అదిరిపోయే లుక్స్‎తో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఎలక్ట్రిక్ కార్లు

భారతదేశపు ఈవీ (EV) మార్కెట్లో టాటా మోటార్స్(Tata Motors) తిరుగులేని నంబర్-1 పొజిషన్‌లో దూసుకుపోతోంది. మార్కెట్లో తన పట్టును మరింత గట్టిగా ఉంచుకోవడానికి కంపెనీ సరికొత్త ప్లాన్‌తో సిద్ధమైంది. రాబోయే రోజుల్లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి టాటా కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 500 నుంచి 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే 4 అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి లైన్లో పెట్టింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఫోర్ వీలర్స్ వివరాలు మరియు వాటి ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.

క్రెటా కంటే రూ.లక్ష తక్కువకే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ

భారతీయ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) టాప్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త కారు ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) కారుకు నేరుగా సవాల్ విసురుతోంది. మీరు కూడా త్వరలోనే ఒక మంచి ఫ్యామిలీ ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫీచర్లు, ధర, రేంజ్ పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

30 కిమీ మైలేజ్, 500 కిమీ రేంజ్4 SUVలతో రెనాల్ట్-నిస్సాన్ ఎంట్రీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తమ పట్టును మరింత బలపరుచుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) జంట ఒక భారీ గేమ్‌ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఇండియాలో నాలుగు సరికొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) కార్లను లాంచ్ చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. 2031 నాటికి ఏకంగా 16 కొత్త SUVలు!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) భారీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు కంపెనీ ఒక మెగా ప్రొడక్ట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. 2031 నాటికి ఏకంగా 16 కొత్త SUVలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక మహీంద్రా భవిష్యత్తుపై ఎంత పెద్ద ఆశలు పెట్టుకుందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ కొత్త వాహనాల్లో సంప్రదాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. మొత్తం 16 మోడళ్లలో 10 అంతర్గత దహన ఇంజిన్ (ICE) ఆధారిత పెట్రోల్, డీజిల్ SUVలు ఉండగా, మరో 6 పూర్తిగా ఎలక్ట్రిక్ SUVలు ఉండనున్నాయి.
Advertisement

రూ.6 లక్షల లోపు SUV కొనాలనుకునేవారి ఫేవరెట్ ఇదే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVల సెగ్మెంట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా 4 మీటర్ల లోపు పొడవు కలిగిన SUVలు స్టైలిష్ డిజైన్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అందుబాటు ధరల కారణంగా మధ్యతరగతి వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ విభాగంలో అనేక మోడళ్లు పోటీపడుతున్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) తన ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన ధరతో మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించింది. భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మాగ్నైట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రీమియం లుక్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరల కలయిక ఈ SUV విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఒక లెజెండ్ తిరిగి వస్తోంది.. కొత్త తరం పజెరోపై భారీ అంచనాలు!

ఒకప్పుడు SUV ప్రియుల కలల వాహనంగా గుర్తింపు పొందిన మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero) మళ్లీ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ఐకానిక్ SUVను తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది. దీంతో పజెరో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. కొత్త తరం పజెరో 2026లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. పజెరో పేరు SUV ప్రపంచంలో ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. దశాబ్దాల పాటు ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు, బలమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరుతో ఈ వాహనం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

రోజూ 50-100 కి.మీ తిరిగేవారికి బెస్ట్ ఆప్షన్! ఈ స్కూటర్‌కు భారీ డిమాండ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లకు మాత్రమే పరిమితమైన వినియోగదారులు, ఇప్పుడు పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునిక సాంకేతికత కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నారు. ఈ మార్పును సద్వినియోగం చేసుకుంటూ బజాజ్ చేతక్ దేశీయ ఈవీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మోడళ్లలో ఒకటిగా ఎదిగింది. ప్రత్యేకంగా సంప్రదాయ బజాజ్ బ్రాండ్‌పై వినియోగదారుల్లో ఉన్న విశ్వాసం, చేతక్‌కు పెద్ద బలంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకుంటోంది.

14 లక్షల మంది నమ్మిన వ్యాన్.. మారుతి ఈకో క్రేజ్ ఇంకా తగ్గలేదు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా భారతీయ కుటుంబాలు, చిన్న వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, వాణిజ్య వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ వాహనం, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. 2010లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈకో, కాలానుగుణంగా కొన్ని మార్పులు, అప్‌డేట్‌లతో ముందుకు సాగుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈకో విజయానికి ప్రధాన కారణం దాని సరళమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, విశ్వసనీయ పనితీరు.
Advertisement

కొత్త హోండా సిటీపై ఫుల్ రివ్యూ: ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త డిజైన్, ఫీచర్లు, పనితీరు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Explore the 2026 Honda City Facelift. Sharper styling, advanced features, hybrid options. Full review on performance, interiors, and India pricing.

ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ కారు అమ్మకాలు పెరిగాయి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తి, భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ప్రారంభంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలను నమోదు చేయలేకపోయింది. ప్రత్యేకంగా ఆఫ్‌రోడింగ్ విభాగంలో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించుకున్న మహీంద్రా థార్ వంటి మోడళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో జిమ్నీ విక్రయాలు కొంతకాలం మందగించాయి. అయితే, తన ప్రత్యేకమైన డిజైన్, నిజమైన 4x4 సామర్థ్యాలు, అలాగే మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ SUV క్రమంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్ నెల జిమ్నీకి ఎంతో సానుకూల ఫలితాలను తీసుకొచ్చింది.

7గురు ఒకేసారి హ్యాపీగా జర్నీ చేసే 5 అదిరిపోయే కార్లు ఇవే

సెలవులు వచ్చాయంటే చాలు.. భార్యాపిల్లలు, అమ్మానాన్నలతో కలిసి హ్యాపీగా ట్రిప్స్ వేయడంలో ఉండే మజాయే వేరు. ఒక మంచి ఫ్యామిలీ కారు అంటే కేవలం సీట్లు ఉండటం కాదు.. ప్రయాణంలో పెద్దలు, పిల్లలకు అలసట లేకుండా లగ్జరీగా కూర్చునేలా ఉండాలి. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నప్పటికీ.. దేశీయ కుటుంబాల అవసరాలను తీరుస్తూ అమ్మకాల్లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న 5 మోస్ట్ పాపులర్ 7-సీటర్ కార్ల (Best 7 Seater Cars) వివరాలను, వాటి మైలేజ్, ధరల గురించి తెలుసుకుందాం.

బ్యాటరీ లేకుండానే టాటా టియాగో EV కొనొచ్చు

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు మరోసారి సంచలన నిర్ణయంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో పంచ్ EVను అందించి మార్కెట్‌లో భారీ చర్చకు దారితీసిన ఈ సంస్థ, ఇప్పుడు టియాగో EV ధర విషయంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. దీంతో "ఎలక్ట్రిక్ కారు కొనడం అంటే చాలా ఖర్చు" అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త దూరంగానే అనిపించేవి. కానీ ఇప్పుడు టాటా తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో పరిస్థితి పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ప్రారంభించిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ కార్యక్రమం ద్వారా, వినియోగదారులు బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించే విధంగా కారును తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు.
Advertisement

భారత‌లో టెస్లా కారు హల్‌చల్.. 500KM రేంజ్‌‌తో మోడల్ వై ప్రీమియం ఎంట్రీ

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త దిశ చూపించిన సంస్థగా టెస్లా (Tesla) పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా గుర్తింపు పొందింది. ఇలాంటి బ్రాండ్ భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించడం సహజంగానే భారీ ఆసక్తిని రేకెత్తించింది. టెస్లా ఎంట్రీని ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా కూడా భావించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్లా గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే మొదటగా పరిచయం చేసిన మోడల్ వైపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కొన్ని మార్కెట్ పరిస్థితులు, స్థానిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

జస్ట్ రూ.4.69 లక్షలకే టాటా సరికొత్త సంచలనం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు నమ్మకమైన బ్రాండ్ టాటా మోటార్స్(Tata Motors). సేఫ్టీ, మైలేజ్ విషయంలో తిరుగులేని రికార్డు సృష్టించిన టాటా.. తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్ టాటా టియాగో(Tata Tiago 2026)ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్లోకి దించింది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి మునుపెన్నడూ లేని రేంజ్‌లో అగ్రెసివ్ ప్రైస్‌తో ఈ కారును లాంచ్ చేసింది.

ఈ స్కూటర్‌లో ఫీచర్లు చూస్తే కార్లను గుర్తు చేస్తాయి

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ గురించి మాట్లాడితే, స్కూటర్లకు ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాల కోసం స్కూటర్లు ఇప్పుడు లక్షలాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించగలగడం, తక్కువ నిర్వహణ ఖర్చులు, కుటుంబ వినియోగానికి అనువుగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన తయారీ సంస్థలు కూడా వరుసగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

ఇక ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్..మార్కెట్లోకి టయొటా ఫస్ట్ ఈవీ కార్

భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న ఒక పెద్ద సంచలనానికి తెరపడింది. ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా (Toyota Urban Cruiser eBella) ను అసలు ఇండియాలో లాంచ్ చేయడం లేదని, బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు చెక్కర్లు కొట్టాయి.
Advertisement

బైక్ లాగా మైలేజ్, రూ. 6.85 లక్షల! మిడిల్ క్లాస్‌కు బెస్ట్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత ఇప్పుడు స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, ఆధునిక టెక్నాలజీ కలిగిన కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ విభాగంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ మార్కెట్లో దూసుకుపోతోంది. ప్రీమియం లుక్, SUV స్టైల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి ఈ కారును కొనుగోలుదారుల ఫస్ట్ ఛాయిస్‌గా మారుస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ పోటీలో ఫ్రాంక్స్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడమే కాకుండా, అమ్మకాల పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది.

