సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న అప్‌కమింగ్ మారుతి కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్లలో మారుతి సుజుకీ భారీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్‌ను శాసిస్తున్న టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్ల హవాకు బ్రేకులు వేసేందుకు మారుతి సరికొత్త వ్యూహాన్ని రెడీ చేసింది. రాబోయే మూడు సంవత్సరాలలో ఏకంగా 9 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, అందులో 7 కార్లు కేవలం ఎస్‌యూవీలే కావడం విశేషం. అందులో భాగంగానే వినియోగదారులను ఆకట్టుకునేందుకు విప్లవాత్మకమైన మైలేజ్ ఇంజన్లతో రానున్న 3 సరికొత్త ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా XUV 3XOకి భారీ డిమాండ్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత తీవ్ర పోటీ ఉన్న 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మహీంద్రా XUV 3XO తనదైన ముద్ర వేస్తోంది. ఒకప్పుడు XUV300 పేరుతో మార్కెట్లో ఉన్న ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయలేకపోయింది. అయితే మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్న మహీంద్రా, ఈ మోడల్‌కు పూర్తి స్థాయి మేకోవర్ ఇచ్చి XUV 3XO పేరుతో కొత్త అవతారంలో తీసుకొచ్చింది. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, పెట్రోల్-డీజిల్ ఇంజన్ ఆప్షన్లు, వేరు వేరు గేర్‌బాక్స్ ఆప్షన్లు, 5-స్టార్ భద్రతా ప్రమాణాలు, అలాగే పోటీదారులతో పోలిస్తే ఆకర్షణీయమైన ధర వంటి అంశాలు ఈ SUVకు భారీ ఆదరణ తీసుకొచ్చాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక మహీంద్రా షోరూమ్‌లలో XUV 3XO కోసం వినియోగదారుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక్క చేత్తో 9 కార్లను వెనక్కి నెట్టిన మిడిల్ క్లాస్ కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లోని సెడాన్ కార్ల విభాగంలో మారుతి సుజుకి డిజైర్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ కారు విక్రయాల జోరు ముందు మిగిలిన ఏ బ్రాండ్ కార్లు కూడా పోటీ పడలేకపోతున్నాయి. ఇటీవల విడుదలైన జూన్ 2026 సేల్స్ గణాంకాల ప్రకారం.. గత నెలలో డిజైర్ కారుకు సంబంధించిన మొత్తం 17,899 యూనిట్లు అమ్ముడయ్యాయి.

భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జాతర

ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణహిత (గ్రీన్) వాహనాలకు డిమాండ్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుతానికి ఇండియాలోని హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్లో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సంస్థ సుమారు 80 శాతం వాటాతో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది.
Advertisement

అందరి చూపు రేపటి వైపే!.. నిస్సాన్ కొత్త SUV గ్రాండ్ ఎంట్రీ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇప్పుడు భారత్‌లో మరో కీలక అడుగు వేయబోతోంది. దేశంలో అత్యంత పోటీ నెలకొన్న మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశించేందుకు కంపెనీ తన కొత్త టెక్టన్ (Tekton) ఎస్‌యూవీని సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ మోడల్‌పై ఆటోమొబైల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, అన్ని ఊహాగానాలకు తెరదిస్తూ ఈ SUV జూలై 9న భారత మార్కెట్‌లో అధికారికంగా తొలి అడుగు పెట్టనుంది. మాగ్నైట్, గ్రావైట్ మోడళ్లతో భారత మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకున్న కంపెనీ తన తదుపరి కారుగా టెక్టన్‌ను తీసుకొస్తుంది. వాస్తవానికి ఈ మోడల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పరిచయం చేయాలని నిస్సాన్ భావించింది. అయితే కొన్ని వ్యాపార, అభివృద్ధి సంబంధిత కారణాలతో విడుదల వాయిదా పడింది.

యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ యమహా కీలక అడుగు వేసింది. యువతను లక్ష్యంగా చేసుకుని కంపెనీ తన కొత్త యమహా ఏరోక్స్ ఇ (yamaha aerox e) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్లతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త పోటీకి నాంది పలకనుంది. డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఏరోక్స్ E తన పెట్రోల్ వెర్షన్ ఏరోక్స్ 155 నుంచి ప్రేరణ పొందింది.

సియెర్రా ఈవీ Vs హారియర్ ఈవీ.. మీ బడ్జెట్‌కు ఏది బెస్ట్ చాయిస్?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేసింది. అవే టాటా సియెర్రా ఈవీ, టాటా హారియర్ ఈవీ. ఈ రెండు కార్లు కూడా టాటా సరికొత్త, అడ్వాన్స్డ్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పైనే తయారయ్యాయి.

థార్ క్రేజ్‌కు బ్రేక్.. గోవాలో భారీ మార్పులకు రంగం సిద్ధం!

దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతాల్లో గోవా (Goa) ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తూ అక్కడి బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. గోవాలో పర్యాటకులు స్వేచ్ఛగా అక్కడి ప్రాంతాలను చూడటానికి ఎక్కువగా సెల్ఫ్-డ్రైవ్ అద్దె వాహనాలపై ఆధారపడుతుంటారు. ఇలాంటి సేవలు విస్తృతంగా గోవాలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టూవీలర్ వాహనాలతో పాటు ఎస్‌యూవీలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వీటిలో మహీంద్రా థార్‌కు (Mahindra Thar) ప్రత్యేక ఆదరణ ఉంది. అడ్వెంచర్ లుక్, ఎలాంటి రోడ్లపైనైనా సులభంగా ప్రయాణించే సామర్థ్యం కారణంగా చాలా మంది పర్యాటకులు థార్‌ను అద్దెకు తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు.
Advertisement

27 ఏళ్లుగా యూత్‎ను ఆకట్టుకుంటున్న బండిని బంద్ చేయనున్న యమహా

ప్రపంచవ్యాప్తంగా బైక్ రైడర్లను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా, మోటార్ సైకిల్ రంగంలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి ముగింపు పలకనుంది. తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత పురాతనమైన, పాపులర్ అయిన యమహా ఆర్6 (Yamaha R6) స్పోర్ట్‌బైక్ ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్ బ్రాండ్ ఇదే

ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్స్ తయారీదారుగా గుర్తింపు పొందిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) చాలా కాలంగా అమ్మకాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. తాజాగా విడుదల అయిన జూన్ నెలలో దేశీయంగా హీరో అదిరిపోయే అమ్మకాలను నమోదు చేసి టాప్‌లో నిలిచింది. సేల్స్ నివేదిక ప్రకారం, కంపెనీ జూన్ 2026లో మొత్తం 5,02,890 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించి దేశీయ అమ్మకాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. 2025 జూన్‌లో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 5,25,136 యూనిట్లు ఉండగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి 22,246 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. శాతాల లెక్కన ఇది దాదాపుగా 4.24 శాతం తగ్గుదలగా చెప్పొచ్చు.

పెద్ద ఫ్యామిలీస్ కోసం బెస్ట్ SUVలు వచ్చేస్తున్నాయ్

సొంతంగా ఓ పెద్ద కారు కొని తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీలకు వెళ్లాలని అనుకునే వాళ్లుకు ఓ సూపర్ గుడ్ న్యూస్. భారత ఆటోమొబైల్ మార్కెట్లో రాబోయే రోజుల్లో 6 లేదా 7 సీటర్ కార్ల హవా నడవబోతోంది. దేశంలోని ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలైన మారుతి సుజుకి, టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా, కియా, ఎంజీ మోటార్స్ త్వరలోనే సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లతో కూడిన 7 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ఈ కార్లన్నీ మల్టిఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో రోడ్లపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఆ 7 అద్భుతమైన SUVల పూర్తి వివరాలు, వాటి విశేషాలు తెలుసుకుందాం.

6 నెలల్లోనే 10 లక్షల ఈవీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు

ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్స్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. గతంలో పెట్రోల్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు క్రమంగా ఇప్పుడు ఈవీల వైపు మళ్లుతున్నారు. దీనికి ప్రధాన కారణం, పెరుగుతున్న ఇంధన ధరలు, అలాగే ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు మెరుగవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈవీ విప్లవం మరింత వేగం అందుకుంది. 2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే దేశీయ ఈవీ మార్కెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని దాటింది. సమాచారం ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై 6 నాటికే దేశవ్యాప్తంగా మొత్తం 10,05,279 ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్ముడుపోయి కొత్త రికార్డును నమోదు చేసింది.
Advertisement

టాప్ సెల్లింగ్ SUV ధరను భారీగా తగ్గించిన మారుతి సుజుకి

భారతదేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే దిగ్గజ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న తన బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ SUV మారుతి సుజుకి విక్టోరిస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ SUV ధర మీద ఏకంగా రూ.38,900 వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ దీపావళికి ఏకంగా 3 గేమ్ ఛేంజింగ్ కార్లు దిగుతున్నాయ్

భారతదేశంలో కార్ లవర్లకు, ముఖ్యంగా భారీ SUV మోడళ్లను ఇష్టపడేవారికి ఇదో సూపర్ గుడ్ న్యూస్. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సరికొత్త విప్లవం నడుస్తోంది. కంపెనీలు కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజన్లకే పరిమితం కాకుండా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి.

34 కిమీ మైలేజ్‌తో మధ్యతరగతి ఫేవరెట్ కారు!

భారతీయ పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందించడంలో దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లు సాధారణంగా బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రతినెలా కూడా ఈ కంపెనీ అమ్మకాల పరంగా ఆకట్టుకునే సేల్స్ గణంకాలను నమోదు చేస్తుంటాయి. ఈ క్రమంలో మారుతి ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి వ్యాగన్‌ ఆర్ (Wagon R) అమ్మకాల విషయంలో గత నెలలో మెరుగైన సంఖ్యలను సాధించింది. తాజాగా వచ్చిన సేల్స్ ప్రకారం, వ్యాగన్‌ ఆర్ జూన్ 2026 లో 16,952 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్లో తన సత్తా ఎంటో ఆటోమొబైల్ రంగానికి చూపించింది.

E20 పెట్రోల్‌తో పాత బండ్లు ఖరాబ్ కావడం గ్యారెంటీ.. నివేదికలో సంచలనాలు

భారతదేశంలో వాహనాలు వాడుతున్న కోట్లాది మంది ఓనర్లకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజన్ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) రూపొందించిన ఒక సీక్రెట్ రిపోర్టు ద్వారా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల ముఖ్యంగా పాత కార్లు, బైక్‌లలో ఉండే రబ్బర్ భాగాలు త్వరగా పాడైపోతాయని నివేదిక హెచ్చరించింది. ఇందులో ఇంధనాన్ని సరఫరా చేసే ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓ-రింగ్స్ వంటి కీలకమైన విడిభాగాలు దెబ్బతినే అవకాశం ఉంది.
Advertisement

20 ఏళ్లలో చరిత్ర సృష్టించిన అపాచీ

టీవీఎస్ మోటార్ (Tvs motor) కంపెనీకి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ అపాచీ (Apache) తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అపాచీ సిరీస్ బైక్‌లను ఉపయోగిస్తున్న రైడర్ల సంఖ్య 70 లక్షలు (7 మిలియన్లు) దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ 90కి పైగా దేశాల్లో అమ్ముడవుతూ, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంటోంది. 2005లో తొలిసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన అపాచీ, రెండు దశాబ్దాల కాలంలో సాధారణ బైక్‌గా ప్రారంభమై, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది.

10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్న టాప్ 5 బ్రాండ్లు ఇవే

ప్రస్తుతం మార్కెట్లో E20 పెట్రోల్ వాడకంపై ఎన్నో రకాల అపోహలు ప్రచారంలో ఉన్నప్పటికీ, భారతదేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థలు కస్టమర్లకు గట్టి భరోసా ఇస్తున్నాయి. వాహనదారులకు మానసిక ప్రశాంతతను చేకూర్చేలా అద్భుతమైన స్టాండర్డ్ వారంటీలతో పాటు సుదీర్ఘమైన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా 10 ఏళ్ల వరకు వారంటీ కవరేజీని అందిస్తూ, లాంగ్ టర్మ్ ఓనర్‌షిప్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. మన దేశంలో E20 కార్లపై అత్యధిక కాలం ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న టాప్ 5 కార్ల బ్రాండ్ల వివరాలను తెలుసుకుందాం.

రూ.74 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కోమాకి నుంచి డబుల్ ధమాకా!

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ కోమాకి (Komaki) తన వాహనాలను మరింత విస్తరించింది. బడ్జెట్ ధరలో మంచి రేంజ్, అధునాతన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్న వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ ఎంజీ ప్రో వీ (MG Pro V), ఎంజీ ప్రో ప్లస్ (MG Pro+) పేర్లతో రెండు కొత్త మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా నగరాల్లో చేసే ప్రయాణాలకు అనువుగా, తక్కువ మెయింటనెన్స్ ఖర్చుతో కూడిన స్కూటర్లను కోరుకునే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి నుంచి భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎస్‌యూవీ రాబోతుందా?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న మారుతి సుజుకి ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా పంచ్ (Tata Punch) SUVకి గట్టి పోటీ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. మిడ్-బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీ ఒక సరికొత్త చిన్న ఎస్‌యూవీని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తున్న ఈ అప్‌కమింగ్ కారుకు 'Y43' అనే కోడ్‌నేమ్ పెట్టినట్లు సమాచారం. జూన్ 2026లో బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డు క్రియేట్ చేసిన టాటా పంచ్‎ను ఢీకొట్టడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ కొత్త మైక్రో SUVని సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450కిమీ.. 75000ల మంది సొంతమైన కారు

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా(JSW MG Motor India)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీ (MG Windsor EV) అమ్మకాల్లో దుమ్ములేపుతోంది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ మోడల్ భారత మార్కెట్లోకి ప్రవేశించిన కేవలం రెండేళ్లే కాలంలోనే 75,000 యూనిట్ల విక్రయాల మైలు రాయిని దాటేసిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన అమ్మకాల వేగంతో విండ్సర్ ఈవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా టాప్ ప్లేసులో నిలిచింది. గత కొన్ని నెలలుగా ఎంజీ మోటార్స్ కంపెనీ నుంచి అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా కూడా ఇదే రికార్డు క్రియేట్ చేసింది.

దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బైక్ వచ్చేసింది

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో చాలా మంది తమ రోజువారి అవసరాల కోసం ఈవీలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే సాధారణంగా ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈవీ బైకుల కంటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనికి ప్రధాన కారణం తగినన్ని ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం, అలాగే ధరలు కాస్త అధికంగా ఉండటం. కానీ, ఇటీవలి కాలంలో తయారీదారులు ఈ సెగ్మెంట్‌పై కూడా ఫోకస్ చేయడం కారణంగా మెల్లగా ఈవీ బైకులు కూడా మార్కెట్లోకి అధికంగానే అడుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీ గత మే నెలలో కొత్త రోర్ ఇవో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది.

సింగిల్ ఛార్జ్‌తో 90 కిమీ.. ఆటోడ్రైవర్ల కడుపు నింపే ఆటో

భారతదేశంలో కమర్షియల్ వాహనాల రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న పియాజియో (Piaggio) సంస్థ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో సరికొత్త దాడికి తెరలేపింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగానే సరికొత్త ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ఆపే వేవ్ (Ape WavE)ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సామాన్యుల, మధ్య తరగతి ఆటో డ్రైవర్ల బడ్జెట్‎ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఆటోను ఎల్3 (L3) ప్యాసింజర్ ఈవీ కేటగిరీ కింద అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను కేవలం రూ.2.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

రూ.3.49 లక్షల కారుపై రూ.37,500 వరకు తగ్గింపు

కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రతినెలా వాహన తయారీదారులు తమ ఉత్పత్తులపై తగ్గింపులు అందిస్తుంటారు. దీని ద్వారా కంపెనీలు తమ స్టాక్‌ను ఎక్కువ అమ్ముకోగలుగుతాయి. అసలు ధర కంటే తక్కువలో లభించడం వలన వినియోగదారులు వాటిని కొనడానికి షోరూమ్‌లకు క్యూలు కడుతుంటారు. ఈ నేపథ్యంలో జులై నెల ప్రారంభం కాగానే ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki) కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి తన ప్రసిద్ద హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి ఎస్-ప్రెస్సో (S Presso) కారుపై భారీ ఎత్తున్న డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగానే ఈ కారు ధర చాలా తక్కువగా ఉంటుంది. పేద, మధ్యతరగతి వారు కూడా ఈజీగా కొనుగోలు చేసే విధంగా అందుబాటులోనే లభిస్తుంది.
Advertisement

ఒక్కసారిగా ఈ కారును కొనేవారు పెరిగారు

హ్యూందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో దిగ్గజ కార్ల తయారీదారుగా ప్రజల మన్నలను పొందుతుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లకు ఇటీవలి కాలంలో వినియోగారుల నుంచి బలమైన డిమాండ్ వస్తుంది. తాజాగా వచ్చిన కాంపాక్ట్ SUVకి సంబంధించిన అమ్మకాలు గణంకాలు భారతీయ మార్కెట్లో దీని పట్ల ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయి. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV అయిన హ్యూందాయ్ వెన్యూ (hyundai venue) గత నెలలో సేల్స్‌లో సత్తా చాటింది. అమ్మకాల నివేదిక ప్రకారం, ఈ కారు జూన్ 2026లో భారత మార్కెట్లో మొత్తం 10,776 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈ అమ్మకాలు సాధారణ సంఖ్యలు కాదు, గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోల్చినట్లయితే ఇది భారీ మొత్తంలో వృద్ధి అని చెప్పొచ్చు.