మోదీ కాన్వాయ్‌లో ఆ కార్ల ప్రత్యేకతలేంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రంగా మారుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా భారీ భద్రతా ఏర్పాట్లతో ప్రయాణించే ప్రధాని కాన్వాయ్‌లో ఇకపై కేవలం రెండు వాహనాలే కనిపించనున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మోదీ(Modi), ఇప్పుడు అదే విషయాన్ని తన భద్రతా వ్యవస్థలో అమలు చేయడంతో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చిన్న కారు.. పెద్ద సక్సెస్!.. సెలెరియో అమ్మకాలలో ఊహించని గ్రోత్

భారతదేశంలో చిన్న కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో మంచి మైలేజ్ ఇచ్చే కార్లను ఎక్కువగా ఎంపిక చేస్తుంటాయి. అలాంటి వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి (Maruti Suzuki) తీసుకొచ్చిన హ్యాచ్‌బ్యాక్‌లలో సెలెరియో (Celerio) ఒకటి. సింపుల్ డిజైన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలమైన పరిమాణం వంటి లక్షణాలతో ఈ కారు భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించింది. చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, అలాగే మొదటిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులకు సెలెరియో ఎంతో అనువైన ఎంపికగా మారింది.

మారుతికి పెద్ద తలనొప్పిగా మారిన కారు

ఒకప్పుడు యువతలో స్టైలిష్ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఇగ్నిస్ ఇప్పుడు షోరూమ్‌లలోనే మూలుగుతుంది. ఏప్రిల్ నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుకాకపోవడం ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు భారీ తగ్గింపులు ప్రకటించినా వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కారుకు భారత మార్కెట్లో ముగింపు దగ్గరపడిందనే చర్చ జోరందుకుంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి సుజుకి, తన నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించే ఇగ్నిస్ కారును దాదాపు మార్కెట్ నుంచి తప్పించినట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఏప్రిల్ అమ్మకాల గణాంకాల ప్రకారం.. ఈ కారుకు ఒక్క కస్టమర్ కూడా దొరకలేదు. అంటే ఏప్రిల్ నెల మొత్తం ఇగ్నిస్ విక్రయాలు సున్నాకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇగ్నిస్‌పై రూ.57,500 వరకు తగ్గింపు ఇస్తున్నా కొనుగోలుదారులు పెద్దగా ముందుకు రావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.5.35 లక్షలుగా ఉండేది. టాప్ వేరియంట్ ధర రూ.7.55 లక్షల వరకు వెళ్లేది. ఇగ్నిస్ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి మారుతి సొంత కార్లే కావడం ఆసక్తికరం. అదే ధరలో వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బలెనో వంటి కార్లు ఎక్కువ ఫీచర్లు, మెరుగైన మైలేజీ, మంచి రీసేల్ విలువతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యాగన్ ఆర్ ధర ఇగ్నిస్ కంటే తక్కువగా ఉండటం వినియోగదారులను పూర్తిగా అక్కడికే మళ్లించింది. ఇటీవలి కాలంలో కార్ల కొనుగోలులో భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. కానీ ఇగ్నిస్‌లో మాత్రం కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఇప్పటికీ రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోనే కొనసాగడం, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. అదే సమయంలో ఇతర మారుతి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందుబాటులోకి రావడం ఇగ్నిస్‌ను మరింత వెనక్కి నెట్టింది. ప్రస్తుతం దేశంలో సీఎన్‌జీ కార్లకు భారీ డిమాండ్ ఉంది. కానీ ఇగ్నిస్‌లో కంపెనీ ఎప్పుడూ ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్‌జీ ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని చూసే వినియోగదారులు స్విఫ్ట్ సీఎన్‌జీ, వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ, బలెనో సీఎన్‌జీ వైపు వెళ్లిపోయారు. ఆటో రంగంలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇగ్నిస్ స్థానంలో మారుతి త్వరలో కొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని అంచనాలు ఉన్నాయి. అందుకే కంపెనీ ఇగ్నిస్ ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. స్టైలిష్ డిజైన్ ఉన్నా, మార్కెట్ ట్రెండ్‌ను అందుకోవడంలో ఇగ్నిస్ వెనుకబడింది. యువత కోసం తీసుకొచ్చిన ఈ కారు, కాలానికి తగ్గ ఫీచర్లు, సేఫ్టీ అప్‌డేట్లు, సీఎన్‌జీ ఆప్షన్, బలమైన మార్కెటింగ్ లేక నెమ్మదిగా మార్కెట్ నుంచి కనుమరుగైపోయింది.

చిన్న ఫ్యామిలీల ఫేవరెట్ కారు ఇదే!.. ఎస్-ప్రెస్సోకు భారీ ఆదరణ

భారతీయ చిన్న కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులు, అలాగే నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తీసుకొచ్చిన మోడళ్లలో ఎస్ ప్రెస్సో (S-Presso) ఒకటి. చిన్న సైజులో ఉండి కూడా SUV తరహా స్టైలింగ్‌ను అందిస్తుంది. రద్దీగా ఉండే నగర వీధుల్లో పెద్ద కార్లను నడపడం చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంటే, ఎస్-ప్రెస్సో మాత్రం తన కాంపాక్ట్ డిజైన్‌తో ట్రాఫిక్ మధ్య ఎంతో ఈజీగా దూసుకుపోతుంది. చిన్న గల్లీలు, ఇరుకైన పార్కింగ్ ప్రదేశాలు, భారీ ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ కారును చాలా సులభంగా నియంత్రించవచ్చు.
Advertisement

సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price : నాలుగేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం సామాన్యుడికి పెద్ద షాక్‌గా మారింది. ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోవడంతో కేంద్రం చివరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభావం కూరగాయల నుంచి క్యాబ్ ఛార్జీల వరకు ప్రతిచోటా కనిపించబోతోందనే ఆందోళన మొదలైంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.3 వరకు పెరగడంతో వాహనదారులు షాక్‌కు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గత నాలుగేళ్లలో రిటైల్ వినియోగదారులకు ఇది మొదటి పెద్ద పెంపుగా మారింది. ఇదే సమయంలో సీఎన్‌జీ ధరలు కూడా కిలోకు రూ.2 పెరగడం మరో దెబ్బగా మారింది. ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కి చేరింది. డీజిల్ ధర రూ.90.67 అయింది. ముంబైలో పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.14గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.74 దాటగా, చెన్నైలో కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఇప్పుడు ఎంతంటే?హైదరాబాద్‌లో ఇప్పటికే దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉండగా, తాజా పెంపుతో మరింత భారం పడింది. గత ధరల ప్రకారం నగరంలో పెట్రోల్ సుమారు రూ.107.45 ఉండేది. ఇప్పుడు కొత్త పెంపుతో అది రూ.110 దాటే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీజిల్ కూడా రూ.98కు చేరువ కావొచ్చని అంచనా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర సుమారు 69 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు 110 డాలర్లకు పైగా చేరినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఒత్తిడిని ప్రభుత్వ చమురు కంపెనీలు ఎక్కువకాలం భరించలేక చివరకు వినియోగదారులపై మోపాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ చమురు సంస్థలు రోజుకు వేల కోట్ల నష్టాలు ఎదుర్కొంటున్నాయని సమాచారం. పెరిగిన ముడి చమురు ధరలకు సరిపడా రిటైల్ ధరలు పెంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కంపెనీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది

మనదేశంలో మిడ్ సైజ్ ఎస్‌యూవీల సందడి మళ్ళీ మొదలైంది. ఒకప్పుడు ఈ విభాగంలో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్, ఇప్పుడు సరికొత్త రూపంతో మూడవ తరం మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత 36 నెలల్లో ఎన్నడూ లేనంతగా భారీ అమ్మకాలతో రెనాల్ట్ ఇండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్న డస్టర్ ఆథెంటిక్ (బేస్ వేరియంట్) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమ్మకాలతో దుమ్మురేపుతున్న ఈ SUV.. డీలర్లకు కాసుల వర్షం!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) భారత SUV మార్కెట్లో ప్రీమియం ఫీలింగ్, జర్మన్ ఇంజినీరింగ్, స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఒకేసారి అందించే మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బాడీ లైన్స్‌తో ఈ SUV రోడ్డుపై ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నగర రోడ్లలోనూ, హైవేలపైనా ఇది మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంటుంది. టైగన్ భారత మిడ్-సైజ్ SUV మార్కెట్లో తన స్థాయిని రోజురోజుకూ మరింత బలపరుచుకుంటోంది. ఇప్పటికే జర్మన్ ఇంజినీరింగ్, ప్రీమియం డిజైన్, స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతితో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ SUV, ఇప్పుడు అమ్మకాల పరంగానూ మంచి వృద్ధిని నమోదు చేస్తోంది.

దేశంలో రతన్ టాటాకు ఉన్నంత ప్రజాధారణ పొందిన కారు

మారుతి సుజుకి లాగా, టాటా మోటార్స్ కూడా వినియోగదారులు ఎలాంటి సందేహం లేకుండా, నమ్మకంగా కొనుగోలు చేయగల కార్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. టియాగో వంటి బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి సఫారీ వంటి ప్రీమియం SUVల వరకు విస్తరించిన ఈ మోడల్ లైనప్‌కు ఉన్న ప్రధాన బలం భద్రత మరియు ఆధునిక ఫీచర్లే. ప్రతి సెగ్మెంట్‌లో కూడా గట్టి నిర్మాణ నాణ్యత, మంచి రోడ్డు ప్రెజెన్స్, వినియోగదారులకు ఉపయోగపడే టెక్నాలజీని అందించడం ద్వారా టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరింత పెరుగుతోంది. ఏప్రిల్ 2026 నాటికి సంస్థ సుమారు 59,000 యూనిట్ల కార్లను విక్రయించి దేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది కేవలం సంఖ్య పరంగా కాకుండా బ్రాండ్‌పై పెరుగుతున్న డిమాండ్‌కు స్పష్టమైన సంకేతంగా కూడా చెప్పవచ్చు.
Advertisement

ఇంటి నుంచే రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనచ్చు

దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రోజూ కాలేజీ, ఉద్యోగం లేదా చిన్న చిన్న పనుల కోసం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో నడిచే ఈ-స్కూటర్లు మంచి ఎంపికగా మారాయి. ఇప్పుడు అమెజాన్ సమ్మర్ సేల్‌లో కొన్ని లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని మోడళ్లు రూ.25 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి.

ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను సగం ధరకే కొనవచ్చు

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే చాలా మందికి మొదట ఎదురయ్యే సమస్య అధిక ప్రారంభ ధర. ముఖ్యంగా బ్యాటరీ ఖర్చు ఎక్కువగా ఉండటంతో మొత్తం వాహనం ధర పెరిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన కొత్త విధానం BaaS. ఈ మోడల్‌లో స్కూటర్‌ను కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీకి కాకుండా వాహనానికి మాత్రమే డబ్బులు వసూలు చేసి, బ్యాటరీ అద్దె ప్రాతిపదికన ఇస్తారు. బ్యాటరీ వినియోగానికి మాత్రమే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ విధానంలో చెల్లింపు చేయాలి. దీంతో ప్రారంభ పెట్టుబడి భారీగా తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడంలో ఈ BaaS విధానం కీలక పాత్ర పోషిస్తోంది. సగం ధరకే వాహనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కథణంలో ఈ విధంగా అందుబాటులో ఉన్న స్కూటర్లను చూద్దాం.

