కొత్త టాటా సియెర్రా EVతో 4 కార్ల పూర్తి కంపారిజన్

దేశీయ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ (tata motors) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీ (sierra ev) ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకున్నాం. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. మార్కెట్లో ఇప్పటికే దూసుకుపోతున్న మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV వంటి ప్రత్యర్థుల కంటే సియెర్రా EV ఏ విషయంలో మెరుగ్గా ఉంది? బ్యాటరీ సామర్థ్యం నుంచి రేంజ్ వరకు, పవర్ నుంచి ధర వరకు, ఫీచర్ల నుంచి పనితీరు వరకు అన్ని అంశాల్లో ఈ కార్ల మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వందల రూపాయలు ఆదా చేయాలంటే.. ఈ డ్రైవింగ్ టిప్స్ పాటించండి!

Fuel Saving Driving Habits. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ సింపుల్ డ్రైవింగ్ టిప్స్ పాటించండి. మీ కారు మైలేజీని పెంచుకుని ప్రతిరోజూ వందల రూపాయలు ఆదా చేసే సులభమైన మార్గాలు ఇవే.

పక్క కంపెనీలు కుళ్లుకునేలా హ్యుందాయ్ 4 సరికొత్త ఎస్‌యూవీలు

భారతదేశ కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాబోయే 2030 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త మోడళ్లను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండనున్నాయి.

ఒక్క చార్జ్‌తో ఏకంగా 665 కిమీ రేంజ్‎తో సియెర్రా ఈవీ లాంచ్

భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎంతో కాలంగా ఆటో లవర్స్ ఎదురుచూస్తున్న తమ ఐకానిక్ ఎస్‌యూవీ సియెర్రా ఈవీ(Tata Sierra EV)ని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.18.79 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పాత సియెర్రా కారు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఆధునిక ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో సరికొత్త అవతారంలో ఈ కారును టాటా కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది.
Advertisement

ఈ కారు చిన్న కుటుంబానికి పెద్ద వరం

భారతదేశంలో లక్షలాది కుటుంబాల కారు కలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (maruti suzuki alto) ఒకటి. ఒకప్పుడు కారు కొనడం అంటే పెద్ద విషయం అనుకునే మధ్యతరగతి కుటుంబాలకు, తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన నాలుగు చక్రాల వాహనాన్ని అందించి ఆల్టో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుబాటు ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, విశ్వసనీయ పనితీరుతో ఈ కారు ఎన్నో ఏళ్ల పాటు భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను ఏలింది. భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన మారుతి 800కు వారసురాలిగా ఆల్టో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే అది కేవలం మారుతి 800 స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా, తనదైన ప్రత్యేక గుర్తింపును కూడా ఏర్పరుచుకుంది.

వాహనం మెయింటెనెన్స్ నుంచి ఇంధనం వరకు డబ్బు ఎలా ఆదా చేయాలి?

Car maintenance tips and fuel saving hacks. మీ వాహనం మైలేజీ పెంచుకోవడానికి మరియు మెయింటెనెన్స్ ఖర్చులను భారీగా తగ్గించుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.

అడ్వెంచర్ లుక్‌తో హీరో కొత్త స్కూటర్

భారత టూవీలర్ మార్కెట్లో స్పోర్టీ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకర్షించే డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు కలిగిన స్కూటర్ల కోసం వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ కూడా తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్లో TVS ఎన్‌టార్క్ 125కు ప్రత్యర్థిగా నిలిచిన హీరో జూమ్ 125ను మరింత ప్రత్యేకమైన రూపంలో తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న హీరో జూమ్ 125 స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్, ఆధునిక ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటోంది.

SUVలకు పోటీగా త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్స్

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్ఈవీ (SUV) కార్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను ఇష్టపడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఎస్ఈవీలు నచ్చని వారి కోసం, తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం భారత మార్కెట్లోకి త్వరలోనే పలు సరికొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్‌లో హ్యుందాయ్ ఐ20 కొత్త జనరేషన్ మోడల్‌తో పాటు మారుతి సుజుకి బలెనో, టాటా టిగోర్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి పాపులర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఉన్నాయి.
Advertisement

3 నెలలుగా జనాలు ఎక్కువగా కొంటున్న మిడ్‌సైజ్ SUVలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్లలో ఒకటిగా నిలిచింది. గత కొన్నేళ్లుగా వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన కొనుగోలుదారులు, ఇప్పుడు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రత, కుటుంబ ప్రయాణాలకు అనువైన డిజైన్ కారణంగా మిడ్‌సైజ్ ఎస్‌యూవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ విభాగంలో పోటీ రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. గాడివాడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, చివరి మూడు నెలల టాప్ 10 మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సేల్స్ చూద్దాం.

