భారీగా పెరుగుతున్న వాహనాల ధరలు

తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం పెద్ద షాక్‌లా మారింది. ఇప్పటికే పెరుగుతున్న వాహన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, ఇంధన వ్యయం మధ్య ఇప్పుడు మరో అదనపు భారం చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై "రోడ్ సేఫ్టీ సెస్" పేరుతో అదనపు పన్ను విధించేందుకు సిద్ధమైంది. రవాణా శాఖ అధికారికంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఈ రోడ్డు భద్రతా సెస్ మార్చి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే ఆ తేదీ తర్వాత నమోదు చేసుకునే ప్రతి కొత్త వాహనంపై ఈ అదనపు పన్ను వర్తిస్తుంది. ఫలితంగా, కార్లు, బైక్‌లు, SUVలు సహా అన్ని కొత్త వాహనాల ఆన్-రోడ్ ధరలు పెరగనున్నాయి.

దేశంలోనే జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే

ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్త మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara) ఎలక్ట్రిక్ SUV మంచి చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తీసుకున్న ఈ పెద్ద అడుగు కంపెనీకి మాత్రమే కాకుండా, మొత్తం మార్కెట్‌కే ఒక కొత్త దిశను చూపిస్తోంది. ఆధునిక డిజైన్, హైటెక్ ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ కలిపి ఈ ఇ-విటారాపై వినియోగదారుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా సరసమైన ధర శ్రేణిలో ఎలక్ట్రిక్ SUV అందుబాటులోకి రావడం చాలా మందికి ఆకర్షణీయంగా మారింది. అయితే, ఈ డిమాండ్ కారణంగా ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది.

ఇప్పుడు స్కూటర్ కొంటే నక్కతోక తొక్కినట్లే!

జపాన్ దిగ్గజ సంస్థ సుజుకి (Suzuki) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో బలమైన అడుగు వేయడానికి తీసుకొచ్చిన కొత్త సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) ఇప్పటికే వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. జనవరి 9న అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, లాంచ్ అయిన వెంటనే మంచి స్పందన అందుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ చూస్తే, మార్కెట్‌లో దీనికి ఉన్న క్రేజ్ ఎంత అన్నది స్పష్టమవుతోంది. ప్రారంభించిన మొదటి నెలలోనే 201 యూనిట్లు కస్టమర్లకు డెలివరీ చేయబడటం చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్న ఈ సమయంలో, కొత్తగా వచ్చిన మోడల్‌కు ఇంత త్వరగా ఆమోదం రావడం విశేషమే.

ఈ స్కూటర్ మీద లీటరు పెట్రోల్‎తో 59కిమీ పోవచ్చు

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ అంటే కేవలం వాహనాల క్రయవిక్రయాలు మాత్రమే కాదు, అది కోట్ల మంది మధ్యతరగతి ప్రజల భావోద్వేగం. ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో స్కూటర్ అనేది ఇంటి సభ్యుడితో సమానం. కిరాణా సరుకులు మోయాలన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకురావాలన్నా, లేదా ఉదయాన్నే పిల్లలను స్కూల్లో దింపాలన్నా అందరికీ టక్కున గుర్తొచ్చేది గేర్‌లెస్ స్కూటర్లే.
Advertisement

ఎలక్ట్రిక్+పెట్రోల్ పవర్‌తో నడిచే JSW మోటార్స్ తొలి కారు

JSW Groupతో విలీనం తర్వాత MG Motor Indiaలో ఎలక్ట్రిక్ కార్ల హవా మరింత పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తున్న MG ఈవీలు వినియోగదారుల దృష్టిని బలంగా ఆకర్షించాయి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్న ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలోనే JSW గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే, JSW మోటార్స్ అనే ప్రత్యేక ఆటోమొబైల్ కంపెనీని స్థాపిస్తున్నట్టు ప్రకటించడం. భారతదేశ ప్రయాణీకుల వాహన విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న JSW Motors తన ఎంట్రీని చాలా స్టైలిష్‌గా ప్రకటించింది.

