హోండా కంపెనీ పాలిట దేవుడిగా మారిన కారు

భారతదేశంలోని వాహన ప్రియులు హోండా (Honda) బ్రాండ్‌పై చూపిస్తున్న నమ్మకం ఎలాంటిదో మరోసారి రుజువైంది. ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా గత నెల (జూన్, 2026)లో జరిగిన తన కార్ల విక్రయాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ అమ్మకాల జాబితాలో కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్ హోండా అమేజ్ (Honda Amaze) మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కారు సేఫ్టీ పరంగా అత్యుత్తమ రేటింగ్‌తో పాటు కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోయేలా ఉండటంతో విక్రయాల పరంగా విపరీతమైన జోరును ప్రదర్శిస్తోంది. తాజా అమ్మకాల నివేదికల ప్రకారం.. గత నెల జూన్‌లో హోండా అమేజ్ ఏకంగా 29 శాతం బలమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ ఒక్క నెలలోనే కంపెనీ మొత్తం 2,937 యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. కాగా, గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి అంటే జూన్, 2025లో అమేజ్ అమ్మకాల సంఖ్య కేవలం 2,274 యూనిట్లుగా మాత్రమే నమోదైంది. గత ఏడాది కాలంలో ఈ కారు అమ్మకాలు గణనీయంగా పెరగడం విశేషం. మిడ్-సైజ్ సెడాన్ కేటగిరీలో ఈ స్థాయి అమ్మకాలతో హోండా అమేజ్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. హోండా కార్ల అమ్మకాల జాబితాలో రెండో స్థానంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివేట్ (Honda Elevate) నిలిచింది. గత నెల జూన్‌లో ఈ ఎస్‌యూవీని మొత్తం 1,561 మంది కస్టమర్లు తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే గత ఏడాది జూన్ 2025లో నమోదైన 1,635 యూనిట్ల అమ్మకాలతో పోల్చి చూస్తే.. ఈసారి ఎలివేట్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న తరుణంలో ఈ గణాంకాలు మెరుగైనవిగానే ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, హోండా బ్రాండ్‌కు భారత్‌లో దశాబ్దాలుగా వెన్నెముకలా నిలుస్తున్న ఐకానిక్ సెడాన్ హోండా సిటీ (Honda City) ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2026లో హోండా సిటీ 5 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 745 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది జూన్, 2025 లో కంపెనీ కేవలం 709 యూనిట్ల సిటీ కార్లను మాత్రమే విక్రయించింది. కొత్త తరం కార్లు ఎన్నో వస్తున్నప్పటికీ, లాంగ్ రైడ్స్ ఇష్టపడే లగ్జరీ కార్ల ప్రియులకు హోండా సిటీ ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే హోండా అమేజ్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. దీని ముందు భాగంలో ఉన్న క్రోమ్ గ్రిల్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. క్యాబిన్ లోపల కస్టమర్ల లగేజ్ కోసం ఏకంగా 416 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

E20 పెట్రోల్‌తో నిజంగానే మైలేజ్ 17 నుంచి 5కి పడిపోతుందా?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. తన లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎస్‌యూవీ మైలేజ్ కేవలం రెండు రోజుల్లోనే ఊహించని విధంగా ఘోరంగా పడిపోయిందని ఆయన ఒక వీడియో ద్వారా ఆరోపించారు.

ఏనుగంత కారు.. మార్కెట్లో దూకుడు మాత్రం సింహంలా!

7-సీటర్ ఫ్యామిలీ కార్ల విభాగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, టయోటా రూమియన్ (Toyota Rumion) తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. జూన్ 2026లో విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ ఎంపీవీ 2,376 యూనిట్లు విక్రయించి మరోసారి మార్కెట్లో తన సత్తా చాటింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,415 యూనిట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 67.9 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. ఈ అమ్మకాల గణాంకాలు భారతీయ కుటుంబాలు 7-సీటర్ వాహనాల వైపు మరింత ఆసక్తి చూపుతున్నారని వెల్లడిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన మెరుగైన వృద్ధి సాధించడంతో టయోటా బ్రాండ్ సంతోషంలో మునిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో సేల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అడ్వెంచర్ ఎడిషన్‌తో రెనాల్ట్ సర్‌ప్రైజ్!

ఇటీవలి కాలంలో కార్ల కంపెనీలు తమ ప్రముఖ కార్లపై కస్టమర్ల ఆసక్తిని మరింత పెంచేందుకు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను వరుసగా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. సాధారణంగా ఏదైనా మోడల్ కీలకమైన అమ్మకాల మైలురాయిని చేరుకున్నప్పుడు, మార్కెట్లోకి వచ్చి కొన్నేళ్లు పూర్తయిన సందర్భంలో లేదా కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేస్తుంటారు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేక డిజైన్, కొత్త అప్‌డేట్లు,ఎక్స్‌ట్రా ఫీచర్లతో ఈ ఎడిషన్లు ఆకర్షిస్తాయి. అదే వ్యూహాన్ని ఇప్పుడు రెనాల్ట్ కూడా అనుసరిస్తోంది. తాజాగా రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Renault Duster Adventure Edition)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Advertisement

కార్ మైలేజ్ పెంచుకోవడానికి ఈ 5 సింపుల్ సీక్రెట్స్ పాటించండి

భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఎప్పుడూ మైలేజ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం, మరోవైపు దేశవ్యాప్తంగా E20 ఇంధనం వేగంగా అందుబాటులోకి రావడం వల్ల చాలామంది కార్ ఓనర్లలో మైలేజ్ గురించిన ఆందోళన మరింత పెరిగింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని స్వయంగా వాహన తయారీ కంపెనీలే అంగీకరిస్తున్నాయి. అయితే, మీ కారు మైలేజ్ అనేది కేవలం పెట్రోల్‌పై మాత్రమే కాకుండా.. మీ డ్రైవింగ్ విధానం, కారు మెయింటెనెన్స్, రోడ్ల పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చు.

తాబేలు నడకతోనైనా టార్గెట్ రీచ్.. ఇన్విక్టో అమ్మకాల్లో 35% వృద్ధి!

మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రీమియం 7 సీటర్ ఎంపీవీగా గుర్తింపు పొందిన ఇన్విక్టో (Invicto) మార్కెట్లో నెమ్మదిగా కానీ నిలకడగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో అమ్మకాలు నమోదు చేసే మోడల్ కాకపోయినా, పనీతీరు, టెక్నాలజీ, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే ఇన్విక్టో అమ్మకాల ప్రయాణాన్ని తాబేలు నడకతో పోల్చవచ్చు. వేగంగా దూసుకెళ్లకపోయినా, ప్రతి నెలా స్థిరమైన విక్రయాలతో తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.

ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఆగకుండా 1000కిమీ జర్నీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ (JSW Motors) ప్రసిద్ధ చైనీస్ కార్ల తయారీ సంస్థ చెరీ (Chery)తో చేతులు కలిపింది. ఈ క్రేజీ భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ కారు జెటూర్ టీ2 (Jetour T2) భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముస్తాబవుతోంది.

స్కైనోమాడ్ N90లో అదిరిపోయే టెక్నాలజీ!

చైనా, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో మంచి గుర్తింపు పొందిన షియోమీ (xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ తన ముద్ర వేయడానికి వేగంగా అడుగులు వేస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే అడుగుపెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు పెర్ఫార్మెన్స్‌తో పాటు లగ్జరీ సెగ్మెంట్‌పైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా తన కొత్త ప్రీమియం సబ్-బ్రాండ్ స్కైనోమాడ్ (Skynomad) కింద తొలి మోడల్ N90ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికత, ఆకట్టుకునే డిజైన్, హై-పెర్ఫార్మెన్స్ పనితీరుతో ఈ కొత్త మోడల్ గ్లోబల్ ఈవీ మార్కెట్లో షియోమీ ఆశయాలను మరింత స్పష్టంగా చాటుతోంది.
Advertisement

రోజుకు 300 కార్లు.. దేశంలో ఎక్కువ మంది కొనే కారు ఇదే

భారత కార్ లవర్స్ పై హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) మ్యాజిక్ మరోసారి పనిచేసింది. మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వస్తున్నా.. క్రెటా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ ఏడాది 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి నుంచి జూన్ వరకు) దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ SUVగా హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు సృష్టించింది.

మైలేజీ బాగున్నా కొనేవాళ్లు తగ్గారు.. ఎస్-ప్రెస్సోకు భారీ షాక్!

ఎస్‌యూవీలకు, ఎంపీవీలకు డిమాండ్ బాగా పెరుగుతున్న కాలంలో చిన్న కార్లు అయినటువంటి హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎంట్రీ లెవల్ కార్లకు లభించిన ఆదరణ చాలా ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న వినియోగదారుల అభిరుచుల కారణంగా చిన్న కార్లను కొనేవారు మెల్లగా తగ్గిపోతున్నారు. తాజాగా మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ద కారు ఎస్-ప్రెస్సో‌ (S-Presso)కు సంబంధించి గత నెల అమ్మకాలు విడుదల అయ్యాయి. దీనిని చూస్తే, మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో అర్థం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకికి చెందిన ఎస్-ప్రెస్సో 2026 జూన్ నెలలో 1,028 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

లగ్జరీ ఫీచర్లు ఉన్నా ఈ కారును కొనే వాళ్లే లేరు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ ఫీచర్లు, విలాసవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన కియా కార్నివాల్ (Kia Carnival)కు గడిచిన జూన్ (2026) నెలలో తీవ్ర నిరాశ ఎదురైంది. జూన్ నెలలోని మొత్తం 30 రోజుల్లో ఈ ఖరీదైన ఎంపీవీ (MPV) కారును దేశవ్యాప్తంగా కేవలం 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేశారు.

నెలకు 12 వేలకు పైగా అమ్ముడవుతున్న మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV కార్లకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలో దేశీయ దిగ్గజం మారుతి సుజుకీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ విక్టోరిస్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 సంవత్సరం మొదటి సగభాగంలో అంటే జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ కారు ఏకంగా 73,912 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది.
Advertisement

24 ఏళ్ల సంప్రదాయానికి ఘనంగా జావా-యెజ్డీ డే!

బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం (International Jawa-Yezdi Day) ఈ ఏడాది తన 24వ ఎడిషన్‌ను ఘనంగా నిర్వహించింది. జూలై రెండో ఆదివారం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో భారతదేశం నలుమూలల నుంచి వేలాది మంది రైడర్లు పాల్గొని జావా, యెజ్డీ బ్రాండ్లపై తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఒకప్పుడు కొద్దిమందితో కలిసి ప్రారంభించిన చిన్న సమావేశంగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు దేశాల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రముఖ మోటార్‌సైక్లింగ్ సంప్రదాయంగా ఎదిగింది. ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో భారతదేశంలోని 150కు పైగా నగరాల నుంచి 7,500 మందికి పైగా రైడర్లు పాల్గొనడం విశేషం.

రద్దీ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్.. SI సస్పెండ్

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి చేసిన నిర్వాకం ఆయన ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. హైదరాబాద్‌ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో రద్దీగా ఉండే గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై కేవలం 6 సంవత్సరాల వయసున్న తన మైనర్ మనవరాలికి ఏకంగా కారు డ్రైవింగ్ సీటు అప్పగించాడో పోలీస్ అధికారి. చిన్నపాప అంత పెద్ద కారును రోడ్డుపై నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు పోలీస్ అధికారిని పూజారి తిరుపతిగా గుర్తించారు. ఆయన తన చిన్నారి మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపిస్తున్న సమయంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారును ఒక చిన్నపిల్ల నడపడం గమనించిన స్థానికులు, వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రూ.4.57 లక్షలకే బెస్ట్ హ్యాచ్‌బ్యాక్.. టాటా టియాగో అమ్మకాలు అదుర్స్!

సరసమైన ధర, బలమైన నిర్మాణం, మంచి భద్రతా ప్రమాణాలు, నమ్మకమైన పనితీరుతో భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో (Tata Tiago) ఒకటి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారు, తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, సేఫ్టీ కోరుకునే కుటుంబాలు ఈ కారును ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణాలకు అనువైన సైజు, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజ్ వంటి అంశాలు టియాగోను తన సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలబెట్టాయి. టాటా మోటార్స్ ఈ కారును ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది.

చిన్న కుటుంబాలకు బెస్ట్ కారు.. అమ్మకాలు 106% జంప్!

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనాలనే కలను అందుబాటులోకి తీసుకొచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) ఎప్పుడూ ముందుంటుంది. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. 1990ల చివర్లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఆల్టో, కాలానుగుణంగా ఎన్నో మార్పులు, సాంకేతిక అప్‌డేట్లను అందుకుంటూ మరింత ఆధునికంగా మారింది. ఒకప్పుడు 800cc ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ఇప్పుడు 1.0-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో విక్రయించబడుతోంది. నగర ప్రయాణాలకు, గ్రామాల్లో చిన్న కుటుంబాలకు ఇది ఇప్పటికీ బెస్ట్ బడ్జెట్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.
Advertisement

ఇండియన్ మార్కెట్లోకి త్వరలోనే 5 పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీల ఎంట్రీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్లపై రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ కార్లను సొంతం చేసుకోవడానికి కస్టమర్లు పోటీ పడుతున్నారు. వినియోగదారుల క్రేజ్‎ను గమనించిన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు సరికొత్త మోడళ్లను రంగంలోకి దించడానికి సిద్ధమయ్యాయి.

5 ఏళ్ల బ్యాటరీ వారంటీతో వస్తున్న బెస్ట్ EV స్కూటర్లు!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే చాలా మంది మనసులో మొదట వచ్చే సందేహం బ్యాటరీ పనితీరు, విశ్వసనీయత గురించే. కొన్నాక ఎలాంటి సమస్యలు వస్తాయో?, బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుందా? వంటి ప్రశ్నలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. అందుకే పెట్రోల్ స్కూటర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారుతోంది. తయారీ సంస్థలు వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆకర్షణీయమైన బ్యాటరీ వారంటీ ప్యాకేజీలను అందిస్తున్నాయి. స్టాండర్డ్ వారంటీతో పాటు, అదనపు చెల్లింపుతో పొడిగించిన వారంటీ లేదా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో బ్యాటరీ నిర్వహణ ఖర్చులపై ఉండే భయం గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐదేళ్ల వరకు బ్యాటరీ వారంటీతో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ కథనంలో చూద్దాం.

పాపం మహీంద్రా.. కంపెనీలో దీని పరిస్థితి మరే కారుకు లేదు భయ్యా

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల అంటే జూన్ 2026 లో మహీంద్రాకు చెందిన స్కార్పియో, థార్, బొలెరో వంటి మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఇదే సమయంలో కంపెనీకి చెందిన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) మహీంద్రా XUV 400 EV కి మాత్రం కస్టమర్లు భారీ షాకిచ్చారు. గత నెలలో ఈ కారును కొనేందుకు కస్టమర్లు అస్సలు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా కేవలం 31 మంది మాత్రమే ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. దీంతో కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

టాటా, మహీంద్రాకు గట్టి పోటీ.. కియా సిరోస్ EV డిజైన్ లీక్!

కియా ఇండియా ఈ జూలైలో రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన టీజర్లతో ఒక హైబ్రిడ్ ఎస్‌యూవీతో పాటు మరో పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా రానున్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కియా కొత్త ఈవీకి సంబంధించిన కీలక వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న కియా సైరోస్‌(Kia Syros) కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ బెంగళూరు నగరంలోని రోడ్డుపై ఎలాంటి క్యామోఫ్లాజ్ లేకుండా సైరోస్ ఈవీ టెస్ట్ రన్ చేస్తుండగా కనిపించింది. ఈ వాహనానికి గ్రీన్ నంబర్ ప్లేట్ ఉండటంతో ఇది ఎలక్ట్రిక్ మోడల్ అనే విషయం స్పష్టమైంది.
Advertisement

పల్లె నుంచి పట్టణాల వరకు కస్టమర్లను ఫిదా చేస్తున్న మహీంద్రా కార్లు

భారత ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ SUV కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. జూన్, 2026 నెలలో జరిగిన తమ కార్ల మోడల్ వారీ అమ్మకాల అధికారిక గణాంకాలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ కస్టమర్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహీంద్రా స్కార్పియో మరోసారి అమ్మకాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

రెండు ఫ్యామిలీలు ఇబ్బంది లేకుండా జర్నీ చేయొచ్చు

భారతీయ కార్ల వినియోగదారులకు మల్టీ యూటిలిటీ వెహికల్స్ (MUV) అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. పెద్ద కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి ఈ కార్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. గత జూన్, 2026 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా మారుతి సుజుకి ఎర్టిగా తన నంబర్-1 స్థానాన్ని పదిలం చేసుకుంది.

బెంజ్ రేంజ్ ఫీచర్లున్నా 30 రోజుల్లో అమ్ముడైంది 9 కార్లు మాత్రమే

భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు కస్టమర్ల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్టర్, సబ్-కాంపాక్ట్ కేటగిరీలో వెన్యూ మోడళ్లు ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

కంపెనీలోని 8 మోడళ్లకు చుక్కలు చూపించిన చిన్న కారు

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రతి నెల సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. జూన్ నెల సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే కంపెనీ బిజినెస్ భారీగా జరుగుతన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా సంస్థ ఇండియన్ మార్కెట్లో దాదాపు 9 కార్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో చాలా వరకు పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి.
Advertisement

తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన సేల్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మోడళ్లు దూసుకుపోతున్నాయి. వీటికి గట్టి పోటీ ఇస్తూ, సరికొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది సరికొత్త రెనాల్ట్ డస్టర్. అయితే, మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఈ కారు విఫలమవుతోంది. ఇండియన్ రోడ్లపై కేవలం నాలుగు నెలల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ఎస్‌యూవీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు సదా సరికదా.. రోజురోజుకూ ఘోరంగా పడిపోతున్నాయి.