హెల్మెట్ బదులుగా ఫ్రైపాన్? బెంగళూరులో వైరల్ అయిన వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంత వేగంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, క్షణాల్లోనే వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నగరంలోని రూపేనా అగ్రహార సమీపంలో ఓ బైక్ రైడర్ చేసిన విచిత్ర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల జరిమానా నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి తలపై హెల్మెట్ బదులుగా ఒక పెద్ద ఫ్రై పాన్, అంటే కడాయిని ధరించి బైక్ వెనుక కూర్చున్నాడు. చూస్తేనే నవ్వొచ్చే ఈ సీన్‌ను ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

నెలరోజులు ఇది రోజూ హాఫ్ స్పూన్ చాలు.. మీ ఆరోగ్యం ఎలా మారుతుందంటే!

ఒక అధ్యయనం రోజువారీ హల్దీ వినియోగం వాలంటీర్లలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని, దాని ఆరోగ్య ప్రయోజనాలను మరియు ఆహార అనుబంధంగా దాని సామర్థ్యాన్ని మద్దతు ఇస్తుందని కనుగొంది.

అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు FY26: ముఖ్యాంశాలు

అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ యొక్క గణనీయమైన ఆదాయ వృద్ధి మరియు FY26 కోసం మౌలిక సదుపాయాల్లో వ్యూహాత్మక పెట్టుబడులను, నవి ముంబై విమానాశ్రయ ప్రారంభాన్ని కనుగొనండి.

FY26 Q2 లో 27% వృద్ధి నమోదు చేసిన అదాని పోర్ట్స్ ..!!

అదాని పోర్ట్స్ FY26 Q2 లో ₹5,550 కోట్ల EBITDA సాధించింది, ఇది 27% వృద్ధిని సూచిస్తుంది, లాజిస్టిక్స్ మరియు సముద్ర రంగాలలో బలమైన వృద్ధిని చూపిస్తుంది.
Advertisement

ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

ఇటలీలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన EICMA 2025 (ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ అండ్ యాక్సెసరీస్ షో) ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రఖ్యాత వేదికపై ప్రతి సంవత్సరం మోటార్‌సైకిల్ దిగ్గజాలు తమ కొత్త ఆవిష్కరణలను, భవిష్యత్ దిశగా తీసుకెళ్లే సాంకేతిక మోడళ్లను ప్రదర్శిస్తారు. ఈసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నది మన దేశపు గర్వకారణమైన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బ్రాండ్, ఎలక్ట్రిక్ యుగంలోకి ప్రవేశిస్తూ ఫ్లయింగ్ ఫ్లీ S6 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆవిష్కరించింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ భవిష్యత్తుకు దారి చూపే తరతరాల మోటార్‌సైకిల్ టెక్నాలజీకి సంకేతం. తేలికైన నిర్మాణం, ఆధునిక డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యంతో ఈ బైక్ వేరే స్థాయిలో ఉన్న రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపుదిద్దుకుంది.

రూ.7.50కోట్ల కారు కొన్న స్టార్ డైరెక్టర్

సెలబ్రిటీల లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రోల్స్ రాయిస్ (Rolls-Royce) కంపెనీకి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్(Spectre)ను కొనుగోలు చేసిన భారతదేశపు మొదటి దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు.. తాను దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు, ఇటీవల షారూఖ్ ఖాన్‌తో జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన అట్లీ కుమార్ (Atlee Kumar). దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లీ, తన వరుస విజయాలు, పాన్-ఇండియా రేంజ్ పెరగడం వలన ఆదాయం పెరిగి, తన వాహనాన్ని కూడా లగ్జరీగా అప్‌గ్రేడ్ చేసుకున్నాడు.

నవంబర్‌ నెలలో లాంఛ్ కాబోతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

ఈ నవంబర్‌లో భారతదేశంలో విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కనుగొనండి, వీటిలో OnePlus 15 మరియు Find X9 సిరీస్ ఉన్నాయి.

