20వ తేదీన టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ సర్ప్రైజ్

టాటా పంచ్ (tata punch) భారత ఆటో మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, కాంపాక్ట్ సైజ్‌లో SUV ఫీల్, మంచి సేఫ్టీ రేటింగ్ వంటి కారణాలతో ఈ కారు తక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకుంది. టాటా మోటార్స్ ఈ మోడల్‌ను అంతర్గత దహన ఇంజిన్ (IC ఇంజిన్), పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చి, విభిన్న అవసరాలున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే టాటా పంచ్ IC ఇంజిన్ వెర్షన్‌కు నవీకరించబడిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్, ఫీచర్లు మరింత మెరుగుపడటంతో పాటు, వినియోగదారుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది.

నెంబర్ ప్లేట్ రంగును చూసి వెహికల్ జాతకం చెప్పొచ్చు

రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం రకరకాల రంగుల నంబర్ ప్లేట్లను చూస్తుంటాం. చాలామందికి వైట్, ఎల్లో కలర్ ప్లేట్ల గురించి మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్లు కేవలం నంబర్లను ప్రదర్శించడానికి మాత్రమే కాదు, ఆ వాహనం దేనికి సంబంధించింది? దాని యజమాని ఎవరు? ఆ వెహికల్ చట్టపరమైన హోదా ఏంటి? అనే విషయాలను ఇట్టే చెప్పేస్తాయి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ రంగులను కేటాయించారు. ఒకవేళ మీరు తప్పుడు నంబర్ ప్లేట్‌తో దొరికిపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే నంబర్ ప్లేట్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

కారు ఉండాలనే కోరికను నెరవేర్చిన కార్ ఇదే!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (maruti suzuki wagonr) భారత ఆటో మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా ఒక నమ్మకమైన, ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో కుటుంబ వినియోగదారుల నుంచి ఈ కారుకు ఎప్పటికీ మంచి స్పందన లభించింది. అందుకే చాలా మంది వినియోగదారులు వ్యాగన్ఆర్‌ను ఆనందంగా కొనుగోలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, 2026 జనవరి నెలలో ఈ కారు అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. జనవరి 2026లో మొత్తం 15,118 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య స్పష్టంగా తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2025 జనవరిలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 24,078 యూనిట్లు అమ్ముడయ్యాయి.

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ కారు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీల హవా కొనసాగుతోంది.ప్రస్తుతం కొత్త కారు కొనే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఎస్యూవీనే. ముఖ్యంగా సెవెన్ సీటర్ లగ్జరీ ఎస్యూవీ విభాగంలో ఇప్పటి వరకూ టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని కింగ్ లా వెలుగొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి సవాల్ విసిరేందుకు జర్మన్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్(Volkswagen) తన అస్త్రాన్ని రెడీ చేసింది. సరికొత్త టైరాన్ ఆర్ లైన్ (Tayron R-Line) ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం పెట్టేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం కావడంతో కార్ లవర్లలో ఉత్సాహం నెలకొంది.
Advertisement

జూపిటర్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్

టీవీఎస్ జూపిటర్ 110 (Tvs Jupiter 110) భారత మార్కెట్‌లో చాలా కాలంగా ఒక నమ్మకమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా నిలిచింది. రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతగానో అనుకూలంగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అలాగే మంచి మైలేజ్ అందించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారుల నుంచి దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ప్రతి నెలా ఈ స్కూటర్ మంచి అమ్మకాలు నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. ఇప్పటికే జూపిటర్‌ను వినియోగిస్తున్న కస్టమర్లు కూడా దీని పనితీరు, సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టీవీఎస్ కంపెనీ జూపిటర్ 110 స్కూటర్ ధరలను సవరించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ప్రతి వేరియంట్‌పై కొంత ధర పెంపు జరిగింది.

ఒక్క ప్రకటనతో దేశాన్నే ఆశ్చర్యపరిచిన రివోల్ట్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో ఎలక్ట్రికల్ బైక్ తయారీలో అగ్రగామిగా ఉన్న రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండ్‌ను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ వార్త ఇప్పుడు అటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ, ఇటు ఆటోమొబైల్ రంగంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

రూ.లక్ష దాకా తగ్గిన ఐ20 ధర.. కొత్త ధర ఎంతంటే ?

