ఒకే ఒక్క కార్తో గ్లోబల్ బ్రాండ్స్కు చుక్కలు చూపించిన మారుతి
ఆటోమొబైల్స్
- 27 days ago
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో ఎవరూ ఊహించని సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. గత జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోనే నాలుగో అత్యంత విజయవంతమైన ఈవీ కంపెనీగా మారుతి సుజుకి అవతరించింది. ఈ సెగ్మెంట్లో మొదటి మూడు స్థానాల్లో టాటా మోటార్స్, మహీంద్రా, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీలు నిలవగా, మారుతి సుజుకి ఏకంగా గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లను వెనక్కి నెట్టి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లే, ఈసారి కూడా మారుతి సుజుకి దెబ్బకు హ్యుందాయ్, కియా, బీవైడీ (BYD) లతో పాటు వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం వెనుకబడిపోయాయి.