ఈ కారును కొనడానికి జంకుతున్న జనం

దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ నుంచి ఎన్నో ఆశలతో మార్కెట్లోకి వచ్చిన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‎టర్(Hyundai Exter) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. టాటా పంచ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ, అమ్మకాల పరంగా ఈ కారు వెనుకబడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తక్కువ ధర, అదిరిపోయే మైలేజ్ ఉన్నప్పటికీ కస్టమర్లు ఎక్స్‎టర్ వైపు మొగ్గు చూపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏనుగు సైజున్న కారు.. పెద్ద ఫ్యామిలీకి పెద్ద కారు

మారుతి సుజుకి ఇన్విక్టో (maruti suzuki invicto) ఈరోజు మార్కెట్‌లో కేవలం ఒక MPVగా మాత్రమే కాదు, పెద్ద కుటుంబాల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక ప్రీమియం ప్యాకేజ్‌గా నిలుస్తోంది. విశాలమైన క్యాబిన్‌, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ కలిసి దీన్ని ఫ్యామిలీ కార్ లిస్టులో టాప్ ప్లేస్‌లో నిలబెడుతున్నాయి. పిల్లలు, పెద్దలు, లగేజీ... అందరికీ సరిపడే స్థలం ఉండటం వల్ల దీర్ఘ ప్రయాణాలు కూడా అలసట లేకుండా పూర్తవుతాయి. ఇన్విక్టో డిజైన్ కూడా దీని మరో పెద్ద ప్లస్ పాయింట్. బయటకు చూస్తే ప్రీమియం SUVలా కనిపిస్తూ, లోపల అడుగుపెడితే లగ్జరీ ఫీల్ ఇస్తుంది. సీట్ల కంఫర్ట్, క్వాలిటీ మెటీరియల్స్, ఆధునిక ఫీచర్లు అన్నీ కలిసి ప్రతి ప్రయాణాన్ని స్పెషల్‌గా మారుస్తాయి.

పంచ్ ఈవీ కొత్త రంగులు చూస్తే కళ్లు చెదరాల్సిందే

టాటా మోటార్స్ తన ఫేమస్ మైక్రో ఈవీ టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)ని సరికొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. ఫిబ్రవరి 20, 2026న విడుదల కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ముఖ్యంగా తన కొత్త కలర్ ఆప్షన్లతో వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. కేవలం రంగులే కాకుండా, సాంకేతికత మరియు ఫీచర్ల పరంగా కూడా ఈ కారులో భారీ మార్పులు జరగనున్నాయి.

ఇంటికి ఒకటి కాదు..నాలుగైదు బైకులుంటున్నాయ్

భారతదేశ వీధుల్లో ఇప్పుడు ఇంజిన్ల మోత మునుపెన్నడూ లేని విధంగా వినిపిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కొనడమే గొప్పగా భావించిన పల్లెలు, ఇప్పుడు బైకులు, స్కూటర్ల హోరుతో మార్మోగిపోతున్నాయి. 2026 సంవత్సరం ఆరంభమే ఆటోమొబైల్ రంగానికి భారీ కానుకను అందించింది. గడిచిన జనవరి నెలలో నమోదైన గణాంకాలు చూస్తుంటే, భారతీయుల కొనుగోలు శక్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కేవలం ఒక్క నెలలోనే సుమారు 18.52 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవడం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ మార్పులకు సంకేతం.
Advertisement

వాలెంటైన్స్ డే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే రిస్క్!

ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు... ప్రేమికుల మనసుల్లో ప్రయాణాల ఆలోచనలు మొదలవుతాయి. వాలెంటైన్స్ డేను గుర్తుండిపోయేలా చేసుకోవాలంటే, కేవలం గిఫ్ట్‌లు లేదా డిన్నర్లే కాదు,, ఇద్దరూ కలిసి చేసే ఒక సుదీర్ఘ ప్రయాణం కూడా మధురమైన అనుభవంగా మారుతుంది. కారులోనైనా, బైక్‌పై అయినా... ఓపెన్ రోడ్డు, చల్లని గాలిలో, కలిసి మాట్లాడుకుంటూ సాగించే ప్రయాణం ప్రేమను మరింత బలపరుస్తుంది. కానీ ఈ ఆనందం మధ్యలో చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకూడదంటే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సుదూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే జంటల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఈ కింది కథణంలో వివరంగా అందించడం జరిగింది.

చావు భయం లేకుండా రెండు కుటుంబాలు వెళ్లొచ్చు!

టాటా మోటార్స్‌ (Tata Motors) కు భారతీయులతో ఉన్న అనుబంధం కేవలం ఒక ఆటోమొబైల్ బ్రాండ్‌కు పరిమితం కాదు... అది ఒక భావోద్వేగం. ఇండికా, సఫారీ, సియెర్రా వంటి కార్లు భారతీయ కుటుంబాల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇండికా అయితేమొదటి ఫ్యామిలీ కార్గా ఎంతోమందికి గుర్తుండిపోయింది. అలాంటి బలమైన వారసత్వం ఉన్న కంపెనీగా టాటా మోటార్స్, కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగింది. ఒక దశలో భారతదేశంలో సేఫ్టీకి పర్యాయపదంగా టాటా పేరు నిలిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో 4, 5 స్టార్ రేటింగ్‌లు సాధించిన నెక్సాన్, పంచ్, టియాగో వంటి కార్లు.. భద్రత ముఖ్యమైతే టాటానే అనే నమ్మకాన్ని వినియోగదారుల్లో బలంగా నాటాయి. ఇదే టాటా బ్రాండ్‌ను మళ్లీ టాప్‌లో నిలబెట్టిన ప్రధాన కారణం కూడా.

ఇది కారు కాదు.. రోడ్ల మీద తిరిగే అద్భుతం

టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20, 2026న ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారికంగా లాంచ్ కానుంది. కేవలం డిజైన్ మార్పులే కాకుండా, బ్యాటరీ వారంటీ, రేంజ్, ఫీచర్ల పరంగా ఈసారి టాటా మోటార్స్ ఒక పెద్ద గేమ్ ఛేంజర్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈవీ ప్రియులను భయపెట్టే బ్యాటరీ ఖర్చు విషయంలో కంపెనీ లైఫ్ టైమ్ వారంటీ ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

యాక్టివా 125 vs యాక్సెస్ 125.. ధర, ఫీచర్లు, మైలేజ్‌లో

భారతదేశ టూవీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ సెగ్మెంట్ అంటేనే గట్టి పోటీకి ప్రతీక. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ స్కూటర్లను ప్రవేశపెట్టినా, కాల పరీక్షను తట్టుకుని నిలబడినవి మాత్రం రెండు పేర్లే.. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125), హోండా యాక్టివా 125 (Honda Activa 125). ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతూ, లక్షలాది వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్నాయి. కాలానుగుణంగా మారుతున్న కస్టమర్ అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, రెండు కంపెనీలు కూడా తరచూ అప్డేట్స్, కొత్త ఫీచర్లతో తమ స్కూటర్లను మార్కెట్లో తాజాగా ఉంచుతున్నాయి. ఇదే ఈ రెండింటి మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో ఈ స్కూటర్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.
Advertisement

కారు కొనడం ఇప్పుడు చాక్లెట్ కొన్నంత ఈజీ

భారతదేశం ఆర్థికంగా దూసుకుపోతుందనడానికి ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ రంగమే నిదర్శనం. ఒకప్పుడు కారు కొనాలంటే దశాబ్దాల కలగా ఉండేది. కానీ ప్రస్తుతం భారతీయులు వాహనాల కొనుగోలులో స్పీడ్ పెంచారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా జనవరి నెలలో నమోదైన గణాంకాలు చూస్తుంటే ఆటో రంగం ఏ రేంజ్‎లో పరుగులు తీస్తుందో అర్థం అవుతుంది.

చూసినవాళ్లంతా బుక్ చేసుకుంటున్నారు.. వెన్యూ హవా!

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కొనుగోలుదారుల నుంచి అసాధారణమైన స్పందనను పొందుతోంది. నవంబర్ 4, 2025న అధికారికంగా ప్రారంభించబడిన ఈ రెండవ తరం వెన్యూ, లాంచ్ రోజే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఇది పూర్తిగా ఫ్రెష్ అవతార్‌లో కనిపిస్తూ యువతతో పాటు ఫ్యామిలీ కార్ కొనుగోలుదారులను కూడా ఆకట్టుకుంటోంది. లుక్ పరంగా చూస్తే, కొత్త వెన్యూ మరింత స్టైలిష్‌గా, ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త వెన్యూ భారీ డిమాండ్‌ను నమోదు చేసింది. డీలర్‌షిప్‌ల వద్ద విచారణలు పెరగడమే కాకుండా, బుకింగ్‌ల పరంగా కూడా ఈ కారు కొత్త రికార్డును సృష్టించింది.

టయోటా ఎబెల్లా చరిత్ర తిరగరాస్తుందా ?

టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా సమీక్షను చూడండి. దీని 543 కిమీ రేంజ్, లెవల్ 2 ADAS మరియు ప్రీమియం ఇంటీరియర్స్ గురించి తెలుసుకోండి. ఆశించిన ధర INR 18.00 లక్షల నుండి ఉంటుంది.

పవర్‌ఫుల్ కార్ కమింగ్ ఫ్రమ్ పవర్‌ఫుల్ కంపెనీ

రేపు (ఫిబ్రవరి 12) ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ఒక పెద్ద రోజు. JSW MG మోటార్ ఇండియా తమ కొత్త కారును ఘనంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పెద్ద-సైజు ఫ్యామిలీ SUV మెజెస్టర్ (Majestor) ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి రానుంది. MG మెజెస్టర్‌ను చూసిన వెంటనే ఇది ఒక ప్రీమియం, రాయల్ ఫీల్ కలిగిన SUV అనే భావన కలుగుతుంది. ఈ SUVను ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీలను టార్గెట్ చేసి అభివృద్ధి చేశారు. రోజువారీ ప్రయాణాల నుంచి హైవే ట్రిప్స్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మెజెస్టర్‌ను రూపొందించారు. ఈ కారు వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.
Advertisement

ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలని అంటోంది

టాటా మోటార్స్ సంస్థ భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత భారీ వృద్ధిని నమోదు చేసి, తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. కేవలం ఒకే నెలలో సుమారు 70,222 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది జనవరితో పోలిస్తే ఏకంగా 46 శాతం వృద్ధిని సాధించింది. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక విక్రయాలు కావడం విశేషం. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది

భారతీయ రోడ్లపై ఆటో రిక్షా అంటే కేవలం ఒక వాహనం కాదు, అది లక్షలాది మంది సామాన్యుల జీవనాధారం. అలాంటి త్రీ వీలర్ వాహన రంగంలో పెను సంచలనం సృష్టిస్తూ, దేశీయ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా WEGO P9018ను మార్కెట్లోకి విసిరింది. ఫిబ్రవరి 09, 2026న పుణె వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రేంజ్ విషయంలో ఉన్న అన్ని అపోహలను పటాపంచలు చేస్తూ, ఏకంగా 296 కిలోమీటర్ల రేంజ్‎తో ఇది రేంజ్ రాజాగా కీర్తించబడుతోంది. బజాజ్ WEGO P9018ను ఒక సాధారణ ఆటోగా చూడలేము. దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఇంజనీరింగ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లోనూ లేని విధంగా, ఇందులో 17.7 kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ సాయంతో ఐడియల్ కండిషన్స్‌లో 296 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. రియల్ వరల్డ్ కండిషన్స్‌లో కూడా ఇది 240-250 కి.మీ. వరకు సునాయాసంగా ఇస్తుందని అంచనా.

నెల రోజుల్లో 2521 మంది ఇదే కారును ఎంచుకున్నారు

భారతీయ SUV మార్కెట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభం నుంచే ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. స్టైలిష్ డిజైన్, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, ఆధునిక ఫీచర్ల కలయికతో, టైజర్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు జనవరి 2026లో కూడా అదే ఊపును కొనసాగించింది. తాజా గణాంకాల ప్రకారం, ఆ నెలలో మొత్తం 2,521 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పమైనప్పటికీ గమనించదగిన వృద్ధి.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVలు

మార్కెట్లో కాంపాక్ట్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఈ సెగ్మెంట్ కార్లు మంచి ఎంపికగా మారాయి. సెడాన్‌ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే విశాలమైన క్యాబిన్, అలాగే బూట్ స్పేస్ ఉండటం వల్ల కాంపాక్ట్ SUVలు భారతీయ వినియోగదారుల అవసరాలకు బాగా సరిపోతున్నాయి. నగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన రోడ్ల పరిస్థితులు కూడా ఈ వాహనాల పాపులారిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కాంపాక్ట్ SUVలు అన్ని రకాల రోడ్లపై సులభంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు, డ్రైవర్‌కు మంచి విజిబిలిటీని కూడా అందిస్తాయి. ఈ కథణంలో గత నెలలో టాప్ 3 కాంపాక్ట్ SUVల గురించి చూద్దాం.
Advertisement

రూ.లక్షకే డిజిటల్ డిస్‌ప్లే, మంచి మైలేజీ ఇచ్చే బైక్

నేటి యువతకు బైక్ అంటే కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా 160cc సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే లుక్స్ కోసం చాలా మంది కుర్రాళ్లు ఆరాటపడుతుంటారు. అయితే బజాజ్ పల్సర్ లేదా టీవీఎస్ అపాచీ వంటి బైక్‌ల ధరలు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160R (Hero Xtreme 160R) ఒక సంచలనంగా మారింది. 160cc సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ ధరకే లభిస్తూ, అదిరిపోయే మైలేజీని ఇస్తున్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన 160cc మోటార్‌సైకిల్. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1,04,749 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర బ్రాండ్లను గమనిస్తే.. బజాజ్ పల్సర్ NS160 లేదా టీవీఎస్ అపాచీ RTR 160 4V వంటి బైక్‌ల ధరలు దీనికంటే కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.35 లక్షల మధ్యలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ బైక్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R లో 163.2 cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 15 bhp పవర్, 6,500 rpm వద్ద 14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బరువు. ఇది కేవలం 139.5 కిలోల బరువు మాత్రమే ఉంటుంది, దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో బైక్‌ను తిప్పడం చాలా సులభం. స్పీడు విషయానికి వస్తే.. ఇది కేవలం 4.7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు అందరికంటే ముందు దూసుకుపోవచ్చు. చాలా మంది స్పోర్ట్స్ బైక్ అంటే మైలేజీ తక్కువ ఇస్తుందని భయపడతారు. కానీ హీరో ఎక్స్‌ట్రీమ్ విషయంలో అది తప్పు. ఈ బైక్ లీటరుకు 46 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని సునాయాసంగా ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. అంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే మీరు సుమారు 550 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ఆఫీసు పనులకు వెళ్లే వారికి లేదా కాలేజీ విద్యార్థులకు ఇది చాలా పొదుపైన బైక్ అని చెప్పవచ్చు. తక్కువ ధర అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో హీరో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో మీరు చూడబోయే కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఇవే. హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు అన్నీ ఎల్‌ఈడీ వెర్షన్‌లోనే వస్తాయి. ఇది రాత్రి వేళల్లో ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. ఇందులో ఇన్వర్టెడ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో గైర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సమయం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిన కారు!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో విశ్వసనీయతకు, దీర్ఘకాలిక పనితీరుకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన అనేక మోడళ్లు ఇప్పటికే భారత వినియోగదారుల మనసుల్లో స్థానం సంపాదించగా, వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్. ఈ కారు 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం మంచి స్పందనను పొందుతూ, టయోటా లైనప్‌లో ఒక కీలక మోడల్‌గా మారింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం దాని హైబ్రిడ్ టెక్నాలజీ. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే హైబ్రిడ్ ఇంజిన్ వినియోగదారులకు పెద్ద ఆకర్షణగా మారింది.

భార్య, పిల్లలు, సామాన్లు.. అన్నీ ఒకే కారులో

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో-ఎన్(Scorpio-N) ఆధారంగా రూపొందిస్తున్న సరికొత్త పికప్ ట్రక్కును భారత మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శితమైన ఈ వాహనం, ఇప్పుడు భారత రోడ్లపై మంచు కురుస్తున్న వేళ కఠినమైన పరీక్షలను (Snow Testing) ఎదుర్కొంటోంది. మహీంద్రా తన గ్లోబల్ పికప్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పై ఫోటోల ప్రకారం, ఈ పికప్ ట్రక్కును మంచుతో నిండిన రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఇది కేవలం కమర్షియల్ వాహనంలా కాకుండా ఒక లైఫ్ స్టైల్ వాహనంగా రూపొందుతోంది.

ఒకప్పుడు టాప్ SUV.. ఇప్పుడు డిమాండ్ తగ్గిందా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) ఒక సమయంలో భారత మార్కెట్లో అత్యంత చర్చకు వచ్చిన SUVగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ వంటి అంశాలతో ఈ కారు కొనుగోలుదారుల మనసు గెలుచుకుంది. ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఈ SUVని నమ్మకంగా ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ, ఇటీవల నెలల్లో గ్రాండ్ విటారా అమ్మకాల గణాంకాలు ఒక భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. గత నెల అయిన జనవరి 2026లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఆ నెలలో మొత్తం 7,030 యూనిట్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. ఇదే కారు జనవరి 2025లో చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పట్లో 15,784 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Advertisement

రైలెక్కిన 5.85 లక్షల కార్లు

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాదు, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసే విధానంలో కూడా మారుతి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల కార్లను కేవలం రైళ్ల ద్వారా రవాణా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనివల్ల పర్యావరణానికి కలిగిన మేలు, ఆదా అయిన ఇంధనం, రవాణాలో మారుతి వేసిన మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా తన కార్లను డీలర్‌షిప్‌లకు చేరవేసేందుకు గత కొన్నేళ్లుగా రైల్వే మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తోంది. 2016వ సంవత్సరంలో మారుతి కేవలం 77 వేల కార్లను మాత్రమే రైళ్ల ద్వారా పంపించేది. కానీ, గడిచిన పదేళ్లలో ఈ సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2017లో లక్ష కార్లు, 2018లో 1.46 లక్షలు, 2019లో 1.72 లక్షలు ఇలా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా కొంచెం తగ్గుదల కనిపించినా, 2021 నుంచి మారుతి స్పీడు పెంచింది.

రూ.6 లక్షల లోపు SUV కొనాలా? టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్‌టర్

ఒకప్పుడు ఇంట్లో బైక్ ఉంటే చాలు అనుకునే రోజులు పోయి ఇప్పుడు కారు ఉండాలనే రోజులు వచ్చాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కాస్త మెరుగ్గా ఉండటంతో తమ కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి బస్సులు, రైళ్లు, ఆటోల కంటే కారు ఉంటే బెటర్ అని కారు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలో దొరుకుతూ, మంచి పనితీరు, మైలేజ్, సేఫ్టీ అందించే కార్లను బాగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 6 లక్షల లోపు బడ్జెట్‌లో ఒక కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్ (tata punch), హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ప్రస్తుతం హాట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లను పోలికలను ఈ కథనంలో చూద్దాం.

ఈ కారు కావాలంటే తపస్సు చేయాల్సిందే

భారతీయ రోడ్లపై మహీంద్రా కార్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ కాస్తా కస్టమర్ల ఓపికకు పరీక్షగా మారుతోంది. "డబ్బులు మూటలు కట్టుకుని వెళ్లి షోరూం ముందు కుమ్మరించినా సరే.. కారు ఇంటికి రావాలంటే నెలల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూడాల్సిందే" అనే రేంజ్‌లో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

యువతకు పిచ్చెక్కిస్తున్న కారు

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో తన విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. 2026 ప్రారంభంలో ఈ కారు సాధించిన అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, భారతీయ వినియోగదారులు దీనికి ఎంతలా బానిసయ్యారో ఇట్టే అర్థమవుతుంది. టాటా నెక్సాన్ వంటి బలమైన ప్రత్యర్థులు మార్కెట్లో ఉన్నప్పటికీ, వెన్యూ తనదైన శైలిలో దూసుకుపోతూ రికార్డులను తిరగరాస్తోంది. 2026 జనవరి నెల హ్యుందాయ్ కంపెనీకి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ఒక్క నెలలోనే హ్యుందాయ్ వెన్యూ ఏకంగా 12,413 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి తన సత్తా చాటింది. గత ఏడాది (2025) ఇదే సమయంలో 11,106 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ ఇండియా తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ దేశీయ విక్రయాలను (59,107 యూనిట్లు) ఈ ఏడాది జనవరిలో నమోదు చేసింది. ఈ భారీ విజయంలో వెన్యూ కీలక పాత్ర పోషించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హ్యుందాయ్ వెన్యూ కేవలం అమ్మకాల్లోనే కాదు, అత్యాధునిక ఫీచర్ల విషయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీని బేస్ మోడల్ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 15.69 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఎల్‌ఈడీ హెడ్-ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు రోడ్లపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Advertisement

ఉబెక్స్ రాకతో మార్కెట్ షేక్ అవ్వాల్సిందే

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన ఎలక్ట్రిక్ విభాగం విడా (Vida) ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో గట్టి పోటీనిస్తున్న హీరో, ఇప్పుడు తన దృష్టిని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై మళ్లించింది. ఇందులో భాగంగా అత్యంత పవర్ఫుల్, స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ విడా ఉబెక్స్ (Vida UBEX) డిజైన్ పెటెంట్‌ను భారత్‌లో పొందింది. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఆధిపత్యానికి గండి కొట్టేలా సిద్ధమవుతున్న ఈ బైక్, 2026లో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ఒక పెను మార్పుగా నిలవబోతోంది.