ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే..!!

భారతదేశంలో సాధారణంగా కనిపించే మధుమేహం యొక్క ఏడు ప్రారంభ సంకేతాలను గుర్తించండి, సకాలంలో తనిఖీలు ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి మరియు ప్రారంభ గుర్తింపు మరియు జీవనశైలి మార్పుల కోసం ఆచరణాత్మక చర్యలను తెలుసుకోండి.

చిన్న ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కారు!

ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరుగుతున్నా, సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండే చిన్న EVల కొరత ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధికి అడ్డంకిగా నిలుస్తోంది. పెద్ద SUVలు, క్రాసోవర్‌లు, ప్రీమియం సెగ్మెంట్ EVలు ఎక్కువగా లభిస్తుండటంతో, బడ్జెట్‌ ఫ్రెండ్లీ చిన్న కార్లను కోరుకునే కొనుగోలుదారులకు ఎంపికలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలోనే దక్షిణ కొరియా దిగ్గజం కియా చిన్న, కానీ శక్తివంతమైన కొత్త ఎలక్ట్రిక్ కారును సిద్ధం చేస్తోంది.. అదే కియా ఈవీ2 (Kia EV2). ఈ ఏడాది జరిగిన ప్రత్యేకమైన కియా EV డే కార్యక్రమంలో కంపెనీ ఈ మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. బయటకు చిన్నగా కనిపించినా, డిజైన్ స్టాన్స్ మాత్రం పూర్తిగా futuristic-EV2ను చిన్నతనంతో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కు కావాల్సిన ఆధునిక టెక్నాలజీ సూటిగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.

రూ.7.5లక్షలకే 215కిమీ రేంజ్ ఈవీ

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) త్వరలోనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ, ముఖ్యంగా విఎఫ్‌6 (VF6), విఎఫ్‌7 (VF7) వంటి రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (EV SUVs) దేశీయ మార్కెట్లలో విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, 2026 ఫిబ్రవరిలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రవేశం భారత ఈవీ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించనుంది.

రష్యా చమురు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం: భారత్ రెండూ సాధించగలదా?

భారతదేశం మరియు రష్యా ఇంధన ధరలు, రక్షణ సహకారం మరియు ఆంక్షల నుండి ఉపశమనంపై చర్చలు జరపాలని యోచిస్తున్నాయి, ప్రపంచ ఒత్తిడి మధ్య సమతుల్య వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నాయి.
Advertisement

జనాలందరూ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ ఏర్పడిన ఉత్సాహం రోజురోజుకూ కొత్త ఎత్తులకు చేరుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సహక చర్యలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన.. ఈ మూడు కలిసి భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మెల్లగా కానీ బలంగా ఎలక్ట్రిక్ మోడ్‌కి తిప్పేస్తున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లలో EVల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు కన్పించడం సాధారణమైపోయింది. కస్టమర్లలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ దృష్టిని వేగంగా ఎలక్ట్రిక్ విభాగంపై కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, గత నవంబర్‌లో ఏ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయో వివరాలను చూద్దాం.

చలికాలంలో ఈ పొరపాట్లు చేస్తే బ్యాటరీ లైఫ్ ఖతం

చలికాలం అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక పెద్ద సవాలును తీసుకొస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు, ఈవీ బ్యాటరీల పనితీరుపై ప్రభావం చూపడం సహజం. ఈ సమయంలో సరైన అవగాహన లేని డ్రైవర్లు చేసే కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల బ్యాటరీ సామర్థ్యం, లైఫ్ స్పాన్ రెండూ తగ్గుతాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నట్లయితే, చలికాలంలో ఛార్జింగ్ సమయంలో కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఛార్జింగ్ అలవాట్లు దీర్ఘకాలంలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

అందరి ఫేవరెట్ స్విఫ్ట్ ఇప్పుడు మరింత చీప్!

మారుతి సుజుకి స్విఫ్ట్‌ (Maruti Suzuki Swift)... పేరు వినగానే భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఓ ఐకాన్ గుర్తుకువస్తుంది. దాదాపు కొన్ని లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, ఏళ్ల తరబడి హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతూ వస్తున్న ఈ కారు, ఇప్పుడు GST తగ్గింపు లాభాలతో మరింత రణరంగం సృష్టిస్తోంది. ధరలు తగ్గడంతో మారుతి షోరూమ్‌ల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగిపోయింది. కొత్తగా కస్టమర్లు మాత్రమే కాదు, ఇప్పటికే కారు కొనాలని చూసిన వారు కూడా ధరల తగ్గింపును సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వేళ, సంవత్సరాంతం కావడంతో ఉన్న స్టాక్‌ను త్వరగా క్లియర్ చేసుకోవడానికి మారుతి సుజుకి భారీ ఆఫర్ల దిశగా అడుగుపెట్టింది. డిసెంబర్ 2025ను లక్ష్యంగా చేసుకుని, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌పై కంపెనీ అగ్రెసివ్‌గా డీల్స్ ప్రకటించింది.

