కర్ణాటక వ్యక్తికి రూ. 49 కోట్ల జాక్ పాట్.. ఒక్క రాత్రిలో సీన్ రివర్స్..

ఒక ఉడుపి స్థానికుడు అబుదాబిలో బిగ్ టికెట్ లాటరీని గెలుచుకుని 20 మిలియన్ దిర్హామ్‌లను సొంతం చేసుకున్నాడు. గల్ఫ్ నెలవారీ డ్రాలో సామూహిక కొనుగోలును హైలైట్ చేస్తూ విజేత స్నేహితుడితో కలిసి టిక్కెట్టును కొనుగోలు చేశాడు.

ఆ హైవేపై 32 గంటలు నిలిచిపోయిన ట్రాఫిక్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదిషి టన్నెల్ సమీపంలో జరిగిన భారీ ట్యాంకర్ ప్రమాదం కారణంగా గ్యాస్ లీక్ సంభవించి, వేలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరియు అత్యవసర ప్రతిస్పందనకు దారితీసింది.

మార్చి నెలాఖరు వరకు ఈ రాశులవారికి తిరుగులేదని చెప్పిన బుధ కేతువులు

బుధుడు మరియు కేతువు మార్చి చివరిలో కలిసి ఉండటం వలన, ఆదాయ వృద్ధి, పెట్టుబడులు మరియు ఆస్తి లాభాల ద్వారా ఆరు రాశుల వారికి సంపద పెరుగుతుంది; ఆర్థిక ప్రణాళిక కోసం ఒక ఆచరణాత్మక దృక్పథం.

ఈ కారు కోసం నెలల తరబడి వెయిట్!

కొత్త టాటా సియెర్రా (Tata Sierra) SUV భారత ఆటోమొబైల్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో గ్రాండ్ లాంచ్‌తో పరిచయమైన ఈ SUV, లాంచ్ అయిన క్షణాల నుంచే తన స్టైలిష్ డిజైన్, ఆధునిక లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పటి ఐకానిక్ పేరైన 'సియెర్రా'ను ఆధునిక టచ్‌తో తిరిగి తీసుకురావడం టాటా మోటార్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. డిజైన్ పరంగానే కాదు, మార్కెట్ రెస్పాన్స్ విషయంలో కూడా టాటా సియెర్రా అంచనాలను మించి విజయాన్ని సాధించింది. డిసెంబర్ 16 నుంచి అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభం కావడంతో, వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.
Advertisement

31 రోజుల్లోనే 17 వేల మందికి పైగా కొనేశారు

మారుతి సుజుకి 2026 సంవత్సరాన్ని కూడా బలమైన అమ్మకాలతోనే ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ మొత్తం 2.37 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇది భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ప్రయాణికుల కార్ల విభాగంలో వినియోగదారుల నమ్మకం పొందిన బ్రాండ్‌గా మారుతి కొనసాగుతుండటానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ఈ భారీ అమ్మకాలలో స్విఫ్ట్, బ్రెజ్జా, డిజైర్, బాలెనో వంటి పాపులర్ మోడళ్లే ప్రధానంగా కీలక పాత్ర పోషించాయి. ఈ కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటం వల్ల, జనవరి నెలలో ఇవి రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరు, సరసమైన ధరల కలయికే ఈ మోడళ్లను వినియోగదారుల మొదటి ఎంపికగా మార్చిందని చెప్పవచ్చు.

US Russia :నేటితో ముగిసిన అమెరికా-రష్యా అణు ఒప్పందం - ఆందోళనలో ప్రపంచ దేశాలు..!!

న్యూ START ఒప్పందం గడువు ముగియడంతో అదుపులేని ఆయుధాల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. US మరియు రష్యా భవిష్యత్తు పరిమితుల గురించి ఆలోచిస్తున్నాయి, చైనా మరియు ఇతర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

భోజనం తర్వాత యాలకులు తింటున్నారా?

ఈ కథనం రాత్రి భోజనం తర్వాత ఒక యాలకులను నమలడం వల్ల ఆరు ఆరోగ్య మార్పులు వస్తాయనే వాదనను పరిశీలిస్తుంది, రుజువు, భద్రత మరియు భారతదేశంలో ఆరోగ్య పోకడలను ఎలా అర్థం చేసుకోవాలో అంచనా వేస్తుంది.

