టాటా పంచ్‌కు పోటీగా మారుతి కొత్త కారు.. రూ.5.5 లక్షలలోపే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మారుతి సుజుకి (Maruti Suzuki), గత దశాబ్దంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కూడా తన స్థాయిని గణనీయంగా పెంచుకోవడానికి చాలా కృషి చేసింది. ఒకప్పుడు చిన్న కార్ల తయారీలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు ఎస్‌యూవీల వైపు మళ్లడంతో, అదే దిశగా భారీగా అడుగులు వేసింది. ఈ క్రమంలో ఆరు మోడళ్లతో కూడిన విస్తృత SUV లైనప్‌ను నిర్మించి, మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. అయితే, కంపెనీ లక్ష్యాలు ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఎస్‌యూవీ శ్రేణిని మరింత విస్తరించాలనే ప్రణాళికతో మారుతి ముందుకు సాగుతోంది.

1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!

ప్రాంతీయ సంఘర్షణల మధ్య గ్లోబల్ ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా షాక్ గురించి IEA హెచ్చరించింది, సమన్వయ అంతర్జాతీయ చర్యలు మరియు కీలక షిప్పింగ్ మార్గాల వేగవంతమైన పునరుద్ధరణను కోరింది.

వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!

రాగి మాల్ట్ జీర్ణక్రియకు ఎలా మద్దతు ఇస్తుంది, ఫైబర్ తీసుకోవడం ఎలా పెంచుతుంది మరియు బిజీ ఉదయాలకు ఎలా సరిపోతుందో తెలుసుకోండి. తయారీ చిట్కాలు మరియు సమతుల్య భారతీయ ఆహారంలో రాగి పాత్రను తెలుసుకోండి.

బుల్లెట్ బండికి బ్రేకులు వేయడానికి ట్రయంఫ్ మాస్టర్ ప్లాన్

భారతదేశంలో ప్రీమియం బైకుల మార్కెట్ ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏలుతున్న 350సీసీ సెగ్మెంట్‌లోకి బ్రిటీష్ దిగ్గజం ట్రయంఫ్(Triumph) తన సరికొత్త అస్త్రాలతో దాడికి సిద్ధమైంది. బజాజ్ ఆటోతో కలిసి ఇప్పటికే 400సీసీ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ట్రయంఫ్, ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభించేలా 350సీసీ బైకులను లాంచ్ చేయబోతోంది. ఏప్రిల్ 6, 2026న ఈ బైకులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ధరలు ఎంత తగ్గుతాయి? రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇది గట్టి పోటీ ఇస్తుందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన GST 2.0 నిబంధనలే ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం. కొత్త పన్ను విధానం ప్రకారం, 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై ఏకంగా 40 శాతం జీఎస్టీ విధిస్తారు. అదే 350సీసీ లోపు ఉంటే కేవలం 18 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. ప్రస్తుతం ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 మోడళ్లు 399సీసీ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి, దీనివల్ల కస్టమర్లపై పన్ను భారం ఎక్కువగా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించి, బైకులను మరింత అందుబాటులోకి తేవడానికి బజాజ్, ట్రయంఫ్ కలిసి 350సీసీ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశాయి. ప్రస్తుత 400సీసీ ఇంజిన్‌ను కొద్దిగా తగ్గించి కొత్త 350సీసీ ఇంజిన్‌ను రూపొందిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ కొత్త ఇంజిన్ 35 bhp పవర్, 33 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేస్తారు. ఇంజిన్ సైజు తగ్గినప్పటికీ, రైడింగ్ క్వాలిటీలో ఎటువంటి రాజీ పడకూడదని ట్రయంఫ్ భావిస్తోంది. స్పీడ్ T4 మోడల్‌ను ఇప్పటికే టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం పవర్ కోసమే కాకుండా, నగర ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.ధర తగ్గుతోంది కదా అని ఫీచర్లు తగ్గిస్తారని అనుకుంటే పొరపాటే. ట్రయంఫ్ తన కొత్త 350సీసీ రేంజ్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతోంది. ఇందులో TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వివిధ రైడింగ్ మోడ్స్ (Rain, Road), సెగ్మెంట్-ఫస్ట్ క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిజైన్ పరంగా ప్రస్తుత స్పీడ్ 400 మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లతో ఇది మరింత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త 350సీసీ రేంజ్ రాకతో ట్రయంఫ్ బైకుల ధరలు దాదాపు రూ.30,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే, ఈ బైకులు రూ.1.80 లక్షల నుంచి రూ.2.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్యలో లభించవచ్చు. ఇదే జరిగితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మార్కెట్‌కు ట్రయంఫ్ గట్టి సవాలు విసిరినట్లే. తక్కువ ధరలో ప్రీమియం బ్రిటీష్ బ్రాండ్ దొరుకుతుందంటే యువత కచ్చితంగా ట్రయంఫ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ట్రయంఫ్ కు ఉన్న అతిపెద్ద సవాలు సర్వీస్ సెంటర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కు దేశవ్యాప్తంగా మూలమూలలా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అయితే, బజాజ్ భాగస్వామ్యంతో ట్రయంఫ్ ఇప్పుడు వేగంగా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. స్పేర్ పార్ట్స్ ధరలను కూడా తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తెస్తే మాత్రం 350సీసీ సెగ్మెంట్‌లో ట్రయంఫ్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఏప్రిల్ 6న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పాత 400సీసీ మోడళ్లను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రానుంది.
Advertisement

