ఉబెక్స్ రాకతో మార్కెట్ షేక్ అవ్వాల్సిందే

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన ఎలక్ట్రిక్ విభాగం విడా (Vida) ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో గట్టి పోటీనిస్తున్న హీరో, ఇప్పుడు తన దృష్టిని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై మళ్లించింది. ఇందులో భాగంగా అత్యంత పవర్ఫుల్, స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ విడా ఉబెక్స్ (Vida UBEX) డిజైన్ పెటెంట్‌ను భారత్‌లో పొందింది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఆధిపత్యానికి గండి కొట్టేలా సిద్ధమవుతున్న ఈ బైక్, 2026లో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ఒక పెను మార్పుగా నిలవబోతోంది.

ఈ కారుకు ఏ దిష్టి తగిలింది భయ్యా?

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతికి చిరునామాగా నిలిచింది. కానీ, 2026 సంవత్సరం ప్రారంభం ఈ కారుకు అనుకున్నంత ఆశాజనకంగా లేదు. 34 కిలోమీటర్ల మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ వంటి బలమైన అంశాలు ఉన్నప్పటికీ, జనవరి నెలలో అమ్మకాలు ఊహించని రీతిలో పతనం కావడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది.

మధ్యతరగతి యువతకి సరైన స్పోర్టీ బైక్!

TVS Apache RTR 160 భారత మార్కెట్లో ఒక ప్రముఖమైన స్పోర్టీ మోటార్‌సైకిల్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టైల్, పనితీరు, ధర ఈ మూడు విషయాల్లోనూ సమతుల్యత ఉండటంతో ఇది ముఖ్యంగా మధ్యతరగతి యువతకు సరైన ఎంపికగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, రోజువారీ ప్రయాణాలకు సరిపడే మైలేజ్ అందించడం ఈ బైక్‌కు ప్లస్ పాయింట్. మీరు ఇప్పుడు కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉంటే, పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్టీ లుక్, నమ్మకమైన బ్రాండ్ విలువ కావాలంటే Apache RTR 160 ఖచ్చితంగా పరిశీలించాల్సిన మోడల్. నగరంలో డైలీ కమ్యూట్ అయినా, హైవే రైడింగ్ అయినా అన్ని అవసరాలకు ఇది సరిపోతుంది. ఈ బైక్ గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందిస్తున్నాము.

ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మొత్తం ఒకే కారులో

భారతదేశంలో ఇప్పుడు పెద్ద కుటుంబాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లడానికి అనువైన కార్ల కోసం జనం ఎగబడుతున్నారు. అందుకే ఇప్పుడు కార్ల కంపెనీలన్నీ ఎమ్‌పీవీ (MPV - Multi Purpose Vehicle)ల మీద దృష్టి పెట్టాయి. వచ్చే కొన్ని నెలల్లో భారత రోడ్ల మీదకు రాబోతున్న టాప్-6 ఫ్యామిలీ కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

రోడ్డుపై జారకుండా కాపాడే టెక్నాలజీ

ఇటీవల భారత మార్కెట్‌లోకి వచ్చిన కొత్త సుజుకి యాక్సెస్ 125 ఏబీఎస్ (Suzuki Access 125 abs) స్కూటర్ వినియోగదారుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. ఇప్పటికే యాక్సెస్ 125కు ఉన్న మంచి పేరు, నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ కొత్త ABS వెర్షన్‌ను సుజుకి లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, భద్రతకు పెద్దపీట వేయడం వల్ల ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ స్కూటర్‌లో ఇచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ సింగిల్-ఛానల్ ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్). అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వీల్ లాక్ కాకుండా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో లేదా జారి పడే రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ABS సిస్టమ్ ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.

దెబ్బకు రూ.37,000 ఆదా..ఇక షోరూమ్‌ల దగ్గర క్యూలే

కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? అది కూడా తక్కువ ధరలో ఎస్‌యూవీ (SUV) లాంటి లుక్ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ ఎస్-ప్రెస్సో(Maruti S-Presso) పై ఫిబ్రవరి 2026లో కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో పాటు, లీటరుకు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యింది. ఫిబ్రవరి 2026 నెలలో మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన ఎస్-ప్రెస్సోపై భారీ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో గనుక కారు కొంటే ఏకంగా రూ.37,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో వేర్వేరు రకాల తగ్గింపులు ఉన్నాయి.

