జూన్ 5న దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు

ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలను ఉపయోగించే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కుటుంబాలు ఇప్పుడు ఇంధన ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు నెలవారీ బడ్జెట్‌లో చిన్న భాగంగా ఉండే ఇంధన ఖర్చులు, ఇప్పుడు చాలా కుటుంబాలకు పెద్ద భారంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం వంటి సమస్యలు కూడా దేశాలను ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. భారతదేశం కూడా ఇప్పుడు ఈ మార్పు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బయో ఫ్యూయల్స్, ఇథనాల్ వంటి పర్యావరణ అనుకూల ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

iver Indie Gen 3 డ్రైవింగ్ ఇంప్రెషన్స్ పూర్తి వివరాలు

రివర్ ఇండి మూడో జనరేషన్ (River Indie Gen 3) భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఇతర స్కూటర్లతో పోలిస్తే ఎప్పుడూ భిన్నమైన దారిలో ప్రయాణిస్తోంది. ఎక్కువగా టచ్‌స్క్రీన్‌లు, కనెక్టెడ్ ఫీచర్లు, డిజిటల్ గిమ్మిక్స్‌పై ఆధారపడే పోటీదారుల మధ్య, ఈ బెంగళూరు-ఆధారిత స్కూటర్ మాత్రం పూర్తిగా ప్రాక్టికాలిటీ, యుటిలిటీ, రియల్-వరల్డ్ ఉపయోగంపై దృష్టి పెట్టింది. 2023లో మొదటిసారి మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్కూటర్ ఇప్పుడు మూడవ జనరేషన్‌కి చేరుకుంది. అదే Gen 3 అప్‌డేట్. ఈ కొత్త River Indie Gen 3 వెర్షన్‌లో కంపెనీ తన యుటిలిటీ ఫిలాసఫీని ఇంకా మెరుగుపరిచింది. బయట నుంచి చూస్తే అదే ప్రత్యేకమైన, కొంచెం భిన్నమైన డిజైన్ కొనసాగుతున్నప్పటికీ, లోపల మాత్రం గణనీయమైన మెకానికల్ మార్పులు చేశారు.

ఎలక్ట్రిక్ SUV కొనాలనుకుంటున్నారా?.. ఈ బడ్జెట్ ఆప్షన్లు మీకోసం!

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సాధారణంగా కార్ కొనుగోలు చేయాలని భావించే చాలామంది ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రన్నింగ్ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్, దీర్ఘకాలికంగా ఆదా చేసే అవకాశాల కారణంగా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరించడంతో, వివిధ బడ్జెట్ సెగ్మెంట్లలో అనేక ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. నగర ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ మోడల్స్ నుంచి ఫ్యామిలీకి అనువైన SUV రేంజ్ వరకు ఎన్నో ఆప్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టాటా పంచ్ EV, నెక్సాన్ EV, మహీంద్రా XUV400 EV కార్ల గురించి ఈ కింది కథణంలో తెలుసుకుందాం.

థార్ రాక్స్ డిమాండ్ చూస్తే ఆశ్చర్యమే!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో SUVలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రఫ్ అండ్ టఫ్ లుక్, ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం, భారీ రోడ్ ప్రెజెన్స్ కలిగిన వాహనాలకు యువత నుంచి కుటుంబాల వరకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తీసుకొచ్చిన థార్ (Thar) భారత మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. మొదట్లో ఇది ప్రధానంగా ఆఫ్‌రోడింగ్ ప్రేమికులు, అడ్వెంచర్ అభిమానులను టార్గెట్ చేస్తూ వచ్చినప్పటికీ, క్రమంగా సాధారణ కుటుంబాలు కూడా థార్ వైపు ఆకర్షితులయ్యాయి. అయితే మూడు డోర్ల థార్‌లో స్థలం పరిమితంగా ఉండటం, వెనుక సీట్లో ప్రయాణించడం కొంచెం అసౌకర్యంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 5 డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను తీసుకొచ్చింది.
Advertisement

మధ్యతరగతి కోసం వస్తున్న VinFast VF3 EV

ప్రస్తుతం భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఇంకా ఎక్కువ మంది వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కార్లపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు సాధారణ మధ్యతరగతి కొనుగోలుదారులకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి. దీనివల్ల దేశంలో ఈవీ కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోవడం లేదు. ఇదే పరిస్థితిని గమనించిన అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఇప్పుడు తక్కువ ధరల్లో కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంపై దృష్టి పెట్టాయి. తక్కువ ధరతో పాటు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, నగర ప్రయాణాలకు సరిపోయే సైజుతో కార్లను అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.

