ఒకే ఒక్క కార్‌తో గ్లోబల్ బ్రాండ్స్‌కు చుక్కలు చూపించిన మారుతి

భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో ఎవరూ ఊహించని సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. గత జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోనే నాలుగో అత్యంత విజయవంతమైన ఈవీ కంపెనీగా మారుతి సుజుకి అవతరించింది. ఈ సెగ్మెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో టాటా మోటార్స్, మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీలు నిలవగా, మారుతి సుజుకి ఏకంగా గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లను వెనక్కి నెట్టి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లే, ఈసారి కూడా మారుతి సుజుకి దెబ్బకు హ్యుందాయ్, కియా, బీవైడీ (BYD) లతో పాటు వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం వెనుకబడిపోయాయి.

సామాన్యుడి డ్రీమ్ కారు వచ్చేసింది.. బడ్జెట్‌లోనే

భారత మార్కెట్లో తొలి కారు కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ఇండియా (Renault India) తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కొత్త రెనాల్ట్ క్విడ్ (New Renault Kwid)ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు పూర్తిగా చెందిన అనుబంధ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా, ఈ కొత్త మోడల్‌లో డిజైన్, వేరియంట్లు, ధరల విషయంలో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఎంపికను మరింత సులభతరం చేయడమే ఈ అప్‌డేట్ ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

పెట్రోల్ రేట్ల పెంపుతో జాక్‌పాట్ కొట్టిన ఎంజీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (Jsw Mg Motor India) మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 జూన్ నెలలో కంపెనీ తన వ్యాపార చరిత్రలోనే అత్యధిక నెలవారీ హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేసి, మార్కెట్లో తన పెరుగుతున్న ప్రభావాన్ని మరోసారి నిరూపించింది. కంపెనీ అధికారికంగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాల ప్రకారం, జూన్ 2026లో మొత్తం 7,568 హోల్‌సేల్ యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 30 శాతం వార్షిక వృద్ధి కావడం విశేషం. భారత ఆటోమొబైల్ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇలాంటి వృద్ధిని నమోదు చేయడం కంపెనీకి పెద్ద విజయంగా భావిస్తున్నారు.

స్కోడా కార్ల పై మనసు పారేసుకున్న మనోళ్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) సంచలన విజయాలతో దూసుకుపోతోంది. గత ఏడాది (2025) సాధించిన అద్భుతమైన వృద్ధిని అదే వేగంతో ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. 2026 సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (H1 2026) కంపెనీ రికార్డు స్థాయిలో మొత్తం 38,894 వాహనాలను విక్రయించింది.
Advertisement

తరాలు మారినా.. రోడ్లపై బుల్లెట్ రాజ్యం మాత్రం అలాగే కొనసాగుతోంది!

దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరోసారి ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. కొత్త మోడళ్ల రాక, మార్కెట్లో పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ బుల్లెట్ బైక్‌లపై వినియోగదారుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా సేల్స్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, ప్రత్యేకమైన రైడింగ్ అనుభవం కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఇప్పటికీ యువతతో పాటు టూరింగ్ ప్రియుల తొలి ఎంపికగా కొనసాగుతున్నాయి. కంపెనీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 1,14,032 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో నమోదైన 89,540 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 27 శాతం పెరగడం విశేషం.

దేశంలో ఎక్కువ మంది కొంటున్న SUV ఇదే.

భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) సరికొత్త రికార్డు ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి హ్యుందాయ్ సంస్థ జూలై నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో క్రెటా కారును కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.1,00,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. హ్యుందాయ్ తన కార్ల శ్రేణిలో ఈ నెల అందిస్తున్న అత్యంత పెద్ద డిస్కౌంట్ ఆఫర్ ఇదే కావడం విశేషం.

ఈ కారుకు భారీ హైప్ ఇచ్చారు.. కానీ కొన్నది ముగ్గురే!

దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కీలక అడుగులు వేస్తున్న మారుతి సుజుకి ఇటీవల భారతదేశపు తొలి బయోఫ్యూయల్ ప్యాసింజర్ కారు వ్యాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ (wagonr flex fuel) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కూడా నడిచేలా రూపొందించిన ఈ కారు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది. అయితే ఈ వినూత్న సాంకేతికతపై కంపెనీ పెట్టుకున్న అంచనాలకు భిన్నంగా, మార్కెట్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మారుతి సుజుకి విడుదల చేసిన జూన్ 2026 అమ్మకాల గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ఆర్ కేవలం 3 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాటా సఫారీ, మహింద్రా XUV 7XOలకు చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్న హోండా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ విభాగంలో ముఖ్యంగా మహింద్రా XUV 7XO, టాటా సఫారీ (Tata Safari) కార్లు మంచి అమ్మకాలతో దూసుకుపోతున్నాయి. అయితే, ఈ కార్ల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేయడానికి ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) సరికొత్త వ్యూహంతో సిద్ధమైంది.
Advertisement

