స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరకే స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters)కు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్‌లో కొత్త మోడళ్లు వెల్లువెత్తుతున్న సమయంలో ఐఫోన్ కొనడానికి అయ్యేంత ఖర్చుతో కూడా ఒక కొత్త ఈవీని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా స్టార్టప్ బ్రాండ్‌లు తక్కువ ధరకే ఈవీలను అందిస్తున్నాయి. ఈ కోవలోనే మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఇ-మొబిలిటీ (Zelio E-Mobility), అతి తక్కువ ధరకు మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈవా (Eeva ) సిరీస్‌లో విడుదల చేసింది. కేవలం రూ.51,551 ప్రారంభ ధరతో, ఈ కొత్త స్కూటర్లు ఒకే ఛార్జ్‌పై 90 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తున్నాయి.

స్పోర్ట్స్ కార్ ఫీలింగ్ ఇచ్చే ఫ్యామిలీ కారు పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే

Skoda Octavia RS launched in India at ₹45.00 Lakh. Explore its design, engine, features, and more. | Skoda Octavia RS భారతదేశంలో ₹45.00 లక్షలకు విడుదలైంది. డిజైన్, ఇంజిన్, ఫీచర్లు మరియు మరిన్నింటిని చూడండి.

ఒక చిన్న మారుతి 800తో మొదలై మూడు కోట్ల కార్ల వరకూ

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది, అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన పనితీరు, ప్రజల నిత్యజీవితంలో భాగమైన కార్లు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్లు కల కాదు అనే భావనను మార్చిన కంపెనీగా మారుతి సుజుకి ఎంతో కాలంగా పేరు గాంచింది. ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా వంటి మోడళ్లు ఒక్కో ఇంటికి చేరి దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. దేశీయంగా 3 కోట్ల కార్ల విక్రయాలను పూర్తి చేసినట్లు మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 2025 నాటికి ఈ ఘనతను సాధించడం ద్వారా ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అత్యధికంగా వాహనాలు విక్రయించిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

హోండా కంపెనీ లోగో మారింది చూశారా

భారతదేశంలో హోండా టూ వీలర్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నెలా అమ్మకాల విషయంలో మార్కెట్లో అగ్రస్థానంలో నిలబడుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు, కొత్త డిజైన్‌లను అందించడంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా బ్రాండ్ తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకునేందుకు లోగోలో కీలక మార్పులు చేసింది.
Advertisement

కూరగాయలు అమ్మే వ్యక్తికి Tvs Xl గిఫ్ట్‌గా ఇచ్చిన ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హృదయానికి హత్తుకునే ఘటన వైరల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఒక అభిమానికి ఎమ్మెల్యే ఇచ్చిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల తన మద్దతుదారుడు బాలయ్యకు కొత్త TVS XL 100 మోపెడ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఎన్నికల సమయంలో గ్రామాలు తిరిగి తన విజయానికి ఎంతగానో సహకరించిన ఈ అభిమాని పట్ల కృతజ్ఞతగా ఆయన ఈ గిఫ్ట్ అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

180 కి.మీ. వేగంతో దూసుకుపోనున్న కొత్త రైలు!

భారతీయ రైల్వేలను ఆధునీకరించే క్రమంలో దూర ప్రయాణాలకు అత్యంత కీలకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కోటా డివిజన్ పరిధిలోని సవాయి మాధోపూర్-కోటా-నాగ్‌డా సెక్షన్‌లో జరిగిన టెస్టుల్లో రెండవ రేక్ గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని అంచనాలను మించిపోయింది.

భారత మార్కెట్లో తుఫాను రేపబోతున్న న్యూమెరోస్ N-ఫస్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవం వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో, కొత్తగా ఆవిష్కృతమైన న్యూమెరోస్ మోటార్స్ n-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్‌లలో ఒకటైన న్యూమెరోస్ మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ N-ఫస్ట్ లాంచ్ ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. బెంగళూరులో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా, కంపెనీ తన దృష్టిని స్పష్టంగా చూపించింది, స్మార్ట్ డిజైన్‌, సుస్థిర టెక్నాలజీ, అందరికీ అందుబాటులో ఉండే ధరతో దీనిని తెచ్చింది. ఈ స్కూటర్ ధరను మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ.64,999 పరిచయ ధరగా నిర్ణయించడం ద్వారా, న్యూమెరోస్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింత చేరువ చేసింది.

