మారుతి 800తో లంబోర్గిని తయారు చేసిన మెకానిక్

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ అనే మెకానిక్ తన ప్రతిభతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. సాధారణంగా అందరికీ తెలిసిన చిన్న హ్యాచ్‌బ్యాక్ అయిన మారుతి 800 (Maruti 800) కారును ప్రపంచప్రసిద్ధ లగ్జరీ స్పోర్ట్స్ కారును పోలి ఉండేలా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా కోట్ల రూపాయల ఖరీదు చేసే సూపర్‌కార్‌లలో ఒకటైన లంబోర్గిని (Lamborghini) మాదిరిగా కనిపించేలా ఈ కారును రూపుదిద్దడంతో, అతని సృజనాత్మకతకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశీ లంబోర్గిని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

మోస్ట్ పాపులర్ కారును అతి తక్కువ ధరకే

భారతదేశంలో సామాన్యుల కారు కలలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) ఒకటి. ఒకప్పుడు భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 800 (Maruti 800)కు ప్రత్యామ్నాయంగా ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు, కంపెనీ కూడా ఊహించని స్థాయిలో వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకుంది. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా ఈ కారు చాలా మంది మధ్యతరగతి కుటుంబాల మొదటి కారుగా మారింది. అందుకే భారతీయులు ప్రేమగా ఈ కారును "లార్డ్ ఆల్టో" అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షలకుపైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయని అంచనా. ఈ గణాంకాలే ఈ కారు భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎంత ప్రత్యేక స్థానం సంపాదించుకుందో చూపిస్తున్నాయి.

టీం ఇండియాను వణికించిన 22ఏళ్ల కుర్రాడు- ఎవరీ జాకబ్ బెథెల్, IPL టీం..రేటు..!!

22 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్-రౌండర్ జాకబ్ బెథెల్, అద్భుతమైన T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ తర్వాత ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు, వైట్-బాల్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ యొక్క లోతును సూచిస్తున్నాడు.

మనదేశంలో టాప్..విదేశాల్లో మాత్రం ప్లాప్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. గత కొన్నేళ్లుగా ఈ కారు దేశీయ రహదారులపై రారాజులా ఏలుతోంది. అయితే, తాజాగా వెలువడిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే క్రెటాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ కారు మన దేశంలో ఎంతలా అమ్ముడవుతుందో, విదేశాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇంట్లో ఈ పులి.. బయట మాత్రం పిల్లి అన్నట్లుగా దీని పరిస్థితి తయారైంది. ఫిబ్రవరి 2026లో ఏకంగా 17,938 యూనిట్ల విక్రయాలతో దేశంలో టాప్-10 కార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన క్రెటా, విదేశీ మార్కెట్లలో మాత్రం కేవలం 608 యూనిట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Advertisement

ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!

బిట్‌కాయిన్ మైనింగ్ ఆంక్షల ఎగవేతకు ఎలా మద్దతు ఇస్తుందో, సరిహద్దు చెల్లింపులను మరియు US మరియు అంతర్జాతీయ ఆంక్షల మధ్య నిధుల నెట్‌వర్క్‌లను ఎలా అనుమతిస్తుందో వివరిస్తుంది.

సామాన్యుల కోసం తక్కువ ధరలో చిన్న కార్లు వస్తున్నాయి

భారతదేశంలో చిన్న SUVలు, ముఖ్యంగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVల విభాగం ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటి. కుటుంబ ప్రయాణాలకు సరిపోయే స్థలం, ఆకర్షణీయమైన డిజైన్, అలాగే తక్కువ ధరలో లభించడం వంటి కారణాల వల్ల ఈ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ SUVలు ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా మంచి క్యాబిన్ స్పేస్‌ను అందిస్తాయి. అందుకే చిన్న కుటుంబాల కోసం ఇవి ఉత్తమ ఎంపికగా మారాయి. నగర రహదారులపై సులభంగా నడపడం, పార్కింగ్ చేయడం కూడా వీటి మరో ప్రధాన ప్రయోజనం. ఇదిలా ఉంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో కూడిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVలను పలు కంపెనీలు సామాన్యులు కొనగలిగే ధరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఈ కథణంలో.

