మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు అదిరిపోయే రెస్పాన్స్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే మరో కీలక మైలురాయిని అందుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కంపెనీ తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా (e Vitara) మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంచనాలకు మించి ఆదరణ పొందుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ ఎలక్ట్రిక్ SUVకు మంచి స్పందన లభిస్తుండటంతో, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణానికి ఇది బలమైన ఆరంభంగా మారింది. 2026 సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే భారతీయ మార్కెట్లో ఇ-విటారా మొత్తం 7,097 యూనిట్లు విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది. తొలి ఎలక్ట్రిక్ మోడల్‌కే ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం విశేషం.

ఆ 5 మోడళ్లపై మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) తన వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే నెలలోనే కంపెనీ ఈ ధరల పెంపునకు సంబంధించిన సంకేతాలను ఇచ్చింది. ఈ సరికొత్త ప్రైస్ హైక్ ప్రభావం కంపెనీకి చెందిన బడ్జెట్ సెగ్మెంట్ ఎరీనా, ప్రీమియం సెగ్మెంట్ నెక్సా డీలర్ షిప్స్ ద్వారా విక్రయించే కార్లపై పడింది. అయితే, కొన్ని మోడళ్ల ధరలను పెంచిన మారుతి సంస్థ, మరికొన్ని మోడళ్ల ధరలను తగ్గించింది. అదే సమయంలో సామాన్యులకు అందుబాటులో ఉండే 5 కార్ల ధరలను మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచకుండా అలాగే ఉంచింది.

అడవుల్లోనూ.. కొండలపైనూ దుమ్మురేపే బైక్!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki), భారత మార్కెట్లో తన నింజా సిరీస్ స్పోర్ట్స్ బైక్‌లతో యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే గత కొన్నేళ్లుగా భారతీయ రైడర్లలో అడ్వెంచర్ టూరింగ్, డ్యూయల్-స్పోర్ట్ బైక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో, ఆ విభాగంలో కూడా తన ఉనికిని మరింత బలపరిచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కవాసకి భారత మార్కెట్లో కేఎల్‌ఎక్స్230 (KLX230) డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. రోడ్లపైనే కాకుండా కఠినమైన ఆఫ్-రోడ్ మార్గాల్లోనూ సమర్థవంతంగా ప్రయాణించగల ఈ బైక్, అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడే వారిలో మంచి ఆదరణను దక్కించుకుంది.

సామాన్యుడి జేబును కాపాడే టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే

భారతదేశంలో హోండా యాక్టివా దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాల ఇళ్లల్లో ఒక ప్రధాన భాగమైపోయింది. నమ్మకమైన ఇంజన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, నడపడానికి సులభంగా ఉండటంతో ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా నిలిచింది. కొన్నిసార్లు అమ్మకాలలో హీరో స్ప్లెండర్ బైక్‌ను సైతం వెనక్కి నెట్టి రికార్డులు సృష్టించింది. అయితే ప్రస్తుత కాలంలో ఇంధన ధరల భారం పెరగడంతో, యాక్టివా కస్టమర్లు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. యాక్టివా ఇచ్చే అదే కంఫర్ట్‌ను అందిస్తూ, పెట్రోల్ ఖర్చును పూర్తిగా మిగిల్చే ఐదు అద్భుతమైన ఈవీ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

హైవే ప్రయాణానికి ముందు ఈ విషయాలు చెక్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు!

Highway Travel Checklist. లాంగ్ డ్రైవ్ వెళ్లే ముందు మీ కారులో టైర్లు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ మరియు బ్రేక్స్ వంటి ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఇండియాలో ఎక్కువ మంది కొనే ఈవీ స్కూటర్ ఇదే

భారతదేశ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సరికొత్త విప్లవం నడుస్తోంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company)కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) దేశీయ మార్కెట్లో ఒక అద్భుతమైన రికార్డును సృష్టించింది. ఈ స్కూటర్ భారత్‌లో లాంచ్ అయిన నాటి నుండి ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల (1 మిలియన్) యూనిట్ల విక్రయాల మార్కును విజయవంతంగా దాటేసింది. ఈ ఘనత సాధించడానికి ఐక్యూబ్‌కు సుమారు 6 ఏళ్ల సమయం పట్టినప్పటికీ, ప్రస్తుత మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ చూస్తే ఆటోమొబైల్ రంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సేల్స్ మైలురాయిని విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐక్యూబ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన ప్రారంభంలో మొదటి 1 లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును అందుకోవడానికి ఏకంగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంటూ కేవలం 10 నెలల్లోనే 2 లక్షల మార్కును దాటింది.

