యాక్టివా తరహాలో మరో కొత్త హోండా స్కూటర్ రాబోతుంది

భారత మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, మైలేజ్, నడపడానికి సులభంగా ఉండటం వంటి కారణాలతో చాలా మంది స్కూటర్లనే మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్కూటర్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఎక్కువగా మారుతోంది. ఇండియాలో చాలా మందికి స్కూటర్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా యాక్టివా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రతి నెలా లక్షలాది మంది వినియోగదారులు యాక్టివానే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హోండా కంపెనీ మరో బ్రహ్మాస్త్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

భారత్ ఈవీ మార్కెట్‌ను ఏలుతున్న టాటా

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ పరిమాణం పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాల మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువగా (పది వంతులో ఒక వంతు) ఉన్నప్పటికీ, EV విభాగంలో వృద్ధి రేటు మాత్రం అద్భుతంగా ఉంది. దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మారుతి సుజుకి అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, రెండో మూడో స్థానాల కోసం టాటా మోటార్స్, మహీంద్రా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జనవరి, జూన్ 2026 మధ్య కాలంలో మొత్తం 3,78,909 వాహనాలను విక్రయించడం ద్వారా టాటా మోటార్స్ ఒక రికార్డును నెలకొల్పింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో (2,69,966 వాహనాలు) పోలిస్తే ఇది భారీగా 40% వృద్ధిని సూచిస్తుంది. ఇదే సమయంలో, మహీంద్రా కూడా గట్టి పోటీనిస్తూ 2026 మొదటి ఆరు నెలల్లో 3,58,545 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో 3,01,194 కార్లను విక్రయించిన మహీంద్రా, ఈసారి 19% వృద్ధిని నమోదు చేసింది. అయితే, మొత్తం అమ్మకాల పరంగా చూస్తే, మహీంద్రా కంటే 20,364 కార్లను ఎక్కువగా విక్రయించి టాటా మోటార్స్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.

సరికొత్త లుక్‎తో వస్తున్న మహీంద్రా విజన్ s

ప్రస్తుత భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ, పవర్ఫుల్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా కంపెనీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఎస్యూవీ కార్లను మాత్రమే నమ్ముకుని హ్యుందాయ్ లాంటి కార్ల తయారీ కంపెనీలను కూడా మహీంద్రా దాటేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్ తో గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తన కార్ల పోర్ట్ ఫోలియోను ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మహీంద్రా తన సరికొత్త 'NU IQ' ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మల్టీ ఎనర్జీ ఆప్షన్లతో కూడిన విజన్ ఎస్ (Vision S) మోడల్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

మైలేజ్ కోసం ఎక్కువ మంది కొంటున్న కారు ఇదే

భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki)కి ఇటీవల కాలంలో భారీ సక్సెస్ అందించిన మోడళ్లలో మారుతి విక్టోరిస్ (Victoris) ఒకటి. మిడ్-సైజ్ SUV విభాగంలో ఎన్నో ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో కంపెనీ ఈ SUVని మార్కెట్లో ప్రవేశపెట్టింది. విడుదలైన కొద్ది కాలంలోనే విక్టోరిస్ కస్టమర్ల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుని, ఈ సెగ్మెంట్‌లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం భారత మిడ్-సైజ్ SUV మార్కెట్లో అమ్మకాల పరంగా హ్యుందాయ్ క్రెటా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విక్టోరిస్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లు, మంచి మైలేజ్, బలమైన బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలు ఈ SUV సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Advertisement

దేశంలోనే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కారు

ప్రతి ఒక్కరికి సొంతంగా కారు కొనుగోలు చేయాలని కల ఉంటుంది. వారి సొంత కారు కల నిజం చేసుకోవాలనే మధ్య తరగతి కస్టమర్లకు జూలై నెల అద్బుతమైన అవకాశాన్ని అందజేస్తోంది. దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసే ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన పాపులర్ మోడళ్ల మీద ఈ జూలై నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