పల్లెటూరు వాళ్లు ఎక్కువగా కొంటున్న బైక్

మారుతున్న కాలంతో పాటు మార్కెట్లోకి ఎన్ని కొత్త బైకులు, స్కూటర్లు వచ్చినా పల్లెటూరి జనం గుండెల్లో మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక్క వాహనం టీవీఎస్ ఎక్స్ఎల్ 100. కాలం మారుతున్నా దీని క్రేజ్ అస్సలు తగ్గలేదు. సామాన్యుల నమ్మకమైన నేస్తంగా, వ్యాపారుల పాలిట కామధేనువుగా నిలిచిన ఈ సూపర్ హిట్ మోపెడ్ ఇప్పుడు సరికొత్త హంగులు, అధునాతన సదుపాయాలతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటూ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టూ వీలర్ వెహికల్ రంగంలో ఎన్ని సంచలనాలు నమోదైనా, దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఈ మోపెడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల కాలంలో దీని డిమాండ్ మరింత పెరిగింది. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 42,246 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంస్థ అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారస్తులు ఈ బండిని ఎంతగానో కొనుగోలు చేస్తున్నారు. అందుకే దీనిని అందరూ ప్రేమగా మన ఊరి బండి అని పిలుచుకుంటారు. ప్రస్తుతం సదరు తయారీ సంస్థకు చెందిన మొత్తం అమ్మకాల్లో ఈ మోపెడ్ ఏకంగా 12.40 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో మొదటి స్థానంలో జూపిటర్ స్కూటర్ (1.17 లక్షల యూనిట్లు), రెండో స్థానంలో అపాచీ సిరీస్ బైకులు (49,390 యూనిట్లు) ఉండగా, మూడో స్థానాన్ని ఈ నమ్మకమైన మోపెడ్ కైవసం చేసుకుంది. ఒకప్పుడు భారతదేశంలో అనేక రకాల మోపెడ్లు లభించేవి, కానీ కాలక్రమేణా అన్ని కంపెనీలు తమ మోడళ్లను నిలిపివేసినా, దశాబ్దాలుగా మార్కెట్లో ఒంటరిగా పోరాడుతూ నిలబడిన ఏకైక మోపెడ్ ఇదే కావడం విశేషం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ మోపెడ్‌ను కంపెనీ ఐదు వేర్వేరు మోడళ్లలో విక్రయిస్తోంది. ఇందులో హెవీ డ్యూటీ, హెవీ డ్యూటీ ఐ-టచ్ స్టార్ట్, విన్ ఎడిషన్, కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్, సరికొత్తగా వచ్చిన హెవీ డ్యూటీ అలాయ్ మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు సామాన్యుడి బడ్జెట్లోనే అంటే ప్రారంభ ధర రూ.46,850 నుంచి టాప్ మోడల్ ధర రూ.61,860 (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉన్నాయి.

రూ. 2 లక్షల బడ్జెట్లోనే టాప్ 5 సూపర్‌హిట్ బైకులు ఇవే!

