కోల్పోయిన సింహాసనం కోసం హ్యుందాయ్ పోరాటం
ఆటోమొబైల్స్
- 1 month, 22 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న హ్యుందాయ్ ప్రస్తుతం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తుండటంతో హ్యుందాయ్ తన పాత స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సవాల్ను అవకాశంగా మార్చుకుని మళ్లీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని కొరియన్ దిగ్గజం గట్టి వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ లక్ష్యంతోనే 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కొత్త మోడళ్లు, అప్డేటెడ్ వెర్షన్లు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనాల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని సంస్థ భావిస్తోంది.