ఒక్కసారిగా బాంబ్ పేల్చిన టాటా.. పెట్రోల్, డీజిల్, CNG కార్లపై ధరల పెంపు

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors) నుంచి తాజాగా వచ్చిన వార్త, టాటా కారును కొనాలని భావిస్తున్న అనేక మందికి కొంత నిరాశ కలిగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుండి పెట్రోల్, డీజిల్, అలాగే CNG ఇంజిన్లతో వచ్చే అన్ని ICE వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదు; గత కొంతకాలంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల ప్రభావమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది.

పైసా ఖర్చు లేకుండా ఫిన్లాండ్ వెళ్లే ఛాన్స్. జంటలకు బంపర్ ఆఫర్.

చిల్ లైక్ ఎ ఫిన్ ఛాలెంజ్ కింద ఏడు రోజుల, పూర్తిగా ఖర్చులతో కూడిన ఫిన్లాండ్ ఉచిత ట్రిప్ కోసం అప్లై చేయండి. ఎలా ఎంటర్ అవ్వాలో మరియు అనుభవం ఏమిటో తెలుసుకోండి.

త్వరలో మార్కెట్లోకి 5 సరికొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు

భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైబ్రిడ్ జపం వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం డీజిల్, పెట్రోల్ ఇంజిన్లకే పరిమితమైన మన కార్ల మార్కెట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. అయితే, పూర్తి ఎలక్ట్రిక్ కార్ల వాడకంలో ఛార్జింగ్ ఇబ్బందులు ఉండటంతో, సామాన్యుడికి హైబ్రిడ్ టెక్నాలజీ ఒక వరంగా మారింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండటం వల్ల మైలేజీ అదిరిపోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ విభాగంలో సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు (SUVs) మార్కెట్లోకి రాబోతున్నాయి. టయోటా నుంచి నిస్సాన్ వరకు దిగ్గజ కంపెనీలు సిద్ధం చేస్తున్న ఆ 5 అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.

ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!?

మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలు ముంబై ఇండియన్స్ జట్టు 2026 కోసం సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా పరిగణించేలా చేశాయి, అభిమానులు, నిపుణుల చర్చల మధ్య నాయకత్వ ప్రణాళికలను రూపొందించింది.

ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక!

అణు కార్యక్రమం మరియు ప్రాక్సీ గ్రూపుల దాడులపై ఇరాన్‌కు జీ7 దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. G7 warns Iran over nuclear enrichment and proxy warfare threatening global oil supplies.

రూ.3.70 లక్షల వరకు తగ్గింపు.. MG కార్లపై అదిరిపోయే డీల్స్!