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది. తన మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ మోటార్స్ ఐ20 ధరలను భారీగా తగ్గించడమే కాకుండా, ఒక సరికొత్త బడ్జెట్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

ఈ కారు కోసం నెలల తరబడి వెయిట్!

కొత్త టాటా సియెర్రా (Tata Sierra) SUV భారత ఆటోమొబైల్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో గ్రాండ్ లాంచ్‌తో పరిచయమైన ఈ SUV, లాంచ్ అయిన క్షణాల నుంచే తన స్టైలిష్ డిజైన్, ఆధునిక లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పటి ఐకానిక్ పేరైన 'సియెర్రా'ను ఆధునిక టచ్‌తో తిరిగి తీసుకురావడం టాటా మోటార్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. డిజైన్ పరంగానే కాదు, మార్కెట్ రెస్పాన్స్ విషయంలో కూడా టాటా సియెర్రా అంచనాలను మించి విజయాన్ని సాధించింది. డిసెంబర్ 16 నుంచి అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభం కావడంతో, వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.
Advertisement

31 రోజుల్లోనే 17 వేల మందికి పైగా కొనేశారు

మారుతి సుజుకి 2026 సంవత్సరాన్ని కూడా బలమైన అమ్మకాలతోనే ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ మొత్తం 2.37 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇది భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ప్రయాణికుల కార్ల విభాగంలో వినియోగదారుల నమ్మకం పొందిన బ్రాండ్‌గా మారుతి కొనసాగుతుండటానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ఈ భారీ అమ్మకాలలో స్విఫ్ట్, బ్రెజ్జా, డిజైర్, బాలెనో వంటి పాపులర్ మోడళ్లే ప్రధానంగా కీలక పాత్ర పోషించాయి. ఈ కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటం వల్ల, జనవరి నెలలో ఇవి రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరు, సరసమైన ధరల కలయికే ఈ మోడళ్లను వినియోగదారుల మొదటి ఎంపికగా మార్చిందని చెప్పవచ్చు.

మారుతి, టాటాలకు వెన్నులో వణుకు మొదలైంది

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి భారీ స్కెచ్ వేసింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు సవాల్ విసురుతూ, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అదే నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton). ఫిబ్రవరి 4న ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ, ఒక చిన్న వ్యూహాత్మక మార్పు కారణంగా ఇది కొద్దిగా ఆలస్యమైంది. నిస్సాన్ సంస్థ తన సరికొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను ఫిబ్రవరి 4న ఆవిష్కరిస్తుందని అందరూ భావించారు. కానీ, అంతకంటే ముందే తన 7-సీటర్ ఎంవీవీ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను మార్కెట్లోకి పంపాలని నిస్సాన్ నిర్ణయించుకుంది. నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. గ్రావైట్ లాంచ్ పూర్తయిన వెంటనే, టెక్టాన్ ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే నిస్సాన్ రెండు పెద్ద అస్త్రాలను వదలబోతోందన్నమాట. నిస్సాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది రోడ్డుపై ఒక రాజసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కారు డిజైన్ నిస్సాన్ ప్రసిద్ధ గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ నుంచి స్ఫూర్తి పొందింది. దీనికి పవర్‌ఫుల్ గ్రిల్, C-షేప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. 17 లేదా 18 ఇంచుల అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ , మజిల్ లాంటి బాడీ లైన్స్ కారుకు ఒక అడ్వెంచరస్ లుక్ ఇస్తాయి. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, టెక్టాన్ బ్యాడ్జింగ్‌తో కారు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. లోపల అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. టెక్టాన్‌లో నిస్సాన్ ఎలాంటి ఫీచర్లను కూడా వదల్లేదు. 10.1 ఇంచ్ లార్జ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు (ముందు భాగంలో), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది. సేఫ్టీ విషయంలో నిస్సాన్ రాజీ పడలేదు. ఈ కారులో లెవల్ 2 అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ను అమర్చారు. ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ప్రమాదాలను అరికడుతుంది. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా రానున్నాయి. నిస్సాన్ టెక్టాన్ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రకాల ఇంజిన్లు ఉండే అవకాశం ఉంది:1.0 లీటర్ టర్బో పెట్రోల్: సిటీలో ప్రయాణించడానికి, మంచి మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.3 లీటర్ టర్బో పెట్రోల్: హైవేలపై వేగంగా వెళ్లాలనుకునే వారికి, ఎక్కువ హార్స్ పవర్ ఇచ్చే ఇంజిన్ ఇది.1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ ఇంజిన్ అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది, ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరలో కారు విడుదలైతే, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి దిగ్గజ కార్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే కంపెనీగా నిస్సాన్ తన గుర్తింపును మళ్ళీ దక్కించుకోనుంది.