మారుతి, టాటాలకు వెన్నులో వణుకు మొదలైంది

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి భారీ స్కెచ్ వేసింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు సవాల్ విసురుతూ, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అదే నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton). ఫిబ్రవరి 4న ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ, ఒక చిన్న వ్యూహాత్మక మార్పు కారణంగా ఇది కొద్దిగా ఆలస్యమైంది. నిస్సాన్ సంస్థ తన సరికొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను ఫిబ్రవరి 4న ఆవిష్కరిస్తుందని అందరూ భావించారు. కానీ, అంతకంటే ముందే తన 7-సీటర్ ఎంవీవీ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను మార్కెట్లోకి పంపాలని నిస్సాన్ నిర్ణయించుకుంది. నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. గ్రావైట్ లాంచ్ పూర్తయిన వెంటనే, టెక్టాన్ ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే నిస్సాన్ రెండు పెద్ద అస్త్రాలను వదలబోతోందన్నమాట. నిస్సాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది రోడ్డుపై ఒక రాజసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కారు డిజైన్ నిస్సాన్ ప్రసిద్ధ గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ నుంచి స్ఫూర్తి పొందింది. దీనికి పవర్‌ఫుల్ గ్రిల్, C-షేప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. 17 లేదా 18 ఇంచుల అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ , మజిల్ లాంటి బాడీ లైన్స్ కారుకు ఒక అడ్వెంచరస్ లుక్ ఇస్తాయి. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, టెక్టాన్ బ్యాడ్జింగ్‌తో కారు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. లోపల అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. టెక్టాన్‌లో నిస్సాన్ ఎలాంటి ఫీచర్లను కూడా వదల్లేదు. 10.1 ఇంచ్ లార్జ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు (ముందు భాగంలో), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది. సేఫ్టీ విషయంలో నిస్సాన్ రాజీ పడలేదు. ఈ కారులో లెవల్ 2 అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ను అమర్చారు. ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ప్రమాదాలను అరికడుతుంది. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా రానున్నాయి. నిస్సాన్ టెక్టాన్ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రకాల ఇంజిన్లు ఉండే అవకాశం ఉంది:1.0 లీటర్ టర్బో పెట్రోల్: సిటీలో ప్రయాణించడానికి, మంచి మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.3 లీటర్ టర్బో పెట్రోల్: హైవేలపై వేగంగా వెళ్లాలనుకునే వారికి, ఎక్కువ హార్స్ పవర్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ ఇంజిన్ అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది, ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరలో కారు విడుదలైతే, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి దిగ్గజ కార్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే కంపెనీగా నిస్సాన్ తన గుర్తింపును మళ్ళీ దక్కించుకోనుంది.

భారత్ అమెరికా డీల్: Pakistan ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా

భారతదేశం US వాణిజ్య ఒప్పందం సుంకాలు 18%కి తగ్గింపు మరియు పాకిస్తాన్, ప్రాంతీయ దౌత్యం మరియు దక్షిణ ఆసియా శక్తి డైనమిక్స్ పై దాని ప్రభావం యొక్క విశ్లేషణ.

Budget 2026: లాభమొచ్చినా, నష్టమొచ్చినా పన్ను కట్టాల్సిందే

బడ్జెట్ 2026-27 ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లపై STT పెరుగుదలను ప్రతిపాదిస్తుంది, ఇది భారతదేశంలోని పెట్టుబడిదారులు మరియు అధిక-ఫ్రీక్వెన్సీ వ్యాపారుల కోసం ట్రేడింగ్ ఖర్చులు మరియు మార్కెట్ డైనమిక్స్‌ను ప్రభావితం చేస్తుంది.

గ్రాఫిక్స్ మారాయి.. క్రేజ్ పెరిగింది.. హోండా డియో 125 X లాంచ్

భారత టూవీలర్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తాజాగా డియో 125 X ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యువ రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డియో 125కి మరింత స్పోర్టీ, ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చింది. కొత్త ఎడిషన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవ్వగా, ఫిబ్రవరి రెండో వారం నుంచి హోండా డీలర్‌షిప్‌ల ద్వారా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. హోండా డియో 125 X ఎడిషన్‌లో మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా, పూర్తిగా డిజైన్, విజువల్స్‌పై దృష్టి పెట్టింది. అదే నమ్మకమైన ఇంజిన్, పనితీరును కొనసాగిస్తూనే, ప్రత్యేకమైన గ్రాఫిక్స్, కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో ఈ స్కూటర్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది.

సింహం లాంటి కారు..కుటుంబానికి బుల్లెట్ ఫ్రూఫ్ సేఫ్టీ

టాటా మోటార్స్ తన సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ (Tata Punch)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి వదిలింది. రూ.5.59 లక్షల ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. హ్యాచ్‌బ్యాక్ ధరలోనే ఎస్‌యూవీ ఫీచర్లు ఇస్తుండటంతో మారుతి వ్యాగన్ ఆర్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
Advertisement

అందరి ఇంటి పేరుగా మారిపోయిన కారు

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారత మార్కెట్లో ఎన్నేళ్లుగా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్ వంటి అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుకే కాలం మారినా, కొత్త కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ కారుకు డిమాండ్ పెరుగుతుండటం దీనికి స్పష్టమైన నిదర్శనం. వినియోగదారులు స్విఫ్ట్‌ను ఎంతో ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, అలాగే డైలీ కమ్యూట్ కోసం కారును ఉపయోగించే వారు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైవ్ చేయడానికి సులభం, నగర రోడ్లకు అనుకూలంగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలు స్విఫ్ట్‌ను బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఎప్పటికప్పుడు నిలబెడుతున్నాయి.

