ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలంటోది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రాజీ పడని వాహనాలను అందిస్తూ, మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరి మనసు గెలుచుకుంటోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే, టాటా కార్లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

ఇది కారు కాదు రోడ్ల మీద తిరిగే ప్రైవేట్ థియేటర్

భారతదేశపు రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల సందడి కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేస్తూ, విలాసానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలా XEV 9e సినీలక్స్ ఎడిషన్ (CineLux Edition)ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టెస్లా సైబర్‌ట్రక్‌ను తలపించేలా అత్యంత ఆధునికమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్, సాధారణంగా లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే హై-ఎండ్ ఫీచర్లతో రూపొందిన ఈ కారు ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక ఎడిషన్ విశేషాలను పరిశీలిస్తే, ఇది కేవలం రవాణా సాధనంగానే కాకుండా ఒక కదిలే విలాసవంతమైన గృహంలా అనిపిస్తుంది.

చిన్న కారుతో జనాల మనసు దోచుకోనున్న టాటా

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకున్న మోడల్ టాటా టియాగో ఈవీ (Tata Tiago.ev). సరసమైన ధర, సిటీ డ్రైవింగ్‌కు తగ్గ రేంజ్‌తో దూసుకుపోతున్న ఈ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ ఈ పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ జరుగుతుండగా తీసిన స్పై చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కవర్‌తో ఉన్నప్పటికీ, ఈ కారులో రాబోయే విప్లవాత్మక మార్పులు ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నాయి. స్పై చిత్రాల ప్రకారం.. 2026 టాటా టియాగో ఈవీ డిజైన్ పరంగా భారీ మార్పులకు లోనవుతోంది. దీనికి సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ (LED Headlamps) అమర్చారు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న రిఫ్లెక్టర్ల స్థానంలో పవర్‌ఫుల్ ప్రొజెక్టర్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, హెడ్‌లైట్ల పైన అమర్చిన స్లిమ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ (LED DRLs) కారుకు ఒక అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

మార్కెట్లోకి మహీంద్రా 5 బ్రహ్మస్త్రాలు

భారతీయ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా పేరు వింటేనే ఒక తెలియని క్రేజ్ కనిపిస్తోంది. రఫ్ అండ్ టఫ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్లకు పెట్టింది పేరు మహీంద్రా. ఇప్పటికే XUV 7XO, XUV 3XO వంటి మోడళ్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఈ దేశీ దిగ్గజం, రాబోయే కాలంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. ఎస్‌యూవీ లవర్స్‌కు కన్నుల పండుగ చేసేలా వచ్చే ఏడాది కాలంలో 5 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ కార్లన్నీ టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఆ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

కారు కంటే ఎక్కువ వారంటీ ఎలక్ట్రిక్ స్కూటర్లివే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఒక ఈవీ స్కూటర్ కొనాలని షోరూమ్‌కు వెళ్లినప్పుడు మనం కేవలం దాని లుక్స్, స్పీడ్, రేంజ్ మాత్రమే చూస్తాం. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది బ్యాటరీ వారంటీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరలో దాదాపు 40 నుంచి 50 శాతం ఖర్చు కేవలం బ్యాటరీ ప్యాక్‌కే అవుతుంది. ఒకవేళ వారంటీ లేని సమయంలో బ్యాటరీ పాడైతే, కొత్తది కొనడం అంటే దాదాపు సగం కారు లేదా కారు ధర చెల్లించినట్లే అవుతుంది. అందుకే ఇప్పుడు కంపెనీలు కస్టమర్ల భయాలను పోగొట్టేందుకు ఏకంగా 8 ఏళ్ల వరకు వారంటీని ప్రకటిస్తున్నాయి. ఓలా నుంచి ఎథర్ వరకు ఏయే కంపెనీలు ఎంత వారంటీ ఇస్తున్నాయో ఈ ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అందరి ఫేవరెట్ కారు రూ.5.99 లక్షలకే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కారు ఉంటే, అది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)నే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టైల్, పనితీరు, సౌకర్యం ఈ మూడు అంశాలను సమతుల్యంగా కలిపిన మోడల్‌గా బాలెనో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారు మొదట 1999లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి ఇది ఒక ఆధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లతో వచ్చిన హ్యాచ్‌బ్యాక్‌గా మంచి గుర్తింపు పొందింది. కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ వచ్చింది. ఫలితంగా నేటికీ బాలెనో యువత నుండి కుటుంబాల వరకు అందరికీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. దీని గురించిన వివరాలను ఈ కథణంలో చూద్దాం.

తక్కువ ధరలో కియా కొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అలాగే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కలిసి EVలకు డిమాండ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పును గమనించిన ప్రముఖ బ్రాండ్లు కూడా వేగంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటీవలే Toyota, Maruti Suzuki భారత మార్కెట్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి EV రేసులో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు Kia కూడా మరింత ఆగ్రెసివ్‌గా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కియా వద్ద ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి. అందులో Kia EV6, Kia Carens Clavis EV, Kia EV9 వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్‌కు చెందినవే.

ఇంత మంచి బైకుకు తగ్గిన ఆదరణ

భారతదేశంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp)కు చెందిన హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ (Hero Super Splendor XTEC) బైక్ ఇప్పటికే లక్షలాది మంది రైడర్ల మనసు గెలుచుకుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే పనితీరు, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో ఈ మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కుటుంబ అవసరాల కోసం నమ్మకమైన బైక్ కోరుకునే వారికి ఇది మొదటి ఎంపికగా మారింది. జనవరి 2026లో కూడా ఈ బైక్ అమ్మకాలు గణనీయ స్థాయిలోనే నమోదయ్యాయి. ఆ నెలలో మొత్తం 13,217 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం చిన్న విషయం కాదు.
Advertisement

ఈ ఎన్‌ఫీల్డ్ బైక్ క్రేజ్ మామూలుగా లేదు!

భారతదేశంలో క్లాసిక్ బైక్‌లకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బ్రాండ్‌లో అత్యంత అందుబాటు ధరలో లభించే మోడల్‌గా హంటర్ 350 (Hunter 350) నిలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనగానే భారీ లుక్, ఘనమైన ఇంజిన్ సౌండ్, ప్రీమియం ఫీలింగ్ గుర్తుకు వస్తాయి. అయితే ఆ బ్రాండ్ అనుభూతిని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన మోడల్ హంటర్ 350 కావడం దీని ప్రత్యేకత. తక్కువ ధర, యూత్‌ఫుల్ డిజైన్, నగర ప్రయాణాలకు అనువైన కాంపాక్ట్ సైజ్ ఈ మూడు ప్రధాన కారణాల వల్ల హంటర్ 350 ప్రతి నెలా భారత మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు భారీ ఆదరణ కనిపిస్తోంది.

లుక్ మార్చింది.. పవర్ పెంచింది.. టాటా పంచ్ EV కొత్త వెర్షన్ రివ్యూ!

టాటా పంచ్ EV సమీక్షలో దాని 468 కిమీ రేంజ్, రెండు బ్యాటరీ ఎంపికలు మరియు స్మార్ట్ ఫీచర్లను చూడండి. ఈ కాంపాక్ట్ SUV నగర ప్రయాణాలకు ఎందుకు ఉత్తమమో తెలుసుకోండి.

పెట్రోల్ స్కూటర్లకు టెన్షన్ స్టార్ట్!

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)కు చెందిన హీరో విడా (Hero Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు నిజంగానే ఇంటింటికీ పరిచయమైన పేరుగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, పెట్రోల్ ధరల భారంతో పాటు పర్యావరణ హితమైన ప్రయాణానికి మళ్లుతున్న ధోరణి ఇవన్నీ కలిసి హీరో విడా అమ్మకాల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. గత నెల జనవరి 2026లో ఈ స్కూటర్ భారీ స్థాయిలో అమ్ముడై రికార్డు సృష్టించింది. ఒక్క నెలలోనే మొత్తం 13,830 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయడం విశేషం. అదే సమయంలో గత సంవత్సరం జనవరి 2025లో 6,669 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మార్కెట్‎ను షేక్ చేసేందుకు టాటా నయా ప్లాన్

భారతదేశ మధ్యతరగతి ప్రజల కలల కారుగా పేరుగాంచిన టాటా న్యూసెన్స్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును అందించాలనే లక్ష్యంతో వచ్చిన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా నిలిచింది. అయితే, పోటీ పెరుగుతున్న తరుణంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు టాటా మోటార్స్ ఈ కారులో భారీ మార్పులు చేస్తోంది. సరికొత్త లుక్, హైటెక్ ఫీచర్లు, ఊహించని ధరతో టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Facelift) త్వరలోనే భారత రహదారులపై గర్జించనుంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా, బయటకు వస్తున్న లీకులు కార్ల ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Advertisement

చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్న బుల్లెట్

భారతీయ రైడర్ల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బైక్‌లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350). దశాబ్దాలుగా కొనసాగుతున్న తన వారసత్వం, క్లాసిక్ డిజైన్, ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్ కారణంగా ఈ బైక్‌కు భారత మార్కెట్లో అపారమైన అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఇది అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటిగా ఉండటం వల్ల, మధ్యతరగతి వినియోగదారులకు కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ అందుబాటు ధర, బ్రాండ్ నమ్మకం, క్లాసిక్ స్టైల్ కలిసివచ్చి బుల్లెట్ 350 అమ్మకాలను ప్రతి నెలా బలంగా నిలబెడుతున్నాయి. 2026 జనవరి నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.

ఇండియాలో తొలి CNG స్కూటర్ ఇదేనా? జూపిటర్ భారీ ఎంట్రీ!

భారత టూవీలర్ మార్కెట్లో విశేషమైన స్థానం సంపాదించుకున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) ఒకటి. ప్రారంభం నుంచే కుటుంబాల కోసం, రోజువారీ ప్రయాణాల కోసం సరైన ఎంపికగా నిలిచిన ఈ స్కూటర్, సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. నగర రహదారులపై, చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జూపిటర్ కనిపించడం సాధారణమే. దీని సౌకర్యవంతమైన సీటింగ్, సాఫ్ట్ సస్పెన్షన్ సెటప్, విశ్వసనీయమైన పనితీరు కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా మారింది. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన Honda Activa కు జూపిటర్ బలమైన పోటీదారుగా నిలవడం కూడా చిన్న విషయం కాదు.

బడ్జెట్ ధరలో అదిరిపోయే అడ్వెంచర్ బైక్స్ ఇవే

సాధారణ రోడ్లపై బైక్ నడపడం ఒక ఎత్తు అయితే, ఎగుడుదిగుడు రాళ్లు, బురద దారులు, కొండ ప్రాంతాల్లో బైక్ రైడింగ్ చేయడం మరో ఎత్తు. దీనినే మనం ఆఫ్-రోడింగ్ అంటాం. ఇలాంటి సాహసోపేతమైన ప్రయాణాలు చేయాలంటే మామూలు బైకులు సరిపోవు. వాటికి పవర్ ఫుల్ ఇంజిన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన సస్పెన్షన్ ఉండాలి. గతంలో ఇలాంటి అడ్వెంచర్ బైకులు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన ఆఫ్-రోడింగ్ బైకులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మీ సాహస యాత్రల కోసం బెస్ట్ అనిపించే టాప్ 5 అఫోర్డబుల్ ఆఫ్-రోడింగ్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

చరిత్ర సృష్టించబోతున్న మహీంద్రా

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరో భారీ విప్లవానికి తెరలేపింది. తన ప్రతిష్టాత్మక బోర్న్ ఎలక్ట్రిక్ (Born Electric) సిరీస్‌లో భాగంగా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2027లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మోడల్ పేరును కంపెనీ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, ఇది గతంలో ప్రదర్శించిన BE.07 కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ అని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ కారు 2026లోనే రావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లాంచ్ టైమ్‌లైన్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కారు మార్కెట్లోకి వస్తే టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 వంటి అంతర్జాతీయ మోడళ్లకు నిద్రలేకుండా చేయడం ఖాయం.
Advertisement

చిన్న కార్లలో పెద్ద పోటీ.. ఆల్టో K10 vs ఎస్-ప్రెస్సో

భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలల కార్లలో ఎప్పుడూ ముందుంటున్న రెండు ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10), మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso). చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, పెద్ద ప్రయోజనాలను అందించే ఈ కార్లు నగర జీవనశైలికి అచ్చంగా సరిపోతాయి. సులభమైన డ్రైవింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ వంటి లక్షణాలు వీటిని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తాయి. ఈ రెండు కార్లలోనూ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు వినియోగదారులకు అదనపు భరోసాను ఇస్తాయి. ఈ కార్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

ఏప్రిల్ నుంచి పెట్రోల్ బంకుల్లో కొత్త పెట్రోల్

భారతదేశ ఇంధన రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. పర్యావరణాన్ని కాపాడటం, విదేశాల నుంచి కొనే ఆయిల్ ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 95 RON (రీసెర్చ్ ఆక్టేన్ నంబర్) ఉన్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20 ఇంధనం) తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం కలగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.

రెండూ యువత మెచ్చే స్కూటర్లే.. మరి ఏది కొనాలి

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రధాన దిగ్గజాలైన టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో తమ ఉనికి మరింత పటిష్టం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ రెండు కంపెనీలు తమ అత్యంత సరసమైన మోడళ్లను రంగంలోకి దించాయి. టీవీఎస్ నుంచి ఆర్బిటర్ (TVS Orbiter), బజాజ్ నుంచి చేతక్ సీ2501 (Bajaj Chetak C2501) మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది కొనడం లాభదాయకం? ఏది మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మోడీ ఇజ్రాయెల్ టూర్‌లో అట్రాక్షన్‌గా ఎన్‌ఫీల్డ్ బైక్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత బలపరిచే ఈ పర్యటనలో ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సాంకేతిక, రక్షణ, వ్యవసాయం, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే దృఢ సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జెరూసలేం నగరంలో జరిగిన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా పాల్గొన్నారు.
Advertisement

పాతికేళ్లలో 50 లక్షల కుటుంబాలకు చేరువైన యాక్టివా

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో స్కూటర్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హోండా యాక్టివా (Honda Activa). రెండు దశాబ్దాలకు పైగా భారతీయుల ప్రయాణాల్లో అంతర్భాగంగా మారిన ఈ స్కూటర్, ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకుంది. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లలో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో యాక్టివా ఏకంగా 50 లక్షల (5 మిలియన్లు) విక్రయాల మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక రాష్ట్రంలోనే ఒక మోడల్ ఇంత పెద్ద ఎత్తున అమ్ముడవడం యాక్టివా బ్రాండ్ పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకాన్ని చాటిచెబుతోంది. హోండా యాక్టివా ప్రస్థానం నేటిది కాదు. గత 25 ఏళ్లుగా ఈ స్కూటర్ నిరంతరాయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2001లో మొదటిసారిగా మార్కెట్లోకి ప్రవేశించిన యాక్టివా, అప్పటి వరకు ఉన్న గేర్ స్కూటర్ల ట్రెండ్‌ను మార్చేసి గేర్ లెస్ విప్లవాన్ని తీసుకొచ్చింది.

ప్రతిరోజూ 1180 మంది ఇదే స్కూటర్‌ కొంటున్నారు

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో యువత మనసు గెలుచుకున్న స్కూటర్లలో ఒకటిగా నిలిచిన టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq 125) ఇప్పుడు అమ్మకాల పరంగా మరోసారి తన సత్తా చాటింది. స్టైలిష్ డిజైన్, స్పోర్టీ లుక్, స్మార్ట్ ఫీచర్లు కలిసొచ్చి ఈ స్కూటర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. అందుకే రోజురోజుకూ దీనిపై డిమాండ్ పెరుగుతూ వస్తోంది. 2026 జనవరి నెలలో ఈ స్కూటర్ భారీ స్థాయిలో అమ్ముడవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఒక్క నెలలోనే మొత్తం 36,596 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం గమనార్హం. రోజుకు సగటున 1,180 ఎన్‌టార్క్ స్కూటర్లు అమ్ముడవడం అంటే, యువతలో దీనికి ఎంతటి ఆదరణ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ 2026 విజేతలు వీరే

భారత ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంగా పేరుగాంచిన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ (Acer FASTER Awards) 2026 ఐదో ఎడిషన్‌ను గుర్గావ్, ఎన్‌సీఆర్‌లో ఘనంగా నిర్వహించారు. Federation of Auto Scribes of the Electronic Realm (FASTER) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 2025 సంవత్సరంలో భారత ఆటో పరిశ్రమలో ఉత్తమ కార్లు, మోటార్‌సైకిళ్లను గుర్తించారు. ఈ అవార్డులకు ప్రధాన స్పాన్సర్‌గా ఏసర్ ఇండియా వ్యవహరించగా, అదనపు స్పాన్సర్‌గా స్పార్క్ మీడియా లిమిటెడ్ భాగస్వామ్యమైంది. ఈ భాగస్వామ్యంతో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆటోమొబైల్ తయారీ విభాగం మాత్రమే కాకుండా, ఇతర ముఖ్య విభాగాల్లోనూ ప్రతిభ కనబర్చిన మొత్తం 13 మంది విజేతలను సత్కరించారు.

ఈ తేదీ గుర్తుపెట్టుకోండి.. షోరూమ్ ముందు క్యూ కడతారు!

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ (Renault Duster SUV) విప్లవాత్మకమైన రూపంలో ఫ్యాన్స్ ముందు వచ్చింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక లుక్, డజన్ల కొద్దీ ఆవిష్కరణలతో ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రతి SUV ప్రేమికుని ఆకట్టుకునేలా ఉంటుంది. దీని సొగసైన ఎక్స్టీరియర్, డైనమిక్ ప్రొపోర్షన్స్, రోడ్డుపై ప్రత్యేక ప్రెజెన్స్‌తో సరళంగా గుర్తించబడతాయి, అలాగే ఇంటీరియర్‌లో సౌకర్యాలు, టెక్నాలజీ ఫీచర్లు, ప్రీమియం ఫినిషింగ్ కస్టమర్ల అనుభవాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి. రెనాల్ట్ ఇప్పటికే జనవరి 26న ఈ కొత్త SUVని ప్రీ-బుక్ కోసం ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు సమీప షోరూమ్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, రూ. 21,000 అడ్వాన్స్ చెల్లించి ఆర్డర్ చేసుకోవచ్చు.
Advertisement

భారీగా పెరుగుతున్న వాహనాల ధరలు

తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం పెద్ద షాక్‌లా మారింది. ఇప్పటికే పెరుగుతున్న వాహన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, ఇంధన వ్యయం మధ్య ఇప్పుడు మరో అదనపు భారం చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై "రోడ్ సేఫ్టీ సెస్" పేరుతో అదనపు పన్ను విధించేందుకు సిద్ధమైంది. రవాణా శాఖ అధికారికంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఈ రోడ్డు భద్రతా సెస్ మార్చి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే ఆ తేదీ తర్వాత నమోదు చేసుకునే ప్రతి కొత్త వాహనంపై ఈ అదనపు పన్ను వర్తిస్తుంది. ఫలితంగా, కార్లు, బైక్‌లు, SUVలు సహా అన్ని కొత్త వాహనాల ఆన్-రోడ్ ధరలు పెరగనున్నాయి.