FASTag పనిచేయడం లేదా?

మీ కారుకు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయిందా? అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి ప్రధాన కారణం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల తప్పనిసరి చేసిన KYV (Know Your Vehicle) ధృవీకరణ ప్రక్రియ.

ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగంలో కూడా తన సత్తా చాటిన మహీంద్రా

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి దారితీసిన మహీంద్రా (Mahindra) సంస్థ మరో విశేషమైన ఘనతను సాధించింది. ఇప్పటికే SUVల విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) పేరుతో తన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విభాగాన్ని విజయవంతంగా నడుపుతున్న ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ మహీంద్రా MLMML ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య భారత ఆటోమొబైల్ చరిత్రలో కొత్త పేజీని రాసిందని చెప్పాలి.

బీపీ ఎంత దాటితే గుండె పోటు వస్తుంది..? లక్షణాలు..!!

భారతదేశం వయోజనులలో హైపర్‌టెన్షన్ కేసుల గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది, అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు నియమిత ఆరోగ్య తనిఖీల అవసరాన్ని నొక్కి చెబుతోంది.

జనాలు ఈ కారును భారీగా కొంటున్నారు

ఒకప్పుడు, కార్ల మార్కెట్‌లో సెడాన్ (Sedan) అనే పేరు వినిపిస్తేనే ప్రజల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం ఉండేది. సొగసైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, క్లాసీ లుక్ కారణంగా, సెడాన్ కార్లు ప్రతి కుటుంబం కలల వాహనాలుగా నిలిచాయి. కానీ సమయం మారింది. SUVల యుగం మొదలైంది. పెద్ద సైజ్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రోడ్ ప్రెజెన్స్ ఇవన్నీ SUVలకు భారీ డిమాండ్ తెచ్చాయి. దాంతో, చాలా మంది కస్టమర్లు సెడాన్‌లను మర్చిపోయి SUVల వైపు మళ్లారు. అయినా సరే, సెడాన్‌లు పూర్తిగా వెనుకబడ్డాయనే చెప్పడం తప్పుడు. SUVలు మార్కెట్‌ను ఆధిపత్యం వహిస్తున్నా, సెడాన్‌లకు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.

నిమిషానికి 15 బండ్లు అమ్మి రికార్డ్

భారతీయ టూ వీలర్ మార్కెట్లో అతిపెద్ద సంస్థలలో ఒకటైన హోండా టూ వీలర్ కంపెనీ అక్టోబర్ 2025 నెల విక్రయాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. కేవలం 31 రోజుల్లోనే ఈ కంపెనీ ఏకంగా 6,50,596 వాహనాలను విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, దేశీయంగా అమ్మకాలు భారీగా పెరగడం ద్వారా కంపెనీ మొత్తం వృద్ధిని బలంగా నిలబెట్టింది. ఈ విజయానికి కీలకమైన యాక్టివా (Activa) స్కూటర్ 3.5 కోట్ల యూనిట్ల ఎగుమతి మైలురాయిని చేరుకుంది. హోండా సాధించిన ఈ రికార్డు విజయం, అమ్మకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement

హీరో నుంచి కొత్త బైక్‌లు.. రోడ్లపై రాకింగ్ లుక్‌తో అదరగొట్టబోతున్నాయ్

హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థలలో ఒకటి, తన కొత్త మోడళ్లతో మరోసారి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇటలీలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన ప్రదర్శన EICMA 2025 లో హీరో తన సత్తా చాటింది. ఈ అంతర్జాతీయ వేదికపై కంపెనీ తన ప్రధాన బ్రాండ్ కింద మాత్రమే కాకుండా, తన ఎలక్ట్రిక్ విభాగం విడా (VIDA) పేరుతో కూడా అనేక కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ సారి హీరో ప్రదర్శించిన మోడళ్లలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించినవి రెండు.. XPulse 210 Dakkar Edition (ఎక్స్‌పల్స్ 210 డాకర్ ఎడిషన్), Hunk 440 SX (హంక్ 440 ఎస్‌ఎక్స్). ఈ రెండు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. వీటి రాక కోసం ఆటో ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ బైక్స్ గురించిన వివరాలు ఈ కథనంలో చూద్దాం.