గ్రాఫిక్స్ మారాయి.. క్రేజ్ పెరిగింది.. హోండా డియో 125 X లాంచ్

భారత టూవీలర్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తాజాగా డియో 125 X ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యువ రైడర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డియో 125కి మరింత స్పోర్టీ, ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చింది. కొత్త ఎడిషన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవ్వగా, ఫిబ్రవరి రెండో వారం నుంచి హోండా డీలర్‌షిప్‌ల ద్వారా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. హోండా డియో 125 X ఎడిషన్‌లో మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా, పూర్తిగా డిజైన్, విజువల్స్‌పై దృష్టి పెట్టింది. అదే నమ్మకమైన ఇంజిన్, పనితీరును కొనసాగిస్తూనే, ప్రత్యేకమైన గ్రాఫిక్స్, కొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో ఈ స్కూటర్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది.

సింహం లాంటి కారు..కుటుంబానికి బుల్లెట్ ఫ్రూఫ్ సేఫ్టీ

టాటా మోటార్స్ తన సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ (Tata Punch)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి వదిలింది. రూ.5.59 లక్షల ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. హ్యాచ్‌బ్యాక్ ధరలోనే ఎస్‌యూవీ ఫీచర్లు ఇస్తుండటంతో మారుతి వ్యాగన్ ఆర్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
Advertisement

అందరి ఇంటి పేరుగా మారిపోయిన కారు

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారత మార్కెట్లో ఎన్నేళ్లుగా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్ వంటి అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుకే కాలం మారినా, కొత్త కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ కారుకు డిమాండ్ పెరుగుతుండటం దీనికి స్పష్టమైన నిదర్శనం. వినియోగదారులు స్విఫ్ట్‌ను ఎంతో ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, అలాగే డైలీ కమ్యూట్ కోసం కారును ఉపయోగించే వారు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైవ్ చేయడానికి సులభం, నగర రోడ్లకు అనుకూలంగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలు స్విఫ్ట్‌ను బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఎప్పటికప్పుడు నిలబెడుతున్నాయి.

మహిళలు ఈజీగా డ్రైవింగ్ చేసే కార్లు ఇవే

ప్రస్తుతం భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆఫీసు పనులకైనా, పిల్లలను స్కూల్‌కు దింపడానికైనా లేదా షాపింగులకైనా సొంతంగా కారు డ్రైవ్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‎గా మారింది. అయితే, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో భారీ కార్లను నడపడం కొంచెం కష్టమైన పని. అందుకే మహిళా డ్రైవర్ల కోసం, ముఖ్యంగా కొత్తగా కారు నేర్చుకునే వారి కోసం తేలికపాటి స్టీరింగ్, మంచి రోడ్ విజబిలిటీ ఉన్న టాప్-5 కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.86 వేలకే కొత్త షైన్ లాంచ్.. స్టైల్ పెంచేసిన హోండా షైన్ 125

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2026 క్యాలెండర్ సంవత్సరాన్ని మరింత స్పెషల్‌గా మార్చే ఉద్దేశంతో భారత మార్కెట్లో షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ (Shine 125 Limited Edition) ను విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర రూ. 86,211 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. పేరు చెప్పినట్టే, ఇది పూర్తిగా ప్రత్యేకతను హైలైట్ చేసే ఎడిషన్ అయినప్పటికీ, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం డిజైన్, విజువల్ అప్‌గ్రేడ్స్‌కే పరిమితమైంది. హోండా షైన్ 125 ఇప్పటివరకు తన సింపుల్, నమ్మదగిన ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అదే ప్రాథమిక రూపాన్ని కొనసాగిస్తూ, ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రం సూక్ష్మమైన కానీ ప్రీమియం టచ్ ఉన్న గ్రాఫిక్ అప్‌డేట్స్‌ను జోడించారు.

