటి సీఎన్‌జీ (CNG) కారు రోడ్లపైకి రావడానికి ముహూర్తం ఖరారైంది. తన పాపులర్ మోడల్ మహింద్రా XUV 3XOలో సీఎన్‌జీ పవర్‌ట్రైన్‌ను జోడించేందుకు కంపెనీ రెడీ అయింది. దీనివల్ల టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న మిడిల్ క్లాస్ వాహనదారులకు ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సీఎన్‌జీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వినియోగదారులు మైలేజీనిచ్చే సీఎన్‌జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు ఈ విభాగంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ మాత్రమే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అయితే, మహింద్రా ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం భారీ డీజిల్ ఎస్‌యూవీలకే పరిమితం కాకుండా, సామాన్యులకు చేరువయ్యేందుకు XUV 3XO మోడల్‌లో సీఎన్‌జీని ప్రవేశపెడుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ గత రెండేళ్లుగా రారాజుగా వెలుగుతోంది. గత ఏడాది (2025) గణాంకాలను పరిశీలిస్తే.. మహింద్రా 3XO సుమారు లక్ష యూనిట్లు విక్రయించగా, నెక్సాన్ ఏకంగా 2 లక్షలకు పైగా యూనిట్లను అమ్మింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే నెక్సాన్‌కు పోటీగా సీఎన్‌జీ మోడల్ ఉండాలని మహింద్రా భావించింది. ఇప్పుడు 3XO సీఎన్‌జీ రావడంతో, కస్టమర్లకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ అనే నాలుగు ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లు ఉన్న కారుగా 3XO సెన్సేషన్ సృష్టించబోతోంది. మహింద్రా ప్రస్తుతం XUV 3XO లో రెండు రకాల 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి 111hp పవర్ ఇచ్చే మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (MPFI), రెండోది 131hp ఇచ్చే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్. అయితే, సీఎన్‌జీ కోసం మహింద్రా మొదటి ఆప్షన్ అయిన MPFI ఇంజన్‌ను ఎంచుకుంది. ఎందుకంటే ఈ తరహా ఇంజన్లు సీఎన్‌జీ కిట్లను అమర్చడానికి సులభంగా ఉండటమే కాకుండా, తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. XUV 3XO లో ఉన్న ప్రధాన సమస్య దాని బూట్ స్పేస్. ఇప్పటికే దీనిలో కేవలం 295 లీటర్ల స్పేస్ మాత్రమే ఉంది. ఒకవేళ సాధారణ సీఎన్‌జీ సిలిండర్ పెడితే, సామాన్లు పెట్టుకోవడానికి అస్సలు చోటు ఉండదు. దీనిని అధిగమించడానికి మహింద్రా, టాటా నెక్సాన్ లాగే ట్విన్ సిలిండర్ (Twin Cylinder) టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. లేదా మారుతి తన విక్టోరిస్ కారులో వాడినట్లుగా అండర్ బాడీ ట్యాంక్ విధానాన్ని అనుసరించవచ్చు. దీనివల్ల వినియోగదారులకు మైలేజీతో పాటు లగేజీ పెట్టుకోవడానికి కూడా తగినంత స్థలం లభిస్తుంది. ఆటోకార్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, మహింద్రా XUV 3XO సీఎన్‌జీ మోడల్ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి సీఎన్‌జీ సెంట్రిక్ మార్కెట్లలో తన పట్టును పెంచుకోవాలని మహింద్రా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాబోయే కఠినమైన CAFE 3 నిబంధనలను పాటించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ సీఎన్‌జీ మోడల్ మహింద్రాకు ఎంతో కీలకం కానుంది. మొత్తానికి మహింద్రా తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులకు కారణం కానుంది. ఒకప్పుడు కేవలం ఆఫీస్ పనులకు లేదా కమర్షియల్ అవసరాలకు మాత్రమే సీఎన్‌జీ వాడేవారు. కానీ ఇప్పుడు లగ్జరీ ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీల్లో కూడా సీఎన్‌జీ రావడం వల్ల వినియోగదారులకు అటు సౌకర్యం, ఇటు పొదుపు రెండూ లభిస్తాయి. మహింద్రా బ్రాండ్ ఇమేజ్, XUV 3XO లోని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తోడైతే, సీఎన్‌జీ మార్కెట్లో మహింద్రా తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ సేల్: ఐఫోన్ 15, శామ్‌సంగ్ S24పై భారీ తగ్గింపులు. Grab the best smartphone deals this weekend with massive bank discounts and exchange offers before the price war ends tonight.