2026 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (Jsw Mg Motor) ఇండియా తమ వ్యాపార వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చుకుంది. మార్కెట్లో అమ్మకాలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో, వినియోగదారులను ఆకట్టుకునేలా ఒక భారీ డిస్కౌంట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, కేవలం సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లకే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలపైనా కంపెనీ గట్టిగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన సంస్థ, తమ మొత్తం అమ్మకాలలో ఈవీల పాత్రను మరింత పెంచుకోవాలని చూస్తోంది.

బైక్ అంటే ఇలా ఉండాలి భయ్యా

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్లతో బైక్స్‌ను లాంచ్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతోంది. తాజాగా టీవీఎస్ రోనిన్ (TVS Ronin) మోడల్ ఫిబ్రవరి 2026లో ఏకంగా 8,000 యూనిట్లకు పైగా అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఇప్పుడు రొనిన్ వెర్షన్‌లోనే ఒక పవర్‌ఫుల్ కేఫ్ రేసర్ (Cafe Racer) ఎడిషన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్ ఫైలింగ్స్ కూడా పూర్తయ్యాయి. టీవీఎస్ రోనిన్ భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2025 ప్రారంభంలో నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఈ బైక్ ప్రయాణం, ఇప్పుడు 8,000 మార్కును దాటేసింది. గడిచిన 12 నెలల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు ప్రతి నెల అమ్మకాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా జనవరిలో 8,247 యూనిట్లు, ఫిబ్రవరిలో 8,175 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలే రోనిన్ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. రోనిన్‎కి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ ఈ లైనప్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కేఫ్ రేసర్ డిజైన్‌ను రూపొందించింది. ఇటీవల ఈ కొత్త వెర్షన్ డిజైన్ పేటెంట్‌ను కంపెనీ ఫైల్ చేసింది. సాధారణ రోనిన్ బైక్ స్క్రాంబ్లర్ లేదా క్రూయిజర్ శైలిలో ఉంటే, ఈ కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ మరింత స్పోర్టీగా, అగ్రెసివ్ లుక్‌లో ఉండబోతోంది. రేసింగ్ ప్రియులను ఆకట్టుకునేలా దీని బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. కొత్త టీవీఎస్ రోనిన్ కేఫ్ రేసర్ డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో కొత్తగా క్వార్టర్ ఫెయిరింగ్ (Quarter Fairing)ను అమర్చారు, ఇది బైక్ ముందు భాగానికి ఒక క్లాసిక్ రేసింగ్ లుక్‌ను ఇస్తుంది. అలాగే లో-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుక వైపుకు జరిపిన ఫుట్‌పెగ్స్ దీని ప్రత్యేకత. దీనివల్ల రైడర్ మరింత వంగి బైక్‌ను నడపాల్సి ఉంటుంది, ఇది అచ్చమైన రేసింగ్ ఫీల్‌ను ఇస్తుంది. సింగిల్ సీట్ ఆప్షన్, స్టబీ ఎగ్జాస్ట్ (చిన్న సైలెన్సర్) వంటి ఎలిమెంట్స్ ఈ బైక్‌ను పాత కాలపు కేఫ్ రేసర్ల వలె మార్చేశాయి. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్‌గా అమర్చిన రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మనం చూడవచ్చు. ఇది స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో వస్తుంది, అంటే మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసుకుని నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటివి పొందవచ్చు. టైర్లు, గ్రాఫిక్స్ కూడా మరింత స్పోర్టీగా ఉండబోతున్నాయి. రోడ్డు మీద ఈ బైక్ వెళ్తుంటే ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించేలా దీని రోడ్ ప్రెజెన్స్ ఉండబోతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఈడీ హెడ్ లాంప్స్, టెయిల్ లైట్స్ లో కూడా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది. పెర్ఫార్మెన్స్ విషయంలో రొనిన్ కేఫ్ రేసర్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 225.9cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ నే ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 20.4 PS పవర్, 19.93 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్‌లో చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. అప్-సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ బైక్‌కు మంచి స్టెబిలిటీని ఇస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఫీచర్ తప్పనిసరిగా ఉంటుంది. 200cc నుంచి 250cc సెగ్మెంట్‌లో ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, బజాజ్ అవెంజర్ 220,హోండా సీబీ 350 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. కేఫ్ రేసర్ వెర్షన్ రావడం వల్ల టీవీఎస్ కు ఈ సెగ్మెంట్‌లో ఒక యూనిక్ అడ్వాంటేజ్ లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీ దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు, కానీ పేటెంట్ ఫైల్ అయిన నేపథ్యంలో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర ప్రామాణిక రోనిన్ కంటే రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు.