జూన్ 3న రోడ్లపైకి రాబోతున్న సరికొత్త అద్భుతం..!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సగటు సామాన్యుడు బైక్ తీయాలంటేనే జంకుతున్నాడు. ఇలాంటి తరుణంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) వాహనదారులకు ఒక మైండ్ బ్లోయింగ్ తియ్యటి కబురు అందించింది. పెట్రోల్ ఖర్చులను సగానికి సగం తగ్గించేలా.. సరికొత్త సాంకేతికతతో కూడిన దేశంలోనే మొట్టమొదటి విప్లవాత్మక మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే వారం అంటే జూన్ 3వ తేదీన ఈ సరికొత్త వాహనం భారత రోడ్లపై అధికారికంగా ల్యాండ్ కాబోతోంది.

కుటుంబం మొత్తం ఒక్క కారులో.. ఒకేసారి 9 మంది వెళ్లొచ్చు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని వాహనాలు కాలానికి అనుగుణంగా మారుతూ కొత్త రూపాల్లో వస్తుంటాయి. కానీ మరికొన్ని వాహనాలు మాత్రం ఎలాంటి ట్రెండ్ వచ్చినా తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోకుండా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి SUVలలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఈ SUVకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ డిజైన్, గట్టి బాడీ, ఎలాంటి రోడ్లపైనా నడిచే సామర్థ్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాలతో బొలెరో ఇప్పటికీ అనేక కుటుంబాల మొదటి ఎంపికగా కొనసాగుతోంది. కాలం మారుతున్నా, మార్కెట్లోకి ఎన్నో ఆధునిక SUVలు వస్తున్నా, బొలెరోకు ఉన్న డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు తాజా అమ్మకాల గణాంకాలే నిదర్శనం.

టాటా మోటార్స్ ఈవీ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు

దేశంలో సామాన్యుడిపై ఇంధన ధరల భారం రోజురోజుకు పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు సెంచరీ దాటి పరిగెత్తుతుండడంతో మధ్యతరగతి వాహనదారుల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఈ క్రమంలోనే కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల (హ్యాచ్‌బ్యాక్, ఎంట్రీ లెవెల్) విభాగంలో పెట్రోల్ వేరియంట్లను కాదని, జనం అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఈవీ కార్ల బుకింగ్స్ ఏకంగా రెండున్నర (2.5) రెట్లు పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మార్కెట్ ట్రెండ్స్ గురించి కీలక విషయాలు పంచుకున్నారు. గత 15 రోజుల్లోనే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారతీయ కార్ల మార్కెట్లో ఈవీల వాటా 5.5 శాతంగా ఉంది.
Advertisement

మధ్యతరగతి వాళ్ల బడ్జెట్లో మార్కెట్లోకి రాబోతున్న 4 పవర్ ఫుల్ కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొంతకాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. కస్టమర్లు తమ బడ్జెట్‌ను కాస్త పెంచుకుని మరీ ఎస్‌యూవీ కార్ల వైపు మొగ్గు చూపుతుండటంతో, ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే, హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు నడుం బిగించాయి.

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు

గత కొన్నేళ్లుగా CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, సాధారణ వినియోగదారులు తక్కువ ఖర్చుతో నడిచే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో CNG కార్లు మంచి ఎంపికగా మారాయి. ఇటీవల CNG ధరలు కూడా కొంత పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఉండటంతో వినియోగదారులు CNG వైపే ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు CNG కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మారుతి CNG మోడళ్లలో కొన్ని కార్లు దాదాపు లీటర్‌కు సమానంగా 30 నుండి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తున్నాయి. ఈ కథణంలో మారుతి ఈకో, ఎస్ ప్రెస్సో, ఆల్టో కె10 సీఎన్‌జీ కార్ల గురించి చూద్దాం.

Royal Enfield కొత్త బుల్లెట్ బైక్ లాంచ్

భారత మోటార్‌సైకిల్ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పేర్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు తన పురాతన మరియు ఐకానిక్ బుల్లెట్ శ్రేణిలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ 650 (Bullet 650) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. క్లాసిక్ బుల్లెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆధునిక 650cc ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ కొత్త బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ధరను కంపెనీ రూ. 3.65 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బుల్లెట్ శ్రేణిలో ఇది అత్యంత శక్తివంతమైన, ప్రీమియం మోడల్‌గా నిలుస్తోంది. సంప్రదాయ బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక ఇంజిన్ టెక్నాలజీ, మెరుగైన రైడింగ్ అనుభవాన్ని కలిపి ఈ బైక్‌ను రూపొందించారు.

రూ. 1,400 కోట్ల సామ్రాజ్యం.. కానీ తిరిగేది మాత్రం డొక్కు కారులోనే

Karnataka CM : కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. తీవ్ర రాజకీయ ఉత్కంఠ మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement

కేవలం రూ.4.69 లక్షలకే టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్(Tata Motors) మరోసారి తన బలాన్ని చూపించింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన, చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో EV అప్‌డేట్ వెర్షన్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ పరంగా గణనీయమైన మార్పులు చేసి, మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. కొత్త టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ 2026 ప్రారంభ ధర రూ.6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. మరింత అందుబాటు ధరలో EV అందించాలనే ఉద్దేశంతో, టాటా మోటార్స్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద టియాగో EV ధర మరింత తగ్గి కేవలం రూ.4.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది.