వాహన బీమా క్లెయిమ్ సమయంలో చేసే సాధారణ తప్పులు

Vehicle Insurance Claim Mistakes. వాహన బీమా క్లెయిమ్ చేసేటప్పుడు చిన్న తప్పులు చేసినా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ డబ్బులు సకాలంలో అందాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఎగబడుతున్న జనాలు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీ(Electric Vehicle) మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ని జూన్ 30న మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ కారు లాంచ్‌కు ముందే మార్కెట్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కొత్త క్రెటా లుక్స్ చూస్తే మిగతా కంపెనీలు దుకాణం సర్దేసుకోవాల్సిందే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్‌-సైజ్ ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. ఎన్నో కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నప్పటికీ, హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తన సెగ్మెంట్‌లో రారాజుగా దూసుకుపోతున్న క్రెటా.. హ్యుందాయ్ కంపెనీకి కూడా అత్యధిక అమ్మకాలను తెచ్చిపెట్టే నంబర్ వన్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే దూకుడును కొనసాగించేందుకు కంపెనీ తన చరిత్రలోనే అతిపెద్ద అడుగు వేయబోతోంది. పూర్తిగా సరికొత్త థర్డ్-జనరేషన్ (3rd Generation) క్రెటాను 2027 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి హ్యుందాయ్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

సిటీలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఫ్యూయల్ ఖర్చు తగ్గించే సులభ చిట్కాలు ఇవే!

Fuel Saving Tips for City Driving: Easy Ways to Improve Mileage. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ సిటీ ట్రాఫిక్‌లో కారు మైలేజీని పెంచుకోవడానికి ఈ సింపుల్ డ్రైవింగ్ టిప్స్ పాటించండి.
Advertisement

భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి పెను సంచలనం

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చే జూలై నెలలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్ మోడల్స్ రోడ్లపై పలుమార్లు కనిపించాయి. అయితే, కొత్త కారు వస్తున్న తరుణంలో షోరూమ్‌లలో ఉన్న ప్రస్తుత మోడల్ స్టాక్‌ను త్వరగా ఖాళీ చేసేందుకు కంపెనీ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను ఎరగా వేస్తోంది.

డిఫెండర్ కారు లాంటి లుక్.. మిడిల్ క్లాస్ బడ్జెట్‎కి నచ్చే రేటు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విభాగంలో రారాజుగా వెలుగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, త్వరలోనే దేశీయ మార్కెట్లోకి మరో రెండు సరికొత్త ఎస్‌యూవీలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌కమింగ్ కార్ల జాబితాలో సరికొత్త న్యూ జనరేషన్ XUV 3XOతో పాటు, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మినీ స్కార్పియో (Mini Scorpio) ఉండటం విశేషం. సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ కార్ల ప్రారంభ ధర రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని సమాచారం.

ప్రపంచంలోనే ఎత్తైన ఇసుక కొండపైకి టాటా సియెర్రా EV

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సియెర్రా EV (Tata Sierra EV)ని జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, విడుదలకు కేవలం మూడు రోజుల ముందే ఈ కారుకు సంబంధించిన ఒక అదిరిపోయే అఫీషియల్ ప్రోమో వీడియోను కంపెనీ రిలీజ్ చేసింది.

భారీ ప్రమాదం తప్పింది.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం

కారు ఎంత ఖరీదైనదైనా, అందులోని చిన్న సాంకేతిక లోపం కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. జగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ తన అంతర్గత దర్యాప్తులో ఈ లోపాన్ని గుర్తించి, ముందుగానే స్పందించి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఖరీదైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తన వినియోగదారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ఉత్తర అమెరికా మార్కెట్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2026 మధ్య కాలంలో తయారైన సుమారు 2,50,857 ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీలను కంపెనీ రీకాల్ (వెనక్కి పిలిపించడం) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలోని ఎయిర్‌బ్యాగ్ కనెక్టర్లలో తలెత్తిన ఒక సాంకేతిక లోపం వల్ల, ప్రమాదం జరిగిన సమయాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు సరిగ్గా తెరుచుకోకపోవచ్చని కంపెనీ గుర్తించింది.
Advertisement

వర్షాకాలంలో బ్యాటరీ త్వరగా దెబ్బతినకుండా ఉండాలంటే ఇవి చేయండి!

Battery maintenance tips for monsoon. వర్షాకాలంలో మీ వాహనం బ్యాటరీ మొరాయించకుండా ఉండాలంటే టెర్మినల్స్ శుభ్రం చేయడం, క్రమం తప్పకుండా ఇంజిన్ స్టార్ట్ చేయడం వంటి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

ఐదుగురికి మించి కుటుంబమా?.. ఈ 7-సీటర్ కార్లు మీ కోసమే!