అక్టోబర్‌లో హోండా విక్రయాలు దూకుడు!

హోండా (Honda) భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో ఒకటి. ఈ కంపెనీ కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తన వాహనాలను సరఫరా చేస్తోంది. ప్రతీ నెలా అమ్మకాల గణాంకాలను ప్రకటించే ఈ సంస్థ, అక్టోబర్ నెలలో మంచి వృద్ధిని నమోదు చేసింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2025లో హోండా టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగి, మరోసారి తన మార్కెట్ బలాన్ని నిరూపించాయి. ఈ నెలలో హోండా మొత్తం 6,50,596 వాహనాలను విక్రయించింది. ఇందులో 5,98,952 యూనిట్లు దేశీయ మార్కెట్‌లో అమ్ముడవ్వగా, 51,644 వాహనాలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 5,97,711 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 8.85 శాతం వృద్ధి సాధించాయి.

ఇది 34 లక్షల కుటుంబాల నమ్మకం

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki WagonR) సరికొత్త మైలురాయిని చేరుకుంది. 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‎గా నిలిచిన ఈ టాల్-బాయ్ డిజైన్ కారు, దేశంలో ఏకంగా 34 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది.

మహిళా ప్రపంచకప్ విజేతలకు టాటా బిగ్ గిఫ్ట్

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచకప్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని, ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) మహిళా క్రికెట్ జట్టుకు భారీ బహుమతిని ప్రకటించింది.

ఈ స్పెషల్ బైక్ కొన్న వాళ్లకు నిజంగానే అదృష్టం

ప్రపంచ మోటార్‌సైకిల్ రంగంలో 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ.. తమ అద్భుతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన మోడల్‌ను విడుదల చేసింది. ఇటలీలో జరుగుతున్న EICMA 2025 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ప్రదర్శనలో క్లాసిక్ 650 125వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్‌ను ఆవిష్కరించింది.

 ఉడికించిన గుడ్డు Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది?

బరువు తగ్గడానికి ఉడికించిన గుడ్లు మరియు ఆమ్లెట్‌ల పోషక ప్రయోజనాలను అన్వేషించండి. మీ ఆహార అవసరాలకు ఏ బ్రేక్‌ఫాస్ట్ ఎంపిక సరిపోతుందో కనుగొనండి.

మారుతి చిన్న కార్లు దుమ్ము దులిపాయి.. SUVలను మించిపోయిన అమ్మకాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం కార్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) తగ్గింపు భారత ఆటోమొబైల్ రంగానికి ఊపిరి పోసింది. ఈ నిర్ణయం ప్రత్యేకించి చిన్న కారు విభాగానికి భారీ ఊతం ఇచ్చింది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగిన, చిన్న ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇప్పుడు కేవలం 18 శాతం GST మాత్రమే వర్తించనుంది. దీంతో చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా, దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ తగ్గింపును వెంటనే వినియోగదారులకు చేరవేసింది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలను రూ.36,000 నుండి రూ.1.06 లక్షల వరకు తగ్గించింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

టమోటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా...? వీరు దూరంగా ఉండాలి..!!

ఒక అధ్యయనం అధిక టమోటా వినియోగాన్ని పెరిగిన కిడ్నీ రాళ్ల ప్రమాదంతో అనుసంధానిస్తుంది. నిపుణులు మెరుగైన ఆరోగ్యానికి మితంగా మరియు సమతుల్య ఆహారాలను సిఫార్సు చేస్తున్నారు.
Advertisement

డ్రైవింగ్‌లో చిన్న మార్పులు.. కానీ మైలేజ్‌లో పెద్ద మిరాకిల్!

