ఫెరారీ చరిత్రలో కొత్త అధ్యాయం.. ఫస్ట్ EV 5 సీటర్ సూపర్‌కార్ వచ్చేసింది!

ప్రపంచ ప్రసిద్ధ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ (Ferrari) తన ఆటోమొబైల్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో, ఫెరారీ కూడా తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని అంతర్జాతీయంగా ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంధన ఇంజిన్ కార్లలో తన అద్భుతమైన పనితీరుకు పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు అదే స్థాయి ప్రదర్శనను ఎలక్ట్రిక్ టెక్నాలజీలో కూడా కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు "లూస్" అనే పేరు పెట్టడం ద్వారా ఫెరారీ తన కొత్త దిశను సూచించింది. ఇది కేవలం ఒక EV మాత్రమే కాకుండా, ఫెరారీకి ఉన్న స్పోర్ట్స్ కార్ DNAని ఎలక్ట్రిక్ యుగంలోకి తీసుకువచ్చే ఒక ప్రయత్నంగా కనిపిస్తోంది.

రూ.8 లక్షలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోక్స్‌వ్యాగన్ కారు

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ (SUV) కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో దొరికే సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను కొనడానికి ఎగబడుతున్నారు. ఇప్పటివరకు ఈ విభాగంలో జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen)కి ఎలాంటి కారు లేదు. దీనివల్ల కంపెనీ భారీగా నష్టపోతోంది. ఈ లోటును భర్తీ చేస్తూ.. మార్కెట్లో ఇప్పటికే దూసుకుపోతున్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జాలకు చెక్ పెట్టేందుకు ఫోక్స్‌వ్యాగన్ సరికొత్త బడ్జెట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోకి త్వరలోనే టెరా (Volkswagen Tera) అనే సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీని చేర్చబోతోంది. ఈ కారు లాంచ్ డేట్‌పై కంపెనీ ఇంకా అధికారిక ముద్ర వేయనప్పటికీ, టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఈ కారు భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చి రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న స్కోడా కైలాక్ (Skoda Kylaq) ప్లాట్‌ఫోరమ్ ఆధారంగానే ఈ సరికొత్త టెరా కారును కూడా తయారు చేస్తున్నారు. కార్ లవర్స్‎ను ఆకర్షించే ప్రధాన అంశం ఈ కారు ధర. స్కోడా కైలాక్ ధరలు ప్రస్తుతం రూ.7.59 లక్షల నుంచి ప్రారంభమై రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇదే ప్లాట్‌ఫోరమ్, విడిభాగాలను వాడుతుండటం వల్ల ఫోక్స్‌వ్యాగన్ టెరా ధర కూడా దాదాపు దీనికి సమానంగానే ఉండబోతోంది. భవిష్యత్తులో ముడిసరుకుల ధరలు కాస్త పెరిగినప్పటికీ.. ఈ కారు బేస్ వేరియంట్ ధర ఖచ్చితంగా రూ.8 లక్షల లోపే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ప్రస్తుత పన్నుల విధానం (Tax Structure) ప్రకారం.. 4 మీటర్ల కంటే తక్కువ పొడవుండి, చిన్న ఇంజన్ కలిగిన కార్లపై కేవలం 18% జీఎస్టీ (GST) మాత్రమే పడుతుంది. అదే కొంచెం పెద్ద కార్లయితే ఏకంగా 40% వరకు భారీ పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకే ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన పెద్ద కారైన కుషాక్ లేదా టైగూన్ కంటే, ఈ చిన్న కారు టెరా ద్వారానే ఎక్కువ లాభాలను ఆర్జించాలని ప్లాన్ చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ చిన్న కారు కంపెనీకి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. ఫోక్స్‌వ్యాగన్ టెరా డిజైన్ పరంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్స్ నుంచి ప్రేరణ పొందింది. అయితే భారతీయ కస్టమర్ల అభిరుచులకు, ఇక్కడి రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ఇందులో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. కారు హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, బానెట్, డిక్కీ డోర్స్ వంటి భాగాలను మన దేశానికి సరిపోయేలా ప్రత్యేకంగా రీ-డిజైన్ చేశారు. దీనివల్ల కారుకు ఒక అగ్రెసివ్, ప్రీమియం లుక్ రానుంది. ఈ రోజుల్లో కారు నడిపే డ్రైవర్లు పవర్‌ఫుల్ పర్ఫామెన్స్ కోరుకుంటున్నారు. అందుకే ఫోక్స్‌వ్యాగన్ టెరాలో అందరికీ ఇష్టమైన దమ్మున్న టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించబోతున్నారు. ఈ ఇంజన్ చిన్నదైనప్పటికీ మైలేజ్ ఇస్తూనే, లాంగ్ డ్రైవ్స్ లో, సిటీ ట్రాఫిక్‌లో రాకెట్ లాంటి స్పీడ్‌ను అందిస్తుంది. దీనికి తోడు కారు లోపల లగ్జరీ ఫీచర్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో టాప్ ఎంపిక.. మారుతి బాలెనో పూర్తి వివరాలు!