మహిళలు ఈజీగా డ్రైవింగ్ చేసే కార్లు ఇవే

ప్రస్తుతం భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆఫీసు పనులకైనా, పిల్లలను స్కూల్‌కు దింపడానికైనా లేదా షాపింగులకైనా సొంతంగా కారు డ్రైవ్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‎గా మారింది. అయితే, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో భారీ కార్లను నడపడం కొంచెం కష్టమైన పని. అందుకే మహిళా డ్రైవర్ల కోసం, ముఖ్యంగా కొత్తగా కారు నేర్చుకునే వారి కోసం తేలికపాటి స్టీరింగ్, మంచి రోడ్ విజబిలిటీ ఉన్న టాప్-5 కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.86 వేలకే కొత్త షైన్ లాంచ్.. స్టైల్ పెంచేసిన హోండా షైన్ 125

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2026 క్యాలెండర్ సంవత్సరాన్ని మరింత స్పెషల్‌గా మార్చే ఉద్దేశంతో భారత మార్కెట్లో షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ (Shine 125 Limited Edition) ను విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర రూ. 86,211 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. పేరు చెప్పినట్టే, ఇది పూర్తిగా ప్రత్యేకతను హైలైట్ చేసే ఎడిషన్ అయినప్పటికీ, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం డిజైన్, విజువల్ అప్‌గ్రేడ్స్‌కే పరిమితమైంది. హోండా షైన్ 125 ఇప్పటివరకు తన సింపుల్, నమ్మదగిన ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అదే ప్రాథమిక రూపాన్ని కొనసాగిస్తూ, ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రం సూక్ష్మమైన కానీ ప్రీమియం టచ్ ఉన్న గ్రాఫిక్ అప్‌డేట్స్‌ను జోడించారు.

రేంజ్ అంటే ఇది..అంబానీ గ్యారేజీలోకి రెండు లగ్జరీ కార్లు

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి మరో రెండు అద్భుతమైన లగ్జరీ కార్లు వచ్చి చేరాయి. సాధారణంగానే అంబానీ గ్యారేజీని జియో గ్యారేజీ అని పిలుస్తారు. అక్కడ ఇప్పటికే 150కి పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రెండు మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 (Mercedes-Maybach SL 680) మోనోగ్రామ్ ఎడిషన్ రోడ్‌స్టర్ కార్లు ఆ జాబితాలో చేరాయి.

ట్వీస్ట్: ప్రేమ, పెళ్లి, జైలు, తల్లి వ్యతిరేకం: అందుకే చెన్నై విద్యార్థిని అశ్విని ప్రాణాలు తీశాడు

అశ్వినీ తనను ప్రేమించి మోసం చేసిందని, ఆమె తల్లి పెళ్లికి వ్యతిరేకించిదని, జైల్లో పెట్టించారని, అందుకే చంపేశానని హంతకుడు అళగేశన్ చెన్నై పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇంటికి మినరల్ వాటర్ సఫ్లేచేసే అళగేశన్ తో అశ్వినీకి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసింది. కొంత కాలం సినిమాలు, షికార్లకు వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే అశ్వినీ అళగేశన్ ను పెళ్లి చేసుకొవడానికి ఆమె తల్లి శంకరి, బంధువులు అంగీకరించలేదు.

సుజుకి యాక్సెస్‎లో ఇక ఫుల్ సేఫ్టీ వచ్చేసింది భయ్యా

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ల విభాగం ఎప్పుడూ హాట్ కేకులాగే ఉంటుంది. ఇక్కడ ఇన్నాళ్లూ హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 జెండా ఎగురవేస్తూ వస్తున్నాయి. అయితే వీటికి గట్టి పోటీనిస్తూ, జపాన్ దిగ్గజం సుజుకి తన ఐకానిక్ మోడల్ సుజుకి యాక్సెస్ 125(Suzuki Access 125)లో సరికొత్త మార్పులు చేసి మార్కెట్లోకి వదిలింది. ఈసారి కేవలం లుక్స్ మాత్రమే కాదు, భద్రతకు పెద్దపీట వేస్తూ రెండు కొత్త వేరియంట్లను సుజుకి పరిచయం చేసింది. అవే రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ TFT ఏబీఎస్ ఎడిషన్. ఈ కొత్త వేరియంట్ల రాకతో హోండా, టీవీఎస్ కంపెనీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

