రికార్డు సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా పంచ్

టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణంలో నెక్సాన్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ పొందిన కారు ఏదైనా ఉందంటే అది పంచ్ (punch) అనే చెప్పాలి. ఈ మాటలకు బలమైన ఆధారం దీని అమ్మకాల గణాంకాలే. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే, టాటా పంచ్ భారత వినియోగదారుల మనసు గెలుచుకుని కంపెనీకి మరో బ్లాక్‌బస్టర్ మోడల్‌గా మారింది. ఆవిష్కరణ జరిగిన నాలుగు సంవత్సరాలు పూర్తికాకముందే టాటా పంచ్ 7 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం నిజంగా విశేషం. అంతేకాదు, భారతదేశంలో 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న కారుగా పంచ్ నిలిచిందని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ కారు మీద ప్రజలకు ఉన్న నమ్మకం, డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

7 సీటర్ సెగ్మెంట్‌లో టైరాన్ సంచలనం

2.0-లీటర్ TSI ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు లెవల్ 2 ADAS కలిగిన వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్‌ను అన్వేషించండి. ఈ ఏడు సీటర్ SUV ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి.

అతి తక్కువ ధరలో 7 సీటర్ ఫ్యామిలీ కార్ కొనాలంటే ఇదే బెస్ట్!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను గమనిస్తే, ముఖ్యంగా 7 సీట్ల MPV కార్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చిన్న కుటుంబాలకు ఐదుగురు సౌకర్యంగా కూర్చోగల హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ.6-7 లక్షల మధ్య ధరలో దొరికినా, రూ.9 లక్షల లోపు 7 సీట్ల MPV ఎంపికలు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ ఖాళీని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) నిలుస్తోంది. ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ప్యాకేజీగా ఎర్టిగా భారత కుటుంబాల మనసు దోచుకుంది. తక్కువ ధరలో 7 మందికి సరిపడా స్థలం, మంచి కంఫర్ట్, రోజువారీ వాడుకకు అనుకూలమైన ఫీచర్లు అందించడం వల్ల ఇది ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది.

3 నెలల్లో 80 వేల బుకింగ్స్..రికార్డుల వేటలో హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. 2025 చివరిలో లాంచ్ అయిన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue 2026) కేవలం మూడు నెలల్లోనే ఏకంగా 80,000 బుకింగ్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ ప్రకటించిన తాజా త్రైమాసిక (Q3 FY26) ఫలితాల ప్రకారం.. ఈ కారుకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఆటోమొబైల్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
Advertisement

5 గంటల్లో 20వేల కోట్లు..31 రోజుల్లో లక్ష కార్లు

భారతీయ రోడ్లపై ఎస్‌యూవీల సామ్రాజ్యాన్ని ఏలుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, 2026 ప్రారంభంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం ఒకే ఒక్క నెలలో అంటే జనవరి 31 రోజుల్లోనే లక్షకు పైగా వాహనాలను విక్రయించి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది.

ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్ కారు ఇదే

టాటా నెక్సాన్ (tata nexon) భారత ఆటో మార్కెట్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఇష్టమైన SUVలలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, బలమైన నిర్మాణం, అధునాతన భద్రతా ఫీచర్లు వంటి అంశాలతో నెక్సాన్ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటోంది. అందుకే ఈ కారుకు మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకసారి నెక్సాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు తమ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఈ SUV క్రేజ్ మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ పెరుగుతున్న ఆదరణను తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. గత నెలగా చెప్పుకునే జనవరి 2026లో టాటా నెక్సాన్ భారీ సంఖ్యలో అమ్ముడవుతూ మరోసారి తన సత్తాను చాటుకుంది.