ఇప్పటి పెట్రోల్ ధరల పెరుగుదల పరిస్థితుల్లో ప్రతి బైక్ రైడర్ మనసులో తారసపడే ప్రశ్న ఒక్కటే, నా బైక్ మైలేజ్ ఎలా పెంచుకోవాలి? అనేది. రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, లేదా ఇంటి అవసరాల కోసం ప్రయాణించే వారు అందరూ వీలైనంత వరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బైక్ కొనేటప్పుడు చాలా మంది మొదటగా కిలోమీటర్‌కు ఎంత ఇస్తుంది? అనే ప్రశ్న అడుగుతారు. కానీ ఒకసారి బైక్ కొనుగోలు చేసిన తర్వాత, దానిని సరైన విధంగా సంరక్షించకపోతే లేదా తప్పుగా నడిపితే, ఆ మైలేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా కొత్తగా కొన్న బైక్ కూడా కొన్ని నెలల్లోనే మైలేజ్ డ్రాప్ సమస్యతో బాధిస్తుంటుంది. నిపుణుల ప్రకారం, బైక్ మైలేజ్‌ పెరగాలంటే ఈ కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవెంటో ఒకసారి చూద్దాం.

సుజుకి మోటార్‌సైకిల్ అక్టోబర్ అమ్మకాలతో కొత్త రికార్డు!

ప్రఖ్యాత టూవీలర్ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) అక్టోబర్ 2025లో తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును సృష్టించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులను కలిపి మొత్తం 1,29,261 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో (అక్టోబర్ 2024) కంపెనీ 1,20,055 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి సుజుకి 8 శాతం వార్షిక వృద్ధిని సాధించడం విశేషం. ఈ అద్భుతమైన అమ్మకాలతో పాటు, సుజుకి మోటార్‌సైకిల్ అక్టోబర్ 2025లో తమ వ్యాపార విలువ రూ. 857 మిలియన్లకు పైగా చేరుకున్నట్లు పేర్కొంది. ఇది కంపెనీకి ఆర్థిక పరంగా కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

తగ్గిన అమ్మకాల తర్వాత తిరిగి దుమ్ము రేపిన రెనాల్ట్

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారతీయ విభాగం రెనాల్ట్ ఇండియా, అక్టోబర్ 2025 నెలలో నమోదు చేసిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో మెరుగైన గణంకాలను నమోదు చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆ నెలలో మొత్తం 4,672 రెనాల్ట్ కార్లు భారత మార్కెట్లో అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,861 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గణనీయమైన వృద్ధి, అంటే 21% సంవత్సరాంతర వృద్ధి సాధించినట్లే. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి, కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ట్రైబర్ (Triber), కైగర్ (Kiger) మోడళ్లకు లభించిన భారీ ఆదరణ.

మీ కారు అద్దాలు ఇలా కాపాడుకోండి

కారులో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులను గాలి, వర్షం, దుమ్ము, ఎగిరే రాళ్ల నుంచి కాపాడే అతి ముఖ్యమైన భాగం విండ్‌షీల్డ్ (Windshield). ఒక్కోసారి డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న రాయి తగలడం వల్ల కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ విండ్‌షీల్డ్ దెబ్బతింటే, అది ప్రయాణీకుల భద్రతకు ముప్పుగా మారుతుంది. చిన్న పగుళ్లను రిపేర్ చేయగలిగినప్పటికీ, అసలు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ కారు విండ్‌షీల్డ్‌ను పగుళ్లు లేదా గీతలు పడకుండా కాపాడుకోవడానికి డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటలీలో మెరిసిన టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ బైకులు

ఇటలీలో ప్రారంభమైన ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌సైకిల్ ఉత్సవం EICMA 2025 మోటార్‌సైకిల్ ప్రేమికులకు నిజమైన పండుగలా మారింది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ కొత్త సాంకేతికతలు, భవిష్యత్ మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాయి. ఈ వేదికపై భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించింది. భారత మార్కెట్‌లోనే కాకుండా, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో కూడా తన స్థానాన్ని బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీఎస్ పలు మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ వాహనాలు కేవలం రేంజ్ పరంగా మాత్రమే కాకుండా, స్మార్ట్ కనెక్టివిటీ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, అధిక భద్రతా ప్రమాణాలతో కూడా ఆకట్టుకున్నాయి. వాటి గురించి ఈ కథణంలో చూద్దాం.