పెట్రోల్ బంక్ వైపు చూడనివ్వదు! ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు

భారతదేశంలో టూవీలర్ మార్కెట్లో ఎంతో కాలంగా విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచిన టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా తన బలాన్ని చూపిస్తోంది. పెట్రోల్ వాహనాలతోనే కాకుండా, భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూ, ఈ సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే ఈ స్కూటర్ వినియోగదారుల మనసు గెలుచుకుని, ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనే ఆలోచన.. కలిసి వినియోగదారులను ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మళ్లిస్తున్నాయి.
Advertisement

నేటి రాశి ఫలాలు 23-03-2026

నేటి రాశి ఫలాలు Monday, 23 March 2026: ఈరోజు వృషభ రాశిలో చంద్రుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి ధనలాభం కలుగుతుందో తెలుసుకోండి. Career, Health, Love మరియు నేటి పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు

క్షీపణి దాడులు మరియు భద్రతా సమస్యల మధ్య ఇరాన్‌ను ఎదుర్కోవడంలో చేరాలని ఇజ్రాయెల్ ప్రపంచ నాయకులను కోరింది, పౌరులు మరియు వ్యూహాత్మక షిప్పింగ్ మార్గాలకు ముప్పులను హైలైట్ చేసింది

భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!

పశ్చిమ ఆసియా అంతరాయాల కారణంగా సరఫరా మరియు ఎగుమతులు తగ్గడంతో భారతదేశ పారిశ్రామిక వృద్ధి ఫిబ్రవరి 2026లో 2.3%కి తగ్గింది, చమురు, LPG మరియు LNG వంటివి అన్ని రంగాలలో ప్రభావితమయ్యాయి.

పాత బంగారానికి కొత్త మెరుపు.. ఒక్కసారి చూస్తే కొనాలనిపిస్తుంది!

భారతీయ రోడ్లపై ప్రీమియం లుక్, స్టైలిష్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్ స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఇప్పుడు మరింత కొత్త అవతారంలో అభిమానులను ఆకట్టుకోవడానికి తిరిగి వచ్చింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన స్థానం బలపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్, తాజా ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్చి 21, 2026న అట్టహాసంగా విడుదలై మరోసారి మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వెర్షన్‌లో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బయటికి మరింత బోల్డ్ లుక్, అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, ఆకట్టుకునే LED లైటింగ్ కలిపి స్కోడా కుషాక్‌ను రోడ్లపై మరింత ఆకర్షణీయంగా నిలబెడుతున్నాయి. లోపల కూడా ప్రీమియం ఫినిష్, అధునాతన టెక్నాలజీ ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీని గురించి ఈ కథణంలో.

కెన్యా తీరంలో చిక్కుకుపోయిన వేలాది లగ్జరీ కార్లు..!

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు జెబెల్ అలీ మరియు హార్ముజ్ ఆంక్షలపై దాడుల తరువాత కార్గో కదలికలను అడ్డుకుంటున్నాయి, వేలాది లగ్జరీ కార్లను కెన్యా ఓడరేవులలో నిలిచిపోయేలా చేశాయి.

క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!

ఆదిత్య ధర్ యొక్క ప్రొఫైల్, ఒక కాశ్మీరీ పండిట్ క్రికెట్ నుండి బాలీవుడ్‌కు మారారు, ఉరి మరియు ధురందర్-2 లకు దర్శకత్వం వహించారు మరియు ఆర్టికల్ 370 తో ఒక ఫిల్మోగ్రఫీని నిర్మించారు.

ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..!

