ఎప్పుడొచ్చామన్నది కాదన్నా.. మార్కెట్ దున్నేశామా లేదా ?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కౌంటర్ పార్ట్ హ్యుందాయ్‌కు తోడుగా, కమ్-బ్యాక్ ఇచ్చిన కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ కియా ఇండియా ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన ఈ సంస్థ, జనవరి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అదిరిపోయే సేల్స్ గ్రోత్‌ను నమోదు చేసింది.

ధర తగ్గించి, ఫీచర్లు పెంచిన హ్యుందాయ్

ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన యుద్ధం సాగుతోంది. కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో దూసుకుపోతుండగా.. రెండో స్థానం కోసం మాత్రం మూడు దిగ్గజ కంపెనీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అటు దేశీయ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇటు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మధ్య పోటీ పీక్స్‌కు చేరింది. ఈ రేసులో తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టి మళ్ళీ పట్టు సాధించేందుకు హ్యుందాయ్ (Hyundai) ఇప్పుడు భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఫిబ్రవరి నెలకు గాను తన పాపులర్ కార్ల మోడళ్లపై ఏకంగా రూ.75,000 వరకు భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్లను ప్రకటించి కస్టమర్లను ఊరిస్తోంది.

ఒక్క కారులో 9 మంది వెళ్లొచ్చు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరత్వానికి, నమ్మకానికి మరో పేరు అంటే అది మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తయారు చేసిన మహీంద్రా బొలెరో (Mahindra Bolero)నే అని చెప్పాలి. పావు శతాబ్దానికి పైగా దేశవ్యాప్తంగా రోడ్లపై తన సత్తా చాటుకుంటూ వస్తున్న ఈ ఎస్యూవీ, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి వర్గం వినియోగదారుడి విశ్వాసాన్ని గెలుచుకుంది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టి దాదాపు 26 సంవత్సరాలు పూర్తిచేసుకున్నప్పటికీ, బొలెరోకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కాలానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకుంటూ వచ్చినా, తన అసలు స్వభావమైన దృఢత్వం, పనితీరును మాత్రం అలాగే కొనసాగిస్తోంది.

కస్టమర్లు రాకపోయే సరికి దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia india) భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి మోడళ్లతో మధ్య తరగతి కొనుగోలుదారుల మనసును గెలుచుకుని, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. డిజైన్, ఫీచర్లు, ధర ఈ మూడు అంశాల్లోనూ కియా తనదైన ముద్ర వేసింది. అయితే ఇదే బ్రాండ్‌కు ప్రస్తుతం ఒక గంభీరమైన సవాలు ఎదురవుతోంది. కియా ఎంతో ఆశలు పెట్టుకున్న తన కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్‌ (kia syros) కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ మోడల్‌ను కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఒక వినూత్న ప్రయోగంగా, టాల్‌బాయ్ శైలిలో స్పోర్ట్ యుటిలిటీ వాహనంగా పరిచయం చేశారు.
Advertisement

దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ

2026 సంవత్సరం ప్రారంభం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మెల్లగా పెరుగుతూ వచ్చిన ఈ విభాగం, ఇప్పుడు స్పష్టమైన వేగాన్ని అందుకుంది. కేవలం ప్రయాణీకుల కార్లు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల విభాగంలో కూడా ఎలక్ట్రిక్ మోడళ్లకు గణనీయమైన ఆదరణ కనిపిస్తోంది. ఇది భారత మార్కెట్‌లో మారుతున్న వినియోగదారుల అభిరుచిని స్పష్టంగా తెలియజేస్తోంది. కొత్త కొత్త ఎలక్ట్రిక్ మోడళ్ల నిరంతర ప్రవేశం కొనుగోలుదారులకు విస్తృత ఎంపికలను అందిస్తోంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను రాయితీలు కూడా ఈ మార్పుకు బలంగా దోహదపడుతున్నాయి. ఫలితంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమర్ల విశ్వాసం స్పష్టంగా పెరిగింది.