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని కార్లు కేవలం వాహనాలుగా కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటాయి. వాటి డిజైన్, నమ్మకమైన పనితీరు, బ్రాండ్ విలువ అన్నీ కలిసి వినియోగదారుల మనసులో ఒక స్థిరమైన స్థానాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి కార్లలో మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) ప్రత్యేకంగా నిలుస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అనుభవాన్ని అందించగల కార్లలో బాలెనో ఒక బెస్ట్ ఆప్షన్‌గా భావించబడుతుంది. ఆధునిక డిజైన్, విశాలమైన ఇంటీరియర్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలు దీనిని యువత నుంచి ఫ్యామిలీ కస్టమర్ల వరకు అందరికీ దగ్గర చేశాయి. అందుకే భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో బాలెనోకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

ఇంత చిన్న కారులో విమానం లాంటి ఫీచర్లు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్ టియాగో(tata tiago)ను కొత్త హంగులతో మార్కెట్లోకి తెస్తోంది. మే 28న ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు చూస్తుంటే, ఈ ఎంట్రీ లెవల్ కారులో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత మోడ్రన్ ఫీచర్లను జోడించినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పడకుండా, లగ్జరీ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా టాటా ఈ అప్‌డేటెడ్ టియాగోను రూపొందించింది. ఇది కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, తన విభాగంలోనే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
Advertisement

90s కార్లు.. ఇప్పటికీ బతికున్న టాప్ 5 ఐకానిక్‌లు

1990ల కాలంలో వచ్చిన కార్లు భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో ఒక ప్రత్యేక యుగాన్ని సృష్టించాయి. ఆ రోజుల్లో రోడ్లపై కనిపించిన ప్రతి కారు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేది. ఆకర్షణీయమైన డిజైన్‌లు, బలమైన ఇంజిన్‌లు, అప్పటివరకు చూడని ఆధునిక ఫీచర్లతో ఈ వాహనాలు భారతీయ మార్కెట్‌కు కొత్త దిశను చూపించాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇవి కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, ఒక కలలా భావించబడేవి. 90ల తరం ప్రజల జ్ఞాపకాలలో ఈ కార్లు ఇప్పటికీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని ఉన్నాయి. 1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు, ఒక కారు కొనడం అంటే కుటుంబ గౌరవానికి, జీవితంలో సాధించిన విజయానికి ప్రతీకగా భావించే పరిస్థితిని ఈ ఐకానిక్ మోడళ్లు తీసుకొచ్చాయి. ఈ కథణంలో చెరగని ముద్ర వేసిన 5 గొప్ప కార్లను చూద్దాం.

మార్కెట్‎ను షేక్ చేస్తున్న టాప్ 10 కార్లు ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎస్‌యూవీ (SUV) కార్లు వస్తున్నప్పటికీ, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో నచ్చే హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. గత నెల అంటే ఏప్రిల్, 2026 నెలలో జరిగిన కార్ల అమ్మకాలను చూస్తే ఈ విషయం మరోసారి స్పష్టమైంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు మనవాళ్లు ఎంతగా బ్రహ్మరథం పడతారో సేల్స్ రిపోర్ట్ చెప్తోంది.

ఈ 7-సీటర్ SUVలో లగ్జరీకి కొదవలేదు! కానీ గత నెలలో..

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) భారతీయ మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రీమియం కస్టమర్ల వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా వాహనాలను అందిస్తూ, దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీ చూపిస్తున్న దూకుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాంటి విజయవంతమైన మోడళ్లలో ఒకటే హ్యూందాయ్ ఆల్కాజర్ (Hyundai Alcazar). ఇంట్లో సభ్యులు ఎక్కువగా ఉంటే, కుటుంబంతో కలిసి టూర్లు వెళ్లాలనే ఆలోచన ఉంటే లేదా స్టైల్‌తో పాటు స్పేస్ కూడా కావాలనుకునే వారికి ఆల్కాజర్ ఒక అద్భుతమైన ఎంపికగా కనిపిస్తుంది.