7 మందికి సరిపోయే ఫ్యామిలీ కారు రూ.5.75 లక్షలకే

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, జపాన్‌కు చెందిన నిస్సాన్ మధ్య ఉన్న గ్లోబల్ భాగస్వామ్యం భారత ఆటో మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌కు దారితీయబోతోంది. ఈ పొత్తులో భాగంగా, ప్రస్తుతం భారత్‌లో మంచి ఆదరణ పొందుతున్న రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని, నిస్సాన్ ఒక సరికొత్త 7-సీటర్ MPVను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త మోడల్‌కు నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేస్తూ, తొలుత దీనిని జనవరి 21న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఊహించని కారణాలతో ఈ లాంచ్ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఆటో ప్రియులు, ముఖ్యంగా నిస్సాన్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరదించుతూ, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కొత్త లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించింది.
Advertisement

AP Govt: స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..!

శక్తివంతమైన సౌర జ్వాలలు భూమిని మరియు అంతరిక్ష వాతావరణ ప్రణాళికను ప్రభావితం చేస్తున్నందున సౌర తుఫానులు ఉపగ్రహాలు, సమాచార వ్యవస్థలు మరియు నావిగేషన్ నెట్‌వర్క్‌లను పర్యవేక్షించడానికి ఇస్రో మరియు ఇతర సంస్థలను ప్రేరేపిస్తాయి.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో టాటా టాప్ గేర్.. జనవరి 2026 రిపోర్ట్

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి వస్తోందని తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వినియోగదారుల్లో మారుతున్న ఆలోచనలు అన్నీ కలిసి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. దీనికి బలమైన ఉదాహరణగా 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. నివేదికల ప్రకారం, భారతీయ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగం జనవరి 2026లో మొత్తం 18,042 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కేవలం ఒక నెల గణాంకమే అయినా, మార్కెట్ దిశను స్పష్టంగా చూపించే సంఖ్యగా చెప్పుకోవచ్చు.

విదేశీయులు కూడా ఈ కారే కావాలంటున్నారు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ విపణిలోనూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఇండోనేషియా ప్రభుత్వ సంస్థ నుంచి ఏకంగా 35,000 మహీంద్రా స్కార్పియో పిక్-అప్ ట్రక్కుల కోసం భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇది మహీంద్రా చరిత్రలోనే అతిపెద్ద ఎగుమతి ఆర్డర్ కావడం విశేషం. భారతీయ తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఒప్పందం ప్రపంచానికి చాటిచెబుతోంది.

మహిళలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే స్కూటర్లు

ఒకప్పుడు గేర్‌లెస్ స్కూటర్లు అంటే మహిళల కోసమే అనే భావన భారతదేశంలో బలంగా ఉండేది. బైక్‌లు పురుషులకే, స్కూటర్లు మహిళలకే అన్నట్లు ఒక గీత వేసుకున్న పరిస్థితి అది. కానీ కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి, డిజైన్‌లో వచ్చిన మార్పులు, మెరుగైన పనితీరు కారణంగా ఆ ఆలోచనను భారతీయులు పూర్తిగా తోసిపుచ్చారు. ఇప్పుడు పురుషులు కూడా గేర్‌లెస్ స్కూటర్లను విరివిగా వాడుతున్నారు. నగరాల్లో అయితే బైక్‌లకు బదులు స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే, ఈ మార్పులన్నింటిలో గేర్‌లెస్ స్కూటర్లు మహిళలకు మాత్రం నిజంగా ఒక పెద్ద వరంగా మారాయి. తేలికపాటి బరువు, సులభమైన హ్యాండ్లింగ్, క్లచ్-గేర్ టెన్షన్ లేకపోవడం వంటివి మహిళలకు ఎంతో అనుకూలంగా మారాయి.

3.50 లక్షలకే కారు.. ఏకంగా 33 కిమీ మైలేజ్

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజల నాడి తెలిసిన ఏకైక కంపెనీగా మారుతి సుజుకి తన ప్రస్థానాన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తోంది. నేడు మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, లీటరు పెట్రోల్ పోస్తే ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని లెక్కలు వేసుకునే సగటు భారతీయుడికి మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సోలే ఇప్పటికీ ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. 2026 ప్రారంభంలో ఈ కార్లు క్రియేట్ చేసిన అమ్మకాల ప్రభంజనం, వాటి సాంకేతిక విశేషాలు భారత ఆటోమొబైల్ మార్కెట్ గమనాన్ని మరోసారి మార్చేశాయి.