ప్రతి జనరేషన్‌లో ఈ కారంటే పిచ్చి

భారతీయ SUV మార్కెట్లో పవర్, ప్రెస్టీజ్, ప్రెజెన్స్ పరంగా గుర్తింపు పొందిన పేరు అంటే మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio). ప్రారంభం నుంచే ఈ SUV ఒక సాధారణ వాహనం కాదు; ఇది ఓ స్టేటస్ సింబల్‌గా మారింది. పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ సమానంగా ఆదరణ పొందుతూ ఇంటింటికీ సుపరిచితమైన బ్రాండ్‌గా ఎదిగింది. ఇటీవలి కాలంలో SUVలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో స్కార్పియో డిమాండ్ మరింత పెరిగింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ మోడల్‌కు 14,665 యూనిట్ల డెలివరీలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 13,618 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు స్పష్టంగా పెరిగాయి. గణాంకాల ప్రకారం సంవత్సరానికి (YoY) 7.69% వృద్ధి నమోదు కావడం స్కార్పియోకు ఉన్న మార్కెట్ బలాన్ని సూచిస్తోంది.

విన్ ఫాస్ట్ స్కెచ్‎కు హ్యుందాయ్ బేజారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల EV) హవా నడుస్తోంది. ఈ రేసులో ఎప్పటి నుంచో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీలకు షాక్ ఇస్తూ ఒక కొత్త కంపెనీ దూసుకుపోతోంది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతేడాది 2025 పండుగ సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ, కేవలం నాలుగు ఐదు నెలల్లోనే తన ఉనికిని బలంగా చాటుకుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, విన్ ఫాస్ట్ ఏకంగా హ్యుందాయ్, బీవైడీ (BYD) వంటి గ్లోబల్ జెయింట్స్‌ను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇండియాలో బెస్ట్ 7 సీటర్ ఇదే!

దేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి (Maruti Suzuki). బడ్జెట్ ధరలు, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఈ మూడు కారణాల వల్లే మారుతి కార్లు భారతీయ కుటుంబాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. చిన్న కార్ల విభాగం నుంచి SUVలు, MPVల వరకు ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ కంపెనీ, అమ్మకాల పరంగా ఎప్పటికప్పుడు నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ప్రత్యేకంగా పెద్ద కుటుంబాలకు అనువైన 7-సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎర్టిగా (Ertiga) మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేసింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు మొత్తం 17,807 యూనిట్లు అమ్ముడవడం విశేషం. అంటే రోజుకు సగటున 635 కార్లు షోరూమ్‌ల నుంచి బయటకు వెళ్లాయి.

ఇక బండి కొనక్కర్లేదు..అద్దెకు తెచ్చుకోవచ్చు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న సుజుకి (Suzuki), తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఈ-యాక్సెస్ (Suzuki eAccess) తో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ స్కూటర్ ధర దాదాపు రూ.1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండటంతో, అందరూ దీనిని కొనడం కష్టమని భావించిన సుజుకి.. కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు సొంతం చేసుకోనవసరం లేదు, కేవలం రెంటల్ (అద్దె) లేదా సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో వాడుకోవచ్చు. ఇందుకోసం సుజుకి సంస్థ ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్ (Royal Brothers) తో జతకట్టింది.
Advertisement

వైట్ కార్ పై హోలీ రంగులు పడ్డాయా?

రంగుల పండుగ హోలీ వచ్చిందంటే చాలు.. ఆ సంతోషం అంబరాన్ని తాకుతుంది. అయితే, హోలీ సంబరాల తర్వాత కారు యజమానులకు, ముఖ్యంగా తెల్లటి కారు (White Car) ఉన్నవారికి అసలైన తలనొప్పి మొదలవుతుంది. హోలీలో వాడే సింథటిక్ రంగులు, రంగు నీళ్లు కారు బాడీపై పడితే, అవి పెయింట్‌లోకి ఇంకిపోయి మొండి మరకలుగా మారుతాయి. ముఖ్యంగా తెల్లటి కారుపై చిన్న మరక పడ్డా అది స్పష్టంగా కనిపిస్తూ కారు అందాన్ని పాడు చేస్తుంది. ఈ సమస్య నుంచి మీ కారును ఎలా కాపాడుకోవాలి? పెయింట్ పాడవకుండా రంగులను ఎలా వదిలించాలో ఈ కథనంలో చూద్దాం.

