మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బెస్ట్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు

యుద్ధం కారణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.గతంలో కంటే ఈ సారి ఈవీల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈవీ స్కూటర్ల ఆప్షన్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. అప్పట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటేనే మొహం చాటేసిన వారు ఇప్పుు అవే కావాలని అంటున్నారు. దీంతో ఇప్పుడు దాదాపు ప్రతి ప్రముఖ కంపెనీ తక్కువ ధరల్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్ కోసం చూస్తున్న వారికి పలు మోడళ్లు ఈ కింది కథనంలో చూద్దాం.

దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా కార్ల ధరలను పెంచే కంపెనీలు, ఈసారి మాత్రం కస్టమర్లకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా XEV 9e (Mahindra XEV 9e) ధరను భారీగా తగ్గించింది. ఈ ఏడాది జూలై 2026 నాటి సవరించిన ధరల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం ఇప్పుడు మునుపటి కంటే చాలా చౌకగా మారింది. మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొనేందుకు, ఈవీ విక్రయాలను మరింత పెంచేందుకు మహీంద్రా ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

చాలా ఏళ్లుగా మంచి కారు అని ముద్ర వేసుకున్న కారు

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుకు చెందిన ప్రసిద్ద హ్యచ్‌బ్యాక్. కొన్నేళ్లకు పైగా మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మారుతున్న కాలానికి, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇది కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మార్కెట్లో తన సత్తా ఎంటో చూపిస్తుంది. ఇది విడుదల అయినప్పటి నుంచి తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోవడం లేదు. భారతీయలకు ఒక నమ్మకమైన చిన్న కారుగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇది చాలా ఏళ్లుగా మెరుగైన అమ్మకాల గణంకాలను నమోదు చేస్తుంది. ఒక నెల తక్కువ అమ్మకాలను నమోదు చేసినప్పటి ఆ తరువాతి నెలలో అంతకన్నా ఎక్కువ సాధించడం ఈ స్విఫ్ట్ ప్రత్యేకత. తాజాగా ఈ కారుకి సంబంధించిన అమ్మకాలు విడుదల అయ్యాయి.

చకన్ ప్లాంట్ నుంచి మహీంద్రా 30 లక్షలవ కారు రిలీజ్

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన తయారీ రంగంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న కంపెనీ ప్రసిద్ధ చకన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి ఏకంగా 30 లక్షలవ వాహనం విజయవంతంగా బయటకు వచ్చింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంలో మైలురాయి వాహనంగా మహీంద్రా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన BE 06 నిలిచింది.
Advertisement

ఫ్యామిలీ కోసం కారు కొనాలా? తక్కువ ధరలో బెస్ట్ సెడాన్ కార్లు ఇవే!

ఎస్‌యూవీలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లకు ఉన్న ఆదరణను దాటి Suv సెగ్మెంట్ దూసుకుపోతుంది. అయితే, గతంలో మాదిరిగా కాకపోయినా సెడాన్ కార్లను కొనుగోలు చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ వంటి తయారీదారులకు చెందిన పలు సెడాన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర బడ్జెట్ రూ.7 లక్షల వరకు ఉండి, కొత్త సెడాన్ కొనుగోలు చేయాలనే ఆలోచిస్తున్న వారికి ఈ కథణంలో మూడు సెడాన్ల గురించి వివరించడం జరిగింది. మారుతికి చెందిన, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న డిజైర్, హ్యుందాయ్‌కి చెందిన ఆరా, అలాగే, టాటా మోటార్స్‌కు చెందిన టిగోర్ కార్ల గురించి ఇక్కడ చూద్దాం.

ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఫ్రీగా వెళ్లే కారు పై ఏకంగా 70,000 తగ్గింపు

భారతదేశపు నంబర్ వన్ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. దేశీయ మార్కెట్లో రఫ్ అండ్ టఫ్ వాడకానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న తన ఐకానిక్ 7-సీటర్ ఎస్‌యూవీ మహీంద్రా బొలేరో (Mahindra Bolero) శ్రేణిపై జూలై 2026 నెలకు గాను భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇటీవల కంపెనీ బొలేరో కార్ల ధరలను రూ.30,500 వరకు పెంచినప్పటికీ, కస్టమర్లపై భారం పడకుండా ఉండేందుకు వీలుగా సరికొత్త జూలై డిస్కౌంట్ ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వేరియంట్లపై ఏకంగా రూ.70,000 వరకు ప్రయోజనాలు కల్పించనున్నారు. మహీంద్రా బొలేరో నియో ప్లస్ రేంజ్ కార్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్ రూ.13.49 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి బడ్జెట్ ధరలో అత్యుత్తమ సేఫ్టీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 7-సీటర్ ఎస్‌యూవీని వెతుకుతున్న వారికి ఈ జూలై ఆఫర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ డిస్కౌంట్లు మీ ప్రాంతం లేదా డీలర్ షిఫ్‎ను బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, కొనుగోలు చేయడానికి ముందు స్థానిక షోరూమ్‌ను సంప్రదించడం మంచిది. మహీంద్రా తన స్టాండర్డ్ బొలేరో క్లాసిక్ మోడల్లోని అన్ని వేరియంట్ల పై (B2, B4, B6, B6 (O), B8) ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఎవరైనా కస్టమర్ పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఒకవేళ పాత స్క్రాప్ వాహనాన్ని రీప్లేస్ చేస్తే గరిష్టంగా రూ.20,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్స్ అందుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లకు మొత్తంగా రూ.20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. మహీంద్రా బొలేరో నియో మోడళ్లపై కంపెనీ మరింత ఎక్కువ డిస్కౌంట్లను ఇస్తోంది. బొలేరో నియో N8 వేరియంట్‌పై రూ.10,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్‌తో పాటు అదనంగా రూ.10,000 విలువైన యాక్సెసరీస్ ప్రయోజనాలను అందిస్తోంది. దీనివల్ల ఈ వేరియంట్‌పై గరిష్టంగా రూ.30,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక బొలేరో నియో లోని మిగిలిన మోడల్స్ అయిన N4, N10, N11 వేరియంట్లపై ఎలాంటి యాక్సెసరీస్ బెనిఫిట్ లేనప్పటికీ, రూ.10,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ.20,000 స్క్రాపేజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.20,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

భారతదేశ మిడ్-సైజ్ బైక్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుగొందుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఐకానిక్ రెట్రో బైక్ క్లాసిక్ 350ను సరికొత్త రైడర్-ఫ్రెండ్లీ అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న రెట్రో మోటార్‌సైకిళ్లలో ఒకటైన ఈ మోడల్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కంపెనీ కొన్ని కీలక మార్పులు చేసింది. బైక్ రైడింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సరికొత్త 2026 ఎడిషన్ క్లాసిక్ 350 బైకును సిద్ధం చేసింది. పాత స్టైలిష్ వింటేజ్ లుక్‌ను అలాగే ఉంచుతూ.. రోజువారీ ప్రయాణాల్లో రైడర్లకు అవసరమైన ఉపయోగకరమైన ఫీచర్లను దీనికి జోడించింది.

రూ.5.81 లక్షల ధర, 27 కిమీ మైలేజ్‌తో అమ్మకాల్లో దూసుకెళ్తోంది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మైక్రో SUV సెగ్మెంట్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. తక్కువ ధరలో SUV తరహా డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండటంతో ఈ విభాగం కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) తీసుకొచ్చిన ఎక్స్‌టర్ మరోసారి తన సత్తా చాటింది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు ఈ మోడల్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం మైక్రో SUV విభాగంలో టాటా పంచ్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, హ్యుందాయ్ ఎక్స్‌టర్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.
Advertisement

మిడ్-సైజ్ SUV టాప్-10 పూర్తి సేల్స్ రిపోర్ట్ చూసేయండి!

భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాంపాక్ట్ SUVలతో పోలిస్తే ఎక్కువ క్యాబిన్ స్పేస్, రోడ్డుపై వెళ్తుంటే ఆకట్టుకునే లుక్, ఫ్యామిలీకి సరిపోయే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఇప్పుడు ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను అత్యంత విజయవంతంగా ఉపయోగించుకుంటున్న కంపెనీల్లో మహీంద్రా (Maghindra) ముందంజలో ఉంది. ప్రత్యేకించి మహీంద్రా స్కార్పియో, XUV 7XO మోడళ్లు మార్కెట్లో అద్భుతమైన స్పందనను అందుకుంటున్నాయి. ఈ రెండు SUVలే ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్‌కు ప్రధాన అమ్మకాల బలంగా మారాయి. వీటి క్రేజ్ కారణంగా కంపెనీ నెలవారీ విక్రయాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి.

దేశంలోనే ఫస్ట్.. ఒకే కారు ప్లాట్‌ఫామ్‌పై ఈవీ, హైబ్రిడ్ టెక్నాలజీలు

భారత ఆటోమొబైల్ రంగంలో పర్యావరణ అనుకూల వాహనాలకు (న్యూ ఎనర్జీ వెహికల్స్ - NEV) ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశంలోనే మొట్టమొదటి మల్టీ-ఎనర్జీ ప్లాట్‌ఫామ్ MG ADAPT (Advance Drive Architecture Platform Technology)ను గురుగ్రామ్ వేదికగా జూలై 16, 2026న ఘనంగా ఆవిష్కరించింది.

ఇండియాలో బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు చూసేయండి!

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో టూవీలర్ కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో కూడా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ మాత్రమే మొదటి ఎంపికగా ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్, CNG టెక్నాలజీతో వచ్చిన టూ-వీలర్లకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సాధారణ పెట్రోల్ టూ-వీలర్లతో పోలిస్తే ఈ కొత్త తరం వాహనాలు మంచి మైలేజ్ అందిస్తాయి. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో పలు కంపెనీలు హైబ్రిడ్, CNG టూ-వీలర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ కథనంలో అలాంటి హైబ్రిడ్, CNG టూ-వీలర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కారు రేట్లు ఏకంగా రూ.5 లక్షల వరకు పెంచేసిన కంపెనీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా సాధారణ ఈవీ సెగ్మెంట్‌లో మంచి పట్టు సాధించిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor), ఇప్పుడు ప్రీమియం, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోనూ దూసుకుపోతోంది. అయితే లగ్జరీ ఈవీలు కొనాలనుకునే వారికి కంపెనీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది.
Advertisement

ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి

భారతదేశంలో మిడ్-సైజ్ SUV విభాగంలో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ (Maruti Suzuki Grand Vitara SUV) తన మార్కెట్ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. క్రెటా, సెల్టోస్, ఎలివేట్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, గ్రాండ్ విటారా జూన్ 2026లో కూడా ఆకట్టుకునే అమ్మకాలతో మంచి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా విక్రయ గణాంకాల ప్రకారం, జూన్ 2026లో గ్రాండ్ విటారా మొత్తం 9,092 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 6,828 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపుగా 33 శాతం వార్షిక వృద్ధి.

కేవలం రూ.6.25 లక్షల బడ్జెట్‌లో 33కిమీ మైలేజ్ ఇచ్చే కారు

భారతదేశంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కొత్త కారు కొనాలనుకుంటే మొదట చూసేది బడ్జెట్, ఆ తర్వాత మైలేజ్. ఈ రెండు విషయాల్లోనూ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుని, దేశీయ సీఎన్‌జీ మార్కెట్లో రారాజుగా నిలిచింది మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). మన దేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందించడంలో మారుతి సంస్థకు తిరుగులేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు కంపెనీ మరో అరుదైన సర్‌ప్రైజ్‌ను అందించింది. తన షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్‌కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా పరిచయం చేసింది. సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత ప్రత్యేకమైన డిజైన్, ప్రత్యేక కలర్ థీమ్, ఎక్స్‌క్లూజివ్ ఫినిషింగ్‌తో రూపొందించిన ఈ ఎడిషన్‌ను చూసిన వెంటనే బైక్ ప్రియులు ఫిదా అయ్యేలా కంపెనీ డిజైన్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.75 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ ఉత్పత్తి మోడల్ కాదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నారు. అందులో కూడా భారత మార్కెట్‌కు కేవలం 25 యూనిట్లు మాత్రమే కేటాయించడం దీనిని మరింత అరుదైన కలెక్షన్ బైక్‌గా మార్చింది.

జూన్‌లో భారత ఆటో మార్కెట్‌ను షేక్ చేసిన టాప్-15 కార్లు ఇవే

భారత ఆటోమొబైల్ రంగం జూన్ నెలలో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన ప్రముఖ సంస్థ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(SIAM) తాజాగా జూన్ నెలకు సంబంధించిన వాహనాల అమ్మకాల అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన దేశీయ ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్‌లు గతేడాదితో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఏకంగా 24.1 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం మీద జూన్ నెలలో 3,88,144 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే జూన్ నెలలో ఈ విక్రయాలు కేవలం 3,12,851 యూనిట్లుగా మాత్రమే ఉండటం గమనార్హం.
Advertisement

ఒక్క ఛార్జ్‌తో 526 కిమీ జర్నీనే కాదు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ కూడా

భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. మధ్యతరగతి, ప్రీమియం ఈవీ కస్టమర్లను టార్గెట్ చేస్తూ తన రెండవ మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ని న్యూఢిల్లీ వేదికగా అధికారికంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కార్లు కొనేవారిలో ఉండే ప్రధాన అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అద్భుతమైన మైలేజ్ రేంజ్, అడ్వాన్సుడ్ టెక్నాలజీని, మునుపెన్నడూ లేని భరోసాతో ఈ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారుకు సంబంధించిన అధికారిక ప్రీ-బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కొత్త కియా సైరోస్ ఈవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్ (kia.com) ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో ప్రస్తుతం ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు ఇవే

ప్రస్తుతం భారత ఆటో రంగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. దీంతో వాహన తయారీ కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాయి. ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే సాధారణ పెట్రోల్‌తో పాటు 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ (E20 నుంచి E85) కలిగిన ఇంధనంపై కూడా నడిచేలా రూపొందించిన ఇంజన్. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఇంజన్లు వివిధ శాతం ఇథనాల్ మిశ్రమాలను గుర్తించి, వాటికి అనుగుణంగా పనితీరును సర్దుబాటు చేసుకుంటాయి. దీంతో పెట్రోల్ లేదా అధిక ఇథనాల్ మిశ్రమంతో కూడా బాగా పనిచేస్తుంది.

ఏథర్ నుంచి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజురోజుకూ వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో కస్టమర్లు భారీగా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల విభాగంలో పోటీ కూడా గణనీయంగా పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇంట్లో అందరూ కలిసి తిరగడానికి బెస్ట్ కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్యతరగతి కుటుంబాల అవసరాలను, వారి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసే కంపెనీలకు ఆదరణ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రవేశపెట్టిన మల్టీ పర్పస్ వెహికల్ (MPV) నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) మార్కెట్లో సరికొత్త సంచలనంగా మారింది.
Advertisement

2026 తొలి 6 నెలల్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తా చాటింది. దేశీయ మార్కెట్లో సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతోందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, డిజైర్ మాత్రం అమ్మకాల పరంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన తొలి ఆరు నెలల అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మారుతి సుజుకి డిజైర్ మొత్తం 1,26,204 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే గత ఆరు నెలల వ్యవధిలోనే 1.26 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు ఈ సెడాన్‌ను కొనుగోలు చేశారు. ఈ గణాంకాలు డిజైర్‌పై భారతీయ వినియోగదారులు ఇప్పటికీ ఎంతటి నమ్మకం ఉంచుతున్నారో తెలియజేస్తున్నాయి.

చుక్క పెట్రోల్ అవసరం లేదు.. సింగిల్ ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) మార్కెట్లోకి సరికొత్త ప్లేయర్ సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రికార్డులు తిరగరాస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ మొబిలిటీ (River Mobility) మార్కెట్లో ఉన్న దిగ్గజ బ్రాండ్లు టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj), ఓలా (Ola) వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ కంపెనీ మార్కెట్లో కేవలం ఒకే ఒక్క మోడల్ రివర్ ఇండి (River Indie) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అమ్ముతోంది. అయినప్పటికీ, దీని సేల్స్ గ్రాఫ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఈ స్కూటర్ ఏకంగా 43,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసింది. జూన్ 2026 నెలలో ఈ కంపెనీ 4,436 యూనిట్ల సేల్స్‌తో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. దేశంలోని మొత్తం 175 ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలలో రివర్ మొబిలిటీ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి (Q1 2026) త్రైమాసికంలో 8వ స్థానంలో ఉన్న ఈ స్టార్టప్.. ఏప్రిల్, మే, జూన్ (Q2 2026) నాటికి ఏడో స్థానానికి ఎగబాకింది.

బొమ్మ కారుని చూసి చిన్నపిల్లాడిలా మురిసిపోయిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన రాజకీయ ప్రసంగం లేదా సినిమా కారణంగా కాదు, ఒక చిన్న టాయ్ కార్ వల్ల నెట్టింట వైరల్ అవుతున్నారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ఆసియా కార్యకలాపాల సీఈఓ ఫామ్ సాన్ చౌ ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కంపెనీకి చెందిన ఒక చిన్న కారు మోడల్ (బొమ్మ కారు)ను జ్ఞాపికగా బహుమతిగా అందజేశారు. సాధారణంగా ఇలాంటి బహుమతులను స్వీకరించి పక్కన పెట్టే నాయకులను మనం చూస్తుంటాం. కానీ విజయ్ మాత్రం ఆ టాయ్ కార్‌ను చేతిలోకి తీసుకుని ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.

3,00,000 కుటుంబాలు కోరుకున్న పెద్ద కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) ఒక భారీ మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ కారు కియా కారెన్స్ (Kia Carens) దేశీయంగా 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును విజయవంతంగా దాటేసింది. 2022 లో మొదటిసారిగా భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, చాలా తక్కువ కాలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది.
Advertisement

కొత్త మారుతి బ్రెజ్జా బుకింగ్స్ స్టార్ట్.. మరో 10 రోజుల్లో గ్రాండ్ లాంచ్!

సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో కొత్త అవతారంలో రాబోతోంది. చాలా కాలంగా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. అప్‌డేట్ చేసిన కొత్త బ్రెజ్జాను ఈ జూలైలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మారుతి సుజుకి, లాంచ్‌కు ముందే ఈ SUV కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొత్త బ్రెజ్జాను ముందుగానే సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పటి నుంచే తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బ్రెజ్జా కోసం బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.