పెట్రోల్ ధరలు చూసి భయపడే మిడిల్ క్లాస్ కోసం కొత్త EV లాంచ్
ఆటోమొబైల్స్
- 2 month, 5 days ago
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ప్రస్తుతం భారత కారు మార్కెట్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఒకదాని వెంట ఒకటి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ప్రత్యర్థి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. వరుస లాంచ్లతో మార్కెట్ను తన ఆధీనంలోకి తీసుకునే వ్యూహాన్ని మహీంద్రా బలంగా అమలు చేస్తోంది. ఇటీవలే XUV 7XOను అధికారికంగా లాంచ్ చేసిన మహీంద్రా, దానికి కేవలం ఒక రోజు గ్యాప్లోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV 3XO EVను కూడా ప్రవేశపెట్టడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వరుస విడుదలలు భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న SUV మార్కెట్లో మహీంద్రా దూకుడు ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.