సిట్యుయేషన్‌షిప్ కామెంట్: రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్

జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్ ఏంటి? Rakul Preet Singh gives a bold reply to husband Jackky Bhagnani's viral comment on modern relationships.

ఇండియాలో అత్యంత చౌకైన బెంజ్ కారు లాంచ్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) భారత మార్కెట్లో కూడా తన ప్రాధాన్యాన్ని నిరంతరం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, కొత్త డిజైన్‌లతో కార్లను విడుదల చేస్తూ, ప్రతి సెగ్మెంట్‌లోనూ తన ఉనికిని బలపరచడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా చూస్తే, బెంజ్ ఇండియాలో కొత్త మోడళ్లను తరచుగా పరిచయం చేస్తూ వినియోగదారుల ఆసక్తిని నిలబెట్టడంలో విజయవంతమైంది. ఇప్పుడు అదే జోష్‌తో కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్-బెంజ్ కూడా తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమైంది.
Advertisement

వేసవిలో కూడా చల్లగా ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

ఏప్రిల్ ఎండల్లో మీ ఫోన్ వేడెక్కుతుందా? వేసవి తాపాన్ని తట్టుకుని చల్లగా ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే. Stay cool this summer with these top-rated heat-resistant smartphones featuring advanced cooling technology.

సగం ప్రభుత్వాన్ని నడిపించబోతున్న AI-ప్రపంచంలో తొలిసారి..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాబోయే రెండు సంవత్సరాలలో ప్రభుత్వ కార్యకలాపాలలో సగం AI ఆధారిత స్వయం పాలక వ్యవస్థలకు మార్చాలని యోచిస్తోంది, ఏజెంటిక్ AI సేవలను మెరుగుపరచడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో ఒక ఎగ్జిక్యూటివ్ భాగస్వామిగా ఉంటుంది.

ఇవి రెండు రెబ్బలు తింటే - రక్తపోటు, కొలెస్ట్రాల్ కు చెక్.. గుండె సేఫ్..!!

ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె మరియు జీర్ణకోశ ఆరోగ్యంపై కలిగే ప్రభావాలను, సాధ్యమయ్యే ప్రమాదాలను మరియు జీర్ణక్రియ మరియు పరస్పర చర్యల కోసం భద్రతా మార్గదర్శకాలను అన్వేషించండి.

బెంగాల్ లో విజయం పై బీజేపీ ధీమా వెనుక, సునామీ- అసలు లెక్కలు..!!

విశ్లేషకులు పశ్చిమ బెంగాల్ కోసం బీజేపీ పేర్కొన్న మాస్టర్‌ప్లాన్‌ను అంచనా వేస్తున్నారు, అధికారిక పత్రాలు లేకపోవడం, రాజకీయ పోటీ మధ్య సంస్థాగత మరియు ప్రజలకు చేరువవడంపై ఆధారపడటం వంటి వాటిని గమనిస్తున్నారు.

Tamil Nadu Exit Poll 2026: ఎగ్జిట్ పోల్స్ ఆలస్యం వెనుక ? రిలీజ్ ఎప్పుండంటే ?

ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఆలస్యమయ్యాయి; ఓటర్ల టర్న్ అవుట్ 84.9 శాతంగా ఉండగా, అధికారిక ఫలితాలు మే 4న ప్రకటించబడతాయి.

ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే చాలు.. ఈ కారే కావాలని ఫిక్స్ అయిపోతారు

ఈ రోజుల్లో కారు కొనడం అంటే కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు.. స్టైల్, స్టేటస్, టెక్నాలజీ అన్నీ కలిపి ఓ ప్యాకేజ్‎లా ఉండాలి.. అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య, తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీల్ ఇచ్చే కార్లు ఉంటేనే మధ్యతరగతి కస్టమర్లు వెంటనే ఆకర్షితులవుతున్నారు. ఇదే ట్రెండ్‌ను సరిగ్గా అర్థం చేసుకున్న కియా మోటార్స్ తన కియా సోనెట్‎తో మార్కెట్లో నిజంగానే సునామీ సృష్టిస్తోంది.