ఉద్యోగుల కోసం కేవలం రూ.85,000‎లకే రివోల్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. గుర్గావ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తన లైనప్‌లో ఇప్పటికే ఉన్న RV1, RV1+, RV బ్లేజ్‌ఎక్స్, RV400 BRZ, RV400 మోడళ్ల సరసన ఇప్పుడు సరికొత్త రివోల్ట్ RVX (Revolt RVX) బైక్‌ను చేర్చింది. మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడల్ అటు మైలేజ్ పరంగా, ఇటు ఫీచర్ల పరంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్‌ను ప్రారంభించగా, ఈ జూలై నెల చివరి నాటికల్లా కస్టమర్లకు డెలివరీలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారత మార్కెట్లో రివోల్ట్ RVX బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.1.29 లక్షలుగా నిర్ణయించింది. అయితే సాధారణ సబ్సిడీలు వర్తించిన తర్వాత దీని ధర రూ. 1.24 లక్షలకు తగ్గుతుంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కారు లేదా బైక్ కొనేవారికి మరింత లబ్ధి చేకూరుస్తూ.. అక్కడి ఈవీ (EV) పాలసీ సబ్సిడీల కారణంగా ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.95,000 గానే ఉండటం విశేషం. వీటన్నింటికీ తోడు, ఎవరైనా తమ పాత పెట్రోల్ (ICE) బైక్‌ను స్క్రాప్ చేసి (అమ్మేసి) ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేస్తే.. ఢిల్లీలో దీనిని కేవలం రూ.85,000 లకే సొంతం చేసుకోవచ్చు. రివోల్ట్ సంస్థ ఈ బైక్ కొనుగోలుపై కస్టమర్లకు గట్టి భరోసానిస్తోంది. సాధారణంగా ఈ బైక్‌పై 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వరకు స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. కానీ కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ ప్రత్యేకంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనిని ఎంచుకోవడం ద్వారా ఏకంగా 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. డిజైన్ పరంగా ఈ బైక్ లుక్ సముద్రపు హంతకుడు షార్క్ బాడీ షేప్ నుంచి ప్రేరణ పొంది తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇది ఎలక్ట్రిక్ బ్లూ, పర్ల్ బ్లాక్, ఎక్లిప్స్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఈ బైక్ సాంకేతిక సామర్థ్యాలను పరిశీలిస్తే.. ఇందులో 3.24 kWh సామర్థ్యం గల పోర్టబుల్ (బయటకు తీయగల) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనివల్ల బైక్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 160 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లగలదు. ఛార్జింగ్ విషయానికొస్తే.. సాధారణ హోమ్ ఛార్జర్‌తో 0 నుండి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3.30 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 80 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ నిండిపోతుంది. స్మూత్ రైడింగ్ కోసం ముందు వైపు యూఎస్‌డీ (USD) ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. అలాగే రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో సరికొత్త తరం ఫీచర్లను జోడించారు. ఇందులో ఇన్స్టెంట్ బూస్ట్ మోడ్, కొండలపై బైక్ వెనక్కి జారకుండా ఆపే హిల్ హోల్డ్ కంట్రోల్, నడుచుకుంటూ బైక్‌ను ముందుకు తీసుకెళ్లే వాలీ అసిస్ట్, వెనక్కి వెళ్లేందుకు రివర్స్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కారు బాడీపై కార్బన్ ఫైబర్ ప్యానెల్స్ మరియు ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట రాకుండా ఉండేలా పొడవైన సీటును అమర్చారు.

టాటా చరిత్రలోనే అత్యంత సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ ఈవీ

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహన (EV) ప్రియుల కోసం సరికొత్త సంచలనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎంతో కాలంగా ఆటోమొబైల్ మార్కెట్ ఎదురుచూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీ (Tata Sierra.ev) దేశీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. ఈ కారు ధరలు రూ. 18.79 లక్షల నుండి రూ. 26.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ మోస్ట్ అవేటెడ్ ఈవీ కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించేసింది. జూలై 15వ తేదీ నుండి కస్టమర్లకు ఈ కార్ల డెలివరీలను ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

ఒకటి బ్యాటరీ.. మరొకటి ఇథనాల్.. మీ డబ్బు ఆదా చేసేది ఏది?

