మారుతి కారు కారణంగా తక్కువ ధర ఉన్నప్పటికీ దీన్ని కొనడం లేదు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) బ్రాండ్‌కు ఉన్న ప్రత్యేకమైన ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకమైన పనితీరు, దీర్ఘకాలిక డ్యూరబిలిటీ, అలాగే సర్వీస్ సెంటర్లలో వినియోగదారులకు ఇచ్చే శ్రద్ధ కారణంగా ఈ బ్రాండ్‌పై చాలా మందికి ప్రత్యేకమైన అభిమానం, నమ్మకం ఏర్పడింది. ఒకసారి కారు కొనుగోలు చేసిన తర్వాత కూడా కస్టమర్లతో కొనసాగించే సంబంధం, సర్వీసింగ్ సమయంలో చూపించే జాగ్రత్తలు ఈ బ్రాండ్‌ను ఇతర కంపెనీలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇండియాలో టయోటా తన మార్కెట్ ప్రయాణాన్ని మరింత విస్తరించడంలో Maruti Suzuki తో చేసిన జాయింట్ వెంచర్ కీలక పాత్ర పోషించింది. ఈ భాగస్వామ్యం వల్ల టయోటా వాహనాలు సామాన్య ప్రజలకు కూడా సులభంగా చేరువయ్యాయి.

భారత్‌లో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే

ఒకప్పుడు కారు కొనేటప్పుడు కేవలం మైలేజ్, లుక్స్ మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కారు ఎంత దృఢంగా ఉంది? ప్రమాదం జరిగితే మన ప్రాణాలను కాపాడుతుందా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) తాజాగా దేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాను విడుదల చేసింది. ఈ క్రాష్ టెస్టుల్లో దేశీ, విదేశీ కంపెనీల కార్లు పోటీపడి మరీ 5-స్టార్ రేటింగ్ సాధించాయి. కొత్త కారు కొనాలనుకుంటే ఈ 10 సేఫెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

లక్షకు దగ్గరగా అమ్మకాలు… HF డీలక్స్ కొత్త రికార్డ్ సృష్టి!

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అప్రతిహత ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్న మోడళ్లలో హీరో స్ప్లెండర్‌ (Hero Splendor) తర్వాత అదే స్థాయి డిమాండ్‌ను పొందుతున్న మరో ముఖ్యమైన మోడల్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). ఈ రెండు బైకులు కంపెనీకి బలమైన సేల్స్ వెన్నెముకగా నిలుస్తున్నాయి. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ముఖ్యంగా 100cc ఇంజన్‌తో అందుబాటులో ఉండి, బడ్జెట్‌కు అనుగుణమైన ధరలో వినియోగదారులకు చేరువవుతోంది. స్ప్లెండర్‌తో పోలిస్తే మరింత తక్కువ ధరలో లభించడం వల్ల ఇది గ్రామీణ ప్రాంతాలు, రోజువారీ కూలీ పనులు చేసే వారు, అలాగే మొదటిసారి బైక్ కొనుగోలు చేసే వినియోగదారుల మధ్య విపరీతమైన ఆదరణ పొందుతోంది.

పెళ్లిళ్లకు వెళ్లాలన్నా, టూర్లకు వెళ్లాలన్నా రెండు కుటుంబాలకు సరిపోతుంది

భారతదేశంలోని రోడ్ల మీద ఇప్పటి వరకు కింగ్ అంటే టయోటా ఇన్నోవా అనే ఎవరిని అడిగినా చెబుతారు. ఎన్నో ఏళ్లుగా 7 సీటర్ ఎంపీవీ సెగ్మెంట్‌లో ఇన్నోవాకు ఎదురు లేదనే చెప్పాలి. కానీ, ఇన్నోవా ఏకాధిపత్యానికి బ్రేక్ వేసేందుకు దిగ్గజ కంపెనీలు నడుం బిగించాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ తమ సరికొత్త ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ టెక్నాలజీతో ఇన్నోవాను ఢీకొట్టేందుకు వస్తున్న ఆ మూడు మోడళ్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

అమ్మకాలతో సంచలనం సృష్టించిన హీరో మోటోకార్ప్!

భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ, ప్రతి నెలా లక్షల్లో వాహనాలను విక్రయిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు హీరో బైకులు, స్కూటర్లు భారీగా ఆదరణ పొందుతుండటం కంపెనీ విజయానికి ప్రధాన కారణంగా మారింది. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా హీరో మోటోకార్ప్ బలమైన మార్కెట్ స్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.

మార్కెట్‌ను షేక్ చేయనున్న టాప్ 4 కొత్త CNG కార్స్ ఇవే

మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో సామాన్యుడి చూపు సిఎన్‌జి కార్ల వైపు మళ్లుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండటంతో దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు సరికొత్త సిఎన్‌జి మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, స్కోడా, రెనాల్ట్ కంపెనీలు తమ పాపులర్ కార్లను సీఎన్జీ వెర్షన్లో లాంచ్ చేయడానికి రెడీ అయ్యాయి. మీరు కూడా కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే, మరికొద్ది రోజులు ఆగడం మంచిది. ఎందుకంటే రాబోయే ఈ నాలుగు కార్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టించబోతున్నాయి.

ఇప్పుడు దేశమంతా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకే డిమాండ్!

భారతదేశంలో ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరగడం సామాన్య ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, డెలివరీ పనులు చేసే యువత, చిన్న చిన్న అవసరాల కోసం టూవీలర్లపై ఆధారపడే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఇంధన ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు నెలకు సరిపడే పెట్రోల్ ఖర్చు ఇప్పుడు ఊహించని స్థాయికి చేరుకోవడంతో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు కొత్త ఆశలా కనిపిస్తున్నాయి. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఖర్చును గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఈవీ స్కూటర్లను చూద్దాం.

ఈ కారును 107 మంది మాత్రమే కొన్నారు

ఎంజీ మోటార్ (MG Motor) కంపెనీ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మంచి గుర్తింపును సంపాదిస్తోంది. ముఖ్యంగా విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ వంటి మోడళ్లతో యువతతో పాటు నగర వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. తక్కువ రన్నింగ్ ఖర్చు, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఎంజీ పేరు ఇప్పుడు ప్రధానంగా ఈవీ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఐసీఈ కార్ల విభాగంలో మాత్రం కంపెనీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా ఎంజీ ఆస్టర్ (MG Astor) అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
Advertisement

22 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన సియెర్రా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో

ఒకప్పుడు భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సంపాదించిన SUVల్లో టాటా సియోర్రా (Tata Sierra) ఒకటి. 1991లో మొదటిసారి భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, తన ప్రత్యేక డిజైన్‌, పెద్ద గ్లాస్ విండోలు, బలమైన నిర్మాణంతో అప్పటి యువతను ఆకట్టుకుంది. 2003 వరకు మార్కెట్లో కొనసాగిన తర్వాత ఈ ఐకానిక్ SUVకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. అయితే దాదాపు 22 సంవత్సరాల తర్వాత, అదే పేరు మరోసారి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయడం ప్రారంభించింది. నవంబర్ 2025లో కొత్త అవతారంలో తిరిగి వచ్చిన టాటా సియెర్రా, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించింది. ముఖ్యంగా SUV ప్రియులు, పాత సియెర్రా అభిమానులు ఈ మోడల్‌కి మంచి స్పందన ఇచ్చారు.

పోటీ ఎంత ఉన్నా తగ్గని డిమాండ్.. యాక్టివా మళ్లీ టాప్‌లో!

భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడితే, ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). సంవత్సరాలుగా ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయ కుటుంబాల నమ్మకానికి ప్రతీకగా మారింది. సాధారణ ప్రయాణాల కోసం ఒక సౌకర్యవంతమైన, నమ్మదగిన, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన వాహనం కావాలంటే ఎక్కువ మంది ఎంచుకునేది యాక్టివానే. అందుకే ఇది పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా తన స్థానం సంపాదించుకుంది. స్కూటర్ మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లు, ఆధునిక డిజైన్‌లు, కొత్త ఫీచర్లు వచ్చినప్పటికీ, యాక్టివా స్థిరమైన డిమాండ్‌ను కొనసాగించడం దాని బలాన్ని చూపిస్తుంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో అమ్మకాలు నమోదు కావడం దీని ప్రజాదరణకు స్పష్టమైన ఉదాహరణ.

ఫ్యూచర్ ఫ్యూయల్‌తో రాబోయే టాటా కారు

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య వినియోగదారుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇంధన రంగంలో పెద్ద మార్పు దిశగా కొత్త టెక్నాలజీలు వేగంగా ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచడంతో, సాధారణ ప్రజలపై అదనపు భారం పడింది. అయితే దీని మధ్యలోనే ఒక సానుకూల మార్పు కూడా కనిపిస్తోంది. భవిష్యత్తులో పెట్రోల్ పంపుల వద్ద ఖర్చు భారం తగ్గించేలా కొత్త ఇంధన ప్రత్యామ్నాయాలు రాబోతున్నాయి. ప్రస్తుతం చర్చలో ఉన్న ముఖ్యమైన టెక్నాలజీ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు. ఇవి 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్ (E100)తో పాటు పెట్రోల్ మిశ్రమాలతో కూడా పనిచేయగలవు.

తక్కువ ధరకే 7 సీట్లు.. ఇంకా ట్రైబర్‌కే క్యూ!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ ఫ్యామిలీ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ సీట్లు, మంచి స్పేస్, ప్రయాణ సౌకర్యం కోరుకునే కుటుంబాలు ఇప్పుడు ఎక్కువగా MPV కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విభాగంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన ట్రైబర్ (Triber) ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అందుబాటు ధరలో 7 సీట్ల సౌకర్యాన్ని అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న ఈ కారు, దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ప్రత్యేకంగా చిన్న కుటుంబాలు మాత్రమే కాకుండా, ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలు కూడా ట్రైబర్‌ను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నాయి.
Advertisement

పెట్రోల్ ధరల పెరుగుదలతో EVలకు డిమాండ్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చు, ఆధునిక టెక్నాలజీ వంటి కారణాలతో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) సంచలనం సృష్టిస్తోంది. ఎంజీ మోటార్ (MG Motor) కంపెనీ 2024 సెప్టెంబర్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి విండ్సర్ ఈవీ అమ్మకాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

లీటరుకు ఏకంగా 40 కిమీ.. మారుతి నుంచి రాబోతున్న టాప్ 5 హైబ్రిడ్ కార్లు

భారతదేశంలో కస్టమర్లకు మారుతి సుజుకి అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకానికి అసలు కారణం ఆ కార్లు ఇచ్చే మైలేజీ. పెట్రోల్ ధరలు సెంచరీ దాటేసిన ప్రస్తుత కాలంలో, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే మారుతి కార్లే దిక్కు. అయితే ఇప్పుడు మారుతి సుజుకి మరో అడుగు ముందుకు వేస్తోంది. కేవలం మైలేజీ మాత్రమే కాదు, పర్యావరణానికి మేలు చేసేలా తన పాపులర్ కార్లన్నింటినీ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి తెస్తోంది. లీటరు పెట్రోల్‌తో ఏకంగా 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేలా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకప్పుడు డీజిల్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ మారుతి సుజుకి డీజిల్ ఇంజిన్లను పక్కన పెట్టి హైబ్రిడ్ టెక్నాలజీని నమ్ముకుంది. ఇప్పటికే గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లలో ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే బాటలో స్విఫ్ట్, బాలెనో, ఫ్రాంక్స్ వంటి చిన్న కార్లలో కూడా తక్కువ ధరలో హైబ్రిడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా HEV సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తోంది.

