రైలెక్కిన 5.85 లక్షల కార్లు
ఆటోమొబైల్స్
- 1 month, 11 hr, 46 min ago
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాదు, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసే విధానంలో కూడా మారుతి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల కార్లను కేవలం రైళ్ల ద్వారా రవాణా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనివల్ల పర్యావరణానికి కలిగిన మేలు, ఆదా అయిన ఇంధనం, రవాణాలో మారుతి వేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా తన కార్లను డీలర్షిప్లకు చేరవేసేందుకు గత కొన్నేళ్లుగా రైల్వే మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తోంది. 2016వ సంవత్సరంలో మారుతి కేవలం 77 వేల కార్లను మాత్రమే రైళ్ల ద్వారా పంపించేది. కానీ, గడిచిన పదేళ్లలో ఈ సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2017లో లక్ష కార్లు, 2018లో 1.46 లక్షలు, 2019లో 1.72 లక్షలు ఇలా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా కొంచెం తగ్గుదల కనిపించినా, 2021 నుంచి మారుతి స్పీడు పెంచింది.