పెరుగుతున్న ఇంధన అవసరాలు, ముడి చమురుపై విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం, అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని వేగంగా విస్తరించే దిశగా పలు కీలక చర్యలు చేపడుతోంది. భవిష్యత్ రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా మార్చడంలో ఈ రెండు టెక్నాలజీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈవీలు మరియు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల లక్ష్యం ఒకటే అయినప్పటికీ, అవి పనిచేసే విధానం, ఉపయోగించే ఇంధనం, నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల అవసరాలు, వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాల్లో గణనీయమైన తేడాలు ఉన్నాయి.

లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఈ కంపెనీ స్కూటర్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (ఈవీ) మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు భారీగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో దేశీయ ఈవీ మార్కెట్లో విక్రయాలు భారీగా పుంజుకున్నాయి.
Advertisement

485 కిమీ రేంజ్‌తో BYD కొత్త ఎలక్ట్రిక్ MPV

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండగా, అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం దేశీయ EV మార్కెట్‌లో టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, BYD కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. నాణ్యమైన ఉత్పత్తులు, అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లతో భారత వినియోగదారులను ఆకట్టుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

10 లక్షల బడ్జెట్లో కొత్త కారు కావాలా ?.. కాస్త వెయిట్ చేయండి

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కారు కొనాలనుకునే మెజారిటీ కస్టమర్లు ఎస్‌యూవీ మోడళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, పవర్‌ఫుల్ ఇంజన్, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే కొద్దిరోజులు ఓపిక పట్టడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లోకి టాటా మోటర్స్, మారుతి సుజుకి, కియా, హోండా కంపెనీల నుంచి సరికొత్త ఎస్‌యూవీలు విడుదల కానున్నాయి. ఈ కార్ల ప్రత్యేకత ఏంటంటే వీటి ప్రారంభ ధర కేవలం రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది.

రతన్ టాటా కంపెనీకి బ్రహ్మరథం పడుతున్న జనాలు

భారత ఆటోమొబైల్ రంగంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న టాటా మోటార్స్ (tata motors), జూన్ 2026లో తన ప్యాసింజర్ వెహికల్ (TMPV) విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. గత కొన్ని నెలలుగా కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొనసాగుతున్న బలమైన ఉనికి, అలాగే SUVలపై పెరుగుతున్న డిమాండ్ కంపెనీ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. జూన్ నెలలో విడుదలైన విక్రయ గణాంకాలు చూస్తే, టాటా మోటార్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, జూన్ 2026లో టాటా మోటార్స్ మొత్తం 63,083 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.

పెద్ద ఫ్యామిలీల ఫేవరెట్ ఛాయిస్ ఈ కారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 2026 నెలలో కంపెనీ అత్యుత్తమ అమ్మకాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది జూన్ 2025లో కంపెనీ 20,625 కార్లను విక్రయించగా, ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 24,552 కార్ల హోల్‌సేల్ అమ్మకాలను జరిపింది. దీని ద్వారా కియా ఇండియా వార్షిక విక్రయాల్లో 19 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది. కియా ఇండియా చరిత్రలోనే జూన్ నెలలో నమోదైన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.
Advertisement

2 లక్షల కార్ల విక్రయాలతో మారుతి కొత్త చరిత్ర!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (maruti suzuki) జూన్ 2026 అమ్మకాల గణాంకాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కంపెనీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 2026లో మారుతి సుజుకి దేశీయ మార్కెట్‌లో మొత్తం 1,47,187 వాహనాలను విక్రయించింది. గత ఏడాది జూన్ 2025లో ఈ సంఖ్య 1,18,906 యూనిట్లుగా నమోదైంది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే కంపెనీ దేశీయ అమ్మకాలు 23.78 శాతం పెరగడం విశేషం. ఇటీవలి కాలంలో కార్ల మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, మారుతి సుజుకి ఇలాంటి బలమైన వృద్ధిని నమోదు చేయడం పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

హోండా నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. యాక్టివా e తర్వాత మరో సర్‌ప్రైజ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో పలు కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, హోండా కూడా తన స్థానాన్ని మరింత బలపరచుకోవడానికి కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే యాక్టివా e, QC1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన హోండా, ఇప్పుడు మరో కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ స్కూటర్ మరేదో కాదు.. హోండా యూ-గో (U-Go). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం చైనా, మయన్మార్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతోంది.