రేంజ్ అంటే ఇది..అంబానీ గ్యారేజీలోకి రెండు లగ్జరీ కార్లు

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి మరో రెండు అద్భుతమైన లగ్జరీ కార్లు వచ్చి చేరాయి. సాధారణంగానే అంబానీ గ్యారేజీని జియో గ్యారేజీ అని పిలుస్తారు. అక్కడ ఇప్పటికే 150కి పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రెండు మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 (Mercedes-Maybach SL 680) మోనోగ్రామ్ ఎడిషన్ రోడ్‌స్టర్ కార్లు ఆ జాబితాలో చేరాయి.
Advertisement

సుజుకి యాక్సెస్‎లో ఇక ఫుల్ సేఫ్టీ వచ్చేసింది భయ్యా

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ల విభాగం ఎప్పుడూ హాట్ కేకులాగే ఉంటుంది. ఇక్కడ ఇన్నాళ్లూ హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 జెండా ఎగురవేస్తూ వస్తున్నాయి. అయితే వీటికి గట్టి పోటీనిస్తూ, జపాన్ దిగ్గజం సుజుకి తన ఐకానిక్ మోడల్ సుజుకి యాక్సెస్ 125(Suzuki Access 125)లో సరికొత్త మార్పులు చేసి మార్కెట్లోకి వదిలింది. ఈసారి కేవలం లుక్స్ మాత్రమే కాదు, భద్రతకు పెద్దపీట వేస్తూ రెండు కొత్త వేరియంట్లను సుజుకి పరిచయం చేసింది. అవే రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ TFT ఏబీఎస్ ఎడిషన్. ఈ కొత్త వేరియంట్ల రాకతో హోండా, టీవీఎస్ కంపెనీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

7 మందికి సరిపోయే ఫ్యామిలీ కారు రూ.5.75 లక్షలకే

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, జపాన్‌కు చెందిన నిస్సాన్ మధ్య ఉన్న గ్లోబల్ భాగస్వామ్యం భారత ఆటో మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌కు దారితీయబోతోంది. ఈ పొత్తులో భాగంగా, ప్రస్తుతం భారత్‌లో మంచి ఆదరణ పొందుతున్న రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని, నిస్సాన్ ఒక సరికొత్త 7-సీటర్ MPVను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త మోడల్‌కు నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేస్తూ, తొలుత దీనిని జనవరి 21న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఊహించని కారణాలతో ఈ లాంచ్ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఆటో ప్రియులు, ముఖ్యంగా నిస్సాన్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరదించుతూ, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కొత్త లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించింది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో టాటా టాప్ గేర్.. జనవరి 2026 రిపోర్ట్

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి వస్తోందని తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వినియోగదారుల్లో మారుతున్న ఆలోచనలు అన్నీ కలిసి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. దీనికి బలమైన ఉదాహరణగా 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. నివేదికల ప్రకారం, భారతీయ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగం జనవరి 2026లో మొత్తం 18,042 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కేవలం ఒక నెల గణాంకమే అయినా, మార్కెట్ దిశను స్పష్టంగా చూపించే సంఖ్యగా చెప్పుకోవచ్చు.