గేమింగ్ ఫోన్ హీటింగ్ సమస్యలకు చెక్ పెట్టండిలా..!

ఎండల్లో మీ ఫోన్ వేడెక్కుతుందా? BGMI గేమింగ్ కోసం Snapdragon vs Dimensity చిప్‌సెట్‌ల హీటింగ్ టెస్ట్ రిపోర్ట్. Find out which processor handles summer heat better for stable 120FPS gaming.

ఎండల నుంచి ఉపశమనం: ఈ చిట్కాలు పాటిస్తే చాలు

ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాలు పాటించండి. Stay hydrated and protect yourself from heatwaves with these effective, natural home remedies to beat the summer heat.
Advertisement

IQOO 15: 8000mAh బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్

iQOO 15 సిరీస్ త్వరలో భారీ 8000mAh బ్యాటరీ మరియు పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో రాబోతోంది. Get ready for the ultimate flagship killer with 200MP camera and record-breaking battery life.

35kmpl మైలేజ్‌తో కొత్త ఫ్రాంక్స్.. హైబ్రిడ్ + ADAS ఫీచర్లతో రాబోతుంది!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ సైజ్, అలాగే ఫీచర్ల పరంగా మంచి బ్యాలెన్స్ ఈ మూడు అంశాలు కలిపి ఈ కారును ప్రతి నెలా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలబెట్టాయి. నగరాల్లో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, ఫ్యామిలీ యూజ్‌కు కూడా సరిపోయే విధంగా రూపొందించబడటం దీని ప్రధాన బలం. ముఖ్యంగా Maruti Suzuki బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా ఫ్రాంక్స్ విజయానికి కారణమైంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజ్, అలాగే రీసేల్ వ్యాల్యూ ఇవి వినియోగదారులను ఆకర్షించే అంశాలుగా నిలుస్తున్నాయి.

అన్నా హజారే నిప్పులు: "దారి తప్పిన పార్టీ.. అందుకే అంతా పోతున్నారు!"

రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన చీలికను ఎదుర్కొంది. భారత రాజకీయాల్లో మార్పులు మరియు పార్టీకి దాని పర్యవసానాలను విశ్లేషిస్తుంది.

స్కూటర్ అంటే ఇదే.. అన్ని వర్గాల వారికి అచ్చొచ్చిన బండి

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో స్కూటర్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, ఆఫీసులకు వెళ్లేవారికి స్కూటర్లే ప్రధాన రవాణా సాధనాలుగా మారాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో స్కూటర్ల అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ రేసులో ఎప్పటిలాగే హోండా యాక్టివా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కేవలం ఏడాది కాలంలోనే లక్షలాది మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడం విశేషం. మిగిలిన కంపెనీలు కూడా గట్టి పోటీని ఇస్తూ టాప్-10 జాబితాలో నిలిచాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో హోండా యాక్టివా ఎప్పుడూ ముందే ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో ఈ స్కూటర్ ఏకంగా 28,45,052 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే నెలకు దాదాపు 2.3 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న స్కూటర్ కంటే యాక్టివా రెండింతలు ఎక్కువ అమ్మకాలను సాధించడం గమనార్హం. దీని మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్, రీసేల్ వాల్యూ కారణంగా ప్రజలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.

పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్ SUV.. MG మేజెస్టర్ పూర్తి విశ్లేషణ

భారత ఆటోమొబైల్ రంగంలో భారీ హైప్ మధ్య జరిగిన Bharat Mobility Global Expo 2025లో MG Motor అనేక కొత్త మోడళ్లను టీజ్ చేసింది. అందులో MG Cyberster, MG M9 ఇప్పటికే రోడ్లపై కనిపిస్తున్నాయి. అయితే దాదాపు ఏడాది నరంగా టీజ్ చేస్తూ వచ్చిన MG Majestor ఇప్పుడు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫుల్-సైజ్ బాడీ-ఆన్-ఫ్రేమ్ SUV, డీ-సెగ్మెంట్‌లో రాజుగా పేరున్న Toyota Fortunerకు నేరుగా పోటీగా నిలవబోతోంది. మరి నిజంగా ఇది ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలదా? దీని డ్రైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ SUVను డ్రైవ్ చేశాం. ఆ అనుభవం వివరాలు ఈ కింది కథణంలో.