25 ఏళ్ల లెజెండ్ కొత్త అవతారంలో ఎంట్రీ!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన తన ఐకానిక్ మోడళ్లను టాటా మోటార్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తీసుకొస్తోంది. పాత మోడళ్లకు ఉన్న క్రేజ్‌ను ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్‌తో కలిపి మరోసారి వినియోగదారుల ముందుకు తీసుకురావడంపై కంపెనీ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వ్యూహం టాటా మోటార్స్‌కు మంచి ఫలితాలను కూడా ఇస్తోంది. దీనికి టాటా సఫారీనే పెద్ద ఉదాహరణ. తొలిసారిగా 1998లో మార్కెట్లోకి వచ్చిన ఈ SUV దాదాపు రెండు దశాబ్దాల పాటు భారతీయుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే BS6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడంతో 2019లో ఈ మోడల్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం 2021లో పూర్తిగా కొత్త అవతారంలో సఫారీని మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చిన టాటా మోటార్స్, మరోసారి ఈ మోడల్‌ను విజయవంతంగా నిలబెట్టింది.

టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఊహించని డిమాండ్!

పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో వాహనం కొనుగోలు చేసే వారి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై సందేహాలు వ్యక్తం చేసిన వినియోగదారులు ఇప్పుడు వాటినే తొలి ఎంపికగా పరిగణిస్తున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రతి కిలోమీటర్‌కు తక్కువ ప్రయాణ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తుండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) అత్యంత సమర్థంగా వినియోగించుకుంటూ భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఈ కారు కొన్నొళ్లకు ఏకంగా రూ.60000 ఆదా చేసుకునే ఛాన్స్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కియా ఇండియా, జూలై నెలలో తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ జూలై నెల మొత్తం సోనెట్ కార్లపై కస్టమర్లకు రూ.60,000 వరకు అద్భుతమైన బెనిఫిట్స్ లభించనున్నాయి. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సరికొత్త మోడల్ ఇయర్ 2026 కార్లపై మాత్రమే అందుబాటులో ఉంది.
Advertisement

వచ్చే 12 నెలల్లో మార్కెట్లోకి రాబోతున్న 5 సరికొత్త సెన్సేషన్ కార్లు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది. ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారా (e Vitara) ఆశించిన స్థాయిలో వేగాన్ని అందుకోలేకపోయినప్పటికీ, కంపెనీ ఏమాత్రం తగ్గడం లేదు. రాబోయే 12 నెలల కాలంలో ఏకంగా ఐదు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి మారుతి సంస్థ అంతా సిద్ధం చేసుకుంది. ఈ జాబితాలో ఇప్పటికే పాపులర్ అయిన కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల నుంచి, సరికొత్త హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి.

ఈ కారుకు కంపెనీ వాళ్లు ఇచ్చే డిస్కౌంట్‎తో ఇంకో కారు కొనుక్కోవచ్చు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను శాసిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన కస్టమర్లకు జూలై నెలలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) మోడల్‌పై కంపెనీ ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.3.35 లక్షల వరకు భారీ ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ జూలై నెల ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్లలో భారీ నగదు తగ్గింపులతో పాటు పాత కార్లను మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తున్నాయి.

స్పోర్టీ లుక్, లగ్జరీ ఫీచర్లు ఉన్న కారు పై ఏకంగా రూ.45వేలు తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్, ఆల్టో కే10, స్విఫ్ట్ వంటి కార్లను మనవాళ్లు బాగా ఇష్టపడుతుంటారు. ఈ రేసులో ఎప్పుడూ ముందంజలో ఉండే మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) కొనాలనుకునే వారికి కంపెనీ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జూలై నెలలో సరికొత్త స్విఫ్ట్ కారుపై ఏకంగా 45,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో నేరుగా వచ్చే నగదు తగ్గింపుతో పాటు మరికొన్ని అదనపు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లే లక్ష్యంగా దూసుకెళ్లనున్న మన దేశపు SUV

భారత ఆటోమొబైల్ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్, తన ఐకానిక్ మోడల్ టాటా సియెర్రా (Tata Sierra) విషయంలో ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీని, ఇకపై ప్రపంచ దేశాల మార్కెట్లలో కూడా లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. సియెర్రా పెట్రోల్, డీజిల్ మోడల్స్‌తో పాటు తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో టాటా బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది.
Advertisement

సైలెంట్‌గా నంబర్-1 పీఠాన్ని ఎక్కేసిన దేశీయ ఆటోమొబైల్ కంపెనీ

భారత టూ-వీలర్ (ద్విచక్ర వాహన) రంగంలో ఎప్పుడూ హీరో మోటోకార్ప్, హోండా కంపెనీల గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ, జూన్ 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దేశీయంగా ఈ రెండు దిగ్గజ కంపెనీలు మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, విదేశీ అమ్మకాలను కూడా కలుపుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్స్ (TVS Motor) అందరికంటే ముందంజలో నిలిచింది. టోటల్ సేల్స్ పరంగా హీరో, హోండాలను వెనక్కి నెట్టి టీవీఎస్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. జూన్ నెలలో ఏకంగా 5,65,417 యూనిట్ల వాహనాలను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.

మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా కొనే కారు పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా కారు కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అందించింది. మారుతి సుజుకికి చెందిన ప్రముఖ ఎరీనా (Arena) షోరూమ్‌లలో అత్యంత పాపులర్ అండ్ ప్రీమియం మోడల్‌గా దూసుకుపోతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా (Brezza) పై కంపెనీ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జూలై నెలలో సరికొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం ఏకంగా 55,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్రెజ్జా కారుకు మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ ఆఫర్ సేల్స్ మరింత పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

చాలా మంచి కారు.. రూ.6.26 లక్షలు, 33 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ కార్లకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణం, మంచి మైలేజ్ కోరుకునే కుటుంబాలకు ఈ సెగ్మెంట్ ఎప్పుడూ తొలి ఎంపికగా ఉంటుంది. ఈ విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ విజయవంతంగా కొనసాగుతున్న కార్లలో మారుతి సుజుకి డిజైర్ (maruti suzuki dzire) ఒకటి. సరసమైన ధర, అద్భుతమైన ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు, విశ్వసనీయ పనితీరు వంటి అంశాల కారణంగా ఈ కారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కొనుగోలుదారుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తొలిసారి కారు కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబాలకు డిజైర్ ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌గా కొనసాగుతోంది.

టాటా పంచ్ కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ఎంతంటే!

భారత కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌(Tata Motors)కు చెందిన టాటా పంచ్ (Tata Punch) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జూన్ 2026లో 21,006 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 10,446 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాలు 101 శాతం పెరగడం విశేషం. ఆకర్షణీయమైన డిజైన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, అలాగే పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉండటంతో టాటా పంచ్‌కు అన్ని వర్గాల కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారుకు ప్రస్తుతం ఇండియాలో చాలా డిమాండ్ నెలకొంది.
Advertisement

జూన్‌లో దేశాన్ని ఊపేసిన టాప్-10 కార్లు ఇవే.. టాటా దుమ్మురేపింది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో జూన్ నెల అమ్మకాల గణాంకాలు ఆసక్తికరమైన చిత్రాన్ని చూపించాయి. ఎన్నో సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మొదటి రెండు స్థానాలపై మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతుండేది. అయితే ఈసారి ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడింది. టాటా మోటార్స్‌కు చెందిన రెండు ప్రముఖ ఎస్‌యూవీలు టాటా పంచ్, టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మొదటి రెండు కార్లుగా నిలిచి కొత్త రికార్డు సృష్టించాయి. ఒకే కంపెనీకి చెందిన రెండు మోడళ్లు టాప్-2 స్థానాలను కైవసం చేసుకోవడం టాటా మోటార్స్‌కు పెద్ద విజయంగా చెప్పవచ్చు. జూన్ నెలలో టాటా పంచ్ ఏకంగా 21,006 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది.

రూ.45 వేల హీరో స్కూటర్‌ను జనాలు పిచ్చిగా కొంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండగా, హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కు చెందిన విడా (Vida) బ్రాండ్ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం దేశంలోని టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచిన విడా, తక్కువ కాలంలోనే మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని పూర్తిగా విడా బ్రాండ్ కింద నిర్వహిస్తుండగా, ప్రస్తుతం కంపెనీ ప్రధాన దృష్టి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంపైనే ఉంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే, విడా బ్రాండ్ మార్కెట్లో ఎంత వేగంగా పుంజుకుంటుందో స్పష్టంగా తెలుస్తోంది.

టాటా పంచ్ నంబర్-1.. నెక్సాన్ నంబర్-2.. జూన్‌లో సేల్స్ రికార్డు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకుంది. గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తుండగా, తాజాగా టాటా పంచ్ (Tata Punch) ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అంతేకాదు, టాటా పంచ్‌తో పాటు అదే కంపెనీకి చెందిన నెక్సాన్ (Nexon) కూడా రెండో స్థానంలో నిలవడంతో టాటా మోటార్స్‌కు ఇది నిజంగానే డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. ఒకే కంపెనీకి చెందిన రెండు కార్లు దేశంలో అత్యధికంగా అమ్ముడైన తొలి రెండు స్థానాలను ఆక్రమించడం కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారుల విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది. గత నెల టాటా మోటార్స్‌కు చారిత్రాత్మకంగా నిలిచింది. ఒక్క నెలలోనే మొత్తం 62,076 యూనిట్ల కార్లను విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది.

115 kmph స్పీడ్.. 180 కి.మీ రేంజ్.. కీవే కొత్త స్కూటర్ వచ్చేసింది!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలతో పాటు కొత్త బ్రాండ్లు కూడా తమ ఉత్పత్తులను వరుసగా పరిచయం చేస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే (Keeway) కూడా చేరింది. ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో పెట్రోల్ బైక్‌లను మాత్రమే విక్రయించిన ఈ సంస్థ, తొలిసారిగా ప్రీమియం సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అభివృద్ధి చేసిన హైప్‌వోల్ట్ మోడల్‌ను, కీవే తన చైనా అనుబంధ సంస్థ EZI సహకారంతో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Advertisement

దేశంలో ఈ కారు కొనేందుకు పోటీపడతారు

సొంతంగా ఒక మంచి సేఫ్టీ ఉన్న SUV కారును కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న కార్ లవర్స్‎కు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్-1 SUVగా దూసుకుపోతున్న తన పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ (Tata Nexon) పై జూలై 2026 నెలకు గానూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

నం.1 మారుతి ప్రీమియం కార్ పై భారీ డిస్కౌంట్లు

మధ్యతరగతి వాహన ప్రియులకు మారుతి సుజుకి ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. జూలై 2026 నెలలో తన విభిన్న కార్ల మోడళ్లపై కంపెనీ భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగానే దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే నంబర్-1 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) పై కూడా సరికొత్త ఆఫర్లను తీసుకువచ్చింది.

ఇప్పటివరకు వెనుకబడిన కంపెనీ.. ఇప్పుడు అమ్మకాలతో వార్తల్లోకి!

ప్రతి నెల ముగిసిన తర్వాత దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను ప్రకటించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) కూడా 2026 జూన్ నెలకు సంబంధించిన విక్రయ వివరాలను విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రధాన ప్రత్యర్థులతో పోలిస్తే ఆశించిన స్థాయిలో మార్కెట్ వాటాను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ, తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే నిస్సాన్ మళ్లీ పుంజుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఒకే ఒక్క కార్‌తో గ్లోబల్ బ్రాండ్స్‌కు చుక్కలు చూపించిన మారుతి

భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లో ఎవరూ ఊహించని సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. గత జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోనే నాలుగో అత్యంత విజయవంతమైన ఈవీ కంపెనీగా మారుతి సుజుకి అవతరించింది. ఈ సెగ్మెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో టాటా మోటార్స్, మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీలు నిలవగా, మారుతి సుజుకి ఏకంగా గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లను వెనక్కి నెట్టి నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లే, ఈసారి కూడా మారుతి సుజుకి దెబ్బకు హ్యుందాయ్, కియా, బీవైడీ (BYD) లతో పాటు వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం వెనుకబడిపోయాయి.
Advertisement

సామాన్యుడి డ్రీమ్ కారు వచ్చేసింది.. బడ్జెట్‌లోనే

భారత మార్కెట్లో తొలి కారు కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ఇండియా (Renault India) తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కొత్త రెనాల్ట్ క్విడ్ (New Renault Kwid)ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు పూర్తిగా చెందిన అనుబంధ సంస్థ అయిన రెనాల్ట్ ఇండియా, ఈ కొత్త మోడల్‌లో డిజైన్, వేరియంట్లు, ధరల విషయంలో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఎంపికను మరింత సులభతరం చేయడమే ఈ అప్‌డేట్ ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.