పెట్రోల్ కార్లు కనిపిస్తే వింతగా చూస్తారేమో

కేంద్ర బడ్జెట్ 2026-27 ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక సరికొత్త ఊపిరిని ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి ఈవీ కార్లను మరింత చౌకగా అందించడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచ ఈవీ హబ్‌గా మార్చేందుకు బలమైన పునాదులు వేశారు. కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాకుండా, ముడి పదార్థాల లభ్యత కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లను ప్రకటించడం విశేషం.

ఇండియాలోనే అందరి ఫేవరెట్ కారు

మారుతి సుజుకి డిజైర్ భారత ఆటో మార్కెట్‌లో ఇప్పుడు ఒక ప్రసిద్ధమైన సెడాన్‌గా స్థిరపడిపోయింది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో ఈ కారుకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు సరిపోయే కంఫర్ట్, మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలిసి, డిజైర్‌ను వినియోగదారుల ఫస్ట్ చాయిస్‌గా మార్చాయి. అందుకే, పోటీ పెరుగుతున్నా కూడా డిజైర్ అమ్మకాల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన జనవరి 2026 అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత నెలలో మారుతి సుజుకి డిజైర్ భారీ సంఖ్యలో అమ్ముడవుతూ మరోసారి తన సత్తాను చాటుకుంది. జనవరి 2026లో మొత్తం 19,629 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడటం విశేషం.
Advertisement

షోరూంలకు కొత్త కారు రాకముందే జనాలు క్యూ కట్టారు

ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన రారాజు, ఎస్యూవీ(SUV) సెగ్మెంట్‌లో ట్రెండ్ సెట్టర్ అయిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster)త్వరలోనే మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా అమ్మకాల్లో వెనుకబడిన రెనాల్ట్ ఇండియా, ఇప్పుడు తన పాత వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది.

కంపెనీకి బంగారు గుడ్డు పెట్టే కారు

భారత ఆటో మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్‌సైజ్ SUVల సందడి అంతా ఇంతా కాదు. కుటుంబ అవసరాలకు సరిపోయే స్పేస్, స్టైలిష్ లుక్, మంచి రోడ్ ప్రెజెన్స్ ఇవన్నీ కలగలిపి ఉండటంతో ప్రజలు ఈ సెగ్మెంట్ కార్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ పోటీతో నిండిన మిడ్‌సైజ్ SUV విభాగంలో ప్రారంభం నుంచే హ్యుందాయ్ క్రెటా తనదైన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు క్రెటా పేరు వినిపించకుండా ఒక్క నెల కూడా గడవలేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా అమ్మకాల గణాంకాలు విడుదలైనప్పుడల్లా, హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ మిడ్‌సైజ్ SUVగా అవతరించడం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. కొత్త మోడళ్లు వచ్చినా, పోటీ బ్రాండ్లు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చినా, క్రెటా తన స్థానాన్ని మాత్రం ఎప్పటికీ వదలడం లేదు.

మహీంద్రా మాస్టర్ ప్లాన్..బడ్జెట్ లోనే లగ్జరీ

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV స్కార్పియో N(Scorpio N)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్ వంటి హేమాహేమీలకు పోటీగా, మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు, సెక్యూరిటీ అప్‎డేట్స్‎తో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్(Scorpio N Facelift) రాబోతోంది. 2026 నాటికి భారత రోడ్లపై సందడి చేయనున్న ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి.

తోపు కారు లాంచింగ్..బడ్జెట్ రెడీ చేసుకోండి

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇన్నాళ్లు హైబ్రిడ్, సీఎన్జీ వాహనాల పైనే దృష్టి సారించిన మారుతి, ఇప్పుడు తన మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారా(e VITARA) తో సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. 2026 ఫిబ్రవరి నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ కారుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

కేవలం కొన్ని నెలల్లోనే 50,000 అమ్మకాలు.. మారుతి విక్టోరిస్ సేల్స్ రికార్డ్

మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఇప్పుడు భారత మార్కెట్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రసిద్ధ SUVగా నిలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 16న అధికారికంగా లాంచ్ అయిన ఈ మోడల్, ప్రారంభమైనప్పటి నుంచే వినియోగదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన మారుతి బ్రాండ్ విలువ, కుటుంబ అవసరాలకు సరిపోయే ఫీచర్లు ఇవన్నీ కలిసి విక్టోరిస్‌ను కస్టమర్లకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి. ఈ SUVకు మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కేవలం ఆసక్తి స్థాయిలోనే కాదు, వాస్తవ అమ్మకాల పరంగా కూడా విక్టోరిస్ తన సత్తాను చాటుతోంది. వినియోగదారులు ఈ కారును ఆనందంగా కొనుగోలు చేస్తుండటం దీని విజయానికి స్పష్టమైన నిదర్శనం.

ఎన్ని కార్లున్నా జనాలు మాత్రం ఆ కారే కావాలంటున్నారు

2026 ప్రారంభంలోనే భారత ఆటోమొబైల్ రంగం అనూహ్య మలుపులతో వేడెక్కింది. ఇన్నాళ్లూ విపణిలో రారాజుగా వెలిగిన మారుతి సుజుకికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. జనవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి తన ఆధిపత్యాన్ని చాటుకున్నప్పటికీ, మొదటి స్థానాన్ని మాత్రం టాటా నెక్సాన్‌కు కోల్పోయింది. సరికొత్త కార్ల ఎంట్రీ, పెరిగిన ఎస్‌యూవీ పిచ్చి వెరసి టాప్ 10 జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

సామాన్యుల కోసం దేశంలోనే మొట్టమొదటి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్

యమహా మోటార్ ఇండియా (Yamaha Motorcycle India) దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు పెట్రోల్ బైక్స్, స్కూటర్లతో మార్కెట్‌ను ఆకట్టుకున్న యమహా, ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన (EV) విభాగంలోకి కూడా అధికారికంగా అడుగుపెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 (ఈసీ 06)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త EC-06 ఈ-స్కూటర్ మొదటి చూపులోనే ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. ఆధునిక స్టైలింగ్, ప్రీమియం లుక్‌తో యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకర్షించేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా, ఈ స్కూటర్‌ను బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లో ఉన్న రివర్ మొబిలిటీ తయారీ యూనిట్‌లో తయారు చేయడం విశేషం.

రూ.25 వేల జీతంతో ఈ కారు కొనచ్చు!

మారుతి సుజుకి (maruti suzuki) భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి తయారీదారుగా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. నమ్మకం, సరసమైన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు మారుతి సుజుకిని కోట్లాది భారతీయ కుటుంబాల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఈ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం జనవరి 2026 అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. జనవరి 2026లో మారుతి సుజుకి మొత్తం 2,36,963 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి మరో బలమైన నెలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో, అంటే జనవరి 2025లో కంపెనీ 2,12,251 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ రెండు గణాంకాలను పోల్చితే, మారుతి సుజుకి అమ్మకాలు సంవత్సరానికి 11.6 శాతం (YoY) వృద్ధిని నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది.
Advertisement

ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి మూడు జిల్లాలు తిరగొచ్చు

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ సందర్భంలో సామాన్యుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించే వారికి సరిగ్గా సరిపోయేలా ఎంజీ విండ్సర్ ఈవీ(MG Windsor EV) మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఎక్కడ చూసినా ఈ కంపెనీ కార్లే కొనాలని పట్టుబడుతున్న జనాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, పేరుగాంచిన కార్ల తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాణ్యత, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అధిక రీ-సేల్ విలువ వంటి అంశాలు టయోటా కార్లకు దేశవ్యాప్తంగా బలమైన అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే దేశీయ మార్కెట్‌లో టయోటా వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు కూడా ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకంతో వరుసగా టయోటా కార్లను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ మొత్తం 33,880 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి, బలమైన అమ్మకాల ప్రదర్శనను నమోదు చేసింది.

మారుతి సుజుకి దెబ్బకు రికార్డులన్నీ బద్ధలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 ఏడాదిని విజయకేతనంతో ప్రారంభించిన ఈ కంపెనీ, జనవరి నెలలో కళ్లు చెదిరే అమ్మకాలతో రికార్డులను తిరగరాసింది. కేవలం 31 రోజుల్లోనే ఏకంగా 2.36 లక్షల కార్లను విక్రయించి, ఇతర కంపెనీలకు అందనంత ఎత్తులో నిలిచింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశీ ఎగుమతుల్లో కూడా మారుతి సుజుకి తన సత్తా చాటింది. అసలు మారుతి ఇంతటి ఘనతను ఎలా సాధించింది? ఏయే కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి? అనే వివరాలు చూద్దాం.

సామాన్యులకు ఎలక్ట్రిక్ కార్లు చవకవుతాయా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను విజయవంతంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకోగా, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహన (EV) పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ బడ్జెట్‌లో పర్యావరణ అనుకూల రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
Advertisement

ప్రతిరోజూ 890 కార్లు అమ్ముతున్న కంపెనీ

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్‌లో రోజురోజుకీ తన పట్టును మరింత బలపరుచుకుంటోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు, విశ్వసనీయ పనితీరుతో కియా కార్లు వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందుకే కంపెనీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూ ఉండగా, కస్టమర్లు కూడా ఉత్సాహంగా ఈ బ్రాండ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో కియా మొత్తం 27,603 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేయగా, ఇది కంపెనీకి బలమైన అమ్మకాల నెలగా మారింది. ఈ గణాంకాలను సగటుగా లెక్కిస్తే, రోజుకు దాదాపు 890 కార్లు విక్రయమైనట్లుగా కనిపిస్తోంది.

ఒక్క నెంబర్ ప్లేట్ ధర రూ.2.08 కోట్లు

భారతదేశంలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండటం ఒక స్టేటస్ సింబల్. తమకు ఇష్టమైన నంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు.

జనవరి అమ్మకాల్లో చరిత్ర సృష్టించిన కంపెనీ

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, బలమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లోనే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల పరంగానూ హ్యుందాయ్ కార్లకు మంచి గుర్తింపు ఉంది. నాణ్యత, ఫీచర్లు, భద్రత, డిజైన్ అన్ని ప్యాకేజీగా ఉండటమే ఈ కంపెనీ విజయానికి ప్రధాన కారణం. ఇటీవల హ్యుందాయ్ విడుదల చేసిన జనవరి నెల అమ్మకాల గణాంకాలు కంపెనీ శక్తిని మరోసారి చాటిచెప్పాయి. ఇప్పటివరకు కంపెనీ చరిత్రలో ఒకే నెలలో సాధించిన అత్యధిక అమ్మకాలుగా జనవరి 2026 నిలిచింది. ఈ నెలలో హ్యుందాయ్ మొత్తం 73,123 వాహనాలను విక్రయించి ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. ఇందులో 59,107 వాహనాలు భారతదేశంలోనే అమ్ముడుపోగా, 14,030 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

ఓర్నీ బడవా.. ఈ బాదుడేంటి ?

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroen) అంతర్జాతీయ మార్కెట్లో ఎంతటి సంచలనాలు సృష్టించినా, భారత మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా తన మోడళ్లలోని లోపాలను సరిదిద్దుకుంటూ భారత్‌లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, ఈ క్రమంలోనే సంస్థ తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ C3(Citroen C3) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కస్టమర్లను కాస్త నిరాశకు గురిచేస్తోంది. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ధరల పెంపు ఒక షాక్ అనే చెప్పాలి.
Advertisement

బడ్జెట్ ఏదైనా..బండి మాత్రం టాటానే కావాలి

టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ ఏకంగా 71,066 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును చాటుకుంది. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) జరిగిన 48,316 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 47.1 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు ఆల్-టైమ్ రికార్డులను సృష్టించాయి.