టాటా పంచ్ ఈవీ యజమానులకు అలర్ట్.. బ్రేకుల్లో లోపం

మీరు ఇటీవల టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) కొన్నారా? అయితే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే. టాటా మోటార్స్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆదరణ పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కారణం సంతోషకరమైనది కాదు, కాస్త ఆందోళన కలిగించేది. ఈ కారు బ్రేకింగ్ సిస్టమ్‎లో ఏదో లోపం ఉందని, అందుకే కంపెనీ గుట్టుచప్పుడు కాకుండా కొన్ని వాహనాలను వెనక్కి పిలిపిస్తోందని (Recall) సమాచారం అందుతోంది. ఇప్పటికే డీలర్లు స్వయంగా కస్టమర్లకు ఫోన్ చేసి కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకురావాలని కోరుతున్నారు.

సామాన్యుడి బడ్జెట్లోనే 5 అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!

పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయమేస్తోందా ? పెట్రోల్, డీజిల్ ధరలు(petrol diesel price) సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న వేళ, ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లుతోంది. కేవలం పర్యావరణం కోసమే కాదు, భారీగా డబ్బు ఆదా చేసేందుకు ఇవి చక్కని మార్గంగా మారాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra modi) కూడా ఇంధన పొదుపుపై పిలుపునివ్వడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. మీరు కూడా కొత్తగా ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(electric SUV) కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న, అత్యధిక రేంజ్ ఇచ్చే టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

రోజూ ఆఫీసుకెళ్లేవారికి వరంలా మారిన 5 కార్లు

పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూస్తుంటే సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. రోజూ ఆఫీసుకి కారులో వెళ్లాలంటే జేబు చిల్లు పడాల్సిందే. ఎలక్ట్రిక్ కారు(Electric Cars) కొందామంటే ఛార్జింగ్ టెన్షన్, లాంగ్ జర్నీలో ఆగిపోతుందన్న భయం. ఇలాంటి చిక్కులన్నింటికీ ఏకైక పరిష్కారం హైబ్రిడ్ కార్స్(hybrid Cars). పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ కార్స్, మీకు ఊహించని మైలేజీని అందిస్తాయి. మరి ఆఫీసు ప్రయాణాలకు అతి తక్కువ ఖర్చుతో రాజసంలా దూసుకెళ్లే ఆ టాప్-5 కార్ల విశేషాలు తెలుసుకుందాం.

పెద్ద ఫ్యామిలీలు పెట్రోల్ ఖర్చు లేకుండా టూర్లు ఎంజాయ్ చేయొచ్చు

ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై 7 సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద ఫ్యామిలీలు అయినా, స్నేహితులతో కలిసి ట్రిప్పులకు వెళ్లడానికైనా పెద్ద కార్లనే అందరూ ఇష్టపడుతున్నారు. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఈ పెద్ద కార్ల యజమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ 7 సీటర్ల వైపు మళ్లింది. టాటా, మారుతి, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకట్టుకునేలా భారీ రేంజ్ ఇచ్చే ఈవీలను రెడీ చేస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు దూసుకుపోయే ఆ 5 అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.

ఇండియాలో కెప్టెన్ సీట్లు ఉన్న టాప్-5 ఎంపీవీలు ఇవే

మీరు ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్తున్నారా? వెనక సీట్లో కూర్చున్నప్పుడు ఇరుకుగా అనిపిస్తోందా? అయితే మీకు కావాల్సింది సాధారణ బెంచ్ సీట్లు కాదు.. కెప్టెన్ సీట్లు. విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లలాగా, ఒకరికొకరు తగలకుండా, హాయిగా కాళ్లు చాపుకుని కూర్చునే వెసులుబాటు ఈ సీట్లలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇండియాలో కెప్టెన్ సీట్లు ఉన్న ఎంపీవీ (MPV) కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మరి మీ బడ్జెట్‌లో టాప్-5 బెస్ట్ ఆప్షన్లు ఏవో ఇప్పుడు చూద్దాం!

4.8 సెకన్లలో 100 స్పీడ్.. రూ.2.7 కోట్ల పోర్షే కొన్న నరేష్

టాలీవుడ్ సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ విజయకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తన అద్భుతమైన నటనతోనో లేదా వ్యక్తిగత విషయాలతోనో కాకుండా, తన గ్యారేజీలోకి చేరిన ఒక లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్‎స్టైల్‎కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నరేష్, తాజాగా ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అయిన పోర్షే (Porsche) నుంచి పనామెరా టర్బో జీ 3 మోడల్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర, దాని ఫీచర్లు చూస్తుంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
Advertisement

ఈ కారును ఎవరైనా కొంటారా అని డీలర్లు ఎదురుచూపులు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెడాన్ కార్లలో హోండా సిటీ (Honda City) పేరు ముందుంటుంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి యువ ఉద్యోగుల వరకు ఎంతో మంది కలల కారుగా భావించిన ఈ సెడాన్‌కు ఒకప్పుడు మార్కెట్లో భారీ క్రేజ్ ఉండేది. కొత్త కారు కొనాలనుకునే వారు ముందుగా సిటీ గురించే ఆలోచించేవారు. స్టైలిష్ డిజైన్, కంఫర్ట్, నమ్మకమైన పనితీరు, హోండా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఈ కారు ఎన్నో సంవత్సరాల పాటు భారత మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఒక దశలో అయితే షోరూమ్‌ల వద్ద ఈ కారును కొనుగోలు చేయడానికి వినియోగదారుల మధ్య పోటీ కనిపించేది.

పెట్రోల్ రేట్లు షాక్ ఇస్తే.. ఈ EV స్కూటర్ మాత్రం రిలీఫ్ ఇస్తోంది

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించే వారు ఇప్పుడు పెట్రోల్ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు నెలకు తక్కువగా ఉండే ఇంధన ఖర్చులు ఇప్పుడు కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి. అందుకే చాలా మంది వాహనదారులు ఇప్పుడు పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా బలంగా ప్రోత్సహిస్తోంది. ప్రధాని Narendra Modi కూడా పలు సందర్భాల్లో ఈవీల వినియోగాన్ని పెంచాలని ప్రజలకు సూచించారు.

టాప్ ఫీచర్లు ఉన్నా ఈ కారును పట్టించుకోవడం లేదు.. సేల్స్ జీరో

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అవకాశాన్ని సరిగ్గా గుర్తించిన కంపెనీలలో ఎంజీ మోటార్ (MG Motor) ఒకటి. భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రత్యేకంగా విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ, సైబర్‌స్టర్ వంటి మోడళ్లతో కంపెనీ భారతీయ కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సక్సెస్ సాధించినంతగా, కంపెనీ సంప్రదాయ ICE విభాగంలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది.

రూ.6.25 లక్షల కారే ఇప్పుడు దేశం మొత్తానికి ఫేవరెట్

భారతీయ కార్ల మార్కెట్లో మరోసారి మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. రూ.6.25 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న డిజైర్ సెడాన్(Maruti Dzire) ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. ఒకప్పుడు వాగన్‌ఆర్, స్విఫ్ట్, బలెనో వంటి కార్లు టాప్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైలేజీ, భద్రత, కుటుంబ వినియోగం అన్నీ ఒకే కారులో కావాలనుకునే ప్రజలు డిజైర్(Maruti Dzire) వైపు పరుగులు తీస్తున్నారు.
Advertisement

భారత్‌లో మిడిల్ క్లాస్ కోసం అతి తక్కువ ధరకే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ రేంజ్

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సాధారణ వాహన వినియోగదారులపై ఇంధన భారం గణనీయంగా పెరిగింది. రోజువారీ ప్రయాణాల కోసం కార్లు ఉపయోగించే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగిన వాహనాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతుండటంతో, ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. భారత్‌లో కూడా ఈవీల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునివ్వడం, దేశీయ ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తోంది.