ఈ టాటా కారు కోసం షోరూమ్‌ల చుట్టూ తిరుగుతున్న జనాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్య-సైజ్ SUV విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్ టాటా హారియర్ (Tata Harrier). స్ట్రాంగ్ డిజైన్, రోడ్డుపై రాయల్ ప్రెజెన్స్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఈ SUVకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ వినియోగం, లాంగ్ డ్రైవ్స్, అలాగే హైవే ప్రయాణాలకు హారియర్‌ను వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ 2026 సంవత్సర ఆరంభంలో కూడా అలాగే కొనసాగింది. గత నెల జనవరి 2026లో మొత్తం 3,711 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ (Delivery) చేయబడ్డాయి. ఇది టాటా హారియర్‌కు చాలా పాజిటివ్ సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే, గత సంవత్సరం అదే కాలం అయిన జనవరి 2025లో కేవలం 1,488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

కిలోమీటరుకు 1 రూపాయి ఖర్చు! ఒక్కసారే 7 మంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో MPV సెగ్మెంట్‌కు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన మైలేజ్ అందించే 7-సీటర్ కార్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఈ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మోడల్ కియా కారెన్స్ (Kia Carens). స్టైలిష్ డిజైన్, ఫీచర్‌లతో నిండిన క్యాబిన్, సేఫ్టీపై దృష్టి ఇవన్నీ కలిపి భారతీయ కస్టమర్లలో కారెన్స్‌కు మంచి ఆదరణను తీసుకొచ్చాయి. 2026 సంవత్సరాన్ని కూడా కారెన్స్ ఘనంగా ప్రారంభించింది. 2026 జనవరిలో మొత్తం 5,633 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా మార్కెట్లో తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించింది. గత ఏడాది జనవరి 2025లో 5,522 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అదనంగా 111 కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

బైక్ లవర్స్ కోసం స్పెషల్ గిఫ్ట్ వచ్చేసింది

గుజరాత్‌లోని విస్తారమైన తెల్లటి ఉప్పు మైదానాలు, సూర్యాస్తమయంలో ఆకాశంతో కలిసిపోయే ఆ అద్భుత దృశ్యం అదే నేపథ్యంగా జరుగుతున్న రాన్ ఉత్సవ్ ఈసారి మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే ఈ వేడుక వేదికగా TVS Motor Company తన ప్రసిద్ధ మోడల్ TVS Roninకు ప్రత్యేక మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్‌కు రోనిన్ రాన్ ఆఫ్ కచ్ ఎడిషన్ అనే పేరు పెట్టారు. ఈ బైక్ కేవలం ఒక మోటార్‌సైకిల్ కాదు; ఇది కళ, సంస్కృతి, ప్రకృతి అన్ని కలిసిన రూపం. రాన్ ఉత్సవ్ కస్టమ్ సిరీస్‌లో భాగంగా విడుదలైన ఈ ప్రత్యేక ఎడిషన్, కచ్ ప్రాంతంలోని తెల్లటి ఇసుక దిబ్బల సౌందర్యం నుంచి స్ఫూర్తి పొందింది.
Advertisement

ఈ కార్ల వల్ల తలలు పట్టుకుంటున్న షోరూం ఓనర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే ఒక తిరుగులేని బ్రాండ్. మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన సంస్థగా, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందించడంలో మారుతికి సాటిలేదు. అయితే, మారుతి సుజుకి అమ్మే ప్రతి కారు హాట్ కేకులా అమ్ముడవుతుందని అనుకుంటే పొరపాటే.

10 నెలల్లోనే 41 వేల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కొనేశారు

భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనం (EV) అంటే కేవలం టాటా మోటార్స్ మాత్రమే గుర్తుకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతోంది. దేశీయ దిగ్గజం మహీంద్రా (Mahindra & Mahindra) తన సరికొత్త బోర్న్ ఎలక్ట్రిక్ (Born Electric) శ్రేణి వాహనాలతో మార్కెట్లోకి తుపానులా దూసుకొచ్చింది. కేవలం 10 నెలల వ్యవధిలోనే 41,000 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ అనూహ్య వృద్ధి ఇప్పటివరకు ఇవి మార్కెట్‌లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్‌కు ఒక రకమైన రెడ్ అలర్ట్ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వెస్పా స్కూటర్ ముందు ఖరీదైన కార్లు కూడా వేస్టే