విదేశీయులు కూడా ఈ కారే కావాలంటున్నారు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ విపణిలోనూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఇండోనేషియా ప్రభుత్వ సంస్థ నుంచి ఏకంగా 35,000 మహీంద్రా స్కార్పియో పిక్-అప్ ట్రక్కుల కోసం భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇది మహీంద్రా చరిత్రలోనే అతిపెద్ద ఎగుమతి ఆర్డర్ కావడం విశేషం. భారతీయ తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఒప్పందం ప్రపంచానికి చాటిచెబుతోంది.
Advertisement

మహిళలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే స్కూటర్లు

ఒకప్పుడు గేర్‌లెస్ స్కూటర్లు అంటే మహిళల కోసమే అనే భావన భారతదేశంలో బలంగా ఉండేది. బైక్‌లు పురుషులకే, స్కూటర్లు మహిళలకే అన్నట్లు ఒక గీత వేసుకున్న పరిస్థితి అది. కానీ కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి, డిజైన్‌లో వచ్చిన మార్పులు, మెరుగైన పనితీరు కారణంగా ఆ ఆలోచనను భారతీయులు పూర్తిగా తోసిపుచ్చారు. ఇప్పుడు పురుషులు కూడా గేర్‌లెస్ స్కూటర్లను విరివిగా వాడుతున్నారు. నగరాల్లో అయితే బైక్‌లకు బదులు స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే, ఈ మార్పులన్నింటిలో గేర్‌లెస్ స్కూటర్లు మహిళలకు మాత్రం నిజంగా ఒక పెద్ద వరంగా మారాయి. తేలికపాటి బరువు, సులభమైన హ్యాండ్లింగ్, క్లచ్-గేర్ టెన్షన్ లేకపోవడం వంటివి మహిళలకు ఎంతో అనుకూలంగా మారాయి.

3.50 లక్షలకే కారు.. ఏకంగా 33 కిమీ మైలేజ్

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజల నాడి తెలిసిన ఏకైక కంపెనీగా మారుతి సుజుకి తన ప్రస్థానాన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తోంది. నేడు మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, లీటరు పెట్రోల్ పోస్తే ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని లెక్కలు వేసుకునే సగటు భారతీయుడికి మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సోలే ఇప్పటికీ ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. 2026 ప్రారంభంలో ఈ కార్లు క్రియేట్ చేసిన అమ్మకాల ప్రభంజనం, వాటి సాంకేతిక విశేషాలు భారత ఆటోమొబైల్ మార్కెట్ గమనాన్ని మరోసారి మార్చేశాయి.

రికార్డు సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా పంచ్

టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణంలో నెక్సాన్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ పొందిన కారు ఏదైనా ఉందంటే అది పంచ్ (punch) అనే చెప్పాలి. ఈ మాటలకు బలమైన ఆధారం దీని అమ్మకాల గణాంకాలే. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే, టాటా పంచ్ భారత వినియోగదారుల మనసు గెలుచుకుని కంపెనీకి మరో బ్లాక్‌బస్టర్ మోడల్‌గా మారింది. ఆవిష్కరణ జరిగిన నాలుగు సంవత్సరాలు పూర్తికాకముందే టాటా పంచ్ 7 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం నిజంగా విశేషం. అంతేకాదు, భారతదేశంలో 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న కారుగా పంచ్ నిలిచిందని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ కారు మీద ప్రజలకు ఉన్న నమ్మకం, డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

7 సీటర్ సెగ్మెంట్‌లో టైరాన్ సంచలనం

2.0-లీటర్ TSI ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు లెవల్ 2 ADAS కలిగిన వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్‌ను అన్వేషించండి. ఈ ఏడు సీటర్ SUV ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి.
Advertisement

అతి తక్కువ ధరలో 7 సీటర్ ఫ్యామిలీ కార్ కొనాలంటే ఇదే బెస్ట్!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను గమనిస్తే, ముఖ్యంగా 7 సీట్ల MPV కార్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చిన్న కుటుంబాలకు ఐదుగురు సౌకర్యంగా కూర్చోగల హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ.6-7 లక్షల మధ్య ధరలో దొరికినా, రూ.9 లక్షల లోపు 7 సీట్ల MPV ఎంపికలు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ ఖాళీని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) నిలుస్తోంది. ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ప్యాకేజీగా ఎర్టిగా భారత కుటుంబాల మనసు దోచుకుంది. తక్కువ ధరలో 7 మందికి సరిపడా స్థలం, మంచి కంఫర్ట్, రోజువారీ వాడుకకు అనుకూలమైన ఫీచర్లు అందించడం వల్ల ఇది ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది.