బంగారం లాంటి కారు..రోజుకు 1500 బుక్ చేసుకుంటున్నారు
ఆటోమొబైల్స్
- 26 days ago
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే టాటా పంచ్ (Tata Punch). మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన ఈ మైక్రో ఎస్యూవీ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండటం, దానికి తోడు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. రోజుకు ఏకంగా 1500 మంది దీనిని బుక్ చేసుకుంటున్నారు!