జూన్ 3న రోడ్లపైకి రాబోతున్న సరికొత్త అద్భుతం..!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సగటు సామాన్యుడు బైక్ తీయాలంటేనే జంకుతున్నాడు. ఇలాంటి తరుణంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) వాహనదారులకు ఒక మైండ్ బ్లోయింగ్ తియ్యటి కబురు అందించింది. పెట్రోల్ ఖర్చులను సగానికి సగం తగ్గించేలా.. సరికొత్త సాంకేతికతతో కూడిన దేశంలోనే మొట్టమొదటి విప్లవాత్మక మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే వారం అంటే జూన్ 3వ తేదీన ఈ సరికొత్త వాహనం భారత రోడ్లపై అధికారికంగా ల్యాండ్ కాబోతోంది.

కుటుంబం మొత్తం ఒక్క కారులో.. ఒకేసారి 9 మంది వెళ్లొచ్చు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని వాహనాలు కాలానికి అనుగుణంగా మారుతూ కొత్త రూపాల్లో వస్తుంటాయి. కానీ మరికొన్ని వాహనాలు మాత్రం ఎలాంటి ట్రెండ్ వచ్చినా తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోకుండా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి SUVలలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఈ SUVకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ డిజైన్, గట్టి బాడీ, ఎలాంటి రోడ్లపైనా నడిచే సామర్థ్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాలతో బొలెరో ఇప్పటికీ అనేక కుటుంబాల మొదటి ఎంపికగా కొనసాగుతోంది. కాలం మారుతున్నా, మార్కెట్లోకి ఎన్నో ఆధునిక SUVలు వస్తున్నా, బొలెరోకు ఉన్న డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు తాజా అమ్మకాల గణాంకాలే నిదర్శనం.

టాటా మోటార్స్ ఈవీ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు

దేశంలో సామాన్యుడిపై ఇంధన ధరల భారం రోజురోజుకు పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు సెంచరీ దాటి పరిగెత్తుతుండడంతో మధ్యతరగతి వాహనదారుల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఈ క్రమంలోనే కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల (హ్యాచ్‌బ్యాక్, ఎంట్రీ లెవెల్) విభాగంలో పెట్రోల్ వేరియంట్లను కాదని, జనం అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఈవీ కార్ల బుకింగ్స్ ఏకంగా రెండున్నర (2.5) రెట్లు పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మార్కెట్ ట్రెండ్స్ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. గత 15 రోజుల్లోనే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారతీయ కార్ల మార్కెట్లో ఈవీల వాటా 5.5 శాతంగా ఉంది.

మధ్యతరగతి వాళ్ల బడ్జెట్లో మార్కెట్లోకి రాబోతున్న 4 పవర్ ఫుల్ కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొంతకాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. కస్టమర్లు తమ బడ్జెట్‌ను కాస్త పెంచుకుని మరీ ఎస్‌యూవీ కార్ల వైపు మొగ్గు చూపుతుండటంతో, ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు నడుం బిగించాయి.
Advertisement

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు

గత కొన్నేళ్లుగా CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, సాధారణ వినియోగదారులు తక్కువ ఖర్చుతో నడిచే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో CNG కార్లు మంచి ఎంపికగా మారాయి. ఇటీవల CNG ధరలు కూడా కొంత పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఉండటంతో వినియోగదారులు CNG వైపే ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు CNG కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మారుతి CNG మోడళ్లలో కొన్ని కార్లు దాదాపు లీటర్‌కు సమానంగా 30 నుండి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తున్నాయి. ఈ కథణంలో మారుతి ఈకో, ఎస్ ప్రెస్సో, ఆల్టో కె10 సీఎన్‌జీ కార్ల గురించి చూద్దాం.

Royal Enfield కొత్త బుల్లెట్ బైక్ లాంచ్

భారత మోటార్‌సైకిల్ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పేర్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు తన పురాతన మరియు ఐకానిక్ బుల్లెట్ శ్రేణిలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ 650 (Bullet 650) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. క్లాసిక్ బుల్లెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆధునిక 650cc ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ కొత్త బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ధరను కంపెనీ రూ. 3.65 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బుల్లెట్ శ్రేణిలో ఇది అత్యంత శక్తివంతమైన, ప్రీమియం మోడల్‌గా నిలుస్తోంది. సంప్రదాయ బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక ఇంజిన్ టెక్నాలజీ, మెరుగైన రైడింగ్ అనుభవాన్ని కలిపి ఈ బైక్‌ను రూపొందించారు.

రూ. 1,400 కోట్ల సామ్రాజ్యం.. కానీ తిరిగేది మాత్రం డొక్కు కారులోనే

Karnataka CM : కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. తీవ్ర రాజకీయ ఉత్కంఠ మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేవలం రూ.4.69 లక్షలకే టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్(Tata Motors) మరోసారి తన బలాన్ని చూపించింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన, చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో EV అప్‌డేట్ వెర్షన్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ పరంగా గణనీయమైన మార్పులు చేసి, మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. కొత్త టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ 2026 ప్రారంభ ధర రూ.6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. మరింత అందుబాటు ధరలో EV అందించాలనే ఉద్దేశంతో, టాటా మోటార్స్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద టియాగో EV ధర మరింత తగ్గి కేవలం రూ.4.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Advertisement

ధర రూ. 4.69 లక్షలే.. కానీ ఈ కారు ఫీచర్లు చూస్తే లగ్జరీ కార్లకే షాక్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్ల రూపురేఖలను మార్చేస్తూ టాటా మోటార్స్ (Tata Motors) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో దగ్గరైన తమ పాపులర్ ఎంట్రీ-లెవల్ హాచ్‌బ్యాక్ కారు టియాగోను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోడ్రన్ డిజైన్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ అప్‌గ్రేడ్స్‌తో 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ (2026 Tata Tiago Facelift)ను దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.

500 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ప్రపంచవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అమెరికా, యూరప్, ఆసియా వంటి అనేక అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే తన EVలను విక్రయిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు భారత మార్కెట్‌పై కూడా గట్టిగా దృష్టి పెట్టింది. గత సంవత్సరం నుంచే భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన విన్‌ఫాస్ట్, దేశీయ EV మార్కెట్లో స్థానం సంపాదించేందుకు వరుస ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా వియత్నాంలో నవీకరించిన రెండో తరం VF8 ఎలక్ట్రిక్ SUVను విడుదల చేయడం ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు అదే మోడల్‌కు భారతదేశంలో పేటెంట్ దాఖలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.

రేసింగ్‎లో బైకులనే ఓడించిన స్కూటర్

భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అత్యంత భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న పవర్‌ఫుల్ ఈవీ స్కూటర్ అల్ట్రావాలెట్ టెసరాక్ట్(Ultraviolette Tesseract) లాంచ్ టైమ్‌లైన్ అధికారికంగా వాయిదా పడింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ అల్ట్రావాలెట్.. ఈ అల్ట్రా ప్రీమియం, హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌ను జనవరి 2027 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

లీటరుకు 90 కి.మీ మైలేజ్, రూ.66 వేలకే బండి

భారతదేశంలోని ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఒకప్పుడు బలమైన స్థానం సంపాదించుకున్న బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, రోజువారీ ప్రయాణాలకు అనుకూలత కారణంగా ప్లాటినా ఎన్నో సంవత్సరాలుగా మధ్యతరగతి వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఈ బైక్‌కు మంచి డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్నట్లు తాజా అమ్మకాల గణాంకాలు సూచిస్తున్నాయి. దేశీయ బడ్జెట్ బైక్ మార్కెట్లో పోటీ రోజురోజుకీ మరింత తీవ్రమవుతోంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, టీవీఎస్ రైడర్ వంటి మోడళ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, ప్లాటినా తన పాత స్థాయిలో అమ్మకాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Advertisement

త్వరలో మార్కెట్లోకి నాలుగు సరికొత్త కార్లు.. లిస్టులో మోస్ట్ పాపులర్ మోడల్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల (SUV) హవా ఎంత నడుస్తున్నప్పటికీ, లగ్జరీగా, క్లాస్‌గా ఉండే సెడాన్ కార్లకు ఉండే క్రేజ్ ఎప్పుడూ సపరేటే. మీకూ లాంగ్ డ్రైవ్స్ కోసం అదిరిపోయే లగ్జరీ సెడాన్ కొనాలనే ప్లాన్ ఉంటే మాత్రం, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టడం చాలా మంచిది. ఎందుకంటే వచ్చే కొన్ని నెలల్లో ఇండియన్ రోడ్లపై సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి నాలుగు అత్యంత పవర్‌ఫుల్ సెడాన్ కార్లు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

రోడ్ల మీద ఎటు చూసినా డుగ్ డుగ్ సౌండ్లే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 350cc నుంచి 450cc సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరోసారి తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇటీవల విడుదలైన బైక్స్ విక్రయాల గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో ఈ పవర్‌ఫుల్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ తిరుగులేని సునామీ సృష్టించింది.