2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు బంద్

దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని క్యాబినెట్ సోమవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సరికొత్త ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026కు క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సరికొత్త పాలసీ ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కియా సైరోస్ ఈవీ రాకకు ముహూర్తం ఫిక్స్?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా (Kia) మోటార్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కియా తన ప్రజాదరణ పొందిన సైరోస్ (Syros) ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు లాంచ్‌పై ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో కియా సైరోస్ ఐసీఈ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో, భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కియా భావిస్తోంది.

లాంచ్ అయి రెండేళ్లు కూడా కాలేదు.. అప్పుడే ప్యాకప్ చెప్పేసింది

బజాజ్ పల్సర్ బైక్ లవర్స్‌కు కంపెనీ ఒక కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. తన పాపులర్ పల్సర్ సిరీస్‌లో 125 సీసీ విభాగంలో వచ్చిన పల్సర్ N125 (Pulsar N125) మోడల్‌ను బజాజ్ ఆటో ఇండియాలో నిలిపివేసింది. ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. ఈ బైక్ ఇంకా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నప్పటికీ, డీలర్లకు ఈ బైక్ సప్లయ్‌ను (డీలర్ డిస్పాచ్) కంపెనీ పూర్తిగా ఆపేసింది.
Advertisement

8 లక్షల అమ్మకాల మైలురాయి దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్

భారత ద్విచక్ర వాహన రంగంలో బజాజ్ ఆటో (Bajaj Auto) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఒకప్పుడు భారత రోడ్లపై పెట్రోల్ స్కూటర్లతో తనదైన ముద్ర వేసిన చేతక్ (Chetak) బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోనూ అదే స్థాయి విజయాన్ని కొనసాగిస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 8 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటడం కంపెనీకి మాత్రమే కాకుండా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరుగుతోందనడానికి కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. సుమారు ఆరున్నర సంవత్సరాల క్రితం భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన బజాజ్ చేతక్, ప్రారంభంలో పరిమిత నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది.

తక్కువ ఖర్చుతో వాహనాన్ని ఎక్కువకాలం ఉపయోగించే మార్గాలు

Car maintenance tips. తక్కువ ఖర్చుతో మీ కారు జీవితకాలాన్ని పెంచుకోవడానికి మరియు భారీ రిపేర్ ఖర్చుల నుండి తప్పించుకోవడానికి ఈ సింపుల్ మెయింటెనెన్స్ చిట్కాలను పాటించండి.

ఓలా ఎలక్ట్రిక్‌కు కంజ్యూమర్ కోర్టు గట్టి షాక్.. రూ.45,000 భారీ జరిమానా

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ సర్వీస్‌లో చూపించిన నిర్లక్ష్యం ఆ కంపెనీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన కంజ్యూమర్ కోర్టు ఓలా కంపెనీపై ఏకంగా రూ.45,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. స్కూటర్ కొన్న కస్టమర్‌కు సరైన సర్వీస్ అందించకుండా, ఒక చిన్న సమస్యను రెండేళ్లకు పైగా పరిష్కరించకుండా తిప్పించుకున్నందుకు కోర్టు ఈ చర్య తీసుకుంది. ఒక ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం.. ఈ కేసు తుది తీర్పు జూన్ 9, 2026న వెలువడింది.

రేపటి నుంచే రోడ్లపై కొత్త కార్ల జాతర

భారతీయ కార్ల మార్కెట్లో రాబోయే రోజులు చాలా హాట్‌గా మారబోతున్నాయి. దేశంలోని ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్, హోండా, రెనాల్ట్, నిస్సాన్ కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి దించడానికి లైన్ కట్టాయి. ఈ సరికొత్త కార్ల లాంచ్‌ల పండగ రేపు (జూన్ 30) టాటా కంపెనీతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూలై మొదటి రెండు వారాల్లోనే ఒకదాని తర్వాత ఒకటిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ 6 కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

ఎక్కువ మైలేజ్ కావాలా? ఈ డ్రైవింగ్ అలవాట్లు తప్పనిసరి!

