స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరకే స్కూటర్
ఆటోమొబైల్స్
- 4 month, 8 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters)కు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్లో కొత్త మోడళ్లు వెల్లువెత్తుతున్న సమయంలో ఐఫోన్ కొనడానికి అయ్యేంత ఖర్చుతో కూడా ఒక కొత్త ఈవీని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా స్టార్టప్ బ్రాండ్లు తక్కువ ధరకే ఈవీలను అందిస్తున్నాయి. ఈ కోవలోనే మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఇ-మొబిలిటీ (Zelio E-Mobility), అతి తక్కువ ధరకు మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈవా (Eeva ) సిరీస్లో విడుదల చేసింది. కేవలం రూ.51,551 ప్రారంభ ధరతో, ఈ కొత్త స్కూటర్లు ఒకే ఛార్జ్పై 90 కి.మీ.ల వరకు రేంజ్ను అందిస్తున్నాయి.