సొంతంగా సరికొత్త మోటార్ సైకిల్ కొనాలనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన కల. అయితే మొదటిసారి బైక్ కొనేటప్పుడు కేవలం తక్కువ ధర మాత్రమే చూస్తే సరిపోదు. కొందరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి మైలేజ్ బైక్ ఇష్టపడితే, మరికొందరు వీకెండ్ సమయాల్లో లాంగ్ జర్నీలు చేసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం దేశీయ విపణిలో రూ.2 లక్షల లోపు ధరలోనే అడ్వాన్సుడ్ టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన అద్భుతమైన స్పోర్ట్స్, క్లాసిక్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

లక్షలు ఉంటే సరిపోదు ఈ బైక్ కావాలంటే అదృష్టం కూడా కావాలి

బైక్ లవర్స్ కలల రాకుమారుడు, బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్(Triumph Motorcycles) భారతీయ మార్కెట్లో మరో హై-ఎండ్ సంచలనానికి తెరలేపింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2026 అన్‌లీష్డ్ క్యాంపెయిన్‌లో భాగంగా అంతర్జాతీయంగా ప్రదర్శించిన మోస్ట్ అవేటెడ్ బైక్ ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 కేఫ్ రేసర్ ఎడిషన్ (Triumph Speed Twin 1200 Cafe Racer Edition)ను ఇప్పుడు అధికారికంగా దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Advertisement

దేశంలో మూడో బెస్ట్ స్కూటర్‌గా యాక్సెస్ 125

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారీ ప్రభావం చూపుతున్నాయి. రోజువారీ ప్రయాణం కోసం బైక్ లేదా స్కూటర్‌పై ఆధారపడే వారు ఇప్పుడు అదనపు ఖర్చును తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పని కోసం, చదువు కోసం, కుటుంబ అవసరాల కోసం బయటకు వెళ్లే ప్రతి ప్రయాణం కూడా ఇప్పుడు జేబుపై భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలవైపు దృష్టి మళ్లిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలన్న ఆలోచన ఉన్నా, వాటి ధరలు ఇప్పటికీ బడ్జెట్‌కు అందని స్థాయిలో ఉండటంతో సాధారణ వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు.

పెట్రోల్ సేవ్ చేసే జపాన్ SUV.. ఫుల్ ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో రివీల్!

గత కొంతకాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా (Honda Cars India) పేరు అంతగా వినిపించలేదు. ఒకప్పుడు సెడాన్ సెగ్మెంట్‌లో తనదైన ఆధిపత్యాన్ని చూపించిన హోండా, SUV మార్కెట్ వేగంగా పెరుగుతున్న సమయంలో మాత్రం కొంత నిశ్శబ్దంగా కనిపించింది. ముఖ్యంగా కొత్త మోడళ్ల విషయంలో ఇతర కంపెనీలు వరుసగా ఆకర్షణీయమైన SUVలను తీసుకొస్తుండగా, హోండా మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది అనే అభిప్రాయం మార్కెట్లో ఏర్పడింది. దీంతో చాలా మంది ఆటోమొబైల్ అభిమానులు "హోండా నుంచి పెద్ద సర్‌ప్రైజ్ ఎప్పుడు వస్తుంది?" అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా Honda ZR-V అనే కారును ఆవిష్కరించింది. దీని గురించిన వివరాలు కింది కథణంలో చూద్దాం.

లీటరుకు 27 కిమీ.. రూ. 12 లక్షలకే సరికొత్త హోండా సిటీ లాంచ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన లగ్జరీ సెడాన్ కారు హోండా సిటీ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా, తన ఐదవ తరం మోడల్‌కు సంబంధించి రెండో మిడ్-లైఫ్‌సైకిల్ అప్‌డేట్‌గా 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (2026 Honda City Facelift) వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్ మార్పులు, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, లగ్జరీ హంగులతో వచ్చిన ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.12 లక్షలుగా నిర్ణయించారు.

ఒకే బ్రాండ్‌లో రెండు రిజల్ట్స్.. ఎర్టిగా హిట్, XL6 డౌన్!

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్లో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఏర్టిగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే 7-సీటర్ MPVగా ఎర్టిగా పేరు తెచ్చుకోవడానికి కారణం దాని ప్రాక్టికల్ డిజైన్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర. పెద్ద కుటుంబాల ప్రయాణ అవసరాలను సులభంగా తీర్చగలిగే ఈ కారు, ఇండియన్ మార్కెట్లో "ఫ్యామిలీ కార్"గా బలమైన గుర్తింపును పొందింది. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకుని మారుతి సుజుకి కొన్నేళ్ల క్రితం అదే ప్లాట్‌ఫారమ్‌పై మరింత ప్రీమియం టచ్‌తో ఒక కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. అదే మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 (Maruti Suzuki XL6).
Advertisement

కేవలం రూ.5 లక్షలకే 34 కిమీ మైలేజ్ ఇచ్చే కార్లు

భారతదేశంలో రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య వాహనదారులు కారు కొనాలన్న ఆలోచనను మానుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఇంధన ప్రత్యామ్నాయాల కోసం కస్టమర్లు వెతుకుతున్నారు.

ఉద్యోగులు, స్టూడెంట్స్ ఎక్కువగా కొంటున్న స్కూటర్ ఇదే!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) గురించి భారతీయ వినియోగదారులలో చాలాకాలంగా ఒక సాధారణ అభిప్రాయం ఉంది. అదేంటంటే.. యమహా బైకులు, స్కూటర్లు స్టైలిష్‌గా ఉన్నప్పటికీ ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు లేదా రోజువారీ ప్రయాణాల కోసం స్కూటర్ కొనాలనుకునే వారు సాధారణంగా తక్కువ ధర, మంచి మైలేజ్ ఇచ్చే మోడళ్లవైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కానీ ఇప్పుడు యమహా ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (Yamaha RayZR 125 Fi Hybrid) భారత మార్కెట్లో ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది.

27కిమీ మైలేజ్.. నెలకు 12,000 కార్లు సేల్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద కుటుంబాల కోసం 7 సీటర్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే బడ్జెట్ పరిమితుల వల్ల చాలా మంది వీటిని కొనలేకపోతుంటారు. అలాంటి వారి కోసం దేశంలోనే అత్యంత చౌకైన, తిరుగులేని మైలేజ్ ఇచ్చే ఏడు సీట్ల సిఎన్‌జి కారు ఒకటి మార్కెట్‌ను శాసిస్తోంది. కేవలం రూ.6.36 లక్షల ప్రారంభ ధరతో, లీటరుకు 27 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తూ, సరికొత్త భద్రతా ఫీచర్లతో దూసుకుపోతున్న ఆ సూపర్ హిట్ కారు విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలో 7 సీటర్ కార్ల విభాగంలో రెనాల్ట్ ట్రైబర్, నిస్సాన్ గ్రావైట్ వంటి కార్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ప్రారంభ ధరలు రూ.5.65 లక్షల నుంచి ఉన్నాయి. ఇక అందరికీ ఇష్టమైన మారుతి ఎర్టిగా కారు కొనాలంటే కనీసం రూ.8.80 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ వీటన్నిటికంటే సగం ధరలోనే లభిస్తూ, సామాన్యుడి సొంత ఇంటి కారు కలని నిజం చేస్తోంది మారుతి ఈకో.

మారుతి కార్లు ఇక చీప్ కాదు.. జూన్ నుంచి కొత్త ధరలు అమల్లోకి!

ఇండియాలో సామాన్య ప్రజల కార్ కలను నిజం చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు ముందువరుసలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, సులభమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాది మంది మారుతి కార్లను నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, మొదటిసారి కారు కొనాలనుకునే వారికి మారుతి ఎప్పుడూ తొలి ఎంపికగానే నిలిచింది. అయితే ఇప్పుడు అదే కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం కార్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారిపై అదనపు భారం మోపేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందుబాటు ధరల్లో లభించిన మారుతి కార్లు ఇకపై మరింత ఖరీదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Advertisement

జస్ట్ రూ.3 లక్షలకే 4 డోర్స్ ఎలక్ట్రిక్ కారు

మధ్య తరగతి ప్రజలకు తమ సొంత కారు కలను నిజం చేయడానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారతీయ మార్కెట్లోకి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బజాజ్ క్యూట్ ఈవీ (Bajaj Qute EV) పేరుతో రాబోతున్న ఈ చిన్న కారు ధర, ఫీచర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

రూ.1.22లక్షల్లో Bajaj Pulsar N160 కొత్త వేరియంట్ లాంచ్

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడపోయే పల్సర్ బైకుల్లో బజాజ్ ఆటో సంస్థ ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ పల్సర్ N160 (Bajaj Pulsar N160) రేంజ్‌లో సరికొత్త ప్రీమియం వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.22 లక్షలుగా (ఇంట్రడక్టరీ ప్రైస్) నిర్ణయించారు. ఇన్నాళ్లూ భారీ రేసింగ్ బైకులకు మాత్రమే పరిమితమైన క్రేజీ ఫీచర్లను ఈ సరికొత్త పల్సర్‌లో అందించడం విశేషం. కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్, అదిరిపోయే స్పోర్టీ లుక్స్‌తో రోజువారీ ప్రయాణాలను మరింత సుఖవంతం చేయడానికి ఈ బైక్ దూసుకొచ్చింది. ఈ సరికొత్త పల్సర్ N160 లో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. దీనికి అమర్చిన గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్. ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ బైక్‌కు ఒక రేసింగ్ లుక్‌ను ఇవ్వడమే కాకుండా, రోడ్లపై సడన్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు, హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు బైక్ అస్సలు ఊగకుండా అద్భుతమైన స్టెబిలిటీని, రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది. బైక్ నడిపే కుర్రాళ్ల సేఫ్టీ కోసం బజాజ్ ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లను జోడించింది. ఇందులో మొదటిసారిగా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ (Slipper Clutch) టెక్నాలజీని ఇచ్చారు. దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్లు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా చాలా స్మూత్ రైడింగ్ అనుభూతి లభిస్తుంది. అలాగే, ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (Dual-Channel ABS) భద్రతను కూడా కల్పించారు. టెక్నాలజీ లవర్స్ కోసం ఈ బైక్‌లో అప్‌డేటెడ్ నెగటివ్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. దీని టాప్ ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు విభిన్న రోడ్ల కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ కూడా లభిస్తాయి. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు వీలుగా ఫ్యూయల్ ట్యాంక్ సరిహద్దుల్లోనే ఒక USB Type-C ఛార్జింగ్ పోర్టును కూడా అమర్చారు. రాత్రి వేళల్లో రోడ్లు క్లియర్‌గా కనిపించేందుకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్ సెటప్‌ను ఇచ్చారు. మెకానికల్ విషయానికి వస్తే బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పాత నమ్మకమైన 164.82 సీసీ సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌నే వాడారు. ఇది 15.7 bhp పవర్, 14.65 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ బైక్ పాత కలర్ ఆప్షన్లయిన పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే మరియు బ్రూక్లిన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. మార్కెట్లో ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, యమహా ఎఫ్‌జెడ్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V లతో గట్టిగా పోటీ పడనుంది. పల్సర్ N160 తో పాటు బజాజ్ ఆటో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ బైక్ Bajaj Pulsar NS400Z సరికొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో సరికొత్త 349 సీసీ ఇంజన్‌ను వాడారు. ఈ అప్‌డేట్ వల్ల ఈ బైక్ ఇప్పుడు 18% జీఎస్టీ పరిధిలోకి రావడంతో దీని ధర భారీగా తగ్గింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,80,092 గా నిర్ణయించారు. ఈ 349cc ఇంజన్ ఏకంగా 40.6 bhp పవర్, 33.2 Nm టార్క్ జనరేట్ చేస్తూ రైడర్లకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తుంది.

బుల్లెట్ సౌండ్ వినిపిస్తే చాలు.. ఇంకా ఇదే బైక్ కొంటున్నారు!

భారతీయ రోడ్లపై కొన్ని వాహనాలకు కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం కూడా ఉంటుంది. అలాంటి అరుదైన మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఒకటి. కాలం మారింది, టెక్నాలజీ మారింది, మార్కెట్లో ఎన్నో ఆధునిక ఫీచర్లతో కొత్త బైకులు వచ్చాయి. LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లేలు, అలాయ్ వీల్స్, స్పోర్టీ డిజైన్లు వంటి ఎన్నో ఫీచర్లు ఇప్పుడు సాధారణమయ్యాయి. అయినప్పటికీ, వీటిలో ఏవి పెద్దగా లేకపోయినా బుల్లెట్ 350 మాత్రం ఇప్పటికీ భారతీయుల మనసుల్లో తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలుపుకుంది. దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కేవలం ఒక బైక్‌గా మాత్రమే కాకుండా, ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, రాయల్ రైడింగ్ అనుభూతికి ప్రతీకగా నిలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో, ప్రజలు ఇప్పుడు రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్నారు. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చు, సులభమైన మెయింటెనెన్స్, అలాగే భవిష్యత్ టెక్నాలజీ కావడంతో ఈవీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో అనేక బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న మోడల్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ లెక్ట్రిక్స్‌కు చెందిన ఎన్ డ్యూరో (Lectrix NDuro Electric Scooter). లెక్ట్రిక్స్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బుకింగ్‌కు అందుబాటులో ఉంది.
Advertisement

ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్ రావడం గ్యారెంటీ

భారతదేశ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ (Midsize SUV) మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan India) సర్వం సిద్ధం చేసుకుంది. దేశీయ మార్కెట్లో చాలా కాలంగా కేవలం మాగ్నైట్ కారుతోనే నెట్టుకొస్తున్న నిస్సాన్, ఇటీవల 7-సీటర్ విభాగంలో గ్రావైట్‎ను పరిచయం చేసింది.

సెలెరియో ధర & EMI ప్లాన్ వివరాలు!

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) భారత హ్యాచ్‌బ్యాక్ విభాగంలో చాలా కాలంగా తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. నగర రోడ్లలో సులభంగా నడిపించగలిగే కాంపాక్ట్ డిజైన్, రోజువారీ వినియోగానికి అనువైన ప్రాక్టికల్ ఫీచర్లు ఈ కారును ఎంతో ఉపయోగకరంగా మారుస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి నమ్మకమైన కారు కావాలనుకునే కుటుంబాలు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు, మొదటి కారుగా కొనాలనుకునే కస్టమర్లకు సెలెరియో ఎప్పుడూ ఒక బెటర్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కూడా ఈ మోడల్‌కు మరింత బలాన్ని ఇస్తూ, దీన్ని మార్కెట్లో స్థిరమైన ఎంపికగా నిలబెడుతోంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.4.70 లక్షలు నుంచి రూ.6.73 లక్షలు (ఎక్స్-షోరూమ్). EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం

రూ.5.59 లక్షల కారుకు దేశమంతా బ్రహ్మరథం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-Compact SUV)ల మధ్య పోటీ రసవత్తరంగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కార్లను వెనక్కి నెట్టి.. టాటా మోటార్స్ కి చెందిన చిన్న కారు సరికొత్త సంచలనం సృష్టించింది.

నెక్సాన్, బ్రెజ్జా ముందు స్కోడా కైలాక్ వెనుకబడిందా? అమ్మకాల్లో క్షీణత!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో యూరోపియన్ కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ జాబితాలో ముందువరుసలో నిలిచే బ్రాండ్లలో స్కోడా ఆటో (Skoda Auto) ఒకటి. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ, గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా భారతీయ రోడ్లు, వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మోడళ్లతో కంపెనీ మంచి విజయాన్ని అందుకుంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కంపెనీకి ప్రధాన బలంగా నిలుస్తున్న మోడల్ స్కోడా కైలాక్ (Skoda Kylaq). స్టైలిష్ డిజైన్, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ, ఆధునిక ఫీచర్లు, ప్రీమియం ఫీల్ కారణంగా ఈ SUVకు మంచి ఆదరణ లభిస్తోంది.
Advertisement

రూ.12 లక్షల బడ్జెట్ లో దొరికే టాప్-4 CNG SUVలు ఇవే

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎస్‌యూవీ (SUV) కార్ల హవా నడుస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో కస్టమర్లు అందరూ ఇప్పుడు సిఎన్‌జి (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఫ్యామిలీల కోసం భారత మార్కెట్లో రూ.12 లక్షల కంటే తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కంఫర్టబుల్ సిఎన్‌జి ఎస్‌యూవీలు అందుబాటులోకి వచ్చాయి.