ఆర్‌సీబీ విజయం: సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్

ఆర్‌సీబీ విజయం నుంచి మనం నేర్చుకోవాల్సిన సక్సెస్ మంత్రాలు ఇవే. Learn how RCB's strategic run chase offers a perfect blueprint for overcoming career pressure, exam stress, and achieving professional growth through smart planning.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో: అదిరిపోయే ఫీచర్లు

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో భారత్‌లో విడుదల, భారీ బ్యాటరీ మరియు అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయింది. Motorola Edge 70 Pro launched in India with 6500mAh battery and premium specs at an aggressive price point.

అంచనాలు ఆకాశంలో.. అమ్మకాలు నేలమట్టం

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు భారీ అంచనాలతో అడుగుపెట్టిన జీప్ (Jeep) బ్రాండ్‌కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు అన్న మాట వినిపిస్తోంది. గ్లోబల్‌గా బలమైన ఇమేజ్ ఉన్న ఈ కంపెనీ, ఇండియాలో మాత్రం ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోతోంది. ప్రారంభంలో జీప్ కంపాస్ (Jeep Compass) మోడల్‌తో మంచి ఎంట్రీ ఇచ్చిన జీప్, ఆ కారుతో మార్కెట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. స్టైలిష్ డిజైన్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, అలాగే ప్రీమియం ఫీలింగ్ ఈ మూడు అంశాలు కంపాస్‌ను కస్టమర్లలో పాపులర్ చేశాయి. అయితే ఆ మంచి ఆరంభాన్ని కంపెనీ కొనసాగించలేకపోయింది. కంపాస్ తర్వాత వచ్చిన మోడళ్లలో ఏదీ కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయింది.
Advertisement

పోర్షే కారుపై సిమెంట్ మిక్సింగ్.. ఇది మరీ టూ మచ్ అన్నా !!

పారిశ్రామికవేత్త అఖిల్ హేమాద్రి ఎర్రటి బోనెట్ కారును ఉపయోగించి సిమెంట్ మిశ్రమంతో గుంతలను మరమ్మత్తు చేశారు, ఇది బెంగళూరులో పౌర సంబంధాలు, పౌర విధి మరియు మౌలిక సదుపాయాలపై ఆన్‌లైన్ చర్చకు దారితీసింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. చుట్టుపక్కల ఊర్లన్నీ చుట్టేసి రావచ్చు

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఛార్జింగ్ టైమ్, రేంజ్ గురించి ఇంకా సందేహాలు ఉన్నాయి... ఈ రెండింటి మధ్య ఇరుక్కున్నవారికి ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. జపాన్ దిగ్గజం Yamaha నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో నెమ్మదిగా కానీ స్ట్రాంగ్‌గా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ మోడల్... ఇప్పుడు అమ్మకాలలో డబుల్ స్పీడ్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైల్, రేంజ్, బ్రాండ్ నేమ్ ఇలా అన్నీ కలిపి చూస్తే ఇది మిడ్‌రేంజ్ EV సెగ్మెంట్‌లో గేమ్ చెంజర్ అవుతుందా అన్న చర్చ మొదలైంది.

జియో ఎయిర్‌ఫైబర్ Vs ఫైబర్.. ఏది బెస్ట్?

ఇంట్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం చూస్తున్నారా? జియో ఎయిర్‌ఫైబర్ మరియు ఫైబర్ ప్లాన్ల మధ్య తేడాలు, బెస్ట్ ఆఫర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. Compare top home internet plans to find the best speed and budget-friendly deals for your family.

గురు పుష్య యోగం: ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు

గురు పుష్య యోగం వేళ ఈ శుభ ముహూర్తాలు పాటిస్తే మీ ఆర్థిక స్థితి మారుతుంది. Follow these powerful astrological timings and tips to attract wealth and prosperity this Saturday.

ఒక్క రోజు యుద్ధానికి ఇన్ని వందల కోట్లు ఖర్చా?

విశ్లేషకులు ఇరాన్ కార్యకలాపాల సమయంలో JASSM-ER మరియు టోమాహాక్స్ వంటి క్షిపణులపై పెరుగుతున్న US ఖర్చులను గుర్తించారు, నిల్వలు కుదించుకుపోతున్నాయి మరియు రక్షణకు విస్తృత ఆర్థిక చిక్కులు ఉన్నాయి.