ఈ కారు మీద డిస్కౌంట్ తో ఇంకో సెకండ్ హ్యాండ్ కారు కొనేయొచ్చు

భారత ఈవీ మార్కెట్లో ఇప్పుడు మహీంద్రా XEV 9e(Mahindra XEV 9e) పేరు మారుమోగుతోంది. కారణం.. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUVపై ఏకంగా రూ.1.40 లక్షల డిస్కౌంట్ ప్రకటించడం. అంతేకాదు, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 682 కిమీ రేంజ్ ఇవ్వడం వల్ల కార్ లవర్స్ దృష్టి మొత్తం ఇప్పుడు దీనిపైనే పడింది. భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మహీంద్రా దూసుకుపోతోంది. ఇప్పటికే BE 6తో సంచలనం సృష్టించిన కంపెనీ.. ఇప్పుడు తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV మహీంద్రా XEV 9e(Mahindra XEV 9e) పై భారీ ఆఫర్ ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచింది. వేసవి సీజన్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఈ ఆఫర్ బంపర్ గిఫ్ట్‌లా మారింది. లగ్జరీ ఫీచర్లు, అత్యుత్తమ భద్రత, తిరుగులేని రేంజ్ కలిగిన ఈ వాహనంపై ఇప్పుడు లక్షకు పైగా క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. మే నెలలో కారు కొనుగోలు చేసే వారికి కంపెనీ ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. మహీంద్రా సంస్థ తన ప్రతిష్టాత్మక విద్యుత్ వాహనం ఎక్స్‌ఈవీ 9ఈ (XEV 9e) పై ఈ నెలలో రూ.1.40 లక్షల వరకు క్యాష్ డిస్కౌంటును ప్రకటించింది. గతేడాది మోడళ్లకు మాత్రమే కాకుండా, 2025 తయారీ వాహనాలపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుండటం విశేషం. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.21.90 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో మంచి విక్రయాలు సాధించిన ఈ మోడల్, ఇప్పుడు ఈ భారీ డిస్కౌంట్‌తో మరిన్ని అమ్మకాలను సాగిస్తుందని కంపెనీ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 2,260 మంది ఈ కారును కొనుగోలు చేశారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ విషయంలో రాజీ పడదు. కంపెనీ నివేదికల ప్రకారం.. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. 59 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక వెర్షన్ కాగా, మరింత పవర్ఫుల్ 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరో వెర్షన్. ఇది కేవలం 6.8 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 170 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ప్రయాణానికి సిద్ధమవుతుంది. భారతదేశపు సొంత భద్రతా ప్రమాణాల సంస్థ (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ 5 స్టార్ (5-Star) రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీ విభాగంలో 32కి 32 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. చైల్డ్ సేఫ్టీ విషయంలో కూడా 49కి 45 పాయింట్లు సాధించి, కుటుంబం మొత్తానికి అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. రహదారిపై ప్రయాణించేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగినా లోపల ఉన్న ప్రయాణికులకు టాప్ రేంజ్ సేఫ్టీ కల్పిస్తుందని ఈ టెస్టులో నిరూపించాయి. ఈ కారు డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ స్టైల్లో ఉంటుంది. దాదాపు 4789 మిల్లీమీటర్ల పొడవు కలిగిన ఈ వాహనంలో విశాలమైన స్థలం ఉంటుంది. లోపల సామాను సర్దుకోవడానికి 663 లీటర్ల బూట్ స్పేస్ ఉండటమే కాకుండా, ముందు భాగంలో కూడా 150 లీటర్ల ఖాళీ స్థలం (Frunk) ఇచ్చారు. 207 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ స్క్రీన్‌లు, విశాలమైన టైర్లతో ఈ కారు విలాసానికి సరికొత్త చిరునామాగా నిలుస్తోంది.

ఈ 7-సీటర్ కోసం షోరూమ్‌లకు క్యూ.. భారీ ఆఫర్లతో కియా సెన్సేషన్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా (Kia) భారత మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంటోంది. ఇప్పటికే SUV సెగ్మెంట్‌లో మంచి విజయాలు సాధించిన ఈ కంపెనీ, ఇప్పుడు MPV విభాగంలో కూడా భారీ పోటీని సృష్టిస్తోంది. ముఖ్యంగా కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) అనే 7-సీటర్ మోడల్, కుటుంబ వినియోగదారుల మధ్య వేగంగా ఆదరణ పొందుతోంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతితో ఈ MPV, మార్కెట్లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తూ, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.
Advertisement

ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కిలోమీటర్లు

మారుతి గ్రాండ్ విటారా ప్రస్తుతం భారత మార్కెట్లో మైలేజీ సంచలనం సృష్టిస్తోంది. 27.97 కిమీ మైలేజీతో పాటు ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1200 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడం వల్ల ఈ హైబ్రిడ్ SUV కోసం మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్ కార్లు.. మైలేజ్, సేఫ్టీలో టాప్‌లో ఇవే!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే వారికి ప్రయాణ ఖర్చు పెద్ద భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, తక్కువ ఖర్చుతో నడిచే కార్ల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే CNG కార్లు నగర ప్రయాణికుల కోసం ఉత్తమ ఎంపికగా మారాయి. తక్కువ ఇంధన ఖర్చుతో పాటు మంచి మైలేజీ ఇవ్వడం వల్ల మారుతి సుజుకి సెలెరియో, టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇవి కేవలం ఖర్చు తగ్గించే కార్లే కాకుండా, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్, కుటుంబానికి సరిపడే స్థలం, భద్రతా ఫీచర్లతో కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో ఇస్తున్నాము.