ఇరాన్ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా పాకిస్తాన్‌పై ఒత్తిడి, రక్షణ ఒప్పందం మరియు పాకిస్తాన్, ఇరాన్ మరియు విస్తృత భద్రత కోసం సంభావ్య ప్రాంతీయ స్థిరత్వ ప్రభావాల విశ్లేషణ.

పిల్లి కోసం ఆత్మహత్య చేసుకున్న డాక్టర్..

కుటుంబ కలహాలు, పెంపుడు జంతువు విషయంలో వివాదం, పెరుగుతున్న మానసిక ఆరోగ్య ఒత్తిళ్ల మధ్య హైదరాబాద్‌లో ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు; వైద్య నిపుణులపై ప్రభావం చూపే అన్ని అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా!

ఆల్కహాల్ సాధారణంగా తాగే పానీయాల్లోనే కాకుండా పండ్లు మరియు ఇడ్లీ పిండి వంటి ఆహారాల్లో సహజంగా ఉంటుంది. Learn about common Indian foods that contain trace amounts of natural alcohol residues.

అప్పు చేయకుండానే ఈ కారు కొనచ్చు.. కేవలం రూ. 3.70 లక్షలే

భారతదేశంలో ఒక కారు కొనాలని నిర్ణయించుకునే ముందు వినియోగదారులు చాలా ఆలోచిస్తారు. కేవలం లుక్ లేదా బ్రాండ్ మాత్రమే కాదు, రోజువారీ ఉపయోగంలో ఎంత సౌకర్యంగా ఉంటుందో అన్నదే ప్రధానంగా చూస్తారు. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, కారు నడపడం సులభంగా ఉండాలి అనే అవసరం మొదటగా ముందుకు వస్తుంది. చిన్న రోడ్లలో, పార్కింగ్ సమయంలో, ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా సులభంగా హ్యాండిల్ చేయగలిగే కారు అయితేనే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. దీనికి తోడు, ఇంధన ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మైలేజ్ కూడా చాలా కీలక అంశంగా మారింది. కారు ఎంత ఎక్కువ మైలేజ్ ఇస్తే, అంత తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల కోసం ఇది చాలా ముఖ్యమైన విషయం.

రికార్డుల రారాజు "మోడీ": చామ్లింగ్‌ను దాటేసి సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు !!

నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా గత రికార్డును అధిగమించారు, గుజరాత్ నుండి జాతీయ స్థాయి వరకు ఆయన చేసిన దశాబ్దాల ప్రజా సేవ మరియు కేంద్రీకృత పాలనను ప్రతిబింబిస్తుంది.

మాస్టర్ ప్లాన్ వేసిన మారుతి.. ఇక ప్రతి ఒక్కరూ ఫ్రాంక్స్ వైపే!

మారుతి సుజుకి నుంచి వచ్చే కార్లు దాదాపుగా మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలోనే ఉంటుంటాయి. రూ.10 లక్షల బడ్జెట్‌లో కారు కొనాలనుకునే చాలా మంది వినియోగదారుల మొదటి ఎంపికల్లో ఒకటిగా నిలిచిన మోడల్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx). కూపే-స్టైల్ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ కలిగిన ఈ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్, భారత మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి నెలా పదివేల యూనిట్లకు పైగా అమ్ముడవుతూ తన డిమాండ్‌ను నిలబెట్టుకోవడం ఈ కారుకు ఉన్న పాపులారిటీని స్పష్టంగా చూపిస్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణం మారుతి వినియోగదారుల అభిరుచిని సరిగ్గా అర్థం చేసుకుని రూపొందించిన డిజైన్, ఫీచర్ల సమతౌల్యం.

పాము పేగుల్లో అద్భుతం.. కొండచిలువ నుంచి వెయిట్ లాస్ సీక్రెట్!

PTOS, ఒక పాము నుండి సేకరించిన జీవక్రియ ఉత్పత్తిని ఊబకాయం ఉన్న ఎలుకలలో ఆకలి నియంత్రణగా పరిశోధకులు గుర్తించారు, ఇది ఊబకాయం చికిత్సకు ఒక కొత్త విధానాన్ని అందిస్తుంది.