ఇటాలియన్ ఐకానిక్ స్కూటర్ బ్రాండ్ వెస్పా (Vespa) తన పుట్టినింటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఆఫీసినా 8(Officina 8) స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వెస్పా స్కూటర్ అంటేనే ఒక స్టైల్ స్టేట్‌మెంట్. అలాంటిది 80 ఏళ్ల చరిత్రను పుణికిపుచ్చుకుని వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు వాహన ప్రియుల మనసు దోచుకుంటోంది. కేవలం రవాణా సాధనంగానే కాకుండా, ఒక కళాఖండంలా రూపొందించిన ఈ స్కూటర్ ధర, ఇతర విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆఫీసినా 8 అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది వెస్పా పుట్టుకకు పునాది వేసిన ఒక ప్రయోగశాల. 1944లో ఇటలీలోని పొంటెడెరాలో ఉన్న పియాజియో (Piaggio) ఫ్యాక్టరీలో ఆఫీసినా 8 పేరుతో ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిభావంతులైన ఇంజనీర్లు, డిజైనర్లు, మెకానిక్కుల బృందం కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి వెస్పా ప్రోటోటైప్‌ను తయారు చేశారు.

ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఇదే ఫస్ట్ ఛాయిస్!

టాటా మోటార్స్ (Tata Motors) తయారు చేసిన టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్. స్టైలిష్ డిజైన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఫీచర్ల పరంగా మంచి విలువ ఇవ్వడం వంటి అంశాలు ఈ కారును కుటుంబాలకే కాదు, యువతకు కూడా ఎంతో ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. జనవరి 2026లో ఆల్ట్రోజ్ అమ్మకాలు ఈ ప్రజాదరణను మరొకసారి నిరూపించాయి. ఆ ఒక్క నెలలోనే మొత్తం 3,135 కార్లు డెలివరీ అయ్యాయి. ఇదే కాలంలో గత సంవత్సరం, అంటే జనవరి 2025లో కేవలం 2,033 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలను పోలిస్తే, కేవలం ఏడాది వ్యవధిలోనే అదనంగా 1,102 కార్లు ఎక్కువగా అమ్ముడవడం గమనార్హం.
Advertisement

ఒకప్పుడు 1 కారు..ఇప్పుడేమో 3300 శాతం సేల్స్ గ్రోత్

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ప్రస్తుతం భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కంపెనీ అమ్మకాల గణాంకాలను గమనిస్తే.. ఒక మోడల్ ఏకంగా 3300 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఓవరాల్‌గా కంపెనీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు.

డిజైర్ తర్వాత దేశంలో అందరూ కొంటున్న కారు ఇదే

SUVల హవా నడుస్తున్న ఈ రోజుల్లో సెడాన్లకు భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ మారుతి సుజుకి డిజైర్‌తో పాటు ఇప్పుడు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) కూడా మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. రోడ్లపై ఎత్తైన SUVలే కనిపిస్తున్న ఈ సమయంలో, ఒక కాంపాక్ట్ సెడాన్ ఇంత భారీగా అమ్మకాలు సాధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌కు చెందిన ఆరా, 2026 జనవరి నెలలో ఊహించని స్థాయిలో అమ్మకాలు నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. గత కొన్ని నెలలుగా ఈ సెడాన్‌కు మార్కెట్‌లో వస్తున్న స్పందనను చూసి కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందనే చెప్పాలి.

ఇండోనేషియా గడ్డ పై టాటా మోటార్స్ సునామీ

గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. ఇండోనేషియా దేశం నుంచి ఏకంగా 70,000 కమర్షియల్ వెహికల్స్ కోసం భారీ ఎగుమతి ఆర్డర్‌ను దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక ఆర్డర్ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై మేక్ ఇన్ ఇండియా సత్తాకు నిదర్శనం.

మారుతున్న ట్రెండ్‌లకు బలైందా? S-ప్రెస్సో సేల్స్ డౌన్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S presso) ఒకప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి క్రేజ్ సంపాదించిన హ్యాచ్‌బ్యాక్. తక్కువ ధర, సరళమైన డిజైన్, మంచి మైలేజ్ వంటి అంశాలతో మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలిచింది. చిన్న కుటుంబాలకు సరిపోయే సైజ్, నగర ప్రయాణాలకు అనువైన డ్రైవింగ్ అనుభవం కారణంగా ఇది ఒక ప్రాక్టికల్ కారుగా గుర్తింపు పొందింది. అయితే 2026 జనవరిలో ఈ కారుకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు అంత ఉత్సాహపరిచేలా లేవు. ఆ నెలలో కేవలం 1,954 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే సమయంలో, అంటే 2025 జనవరిలో, 2,895 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు సంఖ్యలను పోల్చితే, ఎస్-ప్రెస్సో అమ్మకాలు సంవత్సరానికి సుమారు 32.50 శాతం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