భారీ మైలేజ్ ఇచ్చే రూ.లక్ష బడ్జెట్లో టాప్ 5 బైక్స్ ఇవే

ప్రస్తుత రోజుల్లో కొత్త బైక్ కొనాలంటే ఆప్షన్లకు కొదవ లేదు. కానీ ఆఫీస్‌కు వెళ్లడానికైనా, రోజువారీ అవసరాలకైనా తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ ఇచ్చే సింపుల్ బైక్ కావాలని చాలా మంది కోరుకుంటారు. మీ బడ్జెట్ గనుక ఒక లక్ష రూపాయల లోపు ఉంటే.. మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ బైక్స్ వివరాలు మీకోసం ఇక్కడ ప్రత్యేకంగా ఇస్తున్నాం. మన దేశంలో నమ్మకానికి మారుపేరైన హోండా, హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీల నుంచి ఈ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ బైక్ ప్రత్యేకత ఏంటో వివరంగా చూద్దాం.
Advertisement

కొత్త అల్లుడికి బైక్ బదులు ఈ మారుతి కారు కొనివ్వండి

కొత్తగా కారు కొనాలనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న విక్టోరిస్ సీఎన్‌జీ ఎస్‌యూవీపై ఏకంగా రూ.2.10 లక్షల భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. లీటరుకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చే ఈ ఫ్యామిలీ కారుపై వచ్చిన ఈ డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న వాహనదారులకు ఈ వార్త నిజంగా పెద్ద ఊరటనిస్తుంది. మారుతి సుజుకి డీలర్ అసోసియేషన్ తమ విక్టోరిస్ సీఎన్‌జీ మోడల్‌పై దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు నేరుగా రూ.1,50,000ల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

త్వరలో రాబోతున్న టాప్ 7-సీటర్ SUVలు ఇవే!

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ చాలా బలంగా ఉండటంతో పెద్ద సైజు కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకే కారులో కుటుంబ సభ్యులంతా కలిసి సౌకర్యంగా ప్రయాణించాలనే ఆలోచనతో చాలా మంది 7-సీటర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ వినియోగంతో పాటు పండుగలు, ఫ్యామిలీ ట్రిప్స్, లాంగ్ జర్నీలు వంటి సందర్భాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సౌకర్యం ఉండటం ఈ వాహనాల ప్రధాన ఆకర్షణగా మారింది. దీంతో భారత మార్కెట్లో 7-సీటర్ కార్లకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ముఖ్యంగా SUVలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, స్టైలిష్ డిజైన్‌తో పాటు 7-సీటింగ్ సౌకర్యం కలిగిన కొత్త మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ కథణంలో రానున్న రోజుల్లో లాంచ్ కాబోయే శక్తివంతమైన 7 సీటర్ కార్ల గురించి చూద్దాం.

హాట్ ఫేవరెట్‌గా మారిన బడ్జెట్ కారు.. రెనాల్ట్ కైగర్‌కు డిమాండ్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. స్టైలిష్ డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సిటీతో పాటు హైవే డ్రైవింగ్‌కు అనువుగా ఉండే ఫీచర్ల కారణంగా ఈ సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పోటీభరితమైన మార్కెట్‌లో రెనాల్ట్ (Renault) తన కైగర్ (Kiger) ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. 2026 ఏప్రిల్ నెలలో కైగర్ నమోదు చేసిన అమ్మకాలు కంపెనీకి ఊరటనిచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, గత నెలలో ఈ SUVను దాదాపు 727 మంది కొత్త వినియోగదారులు కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిగా చెప్పుకోవచ్చు.

