కంపెనీలోని 8 మోడళ్లకు చుక్కలు చూపించిన చిన్న కారు

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రతి నెల సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. జూన్ నెల సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే కంపెనీ బిజినెస్ భారీగా జరుగుతన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా సంస్థ ఇండియన్ మార్కెట్లో దాదాపు 9 కార్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో చాలా వరకు పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి.

తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన సేల్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మోడళ్లు దూసుకుపోతున్నాయి. వీటికి గట్టి పోటీ ఇస్తూ, సరికొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది సరికొత్త రెనాల్ట్ డస్టర్. అయితే, మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఈ కారు విఫలమవుతోంది. ఇండియన్ రోడ్లపై కేవలం నాలుగు నెలల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ఎస్‌యూవీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు సదా సరికదా.. రోజురోజుకూ ఘోరంగా పడిపోతున్నాయి.

ఈ స్కూటరును చూస్తే ఇట్టే ప్రేమలో పడిపోతారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‎కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ మోబిలిటీ బ్రాండ్ Vida నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి పాపులర్ ఈ-స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చే విధంగా దీనిని రూపొందించారు. దీనికి Vida VX2 Plus అని పేరు పెట్టారు. మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ.1,43,990గా కంపెనీ నిర్ణయించింది. విడా VX2 ఫ్యామిలీలో ఇది నాలుగో మోడల్ కావడం విశేషం.

రూ. 5.21 లక్షలకే 7-సీటర్.. ఈ మారుతి కారు అమ్మకాలు దూసుకెళ్తున్నాయి!

వాణిజ్య అవసరాలకు మాత్రమే కాకుండా, పెద్ద కుటుంబాల రోజువారీ వినియోగానికి కూడా అనువైన వాహనంగా మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఎన్నో ఏళ్లుగా భారత మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. తక్కువ ధర, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చు, బహుళ వినియోగానికి అనుకూలమైన డిజైన్ కారణంగా ఈకో ఇప్పటికీ మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. చిన్న వ్యాపారులు, స్కూల్ వాహన నిర్వాహకులు, కుటుంబ వినియోగదారులు ఇలా వివిధ వర్గాల ప్రజలు ఈ వాహనాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఈకోకు మార్కెట్లో ఉన్న ఆదరణను మరోసారి నిరూపించాయి.
Advertisement

తక్కువలో 7-సీటర్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 7-సీటర్ MPV కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (renault triber) ఒకటి. తక్కువ ధర, విశాలమైన క్యాబిన్, కుటుంబ అవసరాలకు సరిపోయే సీటింగ్ సామర్థ్యంతో ఈ కారు మధ్యతరగతి కుటుంబాల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబం కోసం బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి ట్రైబర్ చాలా కాలంగా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇప్పుడు విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ట్రైబర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపించాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 2026లో మొత్తం 1,871 రెనాల్ట్ ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 31.7 శాతం వృద్ధి.

0 వేల అమ్మకాల సంబరాలు.. టాటా సియెర్రాకు స్పెషల్ జూబ్లీ ఎడిషన్

టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక సియెర్రా (Sierra) suvకి ప్రత్యేక గుర్తింపుగా జూబ్లీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. మార్కెట్లో ఈ మోడల్ 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని విజయవంతంగా అధిగమించిన సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. సియెర్రా అమ్మకాల విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఈ జూబ్లీ ఎడిషన్, సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించే ప్రత్యేక యాక్సెసరీలతో వస్తోంది. అయితే ఇది పూర్తిగా కొత్త వేరియంట్ కాదు. సియెర్రా లైనప్‌లో మరో ట్రిమ్‌ను జోడించకుండా, దానికి బదులుగా, ఇప్పటికే ఉన్న స్మార్ట్+, ప్యూర్, అడ్వెంచర్ ట్రిమ్‌ల ఆధారంగా ప్రత్యేక జూబ్లీ ఎడిషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మిడిల్ క్లాస్‌కు వరం లాంటి కారు.. ఇప్పుడు సేల్స్‌లో భారీ పతనం!