పెట్రోల్, CNG రెండు ఆప్షన్లలో బెస్ట్ కార్.. వ్యాగన్ ఆర్ ఫుల్ డీటైల్స్!

భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త మోడళ్లు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి, డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం కాలానికి తగ్గట్టుగా మారుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ దశాబ్దాల పాటు తమ స్థానాన్ని నిలబెట్టుకుంటాయి. అలాంటి అరుదైన విజయగాథల్లో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్ (Maruti Suzuki WagonR). 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన వ్యాగన్‌ఆర్, ప్రారంభం నుంచే గుర్తింపును ఏర్పరచుకుంది. మార్కెట్లో పోటీ పెరిగినా, వ్యాగన్‌ఆర్ తన స్థానాన్ని కోల్పోలేదు. మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ధరలో అందుబాటులో ఉండటం, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చు ప్రధాన బలం అయ్యాయి. ఇంధన సామర్థ్యం, సర్వీస్ నెట్‌వర్క్, స్పేర్ పార్ట్స్ అందుబాటు వంటి అంశాలు కూడా ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి.

పేదవాడి కారును ఎవరూ పట్టించుకోవడం లేదు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మొదటిసారి కారు కొనుగోలు చేసే కుటుంబాలు, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కోరుకునే వినియోగదారులు సాధారణంగా ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతుంటారు. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, పార్కింగ్ సమస్యలు పెరగడం వంటి కారణాల వల్ల కూడా చిన్న కార్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగంలో ప్రత్యేకమైన డిజైన్, SUV తరహా లుక్‌తో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన కార్లలో రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఒకటి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను అందిస్తూ క్విడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది.
Advertisement

పెళ్లికూతురిలా అందంగా ముస్తాబై వచ్చిన మధ్యతరగతి బండి

భారత మధ్యతరగతి బైక్ లవర్స్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే 125cc బైక్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), మార్కెట్లో తన తిరుగులేని పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు మోస్ట్ పాపులర్ సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్‌ను లాంచ్ చేసింది. దీనికి హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 (Hero Super Splendor XTEC 2.0) అని పేరు పెట్టారు.

రూ.40.99 లక్షలతో ఇండియాలో కొత్త లగ్జరీ SUV

భారత ఆటోమొబైల్ రంగంలో మరో పెద్ద ఎంట్రీగా జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త SUV అయిన ఎంజీ మెజెస్టర్ (MG Majestor)ను అధికారికంగా విడుదల చేసింది. ధర విషయానికి వస్తే, MG మెజెస్టర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4x2 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (6, 7 సీటర్ ఆప్షన్) ధర రూ.40.99 లక్షలుగా నిర్ణయించగా, మరింత అడ్వాన్స్‌డ్ 4x4 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (కేవలం 7 సీటర్) ధర రూ.44.99 లక్షలుగా ఉంది. ఈ ధరలతో ఇది ప్రీమియం SUV కేటగిరీలో తన స్థానం బలంగా నమోదు చేసుకుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే దేశంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాలను బట్టి మారుతు ఉంటాయి.

ఈ కారు ఎక్కితే స్పీడ్ బ్రేకర్ల భయం ఉండదు

భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ (SUV) కార్లకు భారీ క్రేజ్ నడుస్తున్నప్పటికీ, సెడాన్ (Sedan) కార్లను ఇష్టపడే వారి సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే లగ్జరీ కంఫర్ట్, హై-స్పీడు స్టెబిలిటీ, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరే ఇతర కార్లలోనూ లభించవు. అయితే, సెడాన్ కార్లను కొనేటప్పుడు చాలామంది వినియోగదారులను భయపెట్టే ఒకే ఒక్క ప్రధాన సమస్య గ్రౌండ్ క్లియరెన్స్ (Ground Clearance). మన దేశంలో ఉండే ఎత్తుపల్లాలు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద కారు కింద భాగం రోడ్డుకు తగులుతుందేమోనని వాహనదారులు తెగ టెన్షన్ పడిపోతుంటారు.

20 నిమిషాల్లో అమ్ముడైన కారు మళ్లీ వస్తోంది

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో (Skoda Auto) భారత మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ కార్ల ఇమేజ్‌ను మరింత బలపరిచే ప్రయత్నంలో భాగంగా స్కోడా ఆక్టేవియా RS (Skoda Octavia RS) మోడల్‌ను 2025 అక్టోబర్‌లో అధికారికంగా విడుదల చేసింది. సాధారణంగా భారత మార్కెట్లో స్కోడా కార్లకు మంచి ఫ్యాన్‌బేస్ ఉన్నప్పటికీ, ఆక్టేవియా RS విషయంలో కంపెనీకి వచ్చిన స్పందన మాత్రం ఊహించని స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారును భారతదేశంలో తయారు చేయలేదు. పూర్తిగా విదేశాల నుంచి అసెంబుల్ చేయబడిన రూపంలో దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో విక్రయించారు. అంటే ఇది పూర్తిగా CBU (Completely Built Unit) మోడల్‌గా భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
Advertisement

ఏకంగా 617 శాతం సేల్స్ గ్రోత్‌తో దుమ్మురేపిన మారుతి కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న హాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల తాజా నివేదిక విడుదలైంది. ఎప్పటిలాగే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి తన తిరుగులేని టాప్-4 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ సేల్స్ లిస్ట్‌లో మారుతి వ్యాగన్ఆర్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బలెనో, స్విఫ్ట్, ఆల్టో కార్లు నిలిచాయి. ఇవన్నీ కూడా నెలవారీగా పది వేలకు పైగా యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయాయి. అయితే ఈ మొత్తం నివేదికలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.

దేశంలో ఈ హైబ్రిడ్ స్కూటర్‌ను తెగ కొంటున్నారు

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) భారత స్కూటర్ మార్కెట్లో ఇటీవలి కాలంలో తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు ఫ్యామిలీ వినియోగదారులను ఆకట్టుకునేలా స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్ కలయికతో యమహా తన స్కూటర్లను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీతో స్కూటర్లను పరిచయం చేసిన తొలి బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన యమహా, ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం అత్యంత బలమైన ఆయుధాలుగా నిలుస్తున్నవి Yamaha Fascino 125 Fi Hybrid, Yamaha RayZR 125 Fi Hybrid మోడళ్లు.

సిటీ ట్రాఫిక్‎లో, ఇరుకు సందుల్లోనూ దూసుకెళ్లే టాప్ 5 కార్స్ ఇవే

ప్రస్తుత రోజుల్లో సిటీల్లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం ఆఫీస్ వేళల్లో గానీ, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు గానీ సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి ట్రాఫిక్ నరకంలో, ఇరుకైన గల్లీల్లో భారీ సైజులో ఉన్న ఎస్‌యూవీ (SUV) కార్లను నడపడం, పార్కింగ్ చేయడం వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది.

7 సీటర్ కారు ధర రూ.5.65 లక్షలే.. ..ఇండియాలోనే ఫస్ట్ కారు

మధ్యతరగతి కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణించే వారికి నిస్సాన్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. తన అద్భుతమైన 7 సీటర్ మోడల్ గ్రావైట్‎ను ఇప్పుడు సరికొత్త సీఎన్జీ అవతారంలో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడమే కాకుండా, సామాను పెట్టుకోవడానికి డిక్కీలో తగినంత స్థలాన్ని కేటాయించడం ఈ కారు ప్రత్యేకత. నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన ఆల్-న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం ప్రభుత్వం ధృవీకరించిన సీఎన్జీ కిట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ విభాగంలోనే మొదటిసారిగా స్మార్ట్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీని పరిచయం చేశారు. సాధారణంగా సీఎన్జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీలో స్థలం ఉండదు, కానీ గ్రావైట్లో రెండు చిన్న సిలిండర్లను అమర్చడం ద్వారా ఏడుగురు కూర్చున్నా సరే, లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలం లభిస్తుంది. దీనివల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
Advertisement

నాలుగున్నర లక్షల కార్ అయినా సేల్స్‌లో డౌన్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అందుబాటు ధర, నమ్మకమైన పనితీరు, సింపుల్ డిజైన్ కారణంగా మంచి గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా టియాగో (Tata Tiago) ఒకటి. మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది చాలా కాలంగా బలమైన ఎంట్రీ-లెవల్ ఎంపికగా నిలుస్తూ వచ్చింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభించే ఈ మోడల్, బడ్జెట్ సెగ్మెంట్‌లో తన స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ మోడల్ కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2026 నెలలో టియాగో మొత్తం 5,488 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో ఐసీఈ, ఈవీ వేరియంట్లు రెండూ కలిపి ఉన్నాయి.