మార్కెట్లోకి 3 బ్రహ్మస్త్రాలను దింపుతున్న ఎంజీ కంపెనీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor) సరికొత్త వ్యూహంతో దూసుకురాబోతోంది. రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్‌ను మార్చేలా ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ విభాగాలలో 3 సరికొత్త కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Advertisement

ఎర్టిగా కంటే రూ.3.15 లక్షల తక్కువకే కారు.. 7 మందిని తీసుకెళ్లొచ్చు!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత్ మార్కెట్లో మళ్లీ తన స్థానం బలపరుచుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఏప్రిల్ నెలలో ఎగుమతులు, దేశీయ విక్రయాలను కలిపి మొత్తం 5,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం కంపెనీకి ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురైన మార్కెట్ సవాళ్లు, పోటీ ఒత్తిడి మధ్య ఈ స్థాయి అమ్మకాలు రావడం నిస్సాన్ పునరుజ్జీవనానికి సూచనగా ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త మోడళ్లు, వినియోగదారులను ఆకర్షించే వ్యూహాలు, అలాగే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాలు కంపెనీకి మళ్లీ ఊపు తెచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సానుకూల వృద్ధి మధ్యలోనే కొన్ని మోడళ్ల పనితీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న టాప్ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

మన దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. గుంతలమయమైన ఇలాంటి రోడ్లపై చిన్న కార్లు నడపాలంటే నరకం కనిపిస్తుంది, ఎక్కడ కారు అండర్‌బాడీ రోడ్డుకు తగిలి పాడైపోతుందోననే భయం ప్రతి డ్రైవర్‌నూ వెంటాడుతుంది.

పెట్రోల్ బంక్‌కు వెళ్లే ఖర్చు తగ్గించే టాప్ హైబ్రిడ్, సీఎన్‌జీ టూవీలర్స్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కార్లు, బైకులను బయటకు తీసుకెళ్లాలన్నా ప్రజలు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలపై వినియోగదారుల దృష్టి పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన టూవీలర్స్‌కు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే కారణంగా పలువురు తయారీ సంస్థలు కూడా హైబ్రిడ్, సీఎన్‌జీ ఆధారిత టూ-వీలర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇవి సాధారణ పెట్రోల్ వాహనాల కంటే మెరుగైన మైలేజ్ ఇవ్వడమే కాకుండా రోజువారీ ఇంధన వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నాయి. కథనంలో హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో వచ్చిన టూ-వీలర్ల గురించి తెలుసుకుందాం.

లైసెన్స్ అక్కర్లేదు.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు

ప్రస్తుత రోజుల్లో సిటీల్లో నివసించే వారికి పెట్రోల్ ధరలు, ట్రాఫిక్ జామ్‌లు నరకం చూపిస్తున్నాయి. వీటికి తోడు కార్లు, బైక్‌లు పార్కింగ్ చేయడానికి స్థలం దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, చిన్న చిన్న అవసరాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు (E-Cycles) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, వీటిని నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ సైకిళ్లలో ఉండే పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ వల్ల మనకు తెలియకుండానే శరీరానికి మంచి వ్యాయామం కూడా లభిస్తుంది. అన్నింటికంటే పెద్ద ఉపశమనం ఏమిటంటే.. ఈ తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ సైకిళ్లను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదు.
Advertisement

ప్రీమియం బైక్ ధరకే టాటా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది

దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సాధారణ కార్లు వాడే మధ్యతరగతి కుటుంబాలపై భారీ భారం పడుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, కుటుంబంతో తరచూ ప్రయాణాలు చేసే వారు ఇప్పుడు ఇంధన ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి కారును బయటకు తీస్తేనే పెట్రోల్ ఖర్చు వేల రూపాయల్లోకి వెళ్లిపోతోందని చాలామంది వాపోతున్నారు. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన పాత పెట్రోల్ కార్లు తక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో తక్కువ ఖర్చుతో ప్రయాణించే మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

దేశమంతా ఈ ఒక్క స్కూటర్ వెనుకే పడుతోంది

భారత టూ వీలర్ మార్కెట్లో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో సుజుకి యాక్సెస్ (Suzuki Access) స్కూటర్ మరోసారి సత్తా చాటింది. గత నెల అంటే ఏప్రిల్ 2026లో కంపెనీ మొత్తం మోడల్స్‌లో కల్లా ఈ స్కూటర్ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 70,339 మంది కస్టమర్లు సుజుకి యాక్సెస్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 2025లో జరిగిన 65,107 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి నమోదైంది. ఈ విపరీతమైన క్రేజ్ చూస్తుంటే 125 సీసీ స్కూటర్ల విభాగంలో సుజుకి యాక్సెస్‌కు పోటీ ఇచ్చే మోడలే లేదని మరోసారి రుజువైంది.