Driving Habits for Better Mileage. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి మరియు మీ కారు మైలేజీని పెంచుకోవడానికి ఈ సింపుల్ డ్రైవింగ్ చిట్కాలను పాటించండి. ఇంధనం ఆదా చేసే మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

క్విడ్‌కు గడ్డు రోజులు.. ఏడాదిలో 44% పడిపోయిన అమ్మకాలు!

ఒకప్పుడు భారతదేశంలోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సంచలనం సృష్టించిన రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఇప్పుడు మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కోల్పోయినట్లు తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆకర్షణీయమైన SUV తరహా డిజైన్, అందుబాటు ధర, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా విడుదలైన తొలి రోజుల్లోనే ఈ కారు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఒక దశలో నెలకు సగటున 10 వేలకుపైగా యూనిట్లు విక్రయిస్తూ, ఈ సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే కాలక్రమేణా పెరిగిన పోటీ, కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులతో క్విడ్ డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది.

ఈ కారు వెనుక నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడానికి నిస్సాన్ కంపెనీ తన సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను సిద్ధం చేస్తోంది. ఈ కారు జూలై 9వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ కారు వెనుక భాగం ఎలా ఉంటుందో చూపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ లీకైన పిక్ చూశాక నిస్సాన్ టెక్టాన్ లుక్స్ పరంగా మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. లీకైన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ వెనుక భాగం చాలా పవర్‌ఫుల్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. ఇందులో ఈ కాలపు ట్రెండ్‌కు తగ్గట్టుగా అట్రాక్టివ్ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్ అందించారు. కారు బూట్‌లిడ్ డిజైన్ ఎలాంటి ప్లాస్టిక్ క్లాడింగ్ లేకుండా చాలా నీట్‌గా ఉంది, దానిపై గంభీరంగా TEKTON అని రాసి ఉంది. ఇవి కాకుండా కారు పైభాగంలో రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక విండ్‌స్క్రీన్ వైపర్, హై-మౌంటెడ్ స్టాప్ లైట్, కారుకు ప్రీమియం లుక్ ఇచ్చేలా అద్భుతమైన డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌ను కూడా నిస్సాన్ జోడించింది. ఈ కారు వెనుక లుక్ ఇప్పుడే లీక్ అయినప్పటికీ, దీని ముందు భాగం ఎలా ఉంటుందో కంపెనీ ఇప్పటికే టీజర్ల ద్వారా అధికారికంగా హింట్ ఇచ్చింది. నిస్సాన్ టెక్టాన్ ఫ్రంట్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా, రగ్గడ్‌గా ఉంది. కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన గ్లోబల్ ఎస్‌యూవీ నిస్సాన్ పెట్రోల్ (Nissan Patrol) డిజైన్ ఆధారంగా దీనిని రూపొందించారు. పూర్తి కారును ఎలాంటి కవర్లు లేకుండా రోడ్డుపై చూడకపోయినప్పటికీ, టీజర్లలోని దీని లుక్ చూసి జనాలు అప్పుడే మెస్మరైజ్ అయిపోతున్నారు. కారు లోపలి భాగం, ఫీచర్ల విషయానికి వస్తే, నిస్సాన్ టెక్టాన్ దాదాపు రాబోయే సరికొత్త రెనాల్ట్ డస్టర్ (Renault Bigster/Duster) లాగే ఉండే అవకాశం ఉంది. ఇందులో డ్రైవర్ వైపు కాస్త వంగి ఉండేలా కనెక్ట్ చేసిన డ్యూయల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వెంటిలేటెడ్ పవర్డ్ డ్రైవర్ సీట్, టిల్ట్-టెలిస్కోపిక్ స్ట్రీరింగ్, ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించేలా పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వెనుక టైప్-సి యూఎస్‌బీ పోర్టులు, రియర్ ఏసీ వెంట్స్, లగేజీ పెట్టుకోవడానికి ఏకంగా 700 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభించనున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. మొదటిది 1-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (100 PS పవర్ - 166 Nm టార్క్) కాగా, రెండవది మరింత పవర్‌ఫుల్ అయిన 1.3-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (163 PS పవర్ - 280 Nm టార్క్). ఈ రెండు ఇంజన్లకూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే పెద్ద ఇంజన్ వేరియంట్‌లో 6-స్పీడ్ వెట్ క్లచ్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ప్యూర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ కావడం విశేషం. ఈ సంవత్సరం చివరి నాటికి నిస్సాన్ టెక్టాన్‌లో మూడవ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌గా 1.8-లీటర్ పెట్రోల్-స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా తీసుకురానున్నారు. ఇందులో అత్యుత్తమమైన 1.3 kWh బ్యాటరీ, ప్రత్యేక హైబ్రిడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండబోతున్నాయి. ధర విషయానికి వస్తే ఈ కారు సుమారు రూ. 11 లక్షల నుంచి రూ. 18 లక్షల బడ్జెట్ శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రా వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకొన్ని గంటల్లో EV మార్కెట్ ముఖచిత్రం మారబోతోంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొల్పిన టాటా సియెర్రా ఈవీ (Toyota Sierra Ev) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ SUVలపై పెరుగుతున్న ఆసక్తి మధ్య, ఈ కొత్త మోడల్ రేపు (జూన్ 30) అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ కారుపై వినియోగదారుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో టాటా సియెర్రా EV, మార్కెట్‌లో ఉన్న ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా మారుతి సుజుకి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి కార్లతో ఇది నేరుగా పోటీపడే అవకాశం ఉంది. డిజైన్, రేంజ్, ఫీచర్లు వంటి అంశాల్లో టాటా సంస్థ ఈ SUVను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
Advertisement