ఒకప్పుడు తక్కువ బడ్జెట్‌లో తొలి కారును కొనుగోలు చేయాలనుకునే వారి జాబితాలో మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) ముందువరుసలో ఉండేది. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును ఎక్కువగా ఎంచుకునేవి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారు సెలెరియో కోసం షోరూమ్‌లకు పెద్ద ఎత్తున వెళ్లేవారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ కారుకు ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, గత నెలలో సెలెరియోతో ఆశించిన స్థాయి అమ్మకాలను నమోదు చేయలేకపోయింది.

రోజూ ఎక్కువ దూరం వెళ్లేవారికి బెస్ట్ బైక్

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనం కొనుగోలు చేసే చాలా మంది ఇప్పుడు ముందుగా చూసేది మైలేజ్. రోజూ ఉద్యోగానికి వెళ్లేవారు, చిన్న వ్యాపారాలు చేసేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించేవారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లే బైక్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బజాజ్ ప్లాటినా (Bajaj Platina). తక్కువ నిర్వహణ ఖర్చు, నమ్మకమైన పనితీరు, అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో ఈ బైక్ ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది భారతీయుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్లాటినా మంచి ఆదరణ పొందింది.
Advertisement

ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు భలేగా ఉంది

ఫోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో తన ప్రీమియం ఎస్‌యూవీ టైరాన్ ఆర్-లైన్‌‌ను విడుదల చేసి మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు అదే మోడల్‌కు మరింత అందుబాటు ధరలో టైరాన్ లైఫ్ (tayron life) అనే కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్ ధర రూ. 41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్-ఎండ్ టైరాన్ ఆర్-లైన్ ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే ఈ కొత్త వేరియంట్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. ప్రీమియం లుక్, ఆధునిక టెక్నాలజీ, విలాసవంతమైన క్యాబిన్‌ను తక్కువ ధరలో కోరుకునే వారికి టైరాన్ లైఫ్ మంచి ఎంపికగా నిలవనుంది.

సేల్స్ తగ్గినా నంబర్ 1 స్థానంలోనే క్రెటా

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. దేశీయ కార్ల విక్రయాల రేసులో ఎప్పుడూ టాప్-10 లో ఉండే క్రెటా.. జూన్ 2026 నెలలో మాత్రం ఊహించని విధంగా వెనుకబడింది. జూన్ నెల సేల్స్ చార్ట్‌లో ఈ కారు తన సొంత కంపెనీకి చెందిన చిన్న కార్లయిన హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్స్ కంటే కిందకు పడిపోయి, హ్యుందాయ్ కంపెనీలోనే మూడో స్థానానికి పరిమితమైంది.

రూ.11 లక్షల SUVకి దేశంలో సూపర్ క్రేజ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా (Kia India) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మోడళ్లను అప్‌డేట్ చేస్తూ ఈ బ్రాండ్ దేశీయ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం అమ్మకాల పరంగా భారతదేశంలో ఆరవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ సక్సెస్‌కు ప్రధాన కారణాల్లో కియా సెల్టోస్ (Kia Seltios) ఒకటి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదలైన ఈ మోడల్, ప్రారంభం నుంచే వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందింది.

యమహా కొత్త FZ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్!

భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, E20 పెట్రోల్ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ ఈ విభాగంలో తమ మోడళ్లను పరిచయం చేయగా, తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా కూడా ఈ జాబితాలో చేరింది. కంపెనీ యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్(Yamaha Fz Blue Flex Fuel Bike) పేరుతో కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Advertisement

జూలై 16న మార్కెట్‎ను షేక్ చేయడానికి బ్రహ్మస్త్రాన్ని దింపుతున్న ఎంజీ మోటార్స్

భారత SUV మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న JSW MG Motor సంస్థ, దేశీయ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఈ ఏడాది దీపావళి పండుగ నాటికి ఇండియన్ మార్కెట్లో రెండు సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒకటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కాగా, మరొకటి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కావడం విశేషం. ప్రముఖ ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. రాబోయే ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి కంపెనీ ఎంజీ హెక్టార్ హాక్ అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త ప్రీమియం కారును జూలై 16, 2026న కంపెనీ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. రాబోయే సరికొత్త ఎంజీ హెక్టార్ హాక్, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కార్లు రెండూ కూడా చైనా మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందిన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా తయారవుతున్నాయి. దీనివల్ల ఈ రెండు ఎస్‌యూవీల ప్లాట్‌ఫారమ్, బాడీ స్ట్రక్చర్, మెకానికల్ పార్ట్స్ చాలా వరకు ఒకేలా ఉండే అవకాశం ఉంది.

ఏనుగు సైజున్న మారుతి కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది

భారతదేశంలో కారు కొనుగోలు చేసే చాలా మంది కుటుంబ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఐదుగురికి పైగా సభ్యులు ఉన్న కుటుంబాలు, ఎక్కువ సీటింగ్ , విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కలిగిన ఎంపీవీ (MPV) కార్ల వైపు మొగ్గు చూపుతుంటాయి. ఈ విభాగంలో చాలా కాలంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోడళ్లలో మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 (Maruti Suzuki XL6) ఒకటి. ఈ కారు ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాల కోసం సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే MPVగా XL6కు ఇప్పటికీ మంచి ఆదరణ కొనసాగుతోంది.

రూ. 5.70 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. గత మే నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచి టాటాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, కేవలం 30 రోజుల్లోనే టాటా పంచ్ తన పవర్‌ ఏంటో చూపిస్తూ కోల్పోయిన నంబర్-1 కిరీటాన్ని మళ్లీ సొంతం చేసుకుంది.

డిజైర్ తర్వాత ఈ కారంటే చాలా మందికి ఇష్టం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, సబ్-కాంపాక్ట్ సెడాన్ కార్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్, కుటుంబ అవసరాలకు సరిపోయే సౌకర్యాలను కోరుకునే వినియోగదారులు ఈ విభాగాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఎన్నో మోడళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, నమ్మకమైన పనితీరుతో ఈ సెడాన్ మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. 2020లో ఆరాను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Advertisement

ప్రతి 4 ఈవీ స్కూటర్లలో ఒకటి టీవీఎస్‌దే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, టీవీఎస్ (Tvs) కంపెనీ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటోంది. కస్టమర్ల నమ్మకం, మంచి పనితీరు కలిగిన మోడళ్లు, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్, అమ్మకాల తర్వాత మెరుగైన సేవల కారణంగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటూ టీవీఎస్ ప్రస్తుతం దేశీయ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా గత నెలలో కంపెనీ అమ్మకాల గణాంకాలు ఈ విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇటీవల వచ్చిన సేల్స్ ప్రకారం, 2026 జూన్ నెలలో టీవీఎస్ దేశవ్యాప్తంగా మొత్తం 47,064 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి, ఈ విభాగంలో మిగతా అన్ని కంపెనీలను వెనక్కి నెట్టింది.

6 నెలల్లో ఆరు.. 30 రోజుల్లో ఒక్క కారు కూడా అమ్ముపోలేదు

భారత ఆటోమొబైల్ మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. SUV కార్లకు దేశంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) ఇండియాకు గత జూన్ నెల మిశ్రమ ఫలితాలను అందజేసింది. జూన్ నెలలో కంపెనీ మొత్తం మోడళ్లపై 610 కార్లను విక్రయించి, గత రెండు నెలలతో పోలిస్తే స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.

ప్రాణాలు కాపాడే టెక్నాలజీ ఉన్న దీనిని పట్టించుకోని ప్రజలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కార్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కంపెనీకి చెందిన క్రెటా, వెన్యూ, ఎక్స్టర్ వంటి SUV మోడళ్లు ప్రతి నెల భారీ అమ్మకాలతో దూసుకుపోతుంటాయి. గడిచిన జూన్ 2026 నెలలోనే హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో దాదాపు 40,000 యూనిట్ల కార్లను విక్రయించి తన సత్తా చాటుకుంది.

యువత హార్ట్‌బీట్ అయిన RX100.. మళ్లీ రీ లాంచ్ అవుతుందా?

భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో కొన్ని మోడళ్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజల ఆదరణను సొంతం చేసుకుంటుంటాయి. టూవీలర్ విభాగంలో చూసినట్లయితే చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడళ్లలో యమహా RX100 పేరు ఎప్పటికీ ముందుంటుంది. ఒకప్పుడు యువతకు స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన ఈ బైక్, తన తేలికైన బరువు, వేగవంతమైన పనితీరు, ప్రత్యేకమైన టూ-స్ట్రోక్ ఇంజన్ సౌండ్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. మార్కెట్ నుంచి వైదొలిగి దశాబ్దాలు గడిచినా, RX100పై ఉన్న మోజు మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మంచి కండిషన్‌లో ఉన్న పాత RX100 బైక్‌ల కోసం నేటికీ ఎంతోమంది లక్షల రూపాయలు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు.
Advertisement

7-సీటర్ కార్లలో ఇండియాలోనే బెస్ట్ కారు

భారత్‌లో కుటుంబంతో కలిసి ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకే కారులో భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఇతర కుటుంబ సభ్యులు కలిసి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలా పెద్ద కుటుంబానికి 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) బాగా అనుకులంగా ఉంటుంది. ఇది పెద్ద కుటుంబాలకు సరిపోయే సౌకర్యవంతమైన సీటింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా కంఫర్ట్‌ను అందించే సస్పెన్షన్, అలాగే తక్కువ మెయింటనెన్స్ ఖర్చులతో మధ్యతరగతి సరైన ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ కారులో దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే వారు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది ప్రతినెలా వేలల్లో అమ్ముడవుతూ మారుతి కంపెనీకి బంగారు గుడ్డు పెట్టే కోడిలా మారింది.

రూ.5.69 లక్షల బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. దేశంలోనే నం.1 కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సంస్థకు చెందిన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ విజయ విహారం చేస్తోంది. ఈ కారుకు దేశీయంగా ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి తాజాగా నమోదైన అమ్మకాల గణాంకాలే నిదర్శనం. ప్రస్తుత 2026 సంవత్సరపు ప్రథమార్ధంలో అంటే జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 ఎస్‌యూవీగా టాటా పంచ్ సరికొత్త రికార్డు సృష్టించింది.

థార్, బొలేరో కాదు...మహీంద్రా కంపెనీకి కల్పవృక్షంలా మారిన కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో థార్, బొలేరో, XUV 7XO వంటి ఎన్నో పాపులర్ కార్లు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి మహీంద్రా స్కార్పియో మరోసారి కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 మోడల్‌గా నిలిచింది.

నిస్సాన్ టెక్టన్ ఎట్టకేలకు భారత్‌లో ఎంట్రీ

భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో అత్యంత పోటీ నెలకొన్న మిడ్-సైజ్ SUV విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త టెక్టన్ (Tekton) SUVని అధికారికంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్లు, స్పై ఫోటోలు, లీక్ అయిన వివరాలు ఇప్పటికే ఆటోమొబైల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచగా, ఆ అంచనాలన్నింటికీ తెరదిస్తూ జూలై 9న నిస్సాన్ ఈ కొత్త SUVని ఘనంగా ఆవిష్కరించింది. ధరల విషయంలో కూడా టెక్టన్‌ను కంపెనీ పోటీదారులకు గట్టి సవాల్ విసిరేలా తీసుకొచ్చింది.
Advertisement

సెకండ్ హ్యాండ్‌లో ఈ కారును ఎగబడి కొంటారు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ద కారు ఫ్రాంక్స్ (Fronx) భారత మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీలో కూడా ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన మైలేజ్, పనితీరుతో ప్రతినెలా కూడా కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది. తాజాగా ఈ కారుకి సంబంధించిన అమ్మకాల గణంకాలు కూడా చూసినట్లయితే, భారత ప్రజలు దీనిని ఎంతగా ఆదరిస్తున్నారో స్పష్టం అవుతుంది. మారుతి సుజుకి నుంచి వచ్చిన సేల్స్ నివేదిక ప్రకారం, ఫ్రాంక్స్ SUV 2026 జూన్ నెలలో 13,135 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 34 శాతం వృద్ధి.