దేశంలోని సగం మంది ఈ స్కూటర్లనే కొంటున్నారు

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఒకప్పుడు ఈ రంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇప్పుడు ఊహించని దెబ్బ తగిలింది. ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే, వినియోగదారులు సరికొత్త స్టార్టప్‌ల కంటే పాత, నమ్మదగ్గ బ్రాండ్‌లకే పట్టం కడుతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) వంటి దిగ్గజ కంపెనీలు కలిసి దేశంలోని సగానికి పైగా మార్కెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా టాప్-5 జాబితా నుంచి కూడా బయటకు రావడం ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక్కకారు, 10 ఏళ్ల ప్రయాణం.. 14 లక్షల మందిని పలకరించింది!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు కొత్త దిశను చూపించిన మోడల్‌గా మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ప్రత్యేక స్థానం సంపాదించింది. "కాంపాక్ట్ SUV" అనే పదానికి వాస్తవ అర్థాన్ని ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. నగర రోడ్లకు సరిపోయే సైజ్, SUV లుక్, మంచి మైలేజ్, సరసమైన ధర ఈ అన్ని లక్షణాలను ఒకే ప్యాకేజ్‌లో అందించడం ద్వారా బ్రెజ్జా మధ్యతరగతి కుటుంబాల హృదయాలను గెలుచుకుంది. మార్చి 2016లో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మోడల్, తక్కువ సమయంలోనే భారీ ఆదరణను సంపాదించింది. ప్రారంభం నుంచే మంచి స్పందన రావడంతో అమ్మకాల పరంగా స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది.

3 కార్లతోనే నెట్టుకొస్తున్న కంపెనీ!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన స్థిరమైన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు నమ్మకమైన ఇంజిన్ పనితీరు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం వల్ల మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు మాత్రం తీవ్రమైన పోటీ మధ్య తన ప్రాభవాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తోంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హోండా సిటి (Honda City), హోండా అమేజ్ (Honda Amaze) వంటి మోడళ్లను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ కార్లు తమ విభాగంలో మంచి నాణ్యత, విశ్వసనీయతకు పేరుగాంచినప్పటికీ, విస్తృతమైన SUV లైనప్ లేకపోవడం మరియు వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు హోండా అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి.
Advertisement

బడ్జెట్ లో స్పోర్ట్స్ బైక్ కావాలా?

బైక్ కొనాలనే ప్లాన్ ఉందా? అయితే అది కేవలం ఆఫీసుకో, కాలేజీకో వెళ్లడానికే కాకుండా.. నడిపినంత సేపు మంచి కిక్కు ఇచ్చేలా ఉండాలని కోరుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో రకరకాల మోడల్స్ వచ్చి పడ్డాయి. కానీ బడ్జెట్ రూ.1.50 లక్షల లోపే ఉండి, అదే సమయంలో స్పోర్టీ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే బైకులు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. అటు మైలేజీ, ఇటు స్టైల్ రెండూ మేళవించిన టాప్ 5 బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశంలో రతన్ టాటాకు ఉన్నంత ఆదరణ పొందిన కారు

భారత కార్ల మార్కెట్‌లో మైక్రో SUV సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మోడల్‌గా టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు బలమైన స్థానం సంపాదించింది. కాంపాక్ట్ సైజ్, బలమైన నిర్మాణం, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సరసమైన ధర కలిపి ఈ కారును మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్‌గా మార్చాయి. రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోవడంతో పాటు, గ్రామీణ రోడ్లపై కూడా సౌకర్యవంతంగా నడిచే సామర్థ్యం ఉండటం పంచ్‌కు ప్రత్యేక ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. 2026 జనవరి నెలలో పంచ్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఆ ఒక్క నెలలోనే మొత్తం 18,748 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం గమనార్హం.