కొత్త లుక్‌తో వస్తున్న రెనాల్ట్ క్విడ్.. ఈసారి మార్కెట్‌ను షేక్ చేస్తుందా?

రెనాల్ట్ (Renault) భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెండు దశాబ్దాలకు పైగా తన ఉనికిని కొనసాగిస్తున్న ప్రముఖ యూరోపియన్ కార్ల తయారీ సంస్థ. డస్టర్ SUV రీ-ఎంట్రీతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ బ్రాండ్, ఇప్పుడు మరోసారి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌ (kwid)ను కొత్త అవతార్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, క్విడ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో కంపెనీ ఉంది. తాజా సమాచారం ప్రకారం, జూలై 3న అప్‌డేటెడ్ రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. అయితే ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాదని తెలుస్తోంది.

భారీ మైలేజ్ ఇచ్చే టాప్ 4 CNG కార్లు ఇవే

ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి సామాన్యులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సీఎన్‌జీ (CNG) కార్లు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. అయితే సాధారణంగా సీఎన్‌జీ కార్లలో గేర్లు, క్లచ్ మార్చుకుంటూ సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ధర పెరిగింది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, సరఫరా వ్యవస్థ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను దశలవారీగా సవరిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన కంపెనీలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి ప్రైస్ హైక్ అమలు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ఇదే బాటలో నడుస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను పూర్తిగా భరించడం సాధ్యం కాకపోవడంతో, ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో తన మోడల్ శ్రేణిలోని పలు కార్ల ధరలను మరోసారి పెంచుతోంది.

మార్కెట్లోకి రాబోతున్న టాప్ క్లాస్ 7 సీటర్ కార్లు ఇవే

భారతదేశంలో పెద్ద కుటుంబం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, లగ్జరీ ఫీచర్లు ఉన్న పెద్ద కార్లను కొనడానికే ఇష్టపడతారు. అందుకే ఇండియన్ మార్కెట్లో 7 సీటర్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ట్రెండ్‌ను గమనించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి.
Advertisement

జెన్ Z మనసు దోచేస్తున్న 3 EVలు

ఇప్పటి యువత కారు కొనుగోలు చేసే విధానం గత తరాలతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా జెన్ Z తరం కేవలం మైలేజ్ లేదా ధరను మాత్రమే కాకుండా, కారు ఎంత స్మార్ట్‌గా ఉంది, అందులో ఎలాంటి డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి, మొబైల్‌తో ఎంత సులభంగా కనెక్ట్ అవుతుంది వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. స్టైలిష్ లుక్, అత్యాధునిక టెక్నాలజీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై ఈ తరం ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అలాంటి జెన్ Z కొనుగోలుదారులకు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.