డెలివరీ బాయ్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు.. అందరి ఛాయిస్‌ ఇదే

టూ-వీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor) దూకుడు మామూలుగా లేదు. ముఖ్యంగా 125సీసీ సెగ్మెంట్లో టీవీఎస్ రైడర్ 125(TVS Raider 125) ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. లాంచ్ అయిన కేవలం ఐదేళ్ల లోపే ఏకంగా 19 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి ఈ బైక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లు, అదిరిపోయే మైలేజీ కలగలిసిన ఈ బైక్.. ఇప్పుడు యువతకు మొదటి ఛాయిస్‌గా మారింది.

పెట్రోల్ కొట్టించే బాధలేదు.. క్లచ్ నొక్కే పనేలేదు

భారత కార్ల మార్కెట్లో ప్రస్తుతం సీఎన్జీ కార్ల(CNG Cars)కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగస్థులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో టాటా మోటార్స్(tata motors) తన ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ(altroz icng) కారును ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చి మార్కెట్లో కొత్త చర్చకు తెరలేపింది. టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ(altroz icng) ఏఎంటీ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.8.70 లక్షలుగా నిర్ణయించారు. ముఖ్యంగా రోజూ నగరాల్లో ట్రాఫిక్‌లో ఇబ్బంది పడే ఉద్యోగస్థులను టార్గెట్ చేస్తూ ఈ కారును తీసుకొచ్చినట్టు ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

రోడ్డు మీద రెండు సింహాలు ఎదురెదురైతే ఇలానే ఉంటుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం 7-సీటర్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెద్ద ఫ్యామిలీలకు సరిపోయే స్పేస్, లగ్జరీ ఫీచర్లు, బలమైన రోడ్ ప్రెజెన్స్ కలిపి ఈ సెగ్మెంట్ ఇప్పుడు అత్యంత పోటీభరితంగా మారింది. ఇలాంటి సమయంలో స్కోడా తన కొత్త తరం 2026 కోడియాక్‌ (Kodiaq)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈసారి కంపెనీ కేవలం డిజైన్ మార్పులతో మాత్రమే కాకుండా, ధర వ్యూహంలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇది భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్-సైజ్ SUVల్లో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్‌‌(Toyota Fortuner)కు గట్టి పోటీ ఇవ్వబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల ధర, ఇంజిన్, ఇతర వివరాల గురించి ఈ కింది కథణంలో ఇవ్వడం జరిగింది.

విక్టోరిస్ క్రేజ్ మామూలుగా లేదు! నెలలోనే భారీ డిమాండ్

మధ్యతరహా SUV సెగ్మెంట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ పోటీ వాతావరణంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రవేశపెట్టిన కొత్త SUV విక్టోరిస్ (Victoris) ఇప్పుడు మార్కెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్, కియా, టాటా వంటి కంపెనీల మధ్య గట్టి పోటీ ఉంటుండగా, మారుతి తన బలమైన డీలర్ నెట్‌వర్క్, బ్రాండ్ నమ్మకంతో వేగంగా అడుగుపెట్టింది. విక్టోరిస్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వినియోగదారుల నుండి మంచి స్పందన పొందింది. ప్రత్యేకంగా ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతున్న ఈ SUV, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

రూ.10లక్షల బడ్జెట్లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీలు

భారతదేశంలో ఇప్పుడు కారు కొనాలంటే కేవలం ఇంజిన్, మైలేజ్ చూస్తే సరిపోవడం లేదు. కారు పైన ఆకాశం కనిపించేలా పెద్ద సన్‌రూఫ్ ఉండాల్సిందేనని కుర్రకారు పట్టుబడుతున్నారు. దీన్ని గమనించిన కార్ల కంపెనీలు కూడా గతంలో ఖరీదైన కార్లకే పరిమితమైన పనోరమిక్ సన్‌రూఫ్‌ను ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్ ధరలకే అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్ తన కొత్త వేరియంట్‌తో ఈ రేసులో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన దేశంలో లభిస్తున్న టాప్ 5 చౌకైన పనోరమిక్ సన్‌రూఫ్ ఎస్‌యూవీల వివరాలు మీకోసం.

ఫార్చ్యూనర్ కంటే తక్కువ ధరకే ల్యాండ్ క్రూయిజర్ FJ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన ప్రత్యేకమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. భారీ అమ్మకాల పరంగా చూస్తే మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత మహీంద్రా, టాటా మోటార్స్, హ్యూందాయ్ మోటార్ ఇండియా వంటి సంస్థలు మార్కెట్‌ను ఆధిపత్యం చేస్తూ ఉన్నాయి. ఈ పోటీ మధ్యలో టయోటా నెలకు సుమారు 25,000 నుంచి 40,000 యూనిట్ల వరకు అమ్మకాలు నమోదు చేస్తూ, ఐదవ స్థానం కోసం కియా ఇండియాతో గట్టి పోటీ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి టయోటా ఒక భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. భారత మార్కెట్ కోసం ఒక కొత్త SUVని తీసుకురాబోతున్నట్లు కంపెనీ అధికారికంగానే సంకేతాలు ఇచ్చింది.

పదే పదే ఇక క్లచ్ నొక్కాల్సిన అవసరం లేదు

భారతీయ బైక్ లవర్స్ కోసం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఒక అద్భుతమైన వార్తను తీసుకొచ్చింది. తన పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోడల్ NX500ను సరికొత్త ఈ-క్లచ్(E-Clutch) టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసింది. క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకునే వెసులుబాటు కల్పించే ఈ టెక్నాలజీ బైక్ రైడింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్ వింగ్ షోరూమ్‌లలో ఈ బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

స్కార్పియోకి చిన్న తమ్ముడు వచ్చేస్తున్నాడు!

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చుతూ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) 2025లో ఒకేసారి నాలుగు భవిష్యత్తు కాన్సెప్ట్ కార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అవే మహీంద్రా విజన్ ఎస్, మహీంద్రా విజన్ ఎక్స్, మహీంద్రా విజన్ టీ, మహీంద్రా విజన్ ఎస్‌ఎక్స్‌టీ. ఈ కార్లను చూసిన వెంటనే "మహీంద్రా ఇప్పుడు భవిష్యత్తు కార్ల యుగంలోకి అడుగుపెట్టింది" అనే అభిప్రాయం ఆటోమొబైల్ ప్రపంచంలో వ్యక్తమైంది. ఈ కాన్సెప్ట్ మోడళ్ల వెనుక ఉన్న అసలైన హైలైట్ మాత్రం కంపెనీ రూపొందించిన సరికొత్త NU_IQ Platform ప్లాట్‌ఫామ్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్‌పై 3.9 మీటర్ల నుంచి 4.3 మీటర్ల పొడవు కలిగిన విభిన్న రకాల వాహనాలను తయారు చేయవచ్చు.
Advertisement

మహీంద్రా నుంచి మార్కెట్‎ను షేక్ చేసే కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల హవా వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న సందేహాలు, ఎక్కువ మైలేజ్ కావాలనే ఆలోచనతో చాలా మంది ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో మహీంద్రా(Mahindra) కూడా తన తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ((Hybrid suv))ని తీసుకురావడానికి భారీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

మోదీ చెప్పిన మాట వినాలంటే ఈ కారు కొనాల్సిందే! పెట్రోల్ ఖర్చుకు చెక్ పెట్టే టాటా EV

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం దెబ్బతినడం, ముడి చమురు ఉత్పత్తి కేంద్రాలు ప్రభావితమవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారతదేశంలో కూడా చమురు కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు.

మారుతి సుజుకి నుంచి త్వరలో సరికొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల(electric cars) హవా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(maruti suzuki) ఇప్పుడు ఫ్యామిలీల కోసం ప్రత్యేకంగా భారీ 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. సోఫా లాంటి సీట్లు, 500కి పైగా రేంజ్, లగ్జరీ ఫీచర్లతో ఈ కారు మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తోంది.

బైక్ ధరకే ఎలక్ట్రిక్ కారు.. చూడటానికే బుజ్జిగా ఉంటుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవం కొనసాగుతోంది. సామాన్యుడికి కూడా ఈవీ (EV) అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఎంజీ మోటార్స్ (MG Motors) తన కామెట్ ఈవీ(Comet Ev)ని అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు ఒకవేళ కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఈ మే నెల మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఎంజీ కామెట్ ఈవీపై ఇప్పుడు ఏకంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
Advertisement

ఈ కారే కావాలి అంటున్న కస్టమర్లు.. సెల్టోస్‌కు ఊహించని డిమాండ్!

భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు, కియా మోటార్స్ (Kia Motors) తీసుకున్న మొదటి పెద్ద నిర్ణయం సెల్టోస్‌ (Seltos)ను విడుదల చేయడమే. అప్పట్లో భారతీయ వినియోగదారుల అభిరుచులను బాగా అధ్యయనం చేసిన కియా, "ఈ SUV తప్పకుండా హిట్ అవుతుంది" అనే నమ్మకంతో సెల్టోస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నిజంగానే కంపెనీ అంచనాలను మించి ఈ SUV భారీ విజయాన్ని అందుకుంది. స్టైలిష్ డిజైన్‌, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, అలాగే యువతను ఆకట్టుకునే లుక్‌తో సెల్టోస్ చాలా తక్కువ సమయంలోనే భారత మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. మొదటి రోజుల్లో సెల్టోస్ కోసం షోరూమ్‌ల వద్ద భారీ క్యూలు కనిపించేవి.

35kmpl ఇచ్చే హైబ్రిడ్ ఫ్రాంక్స్‌ను తీసుకొస్తున్న మారుతి!

భారత కార్ మార్కెట్లో మధ్యతరగతి కుటుంబాల నుంచి యువత వరకు భారీగా ఆదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. హ్యాచ్‌బ్యాక్ స్టైల్‌కు SUV టచ్‌ను జోడించిన ఈ క్రాస్ఓవర్ కార్ 2023లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మంచి స్పందనను అందుకుంది. 4 మీటర్ల లోపు ఉండే ఈ క్రాస్ఓవర్ డిజైన్ పరంగా యువతను బాగా ఆకట్టుకుంది. బాలెనో ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, SUV తరహా స్టాన్స్‌, ముందుభాగంలో ఇచ్చిన బోల్డ్ డిజైన్‌, ప్రీమియం క్యాబిన్ ఫీలింగ్‌ వంటి అంశాలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. విడుదలైన కొద్ది కాలంలోనే ఫ్రాంక్స్ అమ్మకాలు భారీ స్థాయిలో పెరగడం కూడా దీనికే నిదర్శనం.

స్కోడా మాస్టర్ స్ట్రోక్.. కొత్త కోడియాక్‌లో ఇప్పుడు ADAS సహా ప్రీమియం ఫీచర్లు!

లగ్జరీ SUV మార్కెట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, స్కోడా ఆటో (Skoda Auto) ఇండియా ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చే పనిలో పడింది. ఇప్పటికే భారత మార్కెట్లో ప్రీమియం కార్లకు ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్కోడా, ఇప్పుడు 2026 కోసం తన ప్రముఖ లగ్జరీ SUV అయిన కోడియాక్‌ను భారీ అప్‌డేట్‌లతో కొత్తగా పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో కోడియాక్ మరింత ప్రీమియంగా, మరింత స్టైలిష్‌గా, అలాగే విభిన్న రకాల వినియోగదారుల అభిరుచులకు సరిపోయేలా రూపొందించబడింది. ముఖ్యంగా లగ్జరీ SUV కొనాలనుకునే వారికి ఇప్పుడు మరిన్ని ఎంపికలు అందించేందుకు కంపెనీ మూడు ప్రత్యేక వేరియంట్లను తీసుకొచ్చింది.
Advertisement

5-స్టార్ సేఫ్టీ, 33 కి.మీ మైలేజ్..మిడిల్ క్లాస్ మెచ్చిన కారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సెడాన్ కార్ల(sedan cars) హవా తగ్గుతోందని అందరూ అనుకుంటున్న తరుణంలో, మారుతి సుజుకి డిజైర్(Maruti suzuki dzire 2026) ఆ అంచనాలను తారుమారు చేస్తోంది. కేవలం సెడాన్ సెగ్మెంట్‌లోనే కాకుండా, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా డిజైర్(dzire) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఏప్రిల్ 2026 సేల్స్ రిపోర్టును గమనిస్తే, ఇతర కంపెనీల కార్లు డిజైర్ దరిదాపుల్లో కూడా లేవని స్పష్టమవుతోంది. తక్కువ ధర, అత్యుత్తమ మైలేజ్, ఊహించని భద్రత వంటి అంశాలే ఈ కారును నంబర్-1 స్థానంలో నిలబెట్టాయి. గత నెలలో జరిగిన కార్ల అమ్మకాలను పరిశీలిస్తే మారుతి డిజైర్(Maruti dzire) అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్ 2025లో 16,996 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్ 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 23,580 యూనిట్లకు చేరుకుంది. అంటే దాదాపు 38.70 శాతం వృద్ధిని సాధించింది.

ప్రపంచానికి షాక్ ఇచ్చిన భారతీయ బుల్లెట్!

ఒకప్పుడు కేవలం భారత యువత గుండెల్లో మాత్రమే రాజ్యమేలిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగానికే తన శక్తిని చూపిస్తోంది. బుల్లెట్ శబ్దంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భారతీయ దిగ్గజం తాజాగా ప్రపంచ స్థాయిలో మరో అద్భుతమైన ఘనతను అందుకుంది. స్పోర్ట్స్ కార్ల ప్రపంచంలో ప్రతిష్టాత్మక పేరుగా నిలిచిన ఫేరారీ (Ferrari)ని కూడా వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గా అవతరించడం ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ బ్రాండ్‌లను వారి మార్కెట్ ప్రభావం, వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ విలువ, పనితీరు వంటి కీలక అంశాల ఆధారంగా అంచనా వేసే ప్రముఖ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ (Brand Finance) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

పెద్ద ఫ్యామిలీలు, లాంగ్ డ్రైవ్స్‌కు బెస్ట్ కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నా.. డీజిల్ ఇంజిన్‌ల క్రేజ్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా SUVలను ఇష్టపడే వారు ఇప్పటికీ డీజిల్ వాహనాల(diesel suvs)కే పెద్దపీట వేస్తున్నారు. కారణం ఒక్కటే.. పవర్, టార్క్, హైవే పనితీరు. అందుకే మహీంద్రా, హ్యుందాయ్, టయోటా(Toyota), కియా వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు తమ పాపులర్ SUVలను కొత్త డీజిల్ అవతారంలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

షోరూమ్‌కు వచ్చిన వారు ఈ కారే కావాలంటున్నారు

భారత మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీలకు వచ్చిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిన్న కుటుంబాల కోసం హ్యాచ్‌బ్యాక్ కార్లే ప్రధాన ఎంపికగా ఉండేవి. కానీ ఇప్పుడు అదే వినియోగదారులు కొంచెం ఎత్తుగా కనిపించే, రోడ్డుపై బలమైన ప్రెజెన్స్ ఇచ్చే, కుటుంబంతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా సరిపోయే మైక్రో ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే టాటా పంచ్ భారీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) తన ఎక్స్‌టర్‌ (Exter)తో మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. చూడటానికి చాలా అగ్రెసివ్‌గా లేకపోయినా, ఎక్స్‌టర్‌లో ఉన్న ప్రాక్టికాలిటీ మాత్రం సామాన్య కుటుంబాలకు బాగా నచ్చింది.
Advertisement

పల్లెల్లో.. పట్టణాల్లోనూ దీనిదే హవా

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంపాక్ట్ ఎస్‌యూవీ( Compact SUVs)ల మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు సెడాన్(sedan), హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు మొగ్గు చూపిన భారతీయ వినియోగదారులు, ఇప్పుడు ఎస్‌యూవీల వైపు వేగంగా మళ్లుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాటా మోటార్స్(Tata Motors) తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, మారుతి సుజుకి(Maruti suzuki), హ్యుందాయ్ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

రెండు ఫ్యామిలీలకు సరిపోయే పర్ఫెక్ట్ కార్లు రాబోతున్నాయ్

ఒకే కారులో రెండు కుటుంబాలు.. లాంగ్ ట్రిప్స్‌కైనా టెన్షన్ లేదు.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి భారీ సైజు 7 సీటర్ SUVల వరద రాబోతోంది.పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే అయితే కొద్ది రోజులు ఆగడం మంచిది. ఫార్చ్యూనర్ నుంచి స్కార్పియో వరకు కొత్త అవతారాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కార్లు పెద్ద కుటుంబాల కలలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.

విజయ్ కాన్వాయ్‌లో కనిపించిన కారు వైరల్!

CM Vijay Convoy : సినీ స్టార్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన విజయ్(CM Vijay) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఆయన ప్రమాణ స్వీకార వేడుక కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది మాత్రం ఆయన కాన్వాయ్‌లో కనిపించిన ఓ పాత కారు. కోట్ల విలువైన భద్రతా వాహనాల మధ్య తనకు ఇష్టమైన పాత స్విఫ్ట్(Maruti Swift) కారును కూడా కొనసాగించడంతో విజయ్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

డీజిల్ కార్లకు కౌంట్‌డౌన్ మొదలైందా?

Diesel Cars : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో డీజిల్ కార్ల(Diesel Cars) హవా పూర్తిగా తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి ఈ సెగ్మెంట్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్కార్పియో, థార్(Thar), ఫార్చ్యూనర్ వంటి SUVలను ఇష్టపడే వారి మధ్య ఇప్పుడు ఒకే చర్చ నడుస్తోంది.. BS7 నిబంధనలు వస్తే డీజిల్ కార్ల(Diesel Cars) భవిష్యత్తు ఏమవుతుంది? అనే ప్రశ్న. ఒకవైపు ఎలక్ట్రిక్ కార్లు(Electric Cars) వేగంగా పెరుగుతున్నా.. మరోవైపు లాంగ్ డ్రైవ్స్, హైవే ప్రయాణాలు చేసే వారు ఇప్పటికీ డీజిల్‌కే పెద్దపీట వేస్తున్నారు.
Advertisement

చుక్క పెట్రోల్ కూడా కొట్టించనక్కర్లేదు.. ఇదేం వింత బైక్ సామీ?

Honda WN7 : దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా(Honda WN7) సరికొత్త విద్యుత్ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అద్భుతమైన రూపకల్పన, భారీ శక్తి, భవిష్యత్ తరహా టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ ఇప్పుడు వాహన ప్రియుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.