సుజుకి యాక్సెస్ స్కూటర్‌కు భారీ డిమాండ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి (Suzuki) భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజీ ఈ మూడు అంశాలు సుజుకి వాహనాలను భారతీయ వినియోగదారులలో ప్రాచుర్యం పొందేలా చేశాయి. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో అయితే, కంపెనీ స్థానం మరింత బలంగా ఉంది. ఆ విభాగంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125). నగర ప్రయాణాలకు అనుకూలమైన డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్, మంచి మైలేజీ, స్మూత్ రైడింగ్ అనుభవం కారణంగా ఈ స్కూటర్ ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది.

కోట్లు పోసి కొన్న టయోటా కారుకు షాక్

ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరుగాంచిన టయోటా (Toyota) కంపెనీకి చెందిన ఒక లగ్జరీ ఎస్‌యూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన పటిష్టమైన నిర్మాణం, మొండితనంతో ఆఫ్-రోడింగ్ కింగ్ అని పిలవబడేటయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Land Cruiser 300) వాహనాలను కంపెనీ వెనక్కి పిలిపిస్తోంది (Recall). కోట్ల రూపాయలు పోసి కొన్న ఈ కారులో టెక్నికల్ లోపం తలెత్తడం ఇప్పుడు వాహన రంగంలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

షోరూమ్‌లలో సందడి చేస్తున్న రూ. 5.65 లక్షల కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో 7 సీటర్ కారును అందించడం చిన్న విషయం కాదు. అయితే అదే సవాల్‌ను స్వీకరించి ముందుకొచ్చింది నిస్సాన్ (Nissan). తాజాగా ఈ కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త మోడల్ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 7 సీటర్ కార్లు అంటే ఎక్కువ ధర, భారీ ఖర్చు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ గ్రావైట్ ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. సరసమైన ధరలో పెద్ద కుటుంబాలకు సరిపోయే స్పేస్‌ను అందిస్తూ, రెండు కుటుంబాలు కూడా సౌకర్యంగా కూర్చుని ప్రయాణించగల విధంగా ఈ కారును డిజైన్ చేశారు.
Advertisement

జేబులో రూపాయి లేకున్నా కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు

టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్‌లకి గట్టి పోటీ ఇస్తున్న నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ప్రస్తుతం కొనుగోలుదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లతో ముందుకు వచ్చింది. సొంత కారు కలను సాకారం చేసుకోవాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా తన ఫైనాన్స్ భాగస్వామి NRFSI (నిస్సాన్ రెనో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా) ద్వారా అదిరిపోయే స్కీమ్‌లను ప్రకటించింది. కేవలం తక్కువ వడ్డీకే కాకుండా, జేబులో ఒక్క రూపాయి లేకపోయినా కారును ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సరికొత్తగా ముస్తాబైన బైక్

భారతదేశంలో ప్రీమియం స్ట్రీట్ బైక్ సెగ్మెంట్‌లో యువత హృదయాలను గెలుచుకున్న బ్రాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది KTM. స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్, శక్తివంతమైన పనితీరు ఈ మూడు లక్షణాల కలయికే KTM బైక్‌ల ప్రత్యేకత. భారత మార్కెట్లో ఈ బ్రాండ్‌ను మరింత బలంగా నిలబెట్టింది బజాజ్ (Bajaj Auto)తో ఉన్న భాగస్వామ్యం. ఆ భాగస్వామ్యంతోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించిన మోడళ్లలో ఒకటి కెటీఎం 250 డ్యూక్ (KTM 250 Duke). 250cc నేకెడ్-స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో డ్యూక్ 250 ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నగర రోడ్లపై అగ్రెసివ్ లుక్‌తో మెరిసే ఈ బైక్, పనితీరులోనూ అదే దూకుడు చూపిస్తుంది. అందుకే KTM ఈ మోడల్‌ను తరచుగా అప్‌డేట్ చేస్తూ, యువ రైడర్ల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది.