జనాల గుండెల్లో ప్లేస్ సంపాదిస్తున్న స్కూటర్

భారతీయ స్కూటర్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని విడుదలైన మోడళ్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ (Tvs Ntorq) ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరు కారణంగా ఈ స్కూటర్ యువతలో మంచి ఆదరణ పొందుతోంది. కాలేజీ విద్యార్థుల నుంచి ఉద్యోగాలకు వెళ్లే యువకుల వరకు ఎంతో మంది దీనిని తమ మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. ఈ ప్రజాదరణ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 2026 మే నెలలో టీవీఎస్ ఎన్‌టార్క్ మొత్తం 34,127 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి మరోసారి తన సత్తా చాటుకుంది. గత ఏడాది మే నెలలో ఈ స్కూటర్ 25,205 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించింది.

చైనాలో బాగా డిమాండ్ ఉన్న కారు ఇండియాలోకి

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (Jsw Mg Motor India) ఇండియా మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశంలో తన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (PHEV)ను విడుదల చేసే దిశగా కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. తన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVను జూలై 16న అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ SUVను భారతీయ రహదారులపై విస్తృతంగా పరీక్షిస్తున్న ఎంజీ, ఇప్పుడు దానిని మార్కెట్లోకి తీసుకురావడానికి తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ కొత్త SUVలో అత్యంత ఆకర్షణీయమైన అంశం మూడు వరుసల సీట్ల లేఅవుట్.
Advertisement

వర్షంలో బ్రేక్ వేసినా వాహనం వెంటనే ఎందుకు ఆగదు?

Braking Distance in Rain: వర్షంలో బ్రేక్ వేసినా వాహనం వెంటనే ఎందుకు ఆగదు? హైడ్రోప్లేనింగ్ అంటే ఏమిటి? వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవింగ్ చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు మరియు జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.

మీ కారుకు రూ.1.16 లక్షల బడ్జెట్‌లోనే స్పోర్టీ లుక్

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో సుజుకి స్విఫ్ట్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ కారుకు మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ సరికొత్త అప్‌గ్రేడ్ ప్యాకేజీని ప్రకటించింది. సాధారణ స్విఫ్ట్ కారును ఎంతో పవర్‌ఫుల్ గా కనిపించే స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ తరహాలోకి మార్చేందుకు ఒక అఫీషియల్ ఫ్యాక్టరీ-బ్యాక్డ్ బాడీకిట్ (Factory-Backed Bodykit)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త కిట్ కారు పాత లుక్‌ను పూర్తిగా మార్చేసి అల్ట్రా స్పోర్టీగా చూపిస్తుంది.

టయోటా ఫేవరెట్ కారుకు డిమాండ్ తగ్గిందా?

భారతీయ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఈ విభాగానికి చెందిన కార్లు కుటుంబ వినియోగదారులను విస్తృతంగా ఆకర్షిస్తుంటాయి. ఈ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోడళ్లలో టయోటా గ్లాంజా (Toyota Glanza) ఒకటి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటంతో పాటు, టయోటా బ్రాండ్ విశ్వసనీయత కారణంగా కూడా ఈ కారు కొనుగోలుదారుల జాబితాలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు గ్లాంజా విక్రయాల్లో కొంత మందగమనం కనిపిస్తున్నట్లు సూచిస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఈ రెండు బైక్‌లు ఉంటే చాలు

భారతీయ బైక్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield)కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తన క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతితో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సంస్థ విజయానికి ప్రధాన బలంగా నిలిచిన మోడళ్లు క్లాసిక్ 350 (Classic 350), బుల్లెట్ 350 (Bullet 350). ప్రస్తుతం కూడా ఈ రెండు బైక్‌లే కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తూ, బ్రాండ్‌కు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా నిరూపించాయి.
Advertisement

మార్కెట్లోకి వచ్చిన మొదటి నెలలోనే దుమ్మురేపిన ఈబెల్లా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), తన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. టయోటా భారతీయ పోర్ట్‌ఫోలియోలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా టయోటా అర్బన్ క్రూజర్ ఈబెల్లా (Toyota Urban Cruiser Ebella)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారును మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్‌పై ఉమ్మడిగా సిద్ధం చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సరికొత్త ఎస్‌యూవీ డెలివరీలను కూడా అధికారికంగా ప్రారంభించేసింది.

జూన్ 30న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న టాటా సియెర్రా EV

భారతీయ ఆటోమొబైల్ రంగంలో వినియోగదారుల అభిరుచులను, అవసరాలను అత్యంత సమర్థవంతంగా అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించే కంపెనీలలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతుండటంతో, ఈ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచడానికి టాటా మోటార్స్ వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు భారతీయ రోడ్లపై తనదైన ముద్ర వేసిన లెజెండరీ సియెర్రా పేరును మళ్లీ పునరుద్ధరిస్తూ, సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో సియెర్రా ఈవీ (Sierra ev)ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే ఆటోమొబైల్ ప్రేమికులలో ఈ SUVపై భారీ ఆసక్తి నెలకొంది.

కొత్త జీఎస్టీ రూల్స్‌కు తగ్గట్టుగా 349cc ఇంజన్‌తో ట్రయంఫ్ నుంచి మరో బైక్

బ్రిటన్ లగ్జరీ బైక్ బ్రాండ్ ట్రయంఫ్ తన పాపులర్ టిఆర్-సిరీస్ (TR-Series) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో ట్రాకర్ 400 బైక్‌ను పరిచయం చేసింది. ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ మోటార్ సైకిళ్ల డిజైన్ స్ఫూర్తితో దీనిని రూపొందించారు. అయితే, భారతదేశంలో మారిన కొత్త జీఎస్టీ (GST) నిబంధనల కారణంగా 400cc అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్‌లపై పన్నుల భారం పెరిగింది.దీంతో ఈ బైక్ ఇండియాకు రావడం కష్టమే అనుకున్న తరుణంలో, ట్రయంఫ్ కంపెనీ బజాజ్ ఆటోతో కలిసి కీలక మార్పు చేసింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా 349cc ఇంజన్‌తో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దీనిని లాంచ్ చేశారు.

తక్కువ బడ్జెట్‌లో ADAS కార్లు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కారు కొనేటప్పుడు కేవలం కలర్, డిజైన్ చూసి మురిసిపోయే రోజులు పోయాయి. కస్టమర్లు ఇప్పుడు గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) రేటింగ్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ADAS (Advanced Driver Assistance System) టెక్నాలజీ ఉన్న వాహనాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రమాదాలను ముందుగానే గుర్తించి కారును అలర్ట్ చేసే ఈ అద్భుతమైన ఫీచర్ ఉన్న కొన్ని అఫోర్డబుల్ కార్ల వివరాలను చూద్దాం.. ఈ లిస్ట్‌లోని కార్ల ఆన్-రోడ్ ధర రూ. 16 లక్షల కంటే తక్కువగానే ఉండటం విశేషం.
Advertisement

సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ముందుగా ఈ లెక్కలు వేసి చూడండి!

Second-Hand Car Costs: How to Estimate Expenses Before Buying. సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర దాగి ఉన్న ఖర్చులను ఎలా లెక్కించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

జస్ట్ రూ.6.99లక్షలకే దేశంలోనే అత్యంత చౌకైన టర్బోచార్జ్డ్ SUV

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న సబ్‌-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్ (Renault) కంపెనీ తమ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త అడుగులు వేసింది. తమ మోస్ట్ పాపులర్ కారు రెనాల్ట్ కైగర్ లైనప్‌ను అప్‌డేట్ చేస్తూ సరికొత్త వేరియంట్లను జూన్ 24న అధికారికంగా లాంచ్ చేసింది.

ఆటో లోన్ డిఫాల్టర్ల కోసం ఆర్‌బీఐ రూల్స్!

సొంత కారు కొనుక్కోవాలన్న కోరికతో చాలా మంది కొంత డౌన్‌పేమెంట్ కట్టి మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్ తీసుకుంటారు. అంతా సజావుగా సాగినంత కాలం నెలకు కరెక్ట్‌గా ఈఎంఐలు చెల్లిస్తారు. కానీ ఏదైనా వ్యక్తిగత లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితుల వల్ల ఒకటి లేదా రెండు ఈఎంఐలు కట్టడం ఆలస్యమైతే చాలు.. అప్పు ఇచ్చిన సంస్థల నుంచి కంటిన్యూగా కాల్స్ రావడం, రికవరీ ఏజెంట్లు ఇంటికి రావడం మొదలవుతుంది. ఈ సమయంలో కస్టమర్లకు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలగడమే కాకుండా, ఎక్కడ తమ కారు లేదా బైక్‌ను సీజ్ చేసి పట్టుకుపోతారో అనే భయం వెంటాడుతుంది. అయితే ఇలాంటి సమయంలో మీ హక్కులను తెలుసుకోవడం చాలా అవసరం.

కియా, హ్యుందాయ్ కంపెనీలకు పోటీ ఇవ్వనున్న కొత్త స్కోడా SUV

ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఒక భారీ అడుగు వేసింది. భారత్‌లో ప్రస్తుతం ఐసీఈ (ICE) పెట్రోల్, డీజిల్ కార్లపై ఫోకస్ చేస్తున్న ఈ కంపెనీ, గ్లోబల్ మార్కెట్ల కోసం తమ మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్కోడా పీక్ (Skoda Peaq)ను అధికారికంగా ఆవిష్కరించింది. స్కోడా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత టాప్ ఎండ్ మోడల్‌గా నిలవనుంది. ఇది మార్కెట్లోకి వస్తే.. ప్రస్తుతం లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా EV9, హ్యుందాయ్ ఐయోనిక్ 9, వోల్వో EX90 వంటి ఫుల్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సరికొత్త స్కోడా పీక్ ఎలక్ట్రిక్ కారును కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా 60, 90, 90x అనే మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని బేస్ వేరియంట్ పీక్ 60లో 63kWh బ్యాటరీని ఇచ్చారు, ఇది 459 కిమీల రేంజ్‌ను, 204hp పవర్‌ను జనరేట్ చేస్తుంది.
Advertisement

ఎక్కువ కాలం వాహనం ఉపయోగించకపోతే ఈ సమస్యలు తప్పవు!

Car Maintenance Tips. ఎక్కువ కాలం వాహనం వాడకపోతే బ్యాటరీ డ్రైన్ అవ్వడం, టైర్లు పాడవ్వడం వంటి సమస్యలు వస్తాయి. మీ కారును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.

హీరో డెస్టినీ 125 దూకుడు.. 26 వేల యూనిట్లు అమ్ముడై 76% వృద్ధి!

భారతీయ స్కూటర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్‌కు బలమైన స్థానం సంపాదించడం అంత సులభం కాలేదు. ఒకప్పుడు హీరో ప్లెజర్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత కంపెనీ తీసుకొచ్చిన అనేక స్కూటర్ మోడళ్లు మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య హీరో తన ఉనికిని చాటుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త తరం హీరో డెస్టినీ 125 (Hero Destini 125) మార్కెట్లోకి వచ్చిన తర్వాత కంపెనీ స్కూటర్ విభాగంలో తిరిగి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కార్ల మార్కెట్లో హల్‌చల్ చేయబోతున్న రెండు సరికొత్త మోడళ్లు

భారతీయ ఆటోమొబైల్ రంగానికి రాబోయే రెండు వారాలు ఎంతో ఎక్సైటింగ్‌గా ఉండబోతున్నాయి. మార్కెట్లో అత్యంత ఆదరణ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెండు పవర్‌ఫుల్ కార్లు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), నిస్సాన్ (Nissan) బ్రాండ్లు ఈ కొత్త ఎస్‌యూవీలను తీసుకువస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ వర్గాల్లో వీటిపై భారీ చర్చ జరుగుతోంది. కస్టమర్ల లాంగ్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ పవర్‌ఫుల్ ఇంజన్, అధునాతన టెక్నాలజీ, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లతో ఈ కార్లు అలరించనున్నాయి.

హైదరాబాద్‌లో మారుతి ఫ్రాంక్స్ ఆన్-రోడ్ ధర ఎంత?

భారత మార్కెట్లో సబ్-కాంపాక్ట్ క్రాసోవర్ SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. 2023 ఏప్రిల్‌లో విడుదలైన ఈ SUV, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది వినియోగదారుల మనసు గెలుచుకుంది. స్టైలిష్ SUV తరహా డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్, అందుబాటు ధరలు మరియు మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఫ్రాంక్స్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అందుకే ప్రస్తుతం ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. ధరల విషయానికి వస్తే, ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.6.85 లక్షల నుంచి రూ.11.98 లక్షల వరకు ఉన్నాయి.
Advertisement

కారు అద్దాలపై బంగాళాదుంప రుద్దితే నీటి చుక్కలు మాయం

వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్లు, ఇతర వాహనాలు నడిపేవారు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు.. వర్షం పడుతున్నప్పుడు కార్ల సైడ్ మిర్రర్లు, విండ్‌షీల్డ్‌లపై నీటి చుక్కలు దట్టంగా పేరుకుపోతాయి.. దీనివల్ల వెనుక నుంచి ఏ వాహనాలు వస్తున్నాయో డ్రైవర్లకు అస్సలు కనిపించదు.. అంతా గందరగోళంగా, ధుంధులాగా మారుతుంది.. అయితే, ఈ సమస్యకు మన వంటింట్లో దొరికే ఒక సాధారణ కూరగాయతో శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చని సోషల్ మీడియాలో ఒక క్రేజీ ట్రిక్ వైరల్ అవుతోంది.