రూ.6.85 లక్షలు.. అయినా కంపెనీకి పెద్ద ట్విస్ట్!

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (maruti suzuki fronx) భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన కాంపాక్ట్ SUV. స్టైలిష్ డిజైన్, మారుతి బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ వంటి కారణాలతో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతీ నెలా గౌరవప్రదమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకుంది. అయితే, జనవరి 2026 నెలలో మాత్రం ఈ SUV అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం 13,353 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయగలిగింది. గత సంవత్సరం ఇదే కాలం అయిన జనవరి 2025లో ఈ సంఖ్య 15,192 యూనిట్లుగా ఉండడం గమనార్హం.

మైలేజ్ పెరగాలంటే ఎంత స్పీడుగా వెళ్లాలో తెలుసా ?

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కారు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే మెయిన్ ప్రాబ్లమ్ మైలేజ్. షోరూమ్ వాడు చెప్పినప్పుడు లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుందన్న కారు, రోడ్డు మీదకు వచ్చేసరికి 12 లేదా 13 దగ్గరే ఆగిపోతుంటుంది. అసలు కారు ఎంత స్పీడ్‌లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది? నెమ్మదిగా వెళ్తే ఇంధనం ఆదా అవుతుందా? లేక టాప్ గేర్‌లో దూసుకుపోతే కలిసి వస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానంతో పాటు, మీ జేబుకు చిల్లు పడకుండా ఉండటానికి పాటించాల్సిన రూల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

హైదరాబాద్ ట్రాఫిక్‌కు బెస్ట్ కార్లు

భారతదేశంలోని మెట్రో నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా, రోజువారీ వాహనాల వినియోగం ప్రజలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నివసించే వారు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఓ పెద్ద పరీక్షలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు, నగరాల్లో డ్రైవింగ్‌ను మరింత సులభంగా, సౌకర్యంగా మార్చే దిశగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ పరిమాణం, సులభమైన మలుపులు, మంచి మైలేజ్, ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా నడిచే లక్షణాలతో ఈ కార్లు నగర ప్రయాణాలకు సరైన పరిష్కారంగా మారుతున్నాయి. ఈ కథణంలో ఆ కార్లను చూద్దాం.

ఇప్పుడు బుక్‌ చేస్తే డెలివరీకి ఒక ఏడాది టైం

మహీంద్రా (Mahindra) భారత మార్కెట్లో తన పాపులర్ SUV 700ను తాజాగా అప్‌డేట్ చేసి XUV7XO అనే కొత్త పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జనవరిలో లాంచ్ అయిన ఈ SUVకు కొత్త పేరు మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు, ఆధునిక ఫీచర్లు కూడా జోడించడంతో మార్కెట్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు చాలా మంది కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ SUV బుకింగ్‌లు డిసెంబర్ 15, 2025 నుంచి ప్రారంభం కాగా, డెలివరీలు జనవరి 14 నుంచి మొదలయ్యాయి. అయితే డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో, వేరియంట్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, మిడ్ వేరియంట్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

రూ.6 లక్షలకే 7 సీట్ల కారు..ఫిబ్రవరి 17న లాంచ్

భారతీయ రోడ్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇష్టమైన వాహనం ఏదైనా ఉందంటే అది ఎంపీవీ(MPV - Multi Purpose Vehicle). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో ఇప్పటికే మారుతి ఎర్టిగా, రెనో ట్రైబర్ రాజ్యమేలుతుండగా, ఇప్పుడు వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ సిద్ధమైంది.

ఇదే లక్కీ ఛాన్స్..ఇది మిస్సయితే చాలా నష్టపోతారు

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? మరీ ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) కోరుకునే వారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ (Maruti Suzuki Victoris) పై లాంచ్ అయిన తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ కారుపై ఏకంగా రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం నాలుగు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన ఈ కారుపై ఆఫర్లు ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement

టాటా ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ పాత బైక్ లేదా మెట్రో ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కారులో షికారు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ ఫిబ్రవరి 2026లో టాటా అందిస్తున్న ఈ భారీ తగ్గింపులు, కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. టాటా మోటార్స్ తన స్టాక్ క్లియరెన్స్ లో భాగంగా పాత, కొత్త మోడళ్లపై వైవిధ్యమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా MY24, MY25 (2024, 2025 తయారీ) మోడల్ టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