మార్కెట్లోకి రాబోతున్న టాప్ 5 మిడ్-సైజ్ SUVలు ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే మార్కెట్లో టాటా సియెర్రా, కియా సెల్టోస్, మారుతి ఈ-విటారా వంటి కార్లు సందడి చేస్తుండగా.. స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి పాపులర్ కార్లు కూడా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో దూసుకుపోతున్నాయి. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. రాబోయే ఒకే ఒక్క సంవత్సరంలో ఇండియన్ రోడ్లపై ప్రభంజనం సృష్టించడానికి 5 మిడ్-సైజ్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు మైండ్ బ్లాకింగ్ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ (EV) ఆప్షన్లలో ఉన్నాయి.

దేశంలోని ప్రతి కుటుంబాకి ఈ బైక్ అంటే నమ్మకం

భారత టూ వీలర్ మార్కెట్లో ఎన్ని కొత్త బైకులు వచ్చినా, ఎన్ని మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంట్రీ ఇచ్చినా హీరో స్ప్లెండర్ (Hero Splendor) రేంజే వేరు. సామాన్యుడికి అత్యంత నమ్మకమైన వాహనంగా పేరు తెచ్చుకున్న ఈ బైక్, సేల్స్ పరంగా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. గడిచిన ఏప్రిల్ 2026 నెలలో భారతీయ బైక్ లవర్స్ హీరో స్ప్లెండర్‌పై కాసుల వర్షం కురిపించారు. కేవలం ఒక్క నెలలోనే ఈ మోడల్ సాధించిన అమ్మకాలు చూస్తే ఆటోమొబైల్ రంగానికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నమ్మకమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో దూసుకుపోయే హీరో స్ప్లెండర్ గడిచిన ఏప్రిల్ నెలలో ఏకంగా 2,91,146 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (ఏప్రిల్ 2025) ఇదే నెలలో జరిగిన 1,85,635 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 57 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రోజువారీ ఆఫీసులకు వెళ్లేవారికి ఈ బైక్ ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోందని ఈ రికార్డు స్థాయి అమ్మకాలు మరోసారి రుజువు చేశాయి. ఈ అమ్మకాల లిస్టులో రెండో స్థానాన్ని హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) కైవసం చేసుకుంది. ఈ చౌకైన బైక్‌ను ఏప్రిల్ నెలలో 91,977 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు ఏకంగా 121 శాతం పెరగడం విశేషం. ఇక మూడో స్థానంలో నిలిచిన హీరో గ్లామర్ (Hero Glamour) అయితే 438 శాతం బంపర్ గ్రోత్‌తో 26,573 యూనిట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగో స్థానంలో ఉన్న హీరో ప్యాషన్ (Hero Passion) కూడా 100 శాతం వృద్ధితో 20,367 బైకులను అమ్మి సత్తా చాటింది. కేవలం బైకులు మాత్రమే కాదు, స్కూటర్ల విభాగంలోనూ హీరో మోటోకార్ప్ దుమ్మురేపుతోంది. ఐదో స్థానంలో నిలిచిన హీరో డెస్టినీ 125 (Destini 125) స్కూటర్ ఏకంగా 489 శాతం భారీ వృద్ధితో 25,861 యూనిట్ల సేల్స్ జరిపింది. యువతను ఆకట్టుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Xtreme 125R) 19,757 యూనిట్లతో ఆరో స్థానంలో, సూపర్ స్ప్లెండర్ 17,985 యూనిట్లతో ఏజో స్థానంలో నిలిచాయి.
Advertisement

ఫ్యామిలీలు ఎక్కువగా ఇష్టపడే కార్లు ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే కొనసాగుతోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇష్టపడిన జనం, ఇప్పుడు కాస్త బడ్జెట్ పెంచి అయినా సరే మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీలను కొనడానికి ఎగబడుతున్నారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఒకవేళ మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక సూపర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే ప్రస్తుతం మార్కెట్లో దుమ్మురేపుతున్న 5 బెస్ట్ ఆప్షన్ల వివరాలు చూద్దాం.

రూ.10 లక్షల బడ్జెట్‌లో పవర్‌ఫుల్ డీజిల్ SUVs

కార్ల మార్కెట్లో ఎన్ని పెట్రోల్, ఈవీ కార్లు వచ్చినా డీజిల్ ఇంజన్ ఇచ్చే పవర్, లాంగ్ డ్రైవ్స్‎లో వచ్చే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు, ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్లేటప్పుడు డీజిల్ ఇంజన్ల టార్క్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్ల ఆప్షన్లు తగ్గుతున్నప్పటికీ, రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల బడ్జెట్ పరిధిలో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న 5 అత్యుత్తమ కాంపాక్ట్ డీజిల్ SUV కార్ల వివరాలు తెలుసుకుందాం.

ఫ్యామిలీ అంతా ఎక్కాలంటే దీని తర్వాతే ఏదైనా !

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒకప్పుడు బైకుల హవా నడిచిన మార్కెట్లో, ఇప్పుడు స్కూటర్ల క్రేజ్ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వారి పాపులర్ స్కూటర్ జుపిటర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సొంత కంపెనీకి చెందిన అపాచీ, రైడర్ వంటి స్పోర్ట్స్ బైకులను కూడా వెనక్కి నెట్టి కస్టమర్ల గుండెల్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. భారతీయ రోడ్లపై టీవీఎస్ జుపిటర్ స్కూటర్ హవా మరింత పెరిగింది. గడచిన ఏప్రిల్ నెల సేల్స్ రిపోర్టును పరిశీలిస్తే, ఈ ఒక్క నెలలోనే జుపిటర్ ఏకంగా 1,17,383 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,02,588 యూనిట్లుగా ఉండేది. అంటే ఏడాది కాలంలో జుపిటర్ అమ్మకాలు సుమారు 14.42 శాతం వృద్ధిని సాధించాయన్నమాట. మధ్యతరగతి కుటుంబాలకు నమ్మకమైన వాహనంగా మారడమే కాకుండా, అద్భుతమైన మైలేజ్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వల్లే కస్టమర్లు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అమ్మకాల జాబితాలో టీవీఎస్ కంపెనీకి చెందిన యువత ఫేవరెట్ స్పోర్ట్స్ బైక్ అపాచీ రెండో స్థానంలో నిలిచింది. గడచిన నెలలో అపాచీ దాదాపు 8.23 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 49,390 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. అలాగే మూడో స్థానంలో సామాన్యుల వ్యాపార నేస్తం, రగ్గడ్ వాహనంగా పేరొందిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ మొపెడ్ నిలిచింది. ఈ మోడల్ 9.03 శాతం వృద్ధితో మొత్తం 42,246 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుని తన సత్తా చాటుకుంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఏకంగా 34.74 శాతం వార్షిక వృద్ధితో ఈ స్కూటర్ మొత్తం 37,193 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదో స్థానంలో నిలిచిన టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటూ 33.92 శాతం వృద్ధితో 33,994 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే, గతంలో మార్కెట్ లో దూసుకుపోయిన టీవీఎస్ రైడర్ బైకుకు మాత్రం గత నెల అంతగా కలిసిరాలేదు. ఈ బైక్ అమ్మకాలు ఏకంగా 32.45 శాతం భారీగా పడిపోయి 29,064 యూనిట్లకు పరిమితమై ఆరో స్థానానికి పడిపోయింది. అలాగే ఏడో స్థానంలో ఉన్న బడ్జెట్ బైక్ టీవీఎస్ రేడియాన్ కూడా 4 శాతం స్వల్ప తగ్గింపుతో 10,828 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మిగిలిన మోడళ్ల విషయానికి వస్తే, ఎనిమిదో స్థానంలో టీవీఎస్ స్పోర్ట్ బైక్ 29.69 శాతం క్షీణతతో 9,067 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో ఉన్న టీవీఎస్ రోనిన్ ఏకంగా 64.07 శాతం భారీ వార్షిక వృద్ధితో 8,981 యూనిట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదో స్థానంలో ఉన్న లేడీస్ ఫేవరెట్ స్కూటర్ టీవీఎస్ జెస్ట్ 11.61 శాతం వృద్ధితో 8,822 యూనిట్ల విక్రయాలను జరిపింది.

33 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. దేశంలో తోపు కారు ఇదే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రాండుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కమర్షియల్ వెహికల్స్ రంగంలో ఈ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోనే నంబర్-1 సెడాన్ కారుగా నిలిచిన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Advertisement

దేశమంతా ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటం, రోజువారీ ప్రయాణ ఖర్చులు అధికమవడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మరింత సులభంగా మారడం వంటి కారణాల వల్ల EVలకు భారీ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఛార్జింగ్ సదుపాయాలు కూడా క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో EVలపై నమ్మకం మరింత బలపడుతోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్ రావడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారింది.