అదానీ పరువు నష్టం కేసు.. జర్నలిస్టుకు జైలు శిక్ష

అదానీ ఎంటర్‌ప్రైజెస్ పై క్రిమినల్ పరువు నష్టం కేసులో భారతీయ కోర్టు జర్నలిస్ట్ రవి నార్ ను దోషిగా తేల్చి, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు జరిమానా విధించింది, ఇది భారతదేశంలో మీడియా-న్యాయ చట్టాల మధ్య ఉద్రిక్తతలను హైలైట్ చేస్తుంది.

ఓట్స్ ను రోజూ తింటున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

సాధారణ ఓట్స్ కరిగే ఫైబర్ బీటా గ్లూకాన్‌ను అందించడం ద్వారా భారతదేశంలో LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఆచరణాత్మక ఆహార చిట్కాలు మరియు భారతీయ భోజనంలో ఓట్స్ ఎలా సరిపోతాయో తెలుసుకోండి.

యాక్టివా 125 vs యాక్సెస్ 125.. ధర, ఫీచర్లు, మైలేజ్‌లో

భారతదేశ టూవీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ సెగ్మెంట్ అంటేనే గట్టి పోటీకి ప్రతీక. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ స్కూటర్లను ప్రవేశపెట్టినా, కాల పరీక్షను తట్టుకుని నిలబడినవి మాత్రం రెండు పేర్లే.. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125), హోండా యాక్టివా 125 (Honda Activa 125). ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతూ, లక్షలాది వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్నాయి. కాలానుగుణంగా మారుతున్న కస్టమర్ అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, రెండు కంపెనీలు కూడా తరచూ అప్డేట్స్, కొత్త ఫీచర్లతో తమ స్కూటర్లను మార్కెట్లో తాజాగా ఉంచుతున్నాయి. ఇదే ఈ రెండింటి మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో ఈ స్కూటర్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

కారు కొనడం ఇప్పుడు చాక్లెట్ కొన్నంత ఈజీ

భారతదేశం ఆర్థికంగా దూసుకుపోతుందనడానికి ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ రంగమే నిదర్శనం. ఒకప్పుడు కారు కొనాలంటే దశాబ్దాల కలగా ఉండేది. కానీ ప్రస్తుతం భారతీయులు వాహనాల కొనుగోలులో స్పీడ్ పెంచారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా జనవరి నెలలో నమోదైన గణాంకాలు చూస్తుంటే ఆటో రంగం ఏ రేంజ్‎లో పరుగులు తీస్తుందో అర్థం అవుతుంది.
Advertisement

చూసినవాళ్లంతా బుక్ చేసుకుంటున్నారు.. వెన్యూ హవా!

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కొనుగోలుదారుల నుంచి అసాధారణమైన స్పందనను పొందుతోంది. నవంబర్ 4, 2025న అధికారికంగా ప్రారంభించబడిన ఈ రెండవ తరం వెన్యూ, లాంచ్ రోజే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఇది పూర్తిగా ఫ్రెష్ అవతార్‌లో కనిపిస్తూ యువతతో పాటు ఫ్యామిలీ కార్ కొనుగోలుదారులను కూడా ఆకట్టుకుంటోంది. లుక్ పరంగా చూస్తే, కొత్త వెన్యూ మరింత స్టైలిష్‌గా, ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త వెన్యూ భారీ డిమాండ్‌ను నమోదు చేసింది. డీలర్‌షిప్‌ల వద్ద విచారణలు పెరగడమే కాకుండా, బుకింగ్‌ల పరంగా కూడా ఈ కారు కొత్త రికార్డును సృష్టించింది.

నవ్వాపుకుంటున్నావ్ కదరా: 15వ తేదీ ఉంటదిలే..పాక్‌‌కు రక్త కన్నీరే..!!

2026 T20 ప్రపంచ కప్ నిర్ణయంపై ICC పక్షపాతం చూపుతోందన్న వాదనలను పాకిస్తాన్ ఖండించింది. క్రికెట్ పాలనాపరమైన అంశాల్లో బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఆందోళనలను హైలైట్ చేసింది.

టయోటా ఎబెల్లా చరిత్ర తిరగరాస్తుందా ?

టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా సమీక్షను చూడండి. దీని 543 కిమీ రేంజ్, లెవల్ 2 ADAS మరియు ప్రీమియం ఇంటీరియర్స్ గురించి తెలుసుకోండి. ఆశించిన ధర INR 18.00 లక్షల నుండి ఉంటుంది.

నేడు భారత్ బంద్: నిలిచిన రవాణా - విద్యా సంస్థలు, బ్యాంకులు..!!

ఫిబ్రవరి 12న భారత్ బంద్ పాఠశాలలు, బ్యాంకులు, రవాణా మరియు భారతదేశంలో రోజువారీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో అన్వేషించండి, సమాచారం మరియు సురక్షితంగా ఉండటానికి మార్గదర్శకత్వం ఉంటుంది.

పవర్‌ఫుల్ కార్ కమింగ్ ఫ్రమ్ పవర్‌ఫుల్ కంపెనీ

రేపు (ఫిబ్రవరి 12) ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ఒక పెద్ద రోజు. JSW MG మోటార్ ఇండియా తమ కొత్త కారును ఘనంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పెద్ద-సైజు ఫ్యామిలీ SUV మెజెస్టర్ (Majestor) ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి రానుంది. MG మెజెస్టర్‌ను చూసిన వెంటనే ఇది ఒక ప్రీమియం, రాయల్ ఫీల్ కలిగిన SUV అనే భావన కలుగుతుంది. ఈ SUVను ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీలను టార్గెట్ చేసి అభివృద్ధి చేశారు. రోజువారీ ప్రయాణాల నుంచి హైవే ట్రిప్స్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మెజెస్టర్‌ను రూపొందించారు. ఈ కారు వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలని అంటోంది

టాటా మోటార్స్ సంస్థ భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత భారీ వృద్ధిని నమోదు చేసి, తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. కేవలం ఒకే నెలలో సుమారు 70,222 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది జనవరితో పోలిస్తే ఏకంగా 46 శాతం వృద్ధిని సాధించింది. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక విక్రయాలు కావడం విశేషం. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది

భారతీయ రోడ్లపై ఆటో రిక్షా అంటే కేవలం ఒక వాహనం కాదు, అది లక్షలాది మంది సామాన్యుల జీవనాధారం. అలాంటి త్రీ వీలర్ వాహన రంగంలో పెను సంచలనం సృష్టిస్తూ, దేశీయ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా WEGO P9018ను మార్కెట్లోకి విసిరింది. ఫిబ్రవరి 09, 2026న పుణె వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రేంజ్ విషయంలో ఉన్న అన్ని అపోహలను పటాపంచలు చేస్తూ, ఏకంగా 296 కిలోమీటర్ల రేంజ్‎తో ఇది రేంజ్ రాజాగా కీర్తించబడుతోంది. బజాజ్ WEGO P9018ను ఒక సాధారణ ఆటోగా చూడలేము. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఇంజనీరింగ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లోనూ లేని విధంగా, ఇందులో 17.7 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ సాయంతో ఐడియల్ కండిషన్స్‌లో 296 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ కండిషన్స్‌లో కూడా ఇది 240-250 కి.మీ. వరకు సునాయాసంగా ఇస్తుందని అంచనా.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత్ టూర్.. వివరాలు ఇవే..!

మాక్రాన్ 2026 పర్యటన ద్వారా భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుంది, AI, రక్షణ, అంతరిక్షం మరియు ఇండో-పసిఫిక్ సహకారం, మరియు హోరిజోన్ 2047 రోడ్‌మ్యాప్ ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయి.
Advertisement

మోసం చేసిన ట్రంప్, బంగ్లాదేశ్‌కు జీరో డ్యూటీ: US-Bangladesh Trade Deal

అమెరికా బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం యొక్క విశ్లేషణ సుంకాలు తగ్గింపు మరియు బంగ్లాదేశ్ కాటన్ వస్త్రాలకు సున్నా డ్యూటీని అనుమతిస్తుంది, ఇది భారతీయ వస్త్ర ఎగుమతిదారులపై మరియు తిరుపూర్ పై సంభావ్య ప్రభావాలను కలిగి ఉంటుంది

నెల రోజుల్లో 2521 మంది ఇదే కారును ఎంచుకున్నారు

భారతీయ SUV మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభం నుంచే ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. స్టైలిష్ డిజైన్, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఆధునిక ఫీచర్ల కలయికతో, టైజర్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు జనవరి 2026లో కూడా అదే ఊపును కొనసాగించింది. తాజా గణాంకాల ప్రకారం, ఆ నెలలో మొత్తం 2,521 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పమైనప్పటికీ గమనించదగిన వృద్ధి.

"వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ గుడ్లను తినొద్దు"

తమిళనాడులో పక్షులలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను గుర్తించారు, ప్రజలను మరియు పౌల్ట్రీ కార్మికులను రక్షించడానికి ముందుజాగ్రత్త చర్యలు మరియు ప్రజారోగ్య మార్గదర్శకాలను జారీ చేశారు.

దుబాయ్‌లో ఇల్లు కొనడం ఇక 'ఆన్‌లైన్ షాపింగ్' అంత ఈజీ! ఒకే క్లిక్‌తో..!!

UAE రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రాప్‌టెక్ మరియు AIలను స్వీకరిస్తుంది, డేటా ఆధారిత ప్రాపర్టీ మార్కెట్‌లు మరియు ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ మోడళ్ల ద్వారా పారదర్శకత, వేగం మరియు యాక్సెస్‌ను పెంచుతుంది.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVలు

మార్కెట్లో కాంపాక్ట్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఈ సెగ్మెంట్ కార్లు మంచి ఎంపికగా మారాయి. సెడాన్‌ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే విశాలమైన క్యాబిన్, అలాగే బూట్ స్పేస్ ఉండటం వల్ల కాంపాక్ట్ SUVలు భారతీయ వినియోగదారుల అవసరాలకు బాగా సరిపోతున్నాయి. నగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన రోడ్ల పరిస్థితులు కూడా ఈ వాహనాల పాపులారిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కాంపాక్ట్ SUVలు అన్ని రకాల రోడ్లపై సులభంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు, డ్రైవర్‌కు మంచి విజిబిలిటీని కూడా అందిస్తాయి. ఈ కథణంలో గత నెలలో టాప్ 3 కాంపాక్ట్ SUVల గురించి చూద్దాం.

జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - ఎవరి వైపు..కీలక మలుపు..!!

లోక్‌సభ కార్యకలాపాల నియమాలలోని రూల్ 94C, నోటీసు ప్రక్రియ, ఆర్టికల్స్ 93 మరియు 94 ప్రకారం రాజ్యాంగ ఆధారం మరియు స్పీకర్‌ను తొలగించే తీర్మానాన్ని ఎలా నిర్వహించాలో వివరిస్తుంది.

రూ.లక్షకే డిజిటల్ డిస్‌ప్లే, మంచి మైలేజీ ఇచ్చే బైక్

నేటి యువతకు బైక్ అంటే కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా 160cc సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే లుక్స్ కోసం చాలా మంది కుర్రాళ్లు ఆరాటపడుతుంటారు. అయితే బజాజ్ పల్సర్ లేదా టీవీఎస్ అపాచీ వంటి బైక్‌ల ధరలు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160R (Hero Xtreme 160R) ఒక సంచలనంగా మారింది. 160cc సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ ధరకే లభిస్తూ, అదిరిపోయే మైలేజీని ఇస్తున్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన 160cc మోటార్‌సైకిల్. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1,04,749 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర బ్రాండ్లను గమనిస్తే.. బజాజ్ పల్సర్ NS160 లేదా టీవీఎస్ అపాచీ RTR 160 4V వంటి బైక్‌ల ధరలు దీనికంటే కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.35 లక్షల మధ్యలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ బైక్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R లో 163.2 cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 15 bhp పవర్, 6,500 rpm వద్ద 14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బరువు. ఇది కేవలం 139.5 కిలోల బరువు మాత్రమే ఉంటుంది, దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో బైక్‌ను తిప్పడం చాలా సులభం. స్పీడు విషయానికి వస్తే.. ఇది కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు అందరికంటే ముందు దూసుకుపోవచ్చు. చాలా మంది స్పోర్ట్స్ బైక్ అంటే మైలేజీ తక్కువ ఇస్తుందని భయపడతారు. కానీ హీరో ఎక్స్‌ట్రీమ్ విషయంలో అది తప్పు. ఈ బైక్ లీటరుకు 46 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని సునాయాసంగా ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. అంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే మీరు సుమారు 550 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ఆఫీసు పనులకు వెళ్లే వారికి లేదా కాలేజీ విద్యార్థులకు ఇది చాలా పొదుపైన బైక్ అని చెప్పవచ్చు. తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో హీరో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో మీరు చూడబోయే కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఇవే. హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు అన్నీ ఎల్‌ఈడీ వెర్షన్‌లోనే వస్తాయి. ఇది రాత్రి వేళల్లో ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. ఇందులో ఇన్వర్టెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో గైర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సమయం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

రోజుకు 30 నిమిషాల చురుకైన నడక గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మరియు భారతదేశంలో బిజీగా ఉండే జీవితాలకు మధుమేహ నిర్వహణకు సహాయపడుతుంది.
Advertisement

సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిన కారు!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో విశ్వసనీయతకు, దీర్ఘకాలిక పనితీరుకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన అనేక మోడళ్లు ఇప్పటికే భారత వినియోగదారుల మనసుల్లో స్థానం సంపాదించగా, వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్. ఈ కారు 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం మంచి స్పందనను పొందుతూ, టయోటా లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మారింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని హైబ్రిడ్ టెక్నాలజీ. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే హైబ్రిడ్ ఇంజిన్ వినియోగదారులకు పెద్ద ఆకర్షణగా మారింది.

భార్య, పిల్లలు, సామాన్లు.. అన్నీ ఒకే కారులో

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో-ఎన్(Scorpio-N) ఆధారంగా రూపొందిస్తున్న సరికొత్త పికప్ ట్రక్కును భారత మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శితమైన ఈ వాహనం, ఇప్పుడు భారత రోడ్లపై మంచు కురుస్తున్న వేళ కఠినమైన పరీక్షలను (Snow Testing) ఎదుర్కొంటోంది. మహీంద్రా తన గ్లోబల్ పికప్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పై ఫోటోల ప్రకారం, ఈ పికప్ ట్రక్కును మంచుతో నిండిన రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఇది కేవలం కమర్షియల్ వాహనంలా కాకుండా ఒక లైఫ్ స్టైల్ వాహనంగా రూపొందుతోంది.

Anthropic: భారత్ లో అడుగుపెట్టకముందే ఆంత్రోపిక్ కు భారీ షాక్..!

ఒక కర్ణాటక సంస్థ బ్రాండ్ పేరుపై స్పష్టత కోరుతుండగా ఆంత్రోపిక్ భారతదేశంలో కార్యకలాపాలను విస్తరిస్తోంది, ఇది చట్టపరమైన రక్షణలు మరియు గ్లోబల్ AI వృద్ధిలో దేశం పాత్రను హైలైట్ చేస్తుంది.

కాలేజీల్లోనూ విద్యార్థినులకు ప్రసూతి సెలవులు: హైకోర్టు సంచలన తీర్పు!

గర్భం మరియు ప్రసూతి ఉన్నత విద్యకు ఆటంకం కాకూడదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. ప్రసూతి మరియు శిశు సంరక్షణ సెలవులు, హాజరు రాయితీలు అందించాలని సంస్థలను ఆదేశించింది.

ఒకప్పుడు టాప్ SUV.. ఇప్పుడు డిమాండ్ తగ్గిందా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) ఒక సమయంలో భారత మార్కెట్లో అత్యంత చర్చకు వచ్చిన SUVగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ వంటి అంశాలతో ఈ కారు కొనుగోలుదారుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఈ SUVని నమ్మకంగా ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ, ఇటీవల నెలల్లో గ్రాండ్ విటారా అమ్మకాల గణాంకాలు ఒక భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. గత నెల అయిన జనవరి 2026లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఆ నెలలో మొత్తం 7,030 యూనిట్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. ఇదే కారు జనవరి 2025లో చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పట్లో 15,784 యూనిట్లు అమ్ముడయ్యాయి.