మీరు తక్కువ బడ్జెట్‌లో విశాలమైన, కుటుంబ అవసరాలకు సరిపోయే 7-సీటర్ కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? రోజువారీ వినియోగంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువైన కారు కోసం చూస్తున్నట్లయితే, మార్కెట్లో మీ కోసం అనేక మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 7-సీటర్ కారు అంటే భారీ బడ్జెట్ అవసరమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుబాటు ధరలోనే మంచి ఫీచర్లు, మెరుగైన మైలేజ్, తగినంత స్థలం, భద్రతా సదుపాయాలతో కూడిన 7-సీటర్ కార్లు భారత మార్కెట్లో లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.10 లక్షల లోపు అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ధర పరిధిలో అందుబాటులో ఉన్న, మంచి డిమాండ్‌తో పాటు వినియోగదారుల ఆదరణ పొందుతున్న కార్లను చూద్దాం.

రూ.4.50 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. పేదోడి కల నిజం కానుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటం, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వంటి కారణాలతో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని కోరుకునే వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ, విదేశీ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు కొత్త ఈవీ స్టార్టప్‌లు కూడా భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్త మోడళ్లను వరుసగా పరిచయం చేస్తున్నాయి.

తరచూ క్లచ్ మార్చాల్సి రావడానికి కారణాలేమిటి?

Car Maintenance Tips: తరచూ క్లచ్ ప్లేట్లు మార్చాల్సి వస్తుందా? మీ డ్రైవింగ్ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. క్లచ్ లైఫ్ పెంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
Advertisement

జూలైలో మార్కెట్‌ను షేక్ చేయనున్న మారుతి బ్రెజ్జా

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లను కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (maruti suzuki) కూడా తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV బ్రెజ్జా (Brezza)ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఈ కొత్త బ్రెజ్జా జూలై మధ్యలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విన్‌ఫాస్ట్ కొత్త స్కూటర్‌పై భారీ అంచనాలు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు ఈ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశీయ, విదేశీ బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో భారత వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) కూడా భారత మార్కెట్లో బలమైన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే ప్రణాళికలను ప్రకటించిన ఈ సంస్థ, ఇప్పుడు అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విన్‌ఫాస్ట్ తాజాగా తన కొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌కు సంబంధించిన పేటెంట్‌ను దాఖలు చేసింది.

కాంపాక్ట్ SUVల్లో కియా సోనెట్ దుమ్మురేపుతోంది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ మధ్య, కియా సోనెట్ (Kia Sonet) తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, అలాగే నగర వినియోగంతో పాటు హైవే డ్రైవింగ్‌కు అనుకూలమైన పనితీరు వంటి అంశాలతో ఈ SUV వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, కియా సోనెట్ తన అమ్మకాల జోరును నిలబెట్టుకుంటూ మార్కెట్లో బలమైన స్థానాన్ని కాపాడుకుంటోంది. ఇటీవల విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు కూడా కియా సోనెట్‌కు మార్కెట్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తున్నాయి.

బడ్జెట్‌లో ఏకంగా ఆరు మోడళ్లు.. 4 లక్షల మైలురాయి ఘనత!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణహిత రవాణాపై ప్రజల్లో అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు కంపెనీలు తమ మార్కెట్ వాటాను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ ఆంపియర్ (Ampere) మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ ఫలితంగా, భారత్‌లో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు నమోదు చేసినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Advertisement

వాహనం అమ్మే ముందు ఇలా చేస్తే మంచి ధర పొందొచ్చు!

Car Resale Value Tips. మీ పాత కారును మంచి ధరకు అమ్మాలనుకుంటున్నారా? ఈ సింపుల్ మెయింటెనెన్స్ మరియు డాక్యుమెంటేషన్ చిట్కాలు పాటిస్తే మార్కెట్ ధర కంటే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది.

ఈ స్కూటర్ టెక్నాలజీకి పడిపోతున్న జనాలు

బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ టూవీలర్ మార్కెట్లో రికార్డు స్థాయిలో మొత్తం 7 లక్షల రిటైల్ విక్రయాల మైలురాయిని విజయవంతంగా దాటేసింది. ఈ అద్భుతమైన ఘనతతో భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోల తర్వాత అత్యధికంగా ఈ-స్కూటర్లను విక్రయించిన నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్‌గా ఏథర్ నిలిచింది. ప్రభుత్వ అధికారిక వాహన్ (Vahan) డేటా ప్రకారం, ఏథర్ కంపెనీ 2018లో తన విక్రయాలను ప్రారంభించినప్పటి నుంచి జూన్ 25, 2026 నాటికి కస్టమర్లకు మొత్తం 7,04,447 ఈ-స్కూటర్లను డెలివరీ చేసింది.