ఆశ్చర్యపోయే ఫీచర్లతో రెండు కొత్త టాప్ వేరియంట్లను తెచ్చిన కియా

భారతదేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, ప్రీమియం క్యాబిన్‌తో ఈ SUV ఇప్పటికే లక్షలాది మంది కొనుగోలుదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. మీరు కూడా సెల్టోస్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే, కియా నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీ భారత మార్కెట్లో సెల్టోస్‌కు రెండు కొత్త టాప్-ఎండ్ వేరియంట్లను పరిచయం చేసింది. కొత్తగా విడుదలైన GTX (O), X-Line (O) వేరియంట్లు ఇప్పుడు సెల్టోస్ శ్రేణిలో అత్యంత ప్రీమియం ఆప్షన్లుగా నిలిచాయి. ఈ వేరియంట్ల ప్రారంభ ధర రూ.21.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.

మైలేజ్ తగ్గిందంటే నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ కారణాలు ఉండొచ్చు!

Fuel Efficiency Tips. మీ వాహనం మైలేజ్ అకస్మాత్తుగా తగ్గిందా? ఎయిర్ ఫిల్టర్, టైర్ ప్రెజర్ మరియు డ్రైవింగ్ అలవాట్లు మైలేజ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
Advertisement

జూన్‌లో హ్యుందాయ్ సేల్స్ తగ్గాయి.. కానీ అసలు కారణం ఇదే!

దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) 2026 జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం, కంపెనీ దేశీయ మార్కెట్లో 39,635 కార్లను విక్రయించగా, విదేశీ మార్కెట్లకు 11,700 యూనిట్లను ఎగుమతి చేసింది. దీంతో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం విక్రయాలు 51,335 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా నిలకడగా కొనసాగిన అమ్మకాల జోరు జూన్‌లో కొంత మందగించినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది జూన్‌తో పోలిస్తే దేశీయ అమ్మకాలు 9.97 శాతం తగ్గాయి.

మహీంద్రా కార్ల కోసం ఎగబడుతున్న జనాలు

ప్రతి నెల ముగిసిన వెంటనే దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తుంటాయి. వీటి ద్వారా మార్కెట్లో ఏ బ్రాండ్‌కు ఎంత డిమాండ్ ఉంది, ఏ విభాగం మంచి వృద్ధిని నమోదు చేస్తోంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) కూడా 2026 జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. తాజా గణాంకాలు చూస్తే, కంపెనీ మరోసారి అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలమైన స్థానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.

నానో కంటే చిన్న కారు.. కానీ ధర మాత్రం షాక్ ఇస్తుంది

ప్రపంచవ్యాప్తంగా చిన్న పరిమాణంలోని కార్లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా యూరప్ వంటి దేశాల్లో ఇరుకైన రోడ్లు, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా ఉండటంతో చిన్న కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, నగరాల్లో సులభంగా నడపగలగడం వంటి కారణాలతో ఈ కార్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే భారతదేశంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకప్పుడు సామాన్యుల కారు అనే పేరుతో టాటా మోటార్స్ తీసుకొచ్చిన టాటా నానో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లో నానో కంటే కూడా చిన్న పరిమాణంలో ఉండే కార్లు ఇప్పటికీ విజయవంతంగా అమ్ముడవుతున్నాయి.

మళ్లీ త్వరలో 3 కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల మీద ఫోకస్ పెట్టిన మహీంద్రా

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహనాలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అయితే కేవలం ఈవీలకే పరిమితం కాకుండా మహీంద్రా మళ్లీ తన అసలైన సాంప్రదాయ శైలిలోకి వచ్చేస్తోంది. రాబోయే 9 నెలల కాలంలో మార్కెట్లోకి సరికొత్త పెట్రోల్, డీజిల్ (ICE) ఇంజన్లతో కూడిన మూడు సరికొత్త ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ లైన్ క్లియర్ చేసింది. ఇందులో ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ సృష్టించిన పాపులర్ మోడల్స్ స్కార్పియో-ఎన్, థార్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటు, ఒక సరికొత్త కాంపాక్ట్ కార్ కూడా లైన్అప్‌లో చేరబోతోంది. ఆ మూడు మోడళ్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Advertisement

కొత్త టాటా సియెర్రా EVతో 4 కార్ల పూర్తి కంపారిజన్

దేశీయ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ (tata motors) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా ఈవీ (sierra ev) ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకున్నాం. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. మార్కెట్లో ఇప్పటికే దూసుకుపోతున్న మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV వంటి ప్రత్యర్థుల కంటే సియెర్రా EV ఏ విషయంలో మెరుగ్గా ఉంది? బ్యాటరీ సామర్థ్యం నుంచి రేంజ్ వరకు, పవర్ నుంచి ధర వరకు, ఫీచర్ల నుంచి పనితీరు వరకు అన్ని అంశాల్లో ఈ కార్ల మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.