బైక్ ఇచ్చే మైలేజ్ ఇచ్చినా కొనే దిక్కేలేదు

భారతదేశంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారికి మారుతి సుజుకి కార్స్ అంటే ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో మారుతి దిట్ట. అయితే మారుతి సుజుకికి చెందిన సెలీరియో (Celerio) విషయంలో మాత్రం లెక్కలు మారుతున్నాయి.

కీస్ చేతిలో పెడితే చాలు.. ఆమె ముఖంలో స్మైల్!

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫిబ్రవరి 14 వచ్చేస్తోంది. వాలెంటైన్స్ డేను తమకు ఇష్టమైన వ్యక్తితో మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రేమికులంతా ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటలు ఈ ఒక్క రోజు కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. తమ ప్రేమను మాటల్లోనే కాదు, గుర్తుండిపోయే విధంగా వ్యక్తం చేయాలనే ఆలోచనతో ఈ రోజును ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే అంటేనే గిఫ్ట్‌ల హడావిడి. ప్రేమగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ, అవతలి వ్యక్తి ముఖంపై చిరునవ్వు తెప్పించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చాక్లెట్లు, పూలు, కార్డులు వంటి సాధారణ గిఫ్ట్‌లకు బదులుగా, ఈసారి కొంచెం డిఫరెంట్‌గా, మహిళలకు స్కూటర్ అద్భుతమైన బహుమతిగా నిలుస్తుంది. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లోని టాప్ 3 స్కూటర్లను ఒకసారి చూద్దాం.

ఈ కారుని జనాలు పట్టించుకోవడం లేదు

మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు వినగానే భారత మార్కెట్‌లో అమ్మకాల రికార్డులు గుర్తుకొస్తాయి. డిజైర్, ఎర్టిగా, ఫ్రాంక్స్, బాలెనో, వ్యాగన్ఆర్ లాంటి కార్లు ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ, కంపెనీకి టాప్ సెల్లర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ కార్ల మధ్య ఏది నంబర్ వన్ అనే పోటీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఇదే మారుతి సుజుకి లైనప్‌లో అత్యల్పంగా అమ్ముడవుతున్న కారు ఏది? అని ఎవరైనా ఆలోచించారా? ఆశ్చర్యంగా అనిపించినా, ఆ జాబితాలో ముందుంటుంది ఒకే ఒక్క కారు... అదే మారుతి సుజుకి ఇన్విక్టో (Invicto). ఇన్విక్టోను ఒక్కసారి చూస్తేనే ఇది సాధారణ మారుతి కారు కాదు అనే ఫీలింగ్ వస్తుంది. సైజ్ పరంగా చూస్తే ఇది నిజంగా ఏనుగు సైజు MPVలా కనిపిస్తుంది.

డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మహీంద్రా

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ భారత మార్కెట్‌లో తన తాజా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మహీంద్రా ఉడో (Mahindra UDO) ను అధికారికంగా విడుదల చేసింది. 2018 ఆటో ఎక్స్‌పోలో రెండు సీట్ల త్రీ-వీలర్ కాన్సెప్ట్‌గా మొదటిసారి దర్శనమిచ్చిన ఈ వాహనం, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు వాణిజ్య వినియోగానికి సిద్ధంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పట్లో కాన్సెప్ట్‌గా మాత్రమే కనిపించిన ఉడో, ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెంది ఎలక్ట్రిక్ ఆటోగా మారింది. పట్టణ రవాణా అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన మహీంద్రా ఉడో, L5M కేటగిరీలోకి వస్తుంది. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌తో నిండిన నగర వీధులు, చిన్న పట్టణాల్లోని రోజువారీ కమ్యూటింగ్ అవసరాలను సులభంగా తీర్చేలా ఈ వాహనాన్ని రూపకల్పన చేశారు.
Advertisement

సముద్రం దాటిన స్కూటర్లు

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న వాటికన్ సిటీ స్టేట్‌కు రెండు TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా డెలివరీ చేసింది. ఈ డెలివరీ వాటికన్ సిటీ స్టేట్, ఎక్సెలెంటియా మధ్య జరిగిన ఉమ్మడి చొరవలో భాగంగా జరిగింది. రవాణా రంగంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఎక్సెలెంటియా సంస్థ, TVS మోటార్ ఇటాలియాతో భాగస్వామ్యం కలిగి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. TVS మోటార్ ఇటాలియా అనేది భారతీయ TVS మోటార్ కంపెనీకి చెందిన ఇటాలియన్ విభాగం కావడం విశేషం. ఈ మూడు సంస్థల మధ్య ఏర్పడిన ఈ కూటమి, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బంగారం లాంటి కారు..రోజుకు 1500 బుక్ చేసుకుంటున్నారు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతోంది.. అదే టాటా పంచ్ (Tata Punch). మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన ఈ మైక్రో ఎస్‌యూవీ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండటం, దానికి తోడు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. రోజుకు ఏకంగా 1500 మంది దీనిని బుక్ చేసుకుంటున్నారు!

ఇప్పుడు అందరికి ఇలాంటి కారే కావాలి!

JSW MG మోటార్ ఇండియా తమ తాజా ఫ్లాగ్‌షిప్ SUVను భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రవేశపెట్టింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలోనే భారీ ఆకర్షణగా నిలిచిన పెద్ద సైజు ఫ్యామిలీ SUV MG మెజెస్టర్ (Majestor) ఇప్పుడు లాంచ్ అయింది. మెజెస్టర్‌ను ఒక్కసారి చూసిన వెంటనే ఇది సాధారణ SUV కాదు, పూర్తి స్థాయి ప్రీమియం - రాయల్ క్లాస్ వాహనం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రత్యేకంగా ఇండియన్ ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఈ SUV, రోజువారీ ప్రయాణాల నుంచి లాంగ్ హైవే డ్రైవ్‌ల వరకు అన్ని పరిస్థితుల్లోనూ కంఫర్ట్, పవర్, స్టేబిలిటీ అందించేలా రూపొందించారు. విశాలమైన క్యాబిన్, బలమైన రోడ్ ప్రెజెన్స్‌తో మెజెస్టర్ పెద్ద కుటుంబాలకు సరైన ఎంపికగా కనిపిస్తోంది.

షోరూముల్లో కొనే దిక్కులేక వెలవెలబోతున్న కార్లు

స్టాక్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు ప్రస్తుతం అంతా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ కార్ల విభాగంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు మారుతి సుజుకి అంటే ఎదురులేకుండా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. తాజాగా అందుతున్న అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. మారుతి సుజుకి ఇగ్నిస్(Maruti Ignis)కు కస్టమర్లు దూరమవుతుండగా, టాటా టియాగో (Tata Tiago) వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇగ్నిస్ కంటే టియాగో సుమారు రూ.78,000 తక్కువకే లభిస్తుండటంతో పాటు సేఫ్టీ విషయంలోనూ తిరుగులేదని నిరూపించుకుంటోంది.
Advertisement

2026లో బెస్ట్ ఫ్యామిలీ SUV ఏది? డస్టర్ లేదా విక్టోరిస్?

కొత్త తరం 2026 రెనాల్ట్ డస్టర్ (Renault Duster SUV ఇటీవలే అధికారికంగా ఆవిష్కరించబడింది. ఒకప్పుడు భారత మార్కెట్‌లో డస్టర్ సృష్టించిన క్రేజ్‌ను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త జనరేషన్ మోడల్‌ను రెనాల్ట్ డిజైన్ చేసింది. మస్క్యులర్ లుక్, ఆధునిక టెక్నాలజీ, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఇది మళ్లీ SUV సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇదే సమయంలో, ఈ కొత్త డస్టర్‌కు మారుతి సుజుకి విక్టోరిస్ (maruti suzuki victoris) నేరుగా పోటీ ఇవ్వనుంది. మారుతి బ్రాండ్ నమ్మకం, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో విక్టోరిస్ కూడా మార్కెట్‌లో బలమైన ఛాలెంజర్‌గా నిలవబోతోంది. ఈ రెండు SUVలు డిజైన్ పరంగా చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ SUVల ధర, పనితీరు ఇతర వివరాలను పోల్చడం జరిగింది.