మిడిల్ క్లాస్ వాళ్ల కోసమే తెచ్చిన లగ్జరీ కారు మావ

టాటా కర్వ్ (Tata Curvv) వంటి ఖరీదైన కూపే ఎస్‌యూవీని కొనాలని ఉందా? కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మార్కెట్లోకి ఒక అదిరిపోయే ఆప్షన్ వచ్చేసింది. అదే సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్(Citroen Basalt X). చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తున్న ఈ కారు.. ధర విషయంలో మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉంది. కేవలం రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే మైలేజీని ఇస్తూ ఇప్పుడు కార్ల ప్రేమికుల హాట్ ఫేవరెట్ గా మారింది. అసలు ఈ కారులో ఏముంది? ఇది టాటా కర్వ్‌కు గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు తెలుసుకుందాం.

ధర పెరిగినా కూడా ఈ బైక్ క్రేజ్ తగ్గదు

యూత్ ఫేవరెట్ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్ (TVS Ntorq 125) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే షోరూమ్‌కు వెళ్లే ముందు ఈ వార్త చదవాల్సిందే. ప్రస్తుత కాలంలో కాలేజీ కుర్రాళ్ల నుంచి ఆఫీసు వెళ్లే యువత వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్ ధరలపై కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఉత్పాదక ఖర్చుల దృష్ట్యా ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పోర్టీ స్కూటర్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు టీవీఎస్ ఎన్ టార్క్.

టాటా-మారుతిలకు గట్టి పోటీ ఇస్తున్న కియా కారు

కియా సోనెట్ (Kia Sonet) దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా నుంచి వచ్చిన ఒక కాంపాక్ట్ SUVగా భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో ఇది మొదటి చూపులోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సెల్టోస్ ద్వారా భారీ విజయం అందుకున్న తర్వాత, భారత మార్కెట్‌లో కియా బ్రాండ్‌పై నమ్మకం మరింత పెరిగింది. ఆ విశ్వాసానికి కొనసాగింపుగా, కియా ప్రవేశపెట్టిన తొలి మేడ్ ఇన్ ఇండియా SUVగా సోనెట్‌కు ప్రత్యేక స్థానం లభించింది. ఈ కారు కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, కియా ఇండియా వ్యూహంలో కీలక పాత్ర పోషించింది. నేడు చూస్తే, కియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనం కూడా ఇదే కావడం విశేషం.
Advertisement

కార్ కొనాలంటే దేశం మొత్తం చెప్పేది ఒక్క పేరే

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) భారత ఆటోమొబైల్ మార్కెట్లో నిజంగా ఒక ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. కాలం మారినా, కస్టమర్ల అవసరాలు మారినా, అతి తక్కువ ధరకే నమ్మకమైన కారు అనే గుర్తింపును ఈ కారు ఇప్పటికీ కోల్పోలేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసే వాహనంగా ఆల్టో K10 పేరు నిలిచిపోయింది. తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలని కలగనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. మొదటి కారు కొనుగోలు చేసే వారు, రోజువారీ పనుల కోసం సరళమైన వాహనం కావాలనుకునే కుటుంబాలు, చిన్న వ్యాపార అవసరాలకు ఉపయోగించే వారు అందరికీ ఆల్టో K10 సరైన ఎంపికగా కనిపిస్తోంది.

రూ.60 పెట్రోల్‌తో 45 కి.మీ మైలేజ్ బైక్, ధర రూ.65 వేలు

బజాజ్ ప్లాటినా 110 (bajaj platina 110) భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు, రోజంతా బైక్ మీదే ఆధారపడే వినియోగదారుల కోసం ప్లాటినా ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఈ బైక్‌కు ఉన్న ప్రధాన బలం దాని తక్కువ నిర్వహణ ఖర్చులు. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండడంలోనూ ప్లాటినా వినియోగదారులకు ఎలాంటి భారాన్ని మోపదు. సాధారణంగా నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల, దీర్ఘకాలంలో ఈ బైక్‌ను ఉపయోగించడం చాలా లాభదాయకంగా మారుతుంది.

మహిళల టీ20 విజేతలకు మరపురాని బహుమతి

ఈ ఏడాది మహిళల టీ20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్లుగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకుంది. సీజన్ మొత్తం వారి ఆటలో కనిపించిన ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి, జట్టు సమన్వయం చివరకు వారికి కిరీటాన్ని అందించింది. ఈ చారిత్రక విజయానికి గుర్తింపుగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ ముందుకు రావడం విశేషంగా మారింది. ఆర్‌సీబీ మహిళా జట్టు సాధించిన ఈ ఘనతను గౌరవిస్తూ, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి కొత్త చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందిస్తామని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాకుండా, మహిళా క్రీడాకారుల కష్టానికి, అంకితభావానికి, పట్టుదలకి ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు.

కేవలం నాలుగున్నర లక్షలకే కొత్త టాటా కారు!

టాటా టియాగో (tata tiago) భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఎప్పటి నుంచో మంచి పేరు సంపాదించుకుంది. ధర, భద్రత, నమ్మకమైన పనితీరు ఈ మూడు అంశాలను సమానంగా అందించగల కారుగా టియాగోను చాలా మంది వినియోగదారులు చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగినప్పటికీ, టాటా టియాగో మాత్రం అమ్మకాల విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నిజానికి, తాజా అమ్మకాల గణాంకాలే దీనికి బలమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. జనవరి 2026 నెలలో భారత మార్కెట్లో మొత్తం 8,349 టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి. ఇది చిన్న సంఖ్య కాదు, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం నిజంగా విశేషమే.
Advertisement

రూ.90 వేలకే 322 కి.మీ.రేంజ్ స్కూటర్!

నెలకు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణంపై అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసివచ్చి భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్‌ను రోజురోజుకీ పెంచుతున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ అంటే రేంజ్ తక్కువ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తూ కొత్త తరం ఈవీ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, రేంజ్ విషయంలో వినియోగదారులను నిజంగా ఆశ్చర్యపరుస్తున్న స్కూటర్ మాత్రం కోమాకి తీసుకొచ్చిన XR7 అని చెప్పాలి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునే ప్రతి వినియోగదారుడి మనసులో మొదట వచ్చే ప్రశ్న ఒక్కటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? దీనినే రేంజ్ ఆందోళన అంటారు.

కొండలను పిండి చేసిన ఆంపియర్ నెక్సస్

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ నెక్సస్ (Ampere Nexus) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతిష్టాత్మకమైన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించుకుంది. తమిళనాడులోని అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన కొల్లి కొండలను (Kolli Hills) విజయవంతంగా అధిరోహించిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ఇది రికార్డు సృష్టించింది. సాధారణంగా పెట్రోల్ బండ్లకే సవాలు విసిరే ఈ దారిని, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ చిటికెలో దాటేయడం ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.

షోరూమ్‌లకు వచ్చిన ప్రతిఒక్కరూ ఈ కారే కావాలంటున్నారు

దేశీయ దిగ్గజ ఆటో తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన కొత్త సియెర్రా SUV ఇటీవల కాలంలో భారత ఆటో మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు లెజెండరీ మోడల్‌గా గుర్తింపు పొందిన సియెర్రా పేరును తిరిగి తీసుకురావడంతోనే ఈ కారు జనాల్లో భారీ ఆసక్తిని రేపింది. రెట్రో టచ్‌తో కూడిన ఆధునిక డిజైన్, బోల్డ్ SUV లుక్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి ఈ కారును చూసిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా చేశాయి. కొత్త టాటా సియెర్రా SUVను కంపెనీ అధికారికంగా నవంబర్ 2025లో విడుదల చేయగా, లాంచ్ అయిన వెంటనే దీనికి అద్భుతమైన స్పందన లభించింది. షోరూమ్‌ల వద్ద విచారణలు, బుకింగ్స్ భారీగా పెరిగాయి.

సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టంగా కొంటున్న కారు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) భారత మార్కెట్‌లో ఒక ప్రజాదరణ పొందిన SUVగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే టయోటా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఈ కారుకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు కూడా ఈ SUVను ఆసక్తిగా కొనుగోలు చేస్తుండటంతో, హైరైడర్ అమ్మకాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల అయిన జనవరి 2026లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే మొత్తం 9,156 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది టయోటాకు మాత్రమే కాకుండా, మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు కూడా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు.
Advertisement

పేదలపాలిటి పెన్నిది ఈ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఓమేగా సెకి మొబిలిటీ (Omega Seiki Mobility) సామాన్యుడి బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు వెక్‌స్ట్రా (Vextra). ఇప్పటి వరకు కమర్షియల్ వాహన రంగంలో తన ముద్ర వేసిన ఈ కంపెనీ, ఇప్పుడు ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్లతో ఈ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.