ఇక రోడ్ల మీద టోల్ గేట్‌కు గుడ్ బై

జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. దేశంలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ నిరీక్షణ సమస్యకు 2026 చివరి నాటికి పూర్తిగా తెరపడనుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చేసిన కీలక ప్రకటన ప్రకారం.. అత్యాధునిక మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హైవే నిర్వహణను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా పూర్తి చేస్తారు. ఈ కొత్త టెక్నాలజీ అమలైన తర్వాత, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూడాల్సిన సమయం జీరో మినిట్స్‎కు చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఇది ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనుంది. నూతనంగా రాబోయే ఈ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ పూర్తిగా AI, శాటిలైట్ ఆధారంగా పనిచేయనుంది. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతమున్న ఫాస్ట్‌ట్యాగ్ (FastTag) స్థానంలో, వాహనాలు గంటకు గరిష్టంగా 80 కి.మీ. వేగంతో టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ AI టెక్నాలజీతో అనుసంధానించబడిన శాటిలైట్ ద్వారా నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తుంది.

బెస్ట్ ఫీచర్స్‌తో Motorola Edge 70.. ధర ఎంతంటే ??

Motorola భారతదేశంలో Edge 70ని విడుదల చేసింది. ఇది 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 68W వైర్డ్ ఛార్జింగ్, IP68/IP69 మరియు 50MP కెమెరాలను కలిగి ఉన్న 5G మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్.

షాకింగ్.. భారత్‌లోకి చొరబడ్డ పాకిస్థానీ మహిళ.. ఎందుకో తెలుసా..?

పూంచ్ సమీపంలో తన తండ్రితో గొడవపడి నియంత్రణ రేఖను దాటిన పాకిస్తానీ జాతీయురాలిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణ కొనసాగుతోంది.

450 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక్ పోలో!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్న ఆటోమొబైల్ రంగంలో భాగంగా, సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండే సరసమైన EVను తీసుకురావాలని జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) బ్రాండ్ గట్టి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే, సంవత్సరాలుగా నమ్మకానికి, నాణ్యతకు, డ్రైవింగ్ ఆనందానికి ప్రతీకగా నిలిచిన పోలో (Polo) పేరును ఎలక్ట్రిక్ యుగంలోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. 2026 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా విడుదల కానున్న ఈ కొత్త మోడల్‌ను 'ID.Polo'గా పిలవనున్నారు. ఇది కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు ప్రతినిధిగా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి.
Advertisement

సెలబ్రిటీలకు నచ్చే ఫీచర్లతో వచ్చిన కారును మిడిల్‌క్లాస్ వారు కొనచ్చు!

JSW MG మోటార్ ఇండియా మరోసారి భారత SUV మార్కెట్‌లో తన ప్రభావాన్ని చాటుతూ, కొత్త MG హెక్టర్ SUVను అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ నుంచే బిగ్, బోల్డ్ అండ్ స్మార్ట్ అనే గుర్తింపును సంపాదించుకున్న హెక్టర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ కొత్త హెక్టర్ SUV డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించబడిందని కంపెనీ చెబుతోంది. రోడ్డుపై బలమైన ప్రెజెన్స్‌తో పాటు, SUV విభాగంలో డైనమిక్ పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను రూపొందించారు. ధరల పరంగా చూస్తే, కొత్త MG హెక్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

కొలెస్ట్రాల్..సైలెంట్ కిల్లర్ - ఈ గింజలతో కంట్రోల్​ లో..!!

బాదం LDL మరియు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, నానబెట్టిన మరియు పచ్చి రూపాలను పోల్చడం, భాగాలను నిర్వహించడం మరియు గుండెకు అనుకూలమైన ప్రణాళిక కోసం ఆచరణాత్మక ఆహార చిట్కాలను అన్వేషించండి.

కరెంటు కార్ల రేసులో టాటా మోటార్స్ సునామీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (Electric 4-Wheelers) విభాగం ప్రతి సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యావరణ స్పృహ పెరుగుతుండటం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులు అధికమవుతున్నప్పటికీ ఈ రంగంలో చురుకుగా ఉన్న సంస్థల సంఖ్య ఇంకా పరిమితంగానే ఉంది.

ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ! కైగర్ నవంబర్ సేల్స్ రిపోర్ట్

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ (renault) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కూడా ఈ కంపెనీ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుని, వివిధ సెగ్మెంట్లలో కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌కు తగ్గ కార్లు, SUV లుక్తో వచ్చే మోడళ్లపై దృష్టి పెట్టిన రెనాల్ట్, భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఆగస్టులో రెనాల్ట్ కొత్త లుక్‌తో కైగర్ (Kiger) SUVను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ఈ మోడల్‌కు తాజా డిజైన్ అప్‌డేట్ మరింత ఆకర్షణను జోడించింది. కొత్త రూపంలో వచ్చిన రెనాల్ట్ కైగర్ SUV ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఊపు మీద ఉంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా..! ఫైన్ కడతారా ? ఢిల్లీ సర్కార్ అల్టిమేటం..!

కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీలో GRAP IV ఆంక్షలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఇంటి నుండి పని ఆదేశాలు, జరిమానాలు మరియు వాహన మరియు నిర్మాణ నియమాల గురించి అవలోకనం

లక్షల డిస్కౌంట్లు ఇచ్చినా కొనేనాథుడే లేడు

కరోనా మహమ్మారి తర్వాత భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు 7-సీటర్, మల్టీ పర్పస్ వాహనాలకు (MPV) డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన దేశీ దిగ్గజం మారుతి సుజుకి.. తన భాగస్వామ్య సంస్థ టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్‎ను అరువు తెచ్చుకుంది. దాని రూపురేఖలను స్వల్పంగా మార్చి ఇన్విక్టో(Invicto) అనే పేరుతో గతేడాది గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది. ఒక సినిమా భారీ హిట్‌గా నిలిస్తే, ఆ విజయానికి ప్రధానంగా కారణమైన దర్శకుడికి హీరో లేదా నిర్మాతలు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి సంఘటనలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులో కూడా మరోసారి నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' (OG) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించింది. యాక్షన్, స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, సుజీత్ తీసిన మేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.

కైలాక్ కొంటే ఫుల్ కిక్కు పక్కా

చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda), భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న SUV కారు కైలాక్ (Kylaq). మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి పెద్ద బ్రాండ్‌లు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న కాంపాక్ట్ SUV విభాగంలోకి కైలాక్ ప్రవేశించినప్పటికీ, దానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు తక్కువ ధర, బెస్ట్ పర్పామెన్స్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కావడం వలన, వాహనం కొనాలనుకునే వినియోగదారులు కైలాక్‌ను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
Advertisement

ఎదురు చూపులకు ఫుల్ స్టాప్.. టాటా సియెర్రా బుకింగ్ స్టార్ట్!

టాటా మోటార్స్ (tata motors) అంటేనే భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణం. దేశీయంగా తయారై ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా టాటా మోటార్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ నుండి వచ్చిన సియెర్రా (Sierra) SUV ఒకప్పుడు భారత మార్కెట్‌లో ఒక ఐకానిక్ మోడల్‌గా నిలిచింది. తొలిసారిగా 1991లో ప్రవేశపెట్టిన టాటా సియెర్రా, అప్పటి సంపన్న వర్గ వినియోగదారుల మనసు దోచుకుంది. ప్రత్యేకమైన డిజైన్, భారీ రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఈ SUVకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అయితే మార్కెట్ పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటి కొన్ని కారణాల వల్ల 2003లో ఈ మోడల్ ఉత్పత్తి మరియు అమ్మకాలు నిలిచిపోయాయి.

రోజుకు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి?

మసాలా ఎగ్ బుర్జీ మరియు వెజ్జీ ఆమ్లెట్‌తో సహా ఐదు త్వరగా, పోషకమైన గుడ్డు ఆధారిత అల్పాహారాలను కనుగొనండి. బిజీ ఉదయాలకు వేగవంతమైన, సులభమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఎంపికలు.

ఈ ఏడాది చివరి శక్తిమంతమైన అమావాస్య: డోన్ట్ మిస్

పితృ దేవతలను గౌరవించడానికి, పితృ దేవతల ఆశీస్సులు పొందడానికి మరియు ఇంటికి శాంతి మరియు శ్రేయస్సును ఆహ్వానించడానికి పౌష్య అమావాస్య 2025 కోసం ఐదు సాంప్రదాయ నివారణలను అన్వేషించండి.

2026లో మారుతి కార్ల జాతర

భారతదేశంలో కార్ల మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. 2026 సంవత్సరం మారుతికి అత్యంత కీలకమైనది కానుంది. ఈ ఏడాది కేవలం విక్టోరిస్ అనే ఒకే ఒక్క మోడల్‌ను తెచ్చిన మారుతి, 2026లో మాత్రం ఏకంగా నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి వదలబోతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. మారుతి తన పంథాను మార్చుకుని పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే ఈ నాలుగు మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లు (EVలు), ఒక ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోడల్ ఉండటం గమనార్హం.

ఆంధ్రా స్టైల్ కాకరకాయ కారం.. ఇలా చేసి వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతః!

ఆంధ్ర వంటశాలల్లో కాకరకాయ కారం ఎలా చేదు సొరకాయను ఘాటైన మసాలా మిశ్రమాలు, పొడి వేయించే పద్ధతులు మరియు వేడి అన్నం మరియు పప్పుతో వడ్డించే ఆలోచనలతో ఉపయోగిస్తుందో తెలుసుకోండి.

తమిళనాడులో 97.4 లక్షల ఓటర్లు తొలగింపు..?

తమిళనాడులో సార్ ముసాయిదా విశ్లేషణ జాబితాలో 5.44 కోట్ల మంది ఓటర్లను సూచిస్తుంది, ఇది 2025 అంచనాల నుండి 15.2 శాతం తగ్గుదల, జిల్లా వారీ నమూనాలు మరియు సంభావ్య తుది మొత్తాలు ఉన్నాయి.

మెస్సీ పర్యటన వేళ... మంత్రి రాజీనామా

VYBKలో మెస్సీ ఈవెంట్ సందర్భంగా నిర్వహణ లోపాల ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ రాజీనామా చేశారు; అధికారులకు నోటీసులు జారీ, SIT విచారణ ప్రకటన.

రూ.4.25లక్షల తగ్గించిన కొనే వాళ్లే లేరు

నేటి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (SUV) పెరిగిన డిమాండ్ కారణంగా మహీంద్రా (Mahindra) కంపెనీ థార్ (Thar), స్కార్పియో (Scorpio), XUV700 వంటి మోడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలో ఉన్న మహీంద్రా మరాజో (Mahindra Marazzo) మాత్రం చాలా పరిమిత అమ్మకాలతో నడుస్తోంది. దీని తక్కువ విక్రయాల కారణంగా ఈ కారు మార్కెట్ నుంచి నిలిపివేయబడుతుందనే బలమైన ఊహాగానాలు గతంలో వినిపించాయి. వాస్తవానికి ఒకసారి కంపెనీ వెబ్‌సైట్ నుంచి దీన్ని డీలిస్ట్ చేసి డిమాండ్‌ను బట్టి మళ్లీ తీసుకువచ్చింది.
Advertisement

పండుగ సీజన్ తర్వాత ఎఫెక్ట్? టైజర్ అమ్మకాలు పడిపోయాయి

టయోటా (Toyota) కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్లలో టైజర్ (Toyota Taisor) ఒకటి. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, బడ్జెట్ సెగ్మెంట్‌లో సరైన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి స్థిరమైన డిమాండ్‌ను పొందుతోంది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ నెలలో టయోటా టైజర్ అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. అక్టోబర్‌కు ముందు నెల అయిన సెప్టెంబర్‌లో టయోటా టైజర్ 4,561 యూనిట్లను విక్రయించగా, నవంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య 3,177 యూనిట్లకు తగ్గింది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. ఇది ఈ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రతను, అలాగే వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పులను స్పష్టంగా సూచిస్తోంది.

ఆ యాప్ ఇక పనిచేయదు: Facebook కీలక ప్రకటన

మెటా Mac మరియు Windows కోసం Messenger డెస్క్‌టాప్ యాప్‌లను నిలిపివేసింది, వినియోగదారులను Messenger.com లేదా Facebook.com ద్వారా యాక్సెస్ చేయడానికి మళ్ళించింది, సురక్షిత నిల్వ మరియు గోప్యతా సెట్టింగ్‌ల మార్గదర్శకత్వంతో.

'అడల్ట్ మోడ్' తీసుకొస్తున్న చాట్ జీపీటీ.. కండిషన్స్ అప్లై ?

OpenAI ChatGPT కోసం అడల్ట్ మోడ్‌ను పరిచయం చేస్తుంది, ఇది ధృవీకరించబడిన పెద్దలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది, భద్రతా చర్యలు మరియు ఆలస్యంగా డిఫాల్ట్ యాక్టివేషన్‌తో, 2026లో విడుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

మహీంద్రా EVకు బ్రేక్ పడిందా? XUV400 నవంబర్ సేల్స్ రిపోర్ట్

మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఒకప్పుడు బలమైన గుర్తింపును సంపాదించుకున్న మోడళ్లలో XUV400 ఎలక్ట్రిక్ SUV కీలకమైనది. భారత EV మార్కెట్లో ప్రారంభ దశలోనే మంచి స్పందన పొందిన ఈ మోడల్, మధ్యతరగతి కుటుంబాలు, ఎలక్ట్రిక్ SUV వైపు అడుగులు వేయాలనుకున్న కస్టమర్లను ఆకర్షించింది. అయితే తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్ ప్రస్తుతం కొంత మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్ 2025 నెలలో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆ నెలలో దేశవ్యాప్తంగా ఈ వాహనం కేవలం 404 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

రీ ఎంట్రీ ఇచ్చిన లెజెండరీ బైక్

భారతీయ మార్కెట్‌లోని ఐకానిక్ పెర్ఫార్మెన్స్ బైక్‌లలో బజాజ్ పల్సర్ 220F (Bajaj Pulsar 220F) ఒకటి. ది లెజెండ్, థ్రిల్ మెషిన్ అనే ముద్దుపేర్లతో పిలవబడే ఈ మోటార్‌సైకిల్.. పెర్ఫార్మెన్స్, స్పోర్టీ స్టైలింగ్, రోజువారీ వినియోగానికి సరైన బ్యాలెన్సును అందిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లోకి వెళ్లకుండానే మెరుగైన బైక్‌ను కోరుకునే వారికి ఇది మొదటి ఎంపిక.