జూన్ 3న రోడ్లపైకి రాబోతున్న సరికొత్త అద్భుతం..!
ఆటోమొబైల్స్
- 16 days ago
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సగటు సామాన్యుడు బైక్ తీయాలంటేనే జంకుతున్నాడు. ఇలాంటి తరుణంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) వాహనదారులకు ఒక మైండ్ బ్లోయింగ్ తియ్యటి కబురు అందించింది. పెట్రోల్ ఖర్చులను సగానికి సగం తగ్గించేలా.. సరికొత్త సాంకేతికతతో కూడిన దేశంలోనే మొట్టమొదటి విప్లవాత్మక మోటార్ సైకిల్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే వారం అంటే జూన్ 3వ తేదీన ఈ సరికొత్త వాహనం భారత రోడ్లపై అధికారికంగా ల్యాండ్ కాబోతోంది.