మధ్యతరగతి మనసు దోచుకుంటున్న రిజ్తా

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఇప్పుడు ఈవీలే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. ఈ రేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2026 ప్రారంభంలో ఈ స్కూటర్ అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు సగటున 650 స్కూటర్లు అమ్ముడవుతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏథర్ ఎనర్జీ తాజాగా విడుదల చేసిన 2026 జనవరి విక్రయాల గణాంకాలు ఈవీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 20,155 యూనిట్ల రిజ్తా స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. గతేడాది అంటే 2025 జనవరిలో ఇదే స్కూటర్ కేవలం 11,978 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఏడాది కాలంలోనే అమ్మకాల్లో 68.27 శాతం భారీ వృద్ధి నమోదైంది. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఉండటం వల్లే రిజ్తాఇంతటి విజయాన్ని సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏథర్ రిజ్తా ఇంతటి సంచలనం సృష్టించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రస్తుతం ఇది రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తోంది. ఇందులో రిజ్తా ఎస్ (Rizta S), రిజ్తా జెడ్ (Rizta Z) అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది మరింత విశాలంగా ఉండటమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు (Maintenance Cost) కూడా చాలా తక్కువ. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ స్కూటర్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారు ముందుగా చూసేది రేంజ్. రిజ్తా ఇందులో ఎక్కడా తగ్గదు. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 123 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఏకంగా 160 కిలోమీటర్ల (IDC) మౌలేజీని అందిస్తుంది. ఇందులో వాడిన ఎలక్ట్రిక్ మోటార్ 4.3 kW పవర్, 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఏథర్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు. రిజ్తాలో 7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది, ఇది నావిగేషన్ నుంచి కాల్ అలర్ట్స్ వరకు అన్నీ చూపిస్తుంది. ఇందులో స్మార్ట్ (Smart), ఈకో (Eco), జిప్ (Zip) అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉండటం వల్ల హెల్మెట్ లేదా ఇతర సామాగ్రిని సులభంగా ఉంచుకోవచ్చు. డెక్కన్ గ్రే, సియాచిన్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. సేఫ్టీ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు రైడర్ కు మంచి కంఫర్ట్ ను ఇస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ రిజ్లాకు ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), బజాజ్ చేతక్ (Bajaj Chetak), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి స్కూటర్లు గట్టి పోటీనిస్తున్నాయి. అయినప్పటికీ, ఏథర్ అందించే బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని రేసులో ముందు ఉంచుతోంది. తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్ కావాలనుకునే వారికి ఇప్పుడు రిజ్లానే బెస్ట్ ఆప్షన్ గా మారింది.

ఆఫీస్ వెళ్లే వారికి బెస్ట్ బడ్జెట్ కార్లు

హైదరాబాద్, బెంగళూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల కోసం ఒక సొంత కారు ఇప్పుడు అవసరంగా మారింది. ఉదయం ట్రాఫిక్ హడావిడి, సాయంత్రం రద్దీ, అనూహ్యంగా పడే వర్షాలు, మండే ఎండ ఇలాంటి పరిస్థితుల్లో టూవీలర్ వాహనంతో ప్రయాణించడం కష్టసాధ్యం. అలాంటి సమయంలో ఒక చిన్న, నమ్మకమైన, ఇంధన పొదుపు కలిగిన కారు రోజువారీ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చగలదు. మీరు డైలీ యూజ్ కోసం కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌కు సరిపోయే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మోడల్స్‌ను ఎంపిక చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా పంచ్, మారుతి సుజుకి సెలెరియో కార్లు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ కార్ల గురించి ఈ కింది కథనంలో చూద్దాం.
Advertisement

పేదవాడి కడుపు నింపే బైక్ ఇదే

మధ్యతరగతి భారతీయులకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక పొదుపు మార్గం కూడా. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని కోరుకునే సామాన్యులకు ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తోంది. అదే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి దిగ్గజ బైక్‌ల కంటే దాదాపు 10 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తూ, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఈ బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలో ఈ బైక్ సాధించిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఆటోమొబైల్ దిగ్గజాలే విస్తుపోతున్నాయి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కేవలం ధరలో మాత్రమే కాదు, అమ్మకాల్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా వెలువడిన 2026 జనవరి సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 71,690 బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025 జనవరి) తో పోలిస్తే ఇది 15.21 శాతం వృద్ధి. అంటే గతేడాది కంటే సుమారు 9,467 బైక్‌లు అదనంగా విక్రయించబడ్డాయి. ఈ ఘనతతో 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌ల జాబితాలో హెచ్ఎఫ్ డీలక్స్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ తర్వాత స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

రాబోయే చైనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మరోవైపు వినియోగదారులను ఈవీ (EV)ల వైపు నడిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విభాగంలో దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి.

మరోసారి ఛాన్స్! డిమాండ్ కారణంగా మళ్లీ విడుదల!

అంతర్జాతీయంగా లగ్జరీ ఆఫ్-రోడ్ వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ జీప్ (Jeep) మరోసారి తన ఐకానిక్ మోడల్‌తో భారత మార్కెట్‌లో సందడి చేసింది. అడ్వెంచర్‌ను ఇష్టపడే కార్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్‌ (Jeep Wrangler Willys 41 Limited Edition)ను కంపెనీ మళ్లీ విడుదల చేసింది. ఇది సాధారణ ఎడిషన్ కాదు, చరిత్రను గుర్తు చేసే ఒక ప్రత్యేక అవతారం. 2025లో మొదటిసారి లాంచ్ చేసినప్పుడు, ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. పరిమిత యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచగా, అవన్నీ కూడా విడుదలైన 7 రోజుల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి.

ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సియెర్రా EV

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్ (Tata Motors), పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే EV సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన టాటా, ఇప్పుడు మరో ఐకానిక్ పేరును తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). సమాచారం ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కొత్త సియెర్రా EV అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముంది. అంటే 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Advertisement

ఈ స్కూటర్‎ను జనవరిలో 19 వేల మంది కొన్నారు

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండే స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) తన రేజెడ్‎ఆర్(RayZR) హైబ్రిడ్ స్కూటర్‌తో భారత విపణిలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 స్కూటర్ల జాబితా బయటకు రాగా, యమహా రేజెడ్‎ఆర్ తనదైన శైలిలో దూసుకుపోయి పదో స్థానాన్ని కైవసం చేసుకుంది. యువతను ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన మైలేజీ, లేటెస్ట్ ఫీచర్ల కలయికే ఈ స్కూటర్ విజయానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

లీటర్‌కు 90 కి.మీ మైలేజ్ బైక్

భారతదేశంలో మైలేజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి బజాజ్ ప్లాటినా (Bajaj Platina). నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతీ ఇంటికి సుపరిచితమైన ఈ కమ్యూటర్ బైక్ చాలా కాలంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వడం, మెరుగైన ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం వంటి లక్షణాలు ప్లాటినాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. 2026 జనవరిలో ఈ బైక్ మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపించింది. ఒక్క నెలలోనే 33,520 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ కావడం చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక అమ్మకాల సంఖ్య కాదు, వినియోగదారుల విశ్వాసానికి ప్రతీక.

రూ.10 లక్షల్లో టాప్ 5 టర్బో కార్లు ఇవే

సాధారణంగా కారు అనగానే ప్రతి ఒక్కరూ మైలేజ్ గురించి ఆలోచిస్తారు. కానీ కొంచెం స్పీడ్, అదిరిపోయే పికప్ కోరుకునే కుర్రాళ్లకు మాత్రం టర్బో పెట్రోల్(Turbo Petrol) ఇంజన్లే అసలైన కిక్కునిస్తాయి. తక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ సాధారణ ఇంజన్ల కంటే ఎక్కువ పవర్, వేగం అందించడం వీటి స్పెషాలిటీనే వేరు. గతంలో టర్బో ఇంజన్ కార్లు అంటే చాలా ఖరీదైనవి అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం రూ.10 లక్షల బడ్జెట్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే టర్బో కార్లు ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మైలేజ్, పవర్ కలబోసిన టాప్-5 టర్బో కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue Turbo)హ్యుందాయ్ వెన్యూ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అత్యంత పాపులారిటీ పొందిన మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తక్కువ ధరలోనే బెస్ట్ పవర్ ఆశించే వారికి ఇది ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. టెక్నికల్ పరంగా చూస్తే, ఇందులో 1.0 లీటర్ కాప్పా టర్బో GDi ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 120 hp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోడ్లపై అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇలా కూడా కారు ఉంటుందా?

భారత ఆటోమొబైల్ రంగంలో ఇటీవలి కాలంలో వేగంగా వినిపిస్తున్న పేరు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group). ఇప్పటికే ఎంజీ మోటార్ (MG Motor)తో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మంచి ప్రస్థానం సాగిస్తున్న ఈ గ్రూప్, ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కేవలం భాగస్వామ్యాలకే పరిమితం కాకుండా, భారతదేశంలో స్వతంత్ర ప్రయాణీకుల మొబిలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి JSW సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇది భవిష్యత్ EV మార్కెట్‌పై వారి గంభీర దృష్టిని చూపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Chery తో కూడా భాగస్వామ్యాన్ని ప్రకటించడం కీలక మలుపు. ఈ రెండు బ్రాండ్లు కలిసి భారత మార్కెట్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించాయి.
Advertisement

ఈ కారు అంటేనే జంకుతున్న జనం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఒకప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ఈ విభాగంలో రారాజుగా వెలుగొందేది. ఎండీవర్ నిష్క్రమణ తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసేందుకు, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ గ్లోస్టర్‎ను ఎంతో ఆశతో ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు గ్లోస్టర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎంజీ గ్లోస్టర్ ప్రస్థానం ముగియనుంది. గత రెండు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడంతో, ఈ మోడల్‌ను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.

ప్రతిరోజూ 1,200 ఇదే స్కూటర్‌ను కొంటున్నారు

భారత ఎలక్ట్రిక్ రెండు చక్రాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీకి చెందిన టీవీఎస్ ఐక్యూబ్ (iQube) స్కూటర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులు పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో పాటు, పర్యావరణ హిత వాహనాలపై ఆసక్తి పెరగడం కూడా ఐక్యూబ్ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. 2026 జనవరి నెలలో iQube విక్రయాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయి. ఒక్క నెలలోనే మొత్తం 37,560 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం ఈ స్కూటర్‌పై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

రూ.100తో 450 కిమీ ప్రయాణం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తూ టాటా మోటార్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాటా పంచ్ ఇవి (Tata Punch EV) ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మరిన్ని హంగులతో సిద్ధమైంది. కేవలం 100 రూపాయల ఖర్చుతోనే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా చెన్నై నుంచి మదురై వరకు ప్రయాణించే అద్భుతమైన అవకాశం ఈ కారుతో సాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం చిన్నవి, నలుగురు మాత్రమే కూర్చునేలా ఉంటాయనే అభిప్రాయం జనాల్లో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెద్ద ఫ్యామిలీల కోసం, లగ్జరీ ప్రయాణం కోరుకునే వారి కోసం మార్కెట్లోకి అద్భుతమైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సత్తా ఉన్న ఈ కార్లు, పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. 2026 ప్రారంభం నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు, వాటి ధరలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
Advertisement

షోరూమ్ లో ఈ కార్లను చూస్తే భయపడుతున్న జనం

భారతదేశ ఆటోమొబైల్ రంగం 2025లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. టాప్-10 కార్ల అమ్మకాలు సగటున 1.9 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి. అయితే నాణేనికి మరో వైపు ఉన్నట్లుగా.. కొన్ని కార్లు కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కొన్ని మోడళ్లను కొనడానికి జనం ఎంతగా వెనుకాడుతున్నారంటే, ఏడాది మొత్తం మీద వాటి అమ్మకాలు రెండంకెల సంఖ్యను కూడా దాటలేదు. ముఖ్యంగా ఒక కారునైతే దేశం మొత్తం మీద కేవలం ఐదుగురు మాత్రమే కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2025 సేల్స్ చార్ట్‌లో అత్యంత దిగువన నిలిచిన ఆ మూడు కార్ల కథాకమీమామిషు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.