UPI:మహిళలే టాప్. గ్రామాల్లో డిజిటల్ విప్లవం!

10,000 మంది మహిళా ఏజెంట్ల సర్వే గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో రోజువారీ అవసరాల కోసం పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని, పెరిగిన పొదుపు అవగాహన మరియు ఇష్టపడే అనుకూలమైన ఖాతాలను చూపుతుంది.

ఇది కారు కాదు రోడ్డుపై వెళ్లే బుల్లెట్ రైలు

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా దిగ్గజం BYD(Build Your Dreams), తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ BYD గ్రేట్ టాంగ్ (Great Tang)తో ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ఆకట్టుకున్న ఈ కారు మార్చి 5, 2026న అధికారికంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన ఇంటీరియర్ ఫోటోలు, ఫీచర్లు చూస్తుంటే, ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై వెళ్లే ఒక విలాసవంతమైన విల్లా అనిపిస్తోంది. ఏకంగా 950 కిలోమీటర్ల రేంజ్, 4 భారీ స్క్రీన్లు, లిడార్ (LiDAR) టెక్నాలజీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ కారు రూపొందింది. BYD గ్రేట్ టాంగ్ లోపలికి అడుగుపెడితే మనకు ఒక ఫ్యూచరిస్టిక్ ప్రపంచం కనిపిస్తుంది. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఇచ్చారు. అంటే మొత్తం ఏడుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. డాష్‌బోర్డ్‌పైనే మూడు భారీ స్క్రీన్‌లు అమర్చారు.

రూ.2.5 లక్షల అడ్వెంచర్ బైక్ రూ.1.49 లక్షలకే

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) మరో కీలక నిర్ణయంతో వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల తన X-47 అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసి మంచి స్పందన పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు వినియోగదారులకు మరింత సులభంగా బైక్ కొనుగోలు చేసేలా బ్యాటరీ ఫ్లెక్స్ (Battery-as-a-Service - BaaS) అనే కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ప్రారంభ ఖర్చు గణనీయంగా తగ్గి, మరింత సరసమైన ధరలో అధునాతన ఎలక్ట్రిక్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది.

నేడే గణేషుడిని కొలిచే బాలచంద్ర సంకష్ట చతుర్థి

బాలచంద్ర సంకష్టి చతుర్థి 2026 యొక్క ప్రాముఖ్యత, సమయాలు మరియు ఆచారాలను కనుగొనండి, ఉపవాసం, గణపతి ఆరాధన, చంద్రభాగ ఆచరణలు మరియు ప్రసాదం సమర్పణలు ఉన్నాయి.

తక్కువ ధరలో టాప్-5 సీవీటీ కార్లు ఇవే

ప్రస్తుత కాలంలో సిటీ రోడ్లపై వాహనం నడపడం అంటే మామూలు విషయం కాదు. విపరీతమైన ట్రాఫిక్, గంటల కొద్దీ నిరీక్షణ.. ఈ క్రమంలో మాన్యువల్ గేర్లు మార్చుతూ, పదే పదే క్లచ్ నొక్కుతూ డ్రైవర్లు విసిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు కార్లు కొనేవారు ఎక్కువగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహిళా డ్రైవర్లు, నగరాల్లో నివసించే వారు క్లచ్ లేని ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఆటోమాటిక్ కార్లలో ఏఎంటీ (AMT), డీసీటీ (DCT), సీవీటీ (CVT) అని రకరకాలు ఉంటాయి. వీటిలో ప్రయాణం చాలా స్మూత్‌గా సాగడానికి, ల్యాగ్ లేకుండా ఉండటానికి సీవీటీ(Continuously Variable Transmission) టెక్నాలజీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ సీవీటీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

కూలిపోయిన సుఖోయ్ యుద్ధ విమానం..??

జోర్హాట్, అస్సాం సమీపంలో చివరిసారిగా సంప్రదించిన తర్వాత ఒక సుఖోయ్ Su-30MKI విమానం అదృశ్యమైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. తక్షణ గాలింపు మరియు రక్షణ చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు విచారణలు కొనసాగుతున్నాయి.
Advertisement

డయాబెటిస్ కంట్రోల్ చేసే ఈ పండ్లు తినండి!

టైప్ 2 మధుమేహం కోసం ఆచరణాత్మక పండ్ల ఎంపికలను అన్వేషించండి, అవసరం లేని పరిమితులు లేకుండా స్థిరమైన రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఫైబర్, భాగం పరిమాణం మరియు సమయంపై దృష్టి పెట్టండి.

అగాధంలో 'డార్క్ ఆక్సిజన్'.. సముద్ర గర్భంలో 4,000 మీటర్ల కింద !!

క్లారియన్-క్లిప్పర్‌టన్ జోన్‌లో పాలీమెటాలిక్ గుళికలు చీకటి ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తాయి మరియు లోతైన సముద్ర రసాయన శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి త్రవ్వకాలు మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన చిక్కులను అన్వేషిస్తుంది.

గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్

ఆటోమొబైల్ ప్రపంచంలో భారతీయ కంపెనీల జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో జపాన్, యూరప్ దిగ్గజాలకు మన దేశీ బ్రాండ్లు గట్టి పోటీనిస్తూ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇప్పుడు ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ల విక్రయాల్లో జపాన్ దిగ్గజం యమహా (Yamaha)ను అధిగమించి, గ్లోబల్ సేల్స్‌లో టీవీఎస్ మూడవ స్థానానికి చేరుకోవడం ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

MG కంపెనీకి భారీ ఊపు.. ఫిబ్రవరిలో 24% సేల్స్ జంప్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అనేక అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్లు భారత మార్కెట్లోకి తమ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి ముందుకొస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తున్న కంపెనీలలో ఒకటి ఎంజీ (MG Motor). ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. మొదట ఇంధనంతో నడిచే కార్లను పరిచయం చేసినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టుతోంది.

యుద్ధ నౌకపై హెచ్చరిక లేకుండా అమెరికా చర్య.. మూల్యం చెల్లించక తప్పదన్న ఇరాన్!

ఉమ్మడి ఇరాన్-ఇజ్రాయెల్ దాడి తర్వాత గల్ఫ్ ఉద్రిక్తతలు పెరిగాయి, US ప్రతిస్పందనలు మరియు నావికాదళ సంఘటనలతో, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయమనం పాటించాలని కోరాయి మరియు ప్రాంతీయ భద్రత ఆందోళన కలిగిస్తోంది.

ఫిబ్రవరిలో 5 లక్షలకుపైగా డెలివరీలు!

హోండా మోటార్ సైకిల్ ఇండియా భారత టూవీలర్ వాహన మార్కెట్‌లో తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఈ కంపెనీ, 2026 ఫిబ్రవరిలో అద్భుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. వినియోగదారుల విశ్వాసం, విశ్వసనీయమైన ఇంజిన్ పనితీ, మంచి మైలేజ్ వంటి అంశాలు హోండా వాహనాలకు నిరంతర డిమాండ్ తీసుకొస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో హోండా మొత్తం 5,67,351 యూనిట్ల ద్విచక్ర వాహనాలను డెలివరీ చేయగా, గత సంవత్సరం ఇదే కాలంలో 4,22,449 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చితే సంవత్సర ప్రాతిపదికన (YoY) సుమారు 34 శాతం వృద్ధి నమోదైంది.

కారు లోపల సీట్లు తిరుగుతాయి

టాటా మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టాటా సియెర్రా రీ-ఎంట్రీతో మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ దేశీ దిగ్గజం, ఇప్పుడు మరింత విలాసవంతమైన, అత్యంత శక్తివంతమైన అవిన్యా (Avinya) అనే లగ్జరీ బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది. 2027లో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ బ్రాండ్ గురించి కంపెనీ ఇటీవలే కీలక వివరాలను వెల్లడించింది. టయోటాకు లెక్సస్, హ్యుందాయ్‌కు జెనెసిస్ ఎలాగో.. టాటా మోటార్స్‌కు అవిన్యా అలా ఒక ప్రీమియం గుర్తింపును తీసుకురాబోతోంది.

రోజూ చపాతీలు తింటున్నారా - ఈ జాగ్రత్తలు అవసరం, లేదంటే..!!

పిండి రకం, కొవ్వు వాడకం మరియు పరిమాణం బరువు తగ్గడం మరియు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో అంచనా వేయండి. ఆరోగ్యకరమైన ఎంపికల కోసం ఆచరణాత్మక చిట్కాలతో రోటీ మరియు నాన్ మధ్య ఎంచుకోండి.
Advertisement

Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!!

భారతదేశం ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ఆధిపత్య బ్యాటింగ్ లైనప్ మరియు పటిష్టమైన బౌలింగ్ దాడులతో వస్తోంది, అయితే ఇంగ్లాండ్ స్థిరత్వం లేని ఫామ్ మరియు వ్యూహాత్మక సవాళ్ల మధ్య పెరుగుతున్న ప్రశ్నలను ఎదుర్కొంటోంది.

డస్టర్ తమ్ముడు డిఫెండర్ లుక్‌లో వస్తున్నాడు

భారతదేశంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చిన కార్లలో డస్టర్ (Duster) ఒకటి. ఈ SUV భారత మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా మంచి డిమాండ్‌ను పొందుతూ, కుటుంబాలకు అనువైన బలమైన వాహనంగా పేరు సంపాదించింది. తాజాగా ఈ డస్టర్‌ను కంపెనీ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి మళ్లీ పరిచయం చేసింది. ఈ కొత్త లుక్‌తో వచ్చిన డస్టర్ ఆటో ప్రియులలో మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉండగా, రెనాల్ట్ ఇప్పుడు భారత మార్కెట్ కోసం మరో కొత్త SUVపై పని చేస్తోంది. డస్టర్‌ను పోలిన డిజైన్‌తో, అయితే దానికంటే పెద్దదిగా ఉండే ఈ కొత్త వాహనం 7 మంది కూర్చునేలా రూపొందించబడుతోంది.

కాలేజీ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బైక్స్ ఇవే

కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు బైక్ అంటే కేవలం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే సాధనం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్. అయితే స్టైల్‌తో పాటు జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే తక్కువ మెయింటెనెన్స్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బైక్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, లీటరుకు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే ఆ కిక్కే వేరు.

ఈ ఏడాదిలో టాటా నుంచి 3 కార్లు!

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో, టాటా మోటార్స్ (Tata Motors) ఈ మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ముందుకు సాగుతోంది. సస్టైనబుల్ మొబిలిటీ వైపు దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం టాటా మోటార్స్‌కు ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ ఏడాదిలో కంపెనీ పలు కీలక ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా టియాగో ఈవీ (Tata Tiago EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, అలాగే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియోర్రా ఈవీ (Tata Sierra EV), భవిష్యత్తు టెక్నాలజీని ప్రతిబింబించే అవిన్య ఈవీ (Tata Avinya EV) వంటి మోడళ్లు ఉండనున్నాయి. వీటి గురించి ఈ కథణంలో తెలుసుకుందాం.

"బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్‌" రెడీ చేస్తున్న అమెరికా.. ఇరాన్ పని ఖతమేనా ?

B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ లాంగ్-రేంజ్ బాంబర్, దాని నిరంతర సేవ, సంఘర్షణలలో వ్యూహాత్మక ఉపయోగం మరియు ఆధునిక వైమానిక శక్తిని రూపొందించే అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలను అన్వేషించండి.