అమ్మకాల్లో తొమ్మిదవ స్థానానికి పడిపోయిన హ్యుందాయ్ స్టార్ కార్

భారతీయ మధ్యతరహా ఎస్‌యూవీ(SUV) మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు వరుసగా మార్కెట్లోకి వస్తుండటంతో హ్యుందాయ్ క్రెటా(Hyundai Creata) పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అమ్మకాలు తగ్గినా.. మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మాత్రం క్రెటా(creta) వదులుకోలేదు. యువత నుంచి కుటుంబాల వరకు ఇప్పటికీ ఇదే ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.

ఫోన్ కొన్నంత ఈజీగా ఏడుగురు పట్టే కియా ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు కొనాలని ఉందా.. కానీ భారీ ధర చూసి వెనక్కి తగ్గుతున్నారా? అయితే కియా తీసుకొచ్చిన కొత్త ఫైనాన్స్ పథకం మీకోసమే. కేవలం రూ.51 వేల డౌన్ పేమెంట్‌తోనే 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. బ్యాటరీకి వేరు రుణం ఇవ్వడం ఈ పథకంలో అతిపెద్ద ప్రత్యేకతగా మారింది.
Advertisement

ఈ కారు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

భారత మార్కెట్లో టయోటా అంటేనే నమ్మకం, భద్రత అని చాలామంది భావిస్తారు. కానీ ఇప్పుడు అదే కంపెనీకి చెందిన ఒక కారు క్రాష్ టెస్టులో దారుణంగా విఫలమవడం ఆటో రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద ఎత్తున అమ్ముడవుతున్న ఈ కారు అడల్ట్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సాధించడం వినియోగదారులను షాక్‌కు గురిచేస్తోంది.

తక్కువ సంఖ్యే అయినా పెరుగుతున్న డిమాండ్!

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ప్రీమియం MPVగా ప్రత్యేక గుర్తింపు పొందింది. హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు విశాలమైన క్యాబిన్ స్పేస్, లగ్జరీ టచ్ ఉన్న ఇంటీరియర్, దీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన కంఫర్ట్ వంటి అంశాలతో ఈ కారు ప్రీమియం సెగ్మెంట్‌లో తనదైన స్థానం సంపాదించుకుంది. సాధారణంగా పెద్ద కుటుంబాలు, కంఫర్ట్ ప్రయాణాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ MPV, మార్కెట్లో ఒక ప్రత్యేక ఎంపికగా నిలుస్తోంది. అయితే అమ్మకాల విషయానికి వస్తే, తాజా గణాంకాలు కొంత మిశ్రమ ఫలితాలను చూపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో ఇన్విక్టో అమ్మకాలు 237 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఒక్క సారిగా రెండింతలు పెరిగిన ఈ కారు అమ్మకాలు

టయోటా (Toyota) భారత మార్కెట్లో తన బలమైన ఉనికిని ఇన్నోవా (Innova) వంటి మోడళ్ల ద్వారా చాలా కాలంగా కొనసాగిస్తోంది. ఇన్నోవా తర్వాత కంపెనీకి మరొక కీలక మోడల్‌గా నిలుస్తున్నది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder). ఈ రెండు మోడళ్ల మధ్య గతంలో అమ్మకాల పరంగా పెద్ద తేడా ఉండేది. ఇన్నోవా స్థిరమైన డిమాండ్‌తో ముందంజలో ఉండగా, హైరైడర్ మాత్రం క్రమంగా తన స్థానం సంపాదించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ SUVకు పెరుగుతున్న డిమాండ్, హైబ్రిడ్ టెక్నాలజీపై వినియోగదారుల ఆసక్తి దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తాజా డేటా ప్రకారం, 2026 ఏప్రిల్ నెలలో టయోటా మొత్తం 9,115 యూనిట్ల అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కార్లను విక్రయించింది.

లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ.. రూ.2 లక్షల తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతోంది. భారతీయ మార్కెట్లో Mahindra BE 6 Discount ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారీ రేంజ్, ప్రీమియం ఫీచర్లతో వస్తున్న Mahindra Electric SUV అయిన BE 6పై కంపెనీ రూ.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ముఖ్యంగా Mahindra BE 6 Range 683KM ఉండటం మధ్యతరగతి కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. గత ఏప్రిల్ నెలలో కూడా ఇదే తరహా డిస్కౌంట్‌ను అందించగా, కస్టమర్ల నుంచి వచ్చిన భారీ స్పందనతో ఈ నెలా కూడా దీనిని పొడిగించాలని కంపెనీ నిర్ణయించింది.
Advertisement

456 km రేంజ్ కారుపై బంపర్ ఆఫర్!.. వెంటనే బుక్ చేయండి

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కార్ల సెగ్మెంట్‌లో ప్రతి కంపెనీ కూడా కొత్త మోడళ్లు, కొత్త టెక్నాలజీలు, ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకవైపు కొత్త SUVలు, ఎలక్ట్రిక్ కార్లు వరుసగా విడుదలవుతుండగా, మరోవైపు అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలు ప్రతి నెలా ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో వినియోగదారులకు మంచి డీల్‌లు లభించడం కూడా గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా (Mahindra & Mahindra) మే నెలలో తన వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించి మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

బైక్ పడిపోతే మెసేజ్ వెళ్తుంది..ఇది స్కూటర్ కాదు కంప్యూటర్

భారతీయ మార్కెట్లో ఏథర్ స్కూటర్(ather energy) క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా Ather 450X ఇప్పుడు సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు.. స్మార్ట్ టెక్నాలజీతో నడిచే హైటెక్ వాహనంగా మారిపోయింది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో గూగుల్ మ్యాప్స్, ఫాల్ అలర్ట్స్, కనెక్టివిటీ ఫీచర్లు భారీగా వైరల్ అవుతున్నాయి. నావిగేషన్, సేఫ్టీ, కనెక్టివిటీ వంటి అంశాల్లో ఏథర్(ather) ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చినట్లుగానే, మీ స్కూటర్(Smart Electric Scooter) కూడా కొత్త ఫీచర్లతో స్మార్ట్‌గా మారిపోతుంది.

ఈ ఎలక్ట్రిక్ SUV కోసం ఇప్పటినుంచే వెయిటింగ్ మొదలైంది!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా (Kia) మరో కొత్త ఈవీతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఎంతోకాలంగా వార్తల్లో నిలిచిన కియా సైరోస్ ఈవీ (Syros EV) ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిక్ SUV గురించి పలు వదంతులు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు దీని విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇది పూర్తిగా కొత్తగా తయారైన వాహనం కాకుండా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫ్యూయల్ పవర్డ్ సైరోస్ SUVకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా రానుంది. అందువల్ల డిజైన్ పరంగా భారీ మార్పులు కనిపించే అవకాశం తక్కువ.

రూ.15 లక్షల బడ్జెట్‌లో టాప్ 7 సీటర్ కార్స్ ఇవే

వేసవి సెలవులు వచ్చేశాయి. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు మంచి మైలేజీ ఇచ్చే, భారీ స్పేస్ ఉన్న 7-సీటర్ కారు అవసరమని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సిఎన్‌జి (CNG) ధరల్లో మార్పులు వచ్చాక, మధ్యతరగతి కుటుంబాల చూపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపీవీల (MPV) వైపు మళ్లింది. 2026 ఏప్రిల్, మే నెలల అమ్మకాల ట్రెండ్ ప్రకారం.. రూ.15 లక్షల లోపు బడ్జెట్‌లో భారతీయ రోడ్లపై రాజసం చలాయిస్తున్న నాలుగు బెస్ట్ 7-సీటర్ కార్ల పూర్తి వివరాలు మీకోసం!
Advertisement

చిన్న ఫ్యామిలీల ఫస్ట్ ఛాయిస్ ఇదే! స్విఫ్ట్‌కు భారీ డిమాండ్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నమ్మే కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పేరు ముందువరుసలో నిలుస్తుంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాలతో ఈ కారు చాలా సంవత్సరాలుగా వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. కాలం మారుతున్నా, కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. బంగారానికి డిమాండ్ పెరిగినట్లు దీనికి డిమాండ్ పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలవడం దీని ప్రజాదరణకు నిదర్శనం.