మనోళ్లంతా డబ్బులు ఉన్నోళ్లు అయిపోయారు

భారతదేశంలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ వృద్ధి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా వంటి ప్రధాన బ్రాండ్‌లు నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

కస్టమర్ల నమ్మకమే లక్ష దాటించింది

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) సంస్థ 2025 నవంబర్ నెలలో అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ నవంబర్ నెలలో మొత్తం 1,22,300 టూ వీలర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం 2024 నవంబర్‌లో అమ్ముడైన 94,370 యూనిట్లతో పోలిస్తే, ఏకంగా 29.60 శాతం (27,930 యూనిట్లు) అధికం కావడం విశేషం. దీని ద్వారా సుజుకి ఇండియన్ మార్కెట్‌లో లక్షకు పైగా టూ వీలర్లను విక్రయించే ప్రముఖ కంపెనీల సరసన నిలిచింది. సుజుకి ద్విచక్ర వాహనాల కోసం భారతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. దేశీయ మార్కెట్‌లో 96,360 యూనిట్ల విక్రయాలు జరగగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 23.01 శాతం వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2024 నవంబర్‌లో 16,037 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు, 2025 నవంబర్‌లో 61.75 శాతం పెరిగి 25,940 యూనిట్లకు చేరుకున్నాయి.

భారతీయుల కోసం జర్మనీ బంపర్ ఆఫర్..!

జర్మనీ AI, రోబోటిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాలలో కొరతను ఎదుర్కొంటోంది; సులభతరం చేయబడిన వీసాలు మరియు EU బ్లూ కార్డ్ భారతీయ గ్రాడ్యుయేట్‌లకు తలుపులు తెరుస్తున్నాయి, TU9 విశ్వవిద్యాలయాలు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే STEM అధ్యయనానికి దారితీస్తున్నాయి.

కేవలం ఒక నెలలో 2,064 ట్రైబర్లు! మధ్యతరగతి అడిగేదీ ఇదే!

ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) ఇండియా నవంబర్ 2025 నెలను చాలా సానుకూలమైన అమ్మకాలతో ముగించింది. ప్రత్యేకించి భారత కుటుంబాల మధ్య మంచి క్రేజ్ ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Triber) ఈసారి ఆశించిన దానికంటే మెరుగైన స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వెలువడిన నెలవారీ సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రైబర్ నవంబర్‌లో 2,064 యూనిట్లు అమ్ముడవుతూ మంచి దూకుడు చూపించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ MPV 1,486 యూనిట్ల వద్ద నిలిచింది. అంటే, సంవత్సరం వ్యవధిలో ట్రైబర్ డిమాండ్ గణనీయంగా పెరిగి, 578 అదనపు యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ట్రైబర్‌ సేల్స్‌లో కనిపించిన ఈ పెరుగుదల, ఈ మోడల్‌పై కస్టమర్ నమ్మకం ఎంత పెరిగిందో మరోసారి నిరూపించింది.

30 రోజుల్లో 6 లక్షల సేల్స్! మార్కెట్లో ఊచకోత

భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు నవంబర్ 2025 నిజంగా పండుగ నెలగా మారింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీదారైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఈ నెలను అద్భుతమైన పనితీరుతో ముగించింది. తాజాగా విడుదలైన అధికారిక అమ్మకాల గణాంకాలు పరిశ్రమలో తిరిగి విశ్వాసాన్ని నింపాయి. ప్రజలు తిరిగి బైక్‌ల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైంది. నవంబర్ 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 6,04,490 యూనిట్లను మార్కెట్లోకి పంపింది. ఇందులో దేశీయ విక్రయాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎగుమతులు కూడా ఉన్నాయి. ఏకంగా యూనిట్ల సంఖ్యను చూస్తేనే కంపెనీపై తిరిగి ప్రజల నమ్మకం ఎంత బలమైనదో తెలుస్తుంది.
Advertisement

ఎక్కువ మైలేజ్, సేఫ్టీ.. రూ.5 లక్షల్లోనే 5 సీట్ల కారు

భారతీయ మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే బడ్జెట్‌కు అనుకూలమైన అనేక 5-సీట్ల ఫ్యామిలీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు కేవలం తక్కువ ధరకే కాకుండా ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అద్భుతమైన మైలేజ్‌ను కూడా అందిస్తున్నాయి. మీరు గనుక ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబం కోసం, సౌకర్యవంతమైన, సరసమైన కారును వెతుకుతున్నట్లయితే మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ (Hyundai) వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఈ మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు రూ.4.92 లక్షల నుంచే ప్రారంభమవుతాయి.