తక్కువ ధరకే అందరూ ఎదురూ చూస్తున్న కారు వచ్చేసింది

హ్యుందాయ్ వెన్యూ పేరు విన్నప్పుడు ఆటోమొబైల్ ప్రేమికులకు గుర్తొచ్చేది.. స్టైల్, సౌకర్యం, నమ్మకం. ఈ పేరును మరింత బలోపేతం చేస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త హ్యుందాయ్ వెన్యూను భారత మార్కెట్లో ఘనంగా లాంచ్ చేసింది. కొత్త వెన్యూ పాత మోడల్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, ఆధునిక టెక్నాలజీలతో ముందుకు వచ్చింది. ఇదే సమయంలో, కంపెనీ వెన్యూ N లైన్ వేరియంట్‌ను కూడా ఆవిష్కరించింది, ఇది మరింత పవర్‌ఫుల్, స్పోర్టీ అనుభవాన్ని కోరుకునే యువ డ్రైవర్‌లను ఆకర్షించేలా రూపొందించబడింది. హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అయింది.

బైక్ ప్రేమికులకు పండుగ మొదలైంది.. మిలాన్‌లో EICMA 2025

ప్రతి సంవత్సరం టూవీలర్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఉంటుంది, అదే EICMA (Esposizione Internazionale Ciclo Motociclo e Accessori). ఇది ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ అభిమానులందరికీ ఇది ఒక పండుగలా ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఆటోమొబైల్ కంపెనీలు తమ తాజా టెక్నాలజీని, రాబోయే మోడళ్లను, భవిష్యత్ కాన్సెప్ట్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. సాధారణంగా మోటార్ షోలు అంటే కార్లు, బైక్‌లు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలు అన్నీ ఉంటాయి. కానీ EICMA మాత్రం పూర్తిగా టూవీలర్ వాహనాలకే అంకితమై ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లు.. హోండా, యమహా, సుజుకి, కవాసకి, డుకాటి, ట్రయంఫ్, KTM, బజాజ్, హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, TVS వంటి కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తాయి.

డుగ్గు..డుగ్గు బైకు మీద పోతుంటే అందరి చూపు మీమీదే

ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. కొత్త బైక్‌లు, రికార్డు అమ్మకాలతో మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ కంపెనీ కేవలం రూ.లక్ష రేంజ్‌లోనే ఒక సరికొత్త బైక్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు బైక్ ప్రియులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు ఈ బైక్ ఏకంగా లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అక్టోబర్ 2025 అమ్మకాల నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం కంపెనీ బంపర్ హిట్ సాధించింది. ఇంతకీ ఆ రేంజ్ బైక్ వివరాలు ఏంటి? కంపెనీ అమ్మకాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అందరూ ఈ కంపెనీ ఈవీ కార్లే కొంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి కొత్త ఊపును అందిస్తున్న JSW MG మోటార్ ఇండియా ఇప్పుడు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత మార్కెట్లో 1 లక్ష ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మైలురాయిని దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం MG మోటార్‌కే కాదు, మొత్తం భారత ఆటోమొబైల్ పరిశ్రమకే ఒక కీలక ఘట్టం. ఎందుకంటే, ఇది దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఘనతతో MG మోటార్, టాటా మోటార్స్ తరువాత ఈ మైలురాయిని చేరుకున్న రెండవ ఆటోమేకర్‌గా నిలిచింది. MG మోటార్ ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా బలమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

మీ జాతకం బాగుంటేనే ఈ బైక్ కొంటారు

ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన బైక్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మీ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నా సరే మీ జాతకం బాగుంటే మాత్రమే ఈ బైక్ మీ చేతికి వస్తుంది. సమయానికి స్పందించకపోతే ఈ బైక్‌ను కొనే అవకాశం కోల్పోతారు.
Advertisement

రూ.15.29 లక్షల ధరలో కొత్త హోండా ఎలివేట్ ADV ఎడిషన్

భారతదేశంలో హోండా (Honda) కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఎలివేట్. SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన తొలి జపనీస్ ఆటోమేకర్లలో ఒకటైన హోండా, ఈ కాంపాక్ట్ SUVతో తక్కువ సమయంలోనే భారత వినియోగదారుల మనసును గెలుచుకుంది. స్టైలిష్ లుక్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఎలివేట్ ప్రారంభ దశలోనే భారీ అమ్మకాలను నమోదు చేసింది. అయితే గత కొంతకాలంగా మార్కెట్లో పోటీ పెరగడంతో ఈ SUV అమ్మకాలు కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. ఈ పరిణామాన్ని గమనించిన హోండా మళ్లీ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త వ్యూహాన్ని అవలంబించింది. కంపెనీ తాజాగా ఎలివేట్‌కు ఒక కొత్త రూపం ఇచ్చి, ప్రత్యేక ఆకర్షణలతో కూడిన Elevate ADV Editionను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఖాళీ కడుపుతో టీ స్పూన్ నెయ్యిని కలిపి ఈ రసాన్ని తీసుకోండి- మొత్తం `సాఫ్`

ఉదయాన్నే ఒక టీస్పూన్ నెయ్యి మరియు తులసి రసం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని, జీర్ణక్రియను, మరియు మొత్తం ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో తెలుసుకోండి.

టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది

ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేందుకు భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) సిద్ధమైంది. తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కాన్సెప్ట్ రూపంలో ఇటలీలోని మిలన్‌లో జరిగే EICMA 2025 అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ప్రపంచానికి పరిచయం చేయనుంది. తమిళనాడులోని హోసూరు (Hosur) ప్లాంట్‌లో తయారయ్యే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్, అంతర్జాతీయ మార్కెట్లో టీవీఎస్ బ్రాండ్‌ను మరో మెట్టు ఎక్కించనుంది. ఈ స్పోర్టీ నేకెడ్ మోటార్‌సైకిల్ వివరాలు, ఇతర కొత్త మోడల్స్‌ గురించి తెలుసుకుందాం.

రూ.7.55 లక్షల కారుపై కస్టమర్ల దండయాత్ర.

భారత మార్కెట్‌లో తన బ్రాండ్‌ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India), అక్టోబర్ 2025లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించింది. ఈ రికార్డు అమ్మకాలకు ప్రధాన కారణం రూ.7.55 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన స్కోడా మొదటి 4 మీటర్ల కంటే చిన్న ఎస్‌యూవీ అయిన కైలాక్(Kylaq). ఈ మోడల్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో, స్కోడా అమ్మకాల కౌంటర్ తొలిసారిగా అత్యధిక స్థాయికి చేరుకుంది.

Today Rasi Phalalu : బృహస్పతి, శని దేవుడి అపూర్వ కలయిక..ఈ రాశుల వారి తల రాత మారబోతుంది


హీరో నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp), తన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (VIDA)ను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటివరకు స్కూటర్లపై దృష్టి పెట్టిన హీరో, ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆటో షో EICMA 2025 (మిలన్)లో తొలిసారిగా ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఈ మోటార్‌సైకిల్‌ను హీరో ప్రాజెక్ట్ VXZ పేరుతో అభివృద్ధి చేస్తోంది. గతంలో కంపెనీ ఉబెక్స్ (UBEX) అనే కాన్సెప్ట్‌కు సంబంధించిన టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది, అయితే ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు.

టెస్లా నుంచి ఎగిరే కారు లాంచ్‌పై ఎలాన్ మస్క్ బిగ్ అప్‌డేట్!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా (Tesla) కంపెనీ, ఇప్పుడు మరొక అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elen Musk) మళ్లీ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సాంకేతిక రంగాన్ని కదిలించే ఈ వ్యాపారవేత్త, ఈసారి ఎగిరే కారు కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కంపెనీ 2025 చివరి నాటికి ఒక ఎగిరే కార్ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని వెల్లడించారు. ఆయన మాటల్లో ఇది ఇప్పటివరకు ఆవిష్కరించబడిన అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి అని పేర్కొనడం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న విశ్వాసాన్ని, సాంకేతిక శక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

మార్క్ జుకర్‌బర్గ్ రికార్డ్ బ్రేక్.. యంగెస్ట్ బిలియనీర్స్‌గా 'మెర్కార్' ఫౌండర్స్ !

మెర్కర్ అనే AI రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌కు చెందిన ముగ్గురు 22 ఏళ్ల వ్యవస్థాపకులు వేగవంతమైన వృద్ధి మధ్య $10 బిలియన్ విలువను అధిగమించి వార్తల్లో నిలిచారు.
Advertisement

ఈ ఐదు పానీయాలతో డయాబెటిస్‌ ఇక కంట్రోల్..!!

ఇంటి తయారీ హర్బల్ టీలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా నిర్వహించగలవో తెలుసుకోండి. ఈ సహజ చికిత్సల ప్రయోజనాలు మరియు తయారీని అన్వేషించండి.

మిలన్‌లో బైక్‌ల మేళా

ప్రపంచ మోటార్‌సైకిల్ ప్రేమికులకు పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ షో అయిన EICMA 2025 ఈ సంవత్సరం నవంబర్ 4 నుండి ఇటలీలోని మిలన్‌లో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ తయారీదారులు తమ సరికొత్త మోడళ్లను ముఖ్యంగా అడ్వెంచర్ సెగ్మెంట్‌లోని పవర్ఫుల్ బైక్‌లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. కేవలం పవర్‌ఫుల్ ఇంజిన్లతోనే కాకుండా స్టైల్, టెక్నాలజీలో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో రానున్న 5 ప్రధాన సూపర్ బైక్‌లు, ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ బైక్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జనాలను విపరీతంగా ఆకర్షించిన మారుతి ఈకో

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటిగా మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) స్థిరంగా నిలిచింది. కుటుంబ అవసరాలకైనా, వ్యాపార ప్రయోజనాలకైనా లేదా స్కూల్ వ్యాన్‌‌లుగా ఉపయోగించుకునేందుకైనా ఈకో భారతీయ వినియోగదారుల జీవనశైలిలో ఒక భాగమైపోయింది. గతంలో మారుతి ఓమ్ని ఎంత ప్రాచుర్యం పొందిందో, ఇప్పుడు ఆ స్థానం మొత్తాన్ని ఈకో దక్కించుకుందనే చెప్పాలి. ఓమ్ని ఉత్పత్తి నిలిపివేయబడిన తర్వాత ఏర్పడిన ఆ ఖాళీని ఈకో భర్తి చేసి, తన విశ్వసనీయతతో మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అక్టోబర్ 2025 నెల ఈ విజయ పరంపరలో మరో ముఖ్యమైన అధ్యాయం అయింది.

రేపే దిగుతున్న మొనగాడు

హ్యుందాయ్ కార్స్ ఇండియా (Hyundai Cars India) తమ పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ (Venue)ను పూర్తిగా రీడిజైన్ చేసి, మరింత స్పోర్టీ లుక్‌తో ఎన్ లైన్ (N Line) వెర్షన్‌ను తీసుకురాబోతోంది. నవంబర్ 4, 2025న విడుదల కానున్న ఈ 2026 మోడల్‌కు సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే రూ.25,000 అడ్వాన్స్‌తో మొదలయ్యాయి.

అక్టోబర్‌లో రికార్డు సేల్స్ చేసిన మారుతి సుజుకి

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited), అక్టోబర్ 2025లో మరొకసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఈ నెలలో కంపెనీ అద్భుతమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తూ మళ్లీ మార్కెట్‌లో దూసుకుపోయింది. మొత్తం 2,20,894 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి, దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఎగుమతుల్లో కూడా బలమైన పనితీరును కనబరిచింది. గత ఏడాది అదే నెలలో, అంటే అక్టోబర్ 2024లో, పండుగ సీజన్ కారణంగా 2,06,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఆ గణాంకాన్ని అధిగమిస్తూ కంపెనీ 7 శాతం వృద్ధిని సాధించడం విశేషం. దీని ద్వారా మారుతి సుజుకి బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం ఎంతగానో పెరిగిందని మరోసారి తేలింది.