రూ. 6.49 లక్షలకే కొత్త టాటా ఈవీ కారు లాంచ్

దేశీయ ఈవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు వినియోగదారులు మళ్లుతున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలోనే Tata Motors మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUVకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేస్తూ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) 2026 మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖత సాధించిన ఈ మోడల్‌కు ఇది మొదటి ప్రధాన నవీకరణ కావడం విశేషం. ప్రారంభ అరంగేట్రం తర్వాత వినియోగదారుల అభిప్రాయాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

టీవీఎస్ చీపెస్ట్ బైక్స్ ఇవే

మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా పల్లెటూళ్లలో నివసించే రైతులకు, పట్టణాల్లో రోజువారీ పనుల కోసం తిరిగే సామాన్యులకు టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఎప్పుడూ ఒక భరోసా. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరలో ఉండి.. లీటరుకు అదిరిపోయే మైలేజీ ఇచ్చే బైకుల కోసం అందరూ వెతుకుతుంటారు. అచ్చం అలాంటి వారి కోసమే టీవీఎస్ తన ఎంట్రీ-లెవల్ విభాగంలో మూడు అద్భుతమైన వాహనాలను అందుబాటులో ఉంచింది.

గ్రామాలు, నగరాల్లో బెస్ట్, 9 మంది కూర్చోవచ్చు

భారతీయ SUV మార్కెట్లో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మహీంద్రా స్పార్కియో క్లాసిక్ (Mahindra Scorpio Classic) ఇప్పటికీ బలంగా ఉంది. భారీ బాడీ, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన డిజైన్‌తో రోడ్డుపై కనిపించిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కార్పియో క్లాసిక్ అనేది కేవలం ఒక కారు కాదు, అది ఒక బలమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ముందుభాగంలో ఉన్న బోల్డ్ గ్రిల్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, ఎత్తైన బోనెట్ డిజైన్ కలిసి పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తాయి. గ్రామీణ రహదారులైనా, నగర ట్రాఫిక్ అయినా ఎక్కడైనా ఈ SUV తన స్థాయిని చూపిస్తుంది. బలమైన బాడీ నిర్మాణం, విశాలమైన కేబిన్ స్పేస్ వల్ల కుటుంబ ప్రయాణాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

చైనా సూపర్ కార్ సరికొత్త సంచలనం

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే మనకు గుర్తొచ్చేది శబ్దం లేని ప్రయాణం, పర్యావరణ హితం, అత్యాధునిక టెక్నాలజీ. కానీ ఒక ఎలక్ట్రిక్ కారు గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తూ, రోడ్డుపై టైర్ల నుంచి పొగలు చిమ్ముతూ డ్రిఫ్టింగ్ చేయడం ఎప్పుడైనా ఊహించారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా, చైనాకు చెందిన ఒక సూపర్ ఎలక్ట్రిక్ కారు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
Advertisement

ఒక్క SUVతో కుటుంబం మొత్తం కంఫర్ట్

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా 'టేరాన్ ఆర్-లైన్'ను ఘనంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 46.99 లక్షలుగా నిర్ణయించిన ఈ ప్రీమియం ఏడు సీట్ల SUV, బ్రాండ్ లైనప్‌లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మూడు వరుసల సెగ్మెంట్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పెస్ స్థానాన్ని ఈ కొత్త టేరాన్ ఆర్-లైన్ భర్తీ చేయడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్ ఈ 7-సీటర్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు బ్రాండ్ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్‌తో వినియోగదారులు టేరాన్ ఆర్-లైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.

5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు మంచిది? క్విడ్ vs సెలెరియో కంపారిజన్

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) సెలెరియో (Celerio) తన ప్రత్యేకమైన మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, నగర జీవనశైలికి సరిపోయే డిజైన్‌తో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరతో పాటు, తక్కువ నిర్వహణ ఖర్చు ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది. ఇదే సమయంలో (Renault) నుంచి వచ్చిన రెనాల్ట్ క్విడ్ (kwid) కూడా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన SUV-లుక్ డిజైన్‌తో మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు కార్లు కూడా తమ తమ శ్రేణిలో బలమైన పోటీని కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా అమ్మకాల గణాంకాల్లో ఇవి ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. ఈ రెండు కార్లు గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

మైలేజీలోనూ, లగ్జరీలోనూ ఈ కారు అరాచకం భయ్యా

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault), భారతీయ రోడ్లపై తన పట్టును మరింత పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే తన ఐకానిక్ మోడల్ డస్టర్ (Duster) కొత్త జనరేషన్‌ను సిద్ధం చేసిన కంపెనీ, ఇప్పుడు దానికి ఒక పెద్ద వెర్షన్ అనదగ్గ బిగ్‌స్టర్ (Bigster) 7-సీటర్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

పెద్ద ఫ్యామిలీలు ఉండి లగ్జరీగా వెళ్లాలని అనుకునే వాళ్లకు పర్ఫెక్ట్

సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) భారత మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తిరుగులేని బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంపీవీ కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2022 ఫిబ్రవరి 15న లాంచ్ అయిన ఈ కారు, తాజాగా తన నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కేవలం 4 ఏళ్లలోనే దాదాపు 2.77 లక్షల కుటుంబాలకు చేరువైన ఈ కారు, ఇప్పుడు కియా కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో కారుగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కియా కారెన్స్ ప్రయాణం ప్రారంభం నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. SIAM గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కారు మొత్తం 2,77,236 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో మొదటి లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి 17 నెలల సమయం పట్టగా, తరువాతి లక్ష యూనిట్లను కేవలం 20 నెలల్లోనే విక్రయించింది. 2025 ఫిబ్రవరిలో 2 లక్షల మార్కును దాటిన కారెన్స్, ఇప్పుడు 2026 మే లేదా జూన్ నాటికి 3 లక్షల మైలురాయిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Advertisement

ఈ కారును 6 లక్షల మంది ఎంచుకున్నారు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) భారత మార్కెట్లో అడుగుపెట్టిన సమయం చాలా ఎక్కువ కాలం కాలేదు. అయినప్పటికీ, కొద్ది సంవత్సరాల్లోనే దేశీయ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయికి ఎదగడం ఈ బ్రాండ్ సాధించిన విశేష విజయంగా చెప్పుకోవాలి. కొత్త డిజైన్ భాష, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకున్న ఫీచర్ల కలయికతో కియా భారతీయ వినియోగదారుల మనసులు గెలుచుకుంది. ఈ విజయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మోడల్ అయితే కియా సెల్టోస్ (Kia Seltos). 2019లో భారత మార్కెట్లో తొలిసారిగా విడుదలైన ఈ ఎస్యూవీ, లాంచ్ అయిన నాటి నుంచే మంచి స్పందనను అందుకుంది.

ఏకంగా 10 ఏళ్ల వారంటీ..ఫ్రీ సర్వీస్..మస్త్ కార్

జపనీస్ దిగ్గజం నిసాన్ మోటార్స్, భారతీయ మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. బడ్జెట్ ధరలో లభించే సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ (MPV) నిసాన్ గ్రావైట్ (Nissan Gravite)ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం తక్కువ ధరకే కారును అందించడమే కాకుండా, కారు కొన్న తర్వాత సర్వీస్ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడే సామాన్యుల కోసం జీరో మెయింటెనెన్స్ ప్లాన్‌ను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ADAS ఫీచర్లతో తక్కువ ధరలో హైటెక్ సేఫ్టీ కార్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు స్పష్టంగా మారుతున్నాయి. ఒకప్పుడు కారు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఆకర్షణీయమైన ఫీచర్లు ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కస్టమర్లు ముందుగా అడుగుతున్న ప్రశ్న ఈ కారు ఎంత సురక్షితం?. ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలుదారులు కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. కారు బాడీ నిర్మాణ నాణ్యత, క్రాష్ టెస్ట్ రేటింగ్స్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి అంశాలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ADAS (Advanced Driver Assistance Systems) సూట్ కలిగిన కార్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ADAS ఫీచర్లను కలిగిన కార్లను ఒకసారి చూద్దాం.

దేశాన్ని ఏలుతున్న టాప్-5 సిఎన్‌జీ కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యుడికి ఉన్న ఏకైక భరోసా సీఎన్‌జీ (CNG) కార్లే. ఒకప్పుడు సిఎన్‌జీ అంటే కేవలం మైలేజ్ కోసం కొనేవారు, కానీ ఇప్పుడు కంపెనీలు అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, బూట్ స్పేస్ సమస్య లేకుండా సరికొత్త టెక్నాలజీతో కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మీరు 2026లో రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, భారీ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తుంటే టాప్-5 ఆప్షన్లు ఇవే.
Advertisement

చిన్న కుటుంబాల కోసం సూపర్ కారు

ఫ్రెంచ్ ఆటోమేకర్ Renault భారత మార్కెట్లో విక్రయిస్తున్న హ్యాచ్‌బ్యాక్ రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) దేశంలో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. తక్కువ ధర, ఆకర్షణీయమైన SUV-స్టైల్ డిజైన్, అలాగే నగర వినియోగానికి అనువైన మైలేజ్ కారణంగా క్విడ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ప్రత్యేకంగా మొదటి కారు కొనుగోలు చేసే కస్టమర్లకు క్విడ్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. అందుబాటులో ఉండే ధరతో పాటు, ఆధునిక ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ మోడల్‌ను ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో పోటీదారుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రెనాల్ట్ క్విడ్ మరోసారి తన స్థిరమైన డిమాండ్‌ను నిరూపించింది.

భలే ఆఫర్..కారు కొంటే మరొక కారు ఫ్రీ

ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ లేనంత భారీ ఆఫర్‌తో ఒక కార్ల డీలర్ షిప్ వార్తల్లో నిలిచింది. షాపుల్లో బట్టలు కొన్నప్పుడు బై వన్ గెట్ వన్(ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఆఫర్ చూడటం మనకు అలవాటే. కానీ ఒక కారు కొంటే ఏకంగా మరో కారును ఫ్రీగా ఇచ్చే ఆఫర్ విన్నారా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన SGA సిట్రోయెన్ (Citroen) డీలర్ షిప్ ఈ సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. వారి వద్ద ప్రీమియం SUV అయిన సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొనుగోలు చేస్తే మరొక కారును ఫ్రీగా ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోయంబత్తూరులోని ఈ డీలర్ షిప్ వద్ద సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్ C5 Aircross (దీని ధర సుమారు రూ.37.4 లక్షల ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేసిన వారికి, Citroen C3 X అనే మరో కారును పూర్తిగా ఉచితంగా ఇస్తామని డీలర్ షిప్ వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్త తెలియగానే కారు కొనాలనుకునే వారు షోరూం వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేశారు.

కస్టమర్లతో మైనే ప్యార్ కియా అనిపించిన కియా

దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా (Kia) భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎంపీవీ కారెన్స్ (MPV Kia Carens) ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. ఫిబ్రవరి 15న ఈ ఫ్యామిలీ కారు భారతదేశంలో తన నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 2022 ఫిబ్రవరి 15న ప్రారంభమైన కారెన్స్, కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారత కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. లాంచ్ సమయంలోనే ఆధునిక డిజైన్, విస్తృతమైన క్యాబిన్ స్పేస్, ఫ్యామిలీకి అనువైన సీటింగ్ ఆప్షన్లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు వంటి అంశాలతో కారెన్స్ మంచి స్పందనను అందుకుంది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, నగర ప్రయాణాలకే కాకుండా లాంగ్ డ్రైవ్‌లకు కూడా సౌకర్యవంతమైన ఎంపికగా నిలిచింది.

రూ.6 లక్షల్లోపు కార్లు.. రెండు కుటుంబాలు కూర్చోవచ్చు!

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ భారతీయ మార్కెట్లో కొత్తగా గ్రావైట్ పేరుతో ఒక ఎంవీపీని పరిచయం చేసింది. ఈ మోడల్ ప్రముఖ ఫ్రెంచ్ బ్రాండ్ రెనాల్ట్ తయారు చేసిన ట్రైబర్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. రెండు వాహనాలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైనప్పటికీ, డిజైన్, ఫీచర్లు, బ్రాండింగ్, కొంతవరకు డ్రైవింగ్ అనుభవంలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. గ్రావైట్‌లో ముందు భాగం పూర్తిగా కొత్త స్టైల్‌తో రూపొందించబడింది. కుటుంబాలకు తక్కువ ధరలో 7-సీటర్ ఎంపిక కావాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్లుగా నిలవవచ్చు. వీటి గురించిన వివరాల గురించి ఈ కథణంలో చూద్దాం.
Advertisement

రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

నేటి కాలంలో సొంతంగా ఒక కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందులోనూ రోడ్లపై గంభీరంగా కనిపించే కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) అంటే మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో క్రేజ్. 2026 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్ విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్, అత్యుత్తమ భద్రత కలిగిన ఎస్‌యూవీలు అందుబాటులోకి వచ్చాయి. మీ బడ్జెట్‌లో సరిపోయే టాప్-5 కాంపాక్ట్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఛాయ్ తాగొచ్చే లోపే ఛార్జింగ్ అయిపోద్ది

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే ప్రతి ఒక్కరూ చూసే ప్రధాన ఫీచర్ ఫాస్ట్ ఛార్జింగ్. పెట్రోల్ బంకుల్లో నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ చేసినంత వేగంగా కాకపోయినా, వీలైనంత త్వరగా ఛార్జింగ్ అయ్యే ఈవీలకే వినియోగదారులు జై కొడుతున్నారు. ఆఫీసుకో లేదా బయటకో వెళ్లేటప్పుడు తక్కువ టైమ్‌లో ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

47 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్

ఇటీవలి కాలంలో కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ తరహా కార్యక్రమాలు ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయం క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ హై లైట్ (HiLITE Group) తమ 30వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, రిటైల్, ఆతిథ్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థ కేరళలో ఆధునిక పట్టణ సంస్కృతికి ఒక ప్రతీకగా నిలిచింది.

స్కోడా కార్ కోసం దేశవ్యాప్తంగా రద్దీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం బ్రాండ్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థల్లో స్కోడా (Skoda) ఒకటి. స్టైలిష్ డిజైన్, దృఢమైన నిర్మాణం, యూరోపియన్ డ్రైవింగ్ అనుభూతి ఇవన్నీ స్కోడా కార్ల ప్రత్యేకతలుగా చెప్పుకుంటారు. అయితే, ఎక్కువ ధరలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయనే అభిప్రాయం వల్ల చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్‌ను కొంత దూరంగా ఉంచేవారు. ఫలితంగా, స్కోడా అమ్మకాల గణాంకాలు భారత మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది స్కోడా కైలాక్ (Skoda Kylaq) రాకతో. కైలాక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత బ్రాండ్‌కు కొత్త ఊపు వచ్చింది. ఇది స్కోడా నుంచి వచ్చిన అత్యంత సరసమైన మోడల్‌గా గుర్తింపు పొందింది.
Advertisement

ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ఓలా కథ ముగిసినట్టేనా?

భారతదేశ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన స్టార్టప్ కంపెనీలు వెనకబడిపోగా, ఏళ్ల తరబడి మార్కెట్‌ను ఏలుతున్న సాంప్రదాయ కంపెనీలు మళ్లీ తమ పట్టును సాధించుకున్నాయి. ముఖ్యంగా 2026 ప్రారంభంలో వచ్చిన జనవరి విక్రయాల గణాంకాలు చూస్తుంటే.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ప్రస్తుతం ముగ్గురు కింగ్స్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

భలే కారు..ఛార్జింగ్ అయిపోతే పెట్రోల్‌తో ప్రయాణం

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV)ల హవా కొనసాగుతున్న తరుణంలో, ప్రముఖ వాహన తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెస్తూ, తన సరికొత్త ఎస్‌యూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. బ్యాటరీ అయిపోతే పెట్రోల్‌తో.. పెట్రోల్ లేకపోతే బ్యాటరీతో నడిచే ఈ వినూత్న కారు, భారత రోడ్లపై ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది.

రెండూ పర్ఫెక్ట్.. రూ.2 లక్షల లోపు ఏది బెస్ట్?

భారతదేశంలో ఇటీవలి కాలంలో సరసమైన పనితీరు మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. స్టైల్ కూడా ఉండాలి, పవర్ కూడా ఉండాలి, కానీ ధర మాత్రం అందుబాటులో ఉండాలనే అభిరుచి యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌ను సరిగ్గా క్యాచ్ చేసిన మోడల్ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). గత రెండు సంవత్సరాలుగా ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత సరసమైన బైక్‌గా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అదే ధర శ్రేణిలోకి కొత్తగా అడుగుపెట్టింది Yamaha XSR 155. ఇది యమహా కంపెనీ నుంచి వచ్చిన తేలికైన, మోడర్న్ రెట్రో స్టైల్ బైక్. 350cc ఎన్‌ఫీల్డ్ రోడ్‌స్టర్‌కు ఇది ఒక తక్కువ బరువు, ఇంధన-సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా భావించబడుతోంది. ఈ రెండింటి నుంచి ఈ కథనంలో.

లక్ష ఎక్కువైనా ఫర్వాలేదు కానీ రేంజ్ అదిరింది

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకి తన తొలి గ్లోబల్ ఈవీ ఇ విటారా(Maruti Suzuki e-Vitara)ను ప్రవేశపెట్టి ఎంజీ (MG) మోటార్స్‌కు గట్టి సవాల్ విసిరింది. ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) ఇప్పటికే తన వినూత్నమైన BaaS (Battery-as-a-Service) విధానంతో దూసుకుపోతుండగా ప్రస్తుతం మారుతి కూడా అదే దారిని ఎంచుకుంది. లక్ష రూపాయల ఎక్స్ ట్రా ధరతో వస్తున్నా, మారుతి నమ్మకం, ఫీచర్ల పరంగా విండ్సర్‌కు సరైన ప్రత్యర్థిగానే అనిపిస్తోంది.
Advertisement

ఇంటి ముందే 7 సీటర్ కారు.. కేవలం రూ.5.65 లక్షలతో సాధ్యం!

భారతీయ ఆటో మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు చేసే వారు, అలాగే టాక్సీ ఆపరేటర్లు అందరికీ ఒకే సారి సరిపోయే వాహనం అంటే అది ఒక మంచి ఎంపీవీ. ఇలాంటి సమయంలోనే నిస్సాన్ (Nissan) తమ కొత్త గ్రావైట్(Gravite) ఎంపీవీని ఒక గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా అమ్మకానికి విడుదల చేసి మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నట్టు కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించుకునే కాంపాక్ట్ సైజ్‌తో పాటు, లోపల మాత్రం విస్తారమైన క్యాబిన్ స్పేస్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. పెద్ద కుటుంబాలు ఒకేసారి ప్రయాణించేటప్పుడు ఎవరూ ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన సీటింగ్ అమరికను ఇందులో కల్పించారు.