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు

టాటా మోటార్స్ నెక్సాన్ (Tata Motors Nexon) నవంబర్ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగా సంచలనం సృష్టించింది. సంవత్సరాల తరబడి మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తోన్న అత్యంత పోటీభరితమైన సెగ్మెంట్‌లో, నెక్సాన్ వరుసగా మూడో నెల కూడా టాప్ స్థానాన్ని కాపాడుకోవడం చిన్న విషయం కాదు. భారతీయ కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, మార్కెట్ దిశ ఏమిటి, నమ్మకం ఎక్కడికి మారుతోంది అన్న ప్రశ్నలకు నెక్సాన్ అమ్మకాలు స్పష్టమైన సమాధానమే ఇచ్చాయి. తాజాగా విడుదలైన సేల్స్ గణంకాల ప్రకారం, నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది అక్టోబర్‌లో నమోదైన 22,083 యూనిట్లతో పోలిస్తే వృద్ధిగా చెప్పవచ్చు.

అమెరికా, యూరప్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..! మీ నిర్ణయం బ్యాక్ ఫైర్..!

నైపుణ్యం కలిగిన వలసదారుల కదలికను పరిమితం చేయడం US మరియు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగిస్తుందని భారత విదేశాంగ మంత్రి హెచ్చరించారు, ప్రతిభావంతుల ప్రవాహాలు మరియు విధాన సమతుల్యత యొక్క వ్యయాన్ని హైలైట్ చేశారు.

చియా సీడ్స్‌ తింటున్నారా - అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!!

అధికంగా చియా గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను అంచనా వేయండి మరియు సురక్షితమైన రోజువారీ వినియోగం, మోతాదు మార్గదర్శకత్వం మరియు సమతుల్య పోషణ కోసం శరీర సంకేతాలను ఎలా వినాలో తెలుసుకోండి.

ఢీ అంటే ఢీ..టాటా సియెరా vs మారుతి గ్రాండ్ విటారా

భారతీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా తమ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా సియెరా (Tata Sierra)ను లాంచ్ చేసింది. మార్కెట్‌లోకి రాగానే దీనిని నేరుగా మారుతి సుజుకి పాపులర్ గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)కి గట్టి పోటీదారుగా భావిస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలు కూడా మంచి ఫీచర్లు, విభిన్న ఇంజన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. అయితే, మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ, ధర వంటి అంశాలలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది చాలా మంది కొనుగోలుదారుల సందేహం. ఆ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

టీని మరిగించి మరిగించి తాగుతున్నారా: దెబ్బైపోతారు బాస్..!!

చాయ్ మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు, సురక్షితమైన ముద్దింపు పద్ధతులు, మరియు పాలు ఆధారిత మిశ్రమాలలో బ్యాక్టీరియా వృద్ధిని తగ్గించడానికి రుచి కాపాడే చిట్కాలను అన్వేషించండి.

పల్సర్ కొనేవాళ్లకు ఇప్పుడే 23 వేల వరకూ సేవింగ్!

పండుగ సీజన్‌లో బజాజ్ పల్సర్ (bajaj pulsar) సిరీస్ ఎలా అమ్ముడుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోరూంల ముందు భారీగా క్యూలు, డెలివరీల కోసం ఎదురుచూసే కస్టమర్లు, డిమాండ్‌ను ఏ క్షణానైనా ఛేదించేలా ఉన్న మార్కెట్ ఉత్సాహం.. ఇవన్నీ కలిసి పల్సర్ బ్రాండ్‌కు మరోసారి తన సత్తాను చాటించాయి. ఈ వేడిని కొనసాగించాలనుకున్న బజాజ్ ఆటో ఇప్పుడు కస్టమర్ల కోసం నిజంగా రుచికరమైన వార్తను ప్రకటించింది. పల్సర్ అభిమానులు ఎంతో ఇష్టపడే పల్సర్ హ్యాట్రిక్ ఆఫర్ (Pulsar Hattrick Offer) ను కంపెనీ మళ్లీ తీసుకొస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇది సాధారణ ఆఫర్ కాదు... సంవత్సరాంతానికి ముందే బైక్ కొనాలనుకునే వారికి పూర్తిగా అదనపు విలువను అందించే ప్రత్యేక పథకం.

డిసెంబర్‌లో హ్యుందాయ్ ఆఫర్ల సునామీ

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డిసెంబర్ నెల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ అనే భారీ ఆఫర్ల ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై వినియోగదారులు ఏకంగా రూ.1,00,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఇయర్ ఎండ్ వేడుకలను మరింత ఉత్సాహంగా, లాభదాయకంగా మార్చడానికి కంపెనీ అందిస్తున్న బంపర్ ఆఫర్.
Advertisement

మారుతి తొలి EV అదరగొట్టింది! లాంచ్‌కు ముందే 5 స్టార్ సేఫ్టీ సెన్సేషన్!

మారుతి సుజుకి (Maruti Suzuki) చాలా ఆలస్యంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది అనిపించినా... తొలి ప్రయత్నంతోనే ఆటో మార్కెట్ మొత్తాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ ఎంతోకాలం ఎదురుచూపులకు తెరదిస్తూ ఇ-విటారా (e-vitara)ను భారత మార్కెట్లోకి నిన్న అధికారికంగా విడుదల చేసింది. కానీ ఈ లాంచ్‌లో అసలు కథ ఏమిటంటే, కారు షోరూమ్‌కి చేరుకునేలోపే, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5-స్టార్ భద్రతా రేటింగ్ అందుకోవడం. ఇది మారుతి కోసం సాధారణ విషయం కాదు... భారత మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా మారుతి అంటే మైలేజ్, కానీ భద్రత అంత బాగుండదు అనే భావన ప్రజల్లో బలంగా ఉండేది. ఆ మాటకారులు కూడా ఇప్పుడు ఈ ఫలితాన్ని చూసి ఒక్కసారిగా ఆలోచించే పరిస్థితి వచ్చింది.

ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్: క్లియర్ చేసుకునేందుకు సూపర్ ఛాన్స్.. ఆ రోజే!

డిసెంబర్ 13 2025 న, నేషనల్ లోక్ అదాలత్ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను తగ్గించిన జరిమానాలతో పరిష్కరించి, డ్రైవర్లు సరైన పత్రాలను ఉపయోగించి నిర్దిష్ట కేంద్రాలలో పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది.

ఒక్కసారే పెట్టుబడి..జీవితాంతం ఫ్రీ జర్నీ

భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఊపందుకుంటున్న తరుణంలో దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ అయిన ఎమోటోరాడ్ (EMotorad) ఒక విప్లవాత్మక మోడల్‌ను విడుదల చేసింది. అదే టి-రెక్స్ స్మార్ట్(T-Rex Smart). ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్, దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేయడంతో పాటు, టెక్నాలజీ, క్వాలిటీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీతో మార్కెట్‌లోకి వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఈ-సైకిల్ ఇదే. స్పీడుతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఆధునిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని టి-రెక్స్ స్మార్ట్ను అభివృద్ధి చేశారు.

సేల్స్ లో దుమ్ము దులుపుతున్న ఓమ్ని వారసుడు

భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని స్థానం సంపాదించుకున్న మారుతి సుజుకి ఓమ్నికి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలిచిన కారు మారుతి సుజుకి ఈకో. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం వంటి మూడు ప్రధాన కారణాల వల్ల ఈకో భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.

దేశమంతా ఎదురుచూసిన మారుతి ఇ-విటారా లాంచ్

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికే విధంగా ఇ-విటారా (e-vitara)ను డిసెంబర్ 2న గురుగ్రామ్‌లో ఘనంగా ఆవిష్కరించింది. ఎన్నో నెలలుగా ఆటో లవర్స్ ఎదురు చూసిన ఈ కారు, దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి నుండి వచ్చిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV కావడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారత ఎలక్ట్రిక్ కార్ల ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ మోడల్, డిజైన్ నుంచి టెక్నాలజీ వరకు ప్రతీ అంశంలో వినియోగదారుల అంచనాలకు మించి అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. కొత్త తరం సుజుకి అంతర్జాతీయ EV ప్లాట్‌ఫామ్ అయిన HEARTECT-e ఛాసిస్‌పై తయారైన ఇ-విటారా, ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బలమైన నిర్మాణం, తక్కువ బరువు, మెరుగైన ఎనర్జీ ఎఫిషెన్సీని అందిస్తుంది.