కార్ లాంచ్ అయ్యిందో లేదో భారీగా సేల్స్

Nissan : భారత ఆటోమొబైల్ రంగంలో జపాన్ దిగ్గజం నిస్సాన్ (Nissan) మళ్ళీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గత కొన్నాళ్లుగా నిలకడగా ఉన్న అమ్మకాలు, కొత్త మోడల్ నిస్సాన్ గ్రావిటే(Nissan Gravite) ఎంట్రీతో ఒక్కసారిగా రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. ఫిబ్రవరి 2026 నెల నిస్సాన్ సంస్థకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేసి, ప్రత్యర్థి కంపెనీలకు నిస్సాన్ గట్టి సవాల్ విసిరింది. కొత్త కారు లాంచ్ అయిన వెంటనే కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కట్టడం ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

RX 100ని గుర్తుకు తెస్తూ మార్కెట్లోకి కొత్త బైక్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా తన ఇంజిన్ పనితీరు, డిజైన్ ఫిలాసఫీ, రేసింగ్ వారసత్వంతో ప్రత్యేక గుర్తింపు పొందిన యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) తాజాగా భారత మార్కెట్‌లో మరోసారి యువత దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఆధునిక రెట్రో శైలిలో విడుదలైన యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR155) కు ఇప్పుడు మరింత స్టైల్ జోడిస్తూ 'మెటాలిక్ బ్లాక్' ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1,58,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. గత సంవత్సరం నవంబర్‌లో ప్రారంభమైన XSR155 తక్కువ సమయంలోనే రైడర్ల నుంచి మంచి స్పందన పొందింది. యమహా డిజైన్ తత్వం ప్రకారం, పాతకాలపు క్లాసిక్ లుక్‌ను ఆధునిక టెక్నాలజీతో కలిపి రూపొందించిన ఈ బైక్ యువతతో పాటు రెట్రో స్టైల్‌ను ఇష్టపడే రైడర్లను ఆకట్టుకుంది.
Advertisement

ఓలా పాత కస్టమర్లకు పండగే

Ola Electric : భారతదేశపు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో షేరు ధర పతనం, మరోవైపు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో కంపెనీ ఇమేజ్ కాస్త డీలా పడింది. ఈ నేపథ్యంలో, తన పాత కస్టమర్లను బుజ్జగించడానికి, కొత్త అమ్మకాలను పెంచుకోవడానికి ఓలా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ఓలా ఇన్సైడర్స్ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్. పది లక్షల మందికి పైగా ఉన్న తన పాత కస్టమర్ల కోసం ఏకంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను ప్రకటిస్తూ ఓలా మళ్ళీ రేసులోకి రావాలని చూస్తోంది.

భారత కార్ల మార్కెట్‌లో దుమ్మురేపిన నెక్సాన్, డిజైర్, పంచ్!

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న, అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో మధ్యతరగతి వృద్ధి, పెరుగుతున్న నగరీకరణ, సులభమైన ఫైనాన్స్ సదుపాయాలు, అలాగే విభిన్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న మోడళ్ల వల్ల కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రతి నెలా విడుదలయ్యే సేల్స్ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు; అవి వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ ట్రెండ్స్, బ్రాండ్ల మధ్య ఉన్న తీవ్ర పోటీని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన టాప్ 10 కార్ల జాబితా విడుదల కావడం ఆటో రంగంలో ఆసక్తికర చర్చలకు దారితీసింది. వాటి గురించి కింది కథణంలో చూద్దాం.

ఎలక్ట్రిక్ నుంచి బైక్‌ల వరకు టీవీఎస్ దూకుడు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థల్లో ఒకటైన టీవీఎస్ (TVS Motor Company) మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ముందుకొచ్చింది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తన స్థాయిని మరింత బలోపేతం చేస్తూ, ఫిబ్రవరి 2026లో గణనీయమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఆ ఒక్క నెలలోనే కంపెనీ మొత్తం 5,29,308 యూనిట్ల టూవీలర్, త్రీవీలర్ వాహనాలను విజయవంతంగా విక్రయించింది. ఇందులో దేశీయంగా అమ్ముడైన వాహనాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే ఫిబ్రవరి 2025లో కంపెనీ 4,03,976 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈసారి నమోదు చేసిన సంఖ్యతో పోలిస్తే అమ్మకాలు సంవత్సరానికి 31 శాతం పెరగడం విశేషం.

ఇది కారా లేక లగ్జరీ సోఫానా!

రోడ్ల మీద తిరిగే ఒక రాజప్రసాదం.. అడుగుపెడితే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న అనుభూతి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, అత్యంత నిశ్శబ్దంగా, విలాసవంతంగా సాగిపోయే ప్రయాణం.. ఇవన్నీ వినడానికి ఏదో హాలీవుడ్ సినిమాలో కార్లలా అనిపిస్తున్నాయా? కానీ, నిజంగానే ఇలాంటి ఒక చక్రాల మీద నడిచే విలాస నౌకను మెర్సిడిస్-బెంజ్ సంస్థ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, తన పాపులర్ ఎంబీవీ (MPV) మోడల్ వి-క్లాస్(V-Class) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నేడు (మార్చి 2, 2026) అధికారికంగా లాంచ్ చేసింది. కోట్లాది రూపాయల ఖరీదు చేసే ఈ కారు, కేవలం వాహనం మాత్రమే కాదు, ఒక హోదాకు నిదర్శనం.
Advertisement

200 కి.మీ రేంజ్‌తో రోడ్లపైకి రప్తీ T30 EV.. తొలి డెలివరీలు స్టార్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవి కలిసి EVలపై వినియోగదారుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్టప్ బ్రాండ్లు మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ విప్లవంలో భాగమవుతూ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులకు ఎన్నో కొత్త, ఆధునిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులో భాగంగా చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ రప్తి హెచ్‌వీ (Raptee.HV) కూడా ముందడుగు వేసింది.

అందరికీ ఆ సౌండ్ బాగా నచ్చింది

భారత రోడ్ల మీద గంభీరమైన శబ్దంతో దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతల కాలం నాటి బుల్లెట్ నుంచి నేటి తరం హంటర్ 350 వరకు ఈ బ్రాండ్ తన విలక్షణతను చాటుకుంటూనే ఉంది. తాజాగా ఫిబ్రవరి 2026 నెలలో ఈ స్వదేశీ దిగ్గజం అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గడిచిన నెలలో ఏకంగా ఒక లక్షకు పైగా బైక్‌లను విక్రయించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం వెనుక ఉన్న కారణాలు, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, బైక్ రైడర్స్ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

కియా కార్లను కొనడానికి ఎగబడిన ప్రజలు

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ (Kia Motors) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆశ్చర్యకరమైన వేగంతో ఎదుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే దేశంలోని స్థిరపడిన వాహన తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ, ఫీచర్లతో నిండిన మోడళ్ల ద్వారా భారతీయ వినియోగదారుల మనసును గెలుచుకుంది. ప్రస్తుతం కియా ఇండియా (Kia India)కి చెందిన కార్లు దేశంలోని చిన్న పట్టణాల నుంచి మహానగరాల వరకు ప్రతి ఊరిలో కనిపిస్తున్నాయి. ఇది బ్రాండ్‌కు వచ్చిన ఆదరణ ఎంత విస్తృతంగా ఉందో చూపిస్తోంది. ప్రారంభం నుంచే వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, సరైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించడం కంపెనీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

అతి తక్కువలో బెస్ట్ 7 సీటర్

ఫ్యామిలీతో కలిసి చేసే ప్రతి ప్రయాణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సెలవులు, పండుగలు, పెళ్లిళ్లు లేదా వీకెండ్ ట్రిప్స్ ఏ సందర్భమైనా అందరూ ఒకే వాహనంలో కూర్చొని వెళ్లడం అనేది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. అందుకే భారతీయ మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. పెద్ద కుటుంబాలు ఉన్న దేశంగా భారత్‌లో ఒకే కారులో అందరూ కలిసి ప్రయాణించగలిగే సౌకర్యం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ అవసరాలకు సరిపోయేలా విస్తృతమైన స్థలం, మంచి మైలేజ్, అందుబాటు ధర కలిగిన ఎంపీవీ మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
Advertisement

దేశంలోనే నంబర్ వన్ కారు

భారతీయ రోడ్ల మీద ఎన్నో కార్లు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం జనాల గుండెల్లో గట్టిగా పాగా వేస్తాయి. అలాంటి కార్ల జాబితా తీస్తే మొదటి వరుసలో ఉండే పేరు మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire). ఒకప్పుడు సెడాన్ కార్లు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, ఆ ముద్రను చెరిపేసి సామాన్యుడికి కూడా సెడాన్ కారును అందుబాటులోకి తెచ్చిన ఘనత డిజైర్‌దే. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే, ఎస్‌యూవీల (SUV) జోరు నడుస్తున్న ఈ కాలంలో కూడా డిజైర్ తన పట్టును ఏమాత్రం కోల్పోలేదని అర్థమవుతోంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 19,326 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సెడాన్ కారుగా రికార్డు సృష్టించింది.

కారు, బైక్ ఉందా? మీ కోసమే ఈ ఆర్టికల్

భారతదేశం అంటే పండుగల పర్వదినాల దేశం. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పండుగను ఘనంగా, ఆనందంగా జరుపుకోవడం భారతీయుల ప్రత్యేకత. అలాంటి ప్రధాన పండుగల్లో ఒకటి హోలీ (Holi). రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలో చిన్నా పెద్దా, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొంటారు. వీధులు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు అన్నిచోట్లా నవ్వులు, రంగులు, సంబరాల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ ఆనంద వేడుకల మధ్య వాహనాదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. రంగుల పండుగలో కార్లు, బైకులు కూడా రంగుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువగా ఇష్టపడేకారు

సగటు మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల తర్వాత అత్యంత ముఖ్యమైనది సొంత కారు కొనుక్కోవడం. అయితే ప్రస్తుత కాలంలో కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో బడ్జెట్ ధరలో లభిస్తూ, అదిరిపోయే మైలేజీని ఇచ్చే కార్ల కోసం జనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసిన మారుతి సుజుకి తన ఐకానిక్ మోడల్ మరూతి వ్యాగన్ఆర్‎తో మార్కెట్‌ను ఏలుతోంది. ఫిబ్రవరి 2026 నెలలో వెలువడిన సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే, వ్యాగన్ఆర్ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన సెడాన్లు, స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌లు ఎన్ని ఉన్నా.. సగటు మధ్యతరగతి వాడి ఫేవరెట్ మాత్రం ఎప్పుడూ వ్యాగన్ఆరేనని మరోసారి నిరూపితమైంది.

ఇండియాలో నెం.1 కారు ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు వస్తున్నా, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందంజలో నిలుస్తున్న SUVల్లో ఒకటి టాటా నెక్సాన్ (Tata Nexon). ఈ కారు కేవలం ఒక సాధారణ SUV మాత్రమే కాదు, నమ్మకానికి మరో పేరు అన్నట్టుగా మారింది. అందుకే దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. 2026 ఫిబ్రవరిలో ఈ SUV అద్భుతమైన అమ్మకాలతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఒక్క నెలలోనే మొత్తం 19,430 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం చిన్న విషయం కాదు. అంతకుముందు జనవరి నెలలో కూడా ఇదే జోష్ కొనసాగింది. అప్పట్లో దాదాపు 23,365 యూనిట్లు అమ్ముడై మార్కెట్‌లో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
Advertisement

7-సీటర్ కార్ల కోసం షోరూంల ముందు జనం క్యూ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. క్వాలిటీ, కంఫర్ట్, ఇంజన్ లైఫ్ విషయంలో టోయోటాకు సాటి మరెవరూ లేరని కార్ లవర్స్ నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఇప్పుడు విక్రయాల రూపంలో కనిపిస్తోంది. ఫిబ్రవరి 2026 నెల టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) పాలిట ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ ఏకంగా 34,034 యూనిట్ల మొత్తం అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 2025లో నమోదైన 28,414 యూనిట్లతో పోలిస్తే, ఈసారి కంపెనీ దాదాపు 20 శాతం వృద్ధిని సాధించి మార్కెట్లో తన పట్టును మరింత బిగించింది.