ఏకంగా లక్ష మంది ఉద్యోగులను పీకేయనున్న ఫోక్స్‌వ్యాగన్

ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) గ్రూప్ నుంచి ఆటోమొబైల్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. కంపెనీ తన అంతర్గత ఖర్చులను భారీగా తగ్గించుకోవడానికి, వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ (పునర్వ్యవస్థీకరణ) చేయడానికి సుమారు 1,00,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రూ.84 వేలకే హీరో కొత్త ప్యాషన్+ డిస్క్.. లీటరుకు 71KM మైలేజ్

భారతదేశంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద బైకులు, స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన ప్రజాదరణ పొందిన ప్యాషన్+ మోడల్‌ను మరింత ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ (Hero Passion+ Disc) వేరియంట్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ ప్రయాణాలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో స్టైలిష్ డిజైన్, మెరుగైన భద్రతా ఫీచర్లు, డిజిటల్ టెక్నాలజీ, అధిక మైలేజ్ వంటి అంశాలను సమతుల్యంగా అందించింది. దీంతో నగరాల్లో నిత్యం బైక్‌ను ఉపయోగించే వారికి ఇది మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.
Advertisement

రూ.82,500కే సరికొత్త లుక్‌తో ముస్తాబై వచ్చిన NTorq 125

పండుగల సీజన్ ప్రారంభానికి ముందే వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో టీవీఎస్ మోటార్ (Tvs Motor) కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 (NTorq 125)ను 2026కు గాను కొత్త రంగులు, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో అప్‌డేట్ చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో స్కూటర్ పనితీరు లేదా మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకపోయినా, కొత్త కలర్ స్కీమ్‌లు, స్టైలిష్ గ్రాఫిక్స్‌తో మరింత ఫ్రెష్ లుక్‌ను అందించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని ఈ విజువల్ అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కొత్త 2026 TVS NTorq 125 డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.82,500గా నిర్ణయించగా, మరింత స్పోర్టీ లుక్‌తో వచ్చే రేస్ ఎడిషన్ ధర రూ.87,950గా ఉంది.

రోజువారీ ప్రయాణాలకు డీజిల్ లేదా పెట్రోల్ ఏది మంచిది?

Diesel vs Petrol car comparison, fuel efficiency tips. రోజువారీ ప్రయాణాలకు పెట్రోల్ లేదా డీజిల్ కారులో ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదో ఈ కథనంలో పూర్తి వివరంగా తెలుసుకోండి.

ఈ కారు కొనాలంటే బడ్జెట్ కోటి పైనే ఉండాలి

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా, దేశీయ మార్కెట్లోకి సరికొత్త పవర్‌ఫుల్ స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (SAC) మోడల్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్(BMW X6 M60i xDrive)ను అధికారికంగా విడుదల చేసింది. లగ్జరీ ప్రయాణాన్ని ఇష్టపడే వారితో పాటు, అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను కోరుకునే కార్ లవర్స్ కోసం ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ సరికొత్త మోడల్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (CBU) రూపంలో, అంటే విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది.

హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ తిరిగి రానుంది!

భారతదేశంలో అత్యధిక ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న హీరో మోటోకార్ప్ (Hero Motocorp), మరోసారి తన అభిమానులను ఉత్సాహపరిచే వార్తతో ముందుకొచ్చింది. ఒకప్పుడు యువతతో పాటు సాధారణ కమ్యూటర్ రైడర్లను కూడా విశేషంగా ఆకట్టుకున్న రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ (Hero Splendor Pro-Classic) మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు బలమైన సంకేతంగా కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన కొత్త డిజైన్ పేటెంట్‌ను అధికారికంగా దాఖలు చేసింది. దీంతో ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఐకానిక్ బైక్ కొత్త రూపంలో పునరాగమనం చేయబోతుందనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Advertisement

పెట్రోల్, డీజిల్ బాధలకు గుడ్‌బై.. మార్కెట్లోకి రాబోతున్న టాప్ 5 కార్లు ఇవే

భారతదేశంలో ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది సామాన్య వాహనదారుడి ఆర్థిక బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఖర్చుల నుంచి ఎప్పటికీ తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లు (EVs) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారాయి. అందుకు తగ్గట్టుగానే రాబోయే కొన్ని నెలల్లో భారత మార్కెట్లోకి 5 సరికొత్త, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు (SUVs) ప్రవేశించబోతున్నాయి. ఇవి బడ్జెట్ ధరలో లభించడమే కాకుండా, లాంగ్ రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.