కంపెనీ ఇచ్చే డిస్కౌంట్‎తో ఇంకో స్కూటర్ కొనేయొచ్చు

కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వాహనదారులకు జూన్ నెల అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారతీయ మార్కెట్లో తన కార్ల అమ్మకాలను పెంచేందుకు సరికొత్త ఆఫర్ల జాతరను ప్రకటించింది. ఈ జూన్ నెలలో కంపెనీ తన పాపులర్ కార్లపై గరిష్టంగా రూ.80,000 వరకు భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో నేరుగా లభించే క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్‌లు కూడా ఉన్నాయి. కంపెనీకి చెందిన బడ్జెట్ కార్లయిన కైగర్, ట్రైబర్, క్విడ్ మోడల్స్‌పై ఈ బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఇష్టమైన చిన్న కారు రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) పై ఈ నెలలో మొత్తం రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, అలాగే రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయి. వీటితో పాటు అదనంగా రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

వచ్చిన కొద్ది కాలంలోనే సంచలనం.. 5 లక్షల అమ్మకాలు దాటిన ఫ్రాంక్స్!

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. దేశంలోని అత్యంత పోటీ ఉన్న సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV సెగ్మెంట్‌లో విక్రయించబడుతున్నప్పటికీ, ఈ మోడల్ అమ్మకాల పరంగా అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి నెక్సా SUVగా ఫ్రాంక్స్ చరిత్ర సృష్టించింది. 2023 ఏప్రిల్‌లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫ్రాంక్స్, ప్రారంభం నుంచే వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందింది. SUV తరహా డిజైన్, ప్రీమియం ఫీచర్లు, మంచి మైలేజ్, అందుబాటు ధరలు, మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ వాహనం విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఒక్క నెలలోనే తలకిందులైన లెక్కలు.. క్రెటాను వెనక్కి నెట్టిన స్కార్పియో!

భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల (SUV) హవా నడుస్తోంది. అయితే మే 2026 నెల సేల్స్ గణాంకాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీల జాబితాలో ఎప్పుడూ టాప్‌లో ఉండే హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఈసారి ఘోరంగా వెనకబడిపోయింది.

మే నెలలో 961 మంది ఈ SUVనే ఇంటికి తీసుకెళ్లారు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ (Kia motors) భారత మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే సెల్టోస్, సోనెట్, కారెన్స్ క్లావిస్ వంటి మోడళ్లతో భారతీయ వినియోగదారుల మనసులు గెలుచుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు సిరోస్ (Syros) SUVతో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, భద్రతా అంశాల కలయికతో రూపొందిన ఈ SUV మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల కియా 2026 మోడల్ సిరోస్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ SUVపై వినియోగదారుల ఆసక్తి మరింత పెరిగింది. కొత్త మోడల్‌లో అందించిన అప్‌డేట్స్, మెరుగైన ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్స్ కారణంగా షోరూమ్‌లకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
Advertisement

ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల ఫస్ట్ ఛాయిస్ ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గత కొంతకాలంగా ఎస్‌యూవీ (SUV) కార్ల హవా కొనసాగుతోంది. చిన్న కార్లయిన హ్యాచ్‌బ్యాక్స్ మార్కెట్ క్రమంగా ముగిసిపోతుందని అందరూ భావిస్తున్న తరుణంలో, మార్కెట్ ఊహించని మలుపు తిరిగింది. మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో నచ్చే చిన్న, సరసమైన కార్లు మరోసారి కస్టమర్ల మొదటి ఎంపికగా మారుతున్నాయి. మే 2026 నాటి కార్ల విక్రయాల గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చిన్న కార్ల అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేయగా, టాటా మోటార్స్ హ్యాచ్‌బ్యాక్ విభాగం కూడా అద్భుతమైన వృద్ధిని సాధించింది.

ఎక్కువ లగేజ్ స్పేస్ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) హవా రోజురోజుకూ పెరిగిపోతోంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పెట్రోల్ ఖర్చులను ఆదా చేసేందుకు కస్టమర్లు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు కంపెనీలు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా.. రోజువారీ అవసరాల కోసం స్కూటర్లలో ప్రాక్టికాలిటీని, అంటే ఎక్కువ లగేజ్ స్పేస్‌ను అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు గ్రాసరీస్, షాపింగ్ బ్యాగులు, నిత్యావసర సరుకులు సులభంగా తీసుకెళ్లగలిగేలా భారీ బూట్ స్పేస్‌తో మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు చూద్దాం.

అమ్మకాల్లో ఈ కారుకు ఎదురే లేదు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మే 2026 నెలలో కంపెనీ కార్ల అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. భారతీయ కస్టమర్లు హ్యుందాయ్ మోడళ్లకు బ్రహ్మరథం పట్టారు. మోడల్ వారీగా చూసుకుంటే.. ఎప్పటిలాగే కంపెనీ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. మిగతా కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా క్రెటా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

ప్రపంచంలో తొలి CNG బైక్‌కు మార్కెట్లో ఎదురుదెబ్బ

భారత టూవీలర్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన బజాజ్ ఆటో, ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ (CNG) మోటార్‌సైకిల్‌గా ఫ్రీడమ్ 125 (Freedom 125)ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకునే అవకాశంతో పాటు సీఎన్‌జీ సాంకేతికతను బైక్‌లో అందించడం వల్ల ఈ మోడల్‌కు ప్రారంభంలో మంచి స్పందన లభించింది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్లో గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 2026 మే నెలలో బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఆ నెలలో కేవలం 1,210 యూనిట్లు మాత్రమే విక్రయించబడటం గమనార్హం. ఈ సంఖ్య బైక్ విడుదలైనప్పటి నుంచి నమోదైన అత్యల్ప నెలవారీ అమ్మకాలుగా నిలిచింది.
Advertisement

స్టాక్ క్లియరింగ్ ఆఫర్.. రూ.5.35 లక్షల కారుపై ఏకంగా రూ.57,500 తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ (Maruti Suzuki) తన కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒకప్పుడు మార్కెట్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) ప్రొడక్షన్‌ను కంపెనీ అధికారికంగా నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారు ఉత్పత్తిని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ కారును ఇష్టపడే వారి కోసం కంపెనీ ఒక గుడ్ న్యూస్ కూడా అందించింది. జూన్ 2026 నెలలో కంపెనీ తన విభిన్న మోడళ్లపై ఇస్తున్న ఆఫర్లలో భాగంగా, మిగిలి ఉన్న ఇగ్నిస్ కార్ల పై కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న కాంపాక్ట్ SUV!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతుండగా, టాటా మోటార్స్‌ (tata motors)కు చెందిన నెక్సాన్(Nexon) తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటోంది. 4 మీటర్ల లోపు ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా గుర్తింపు పొందిన నెక్సాన్, మార్కెట్లోకి వచ్చి చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కొనుగోలుదారుల మొదటి ఎంపికల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన భద్రతా ప్రమాణాలు, ఆధునిక ఫీచర్లు, విభిన్న ఇంధన ఎంపికలు ఈ ఎస్‌యూవీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి మరియు ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న అరుదైన ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి.

దేశంలో రతన్ టాటాకు ఉన్నంత ప్రజాధారణ పొందిన కారు

భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్‌ (tata motors)కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు విభిన్న విభాగాల్లో వాహనాలను అందిస్తున్న ఈ సంస్థ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అభివృద్ధి చేస్తూ వస్తోంది. అందుకే టాటా విడుదల చేసే దాదాపు ప్రతి మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. మధ్యస్థాయి ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన పొందుతున్న హారియర్ (tata harrier), 2026 మే నెలలో అద్భుతమైన అమ్మకాల ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 2,815 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇందులో ICE వేరియంట్లతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వెర్షన్ అమ్మకాలు కూడా ఉన్నాయి.

క్రెటా, XUV 7XOలకు వణుకు పుట్టిస్తున్న నిస్సాన్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలె గ్రావైట్ (Gravite) MPV కారును విజయవంతంగా లాంచ్ చేసిన ఈ జపాన్ సంస్థ, ఇప్పుడు సరికొత్తగా రెండు అద్భుతమైన ఎస్‌యూవీలను రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తోంది.
Advertisement

పెట్రోల్ కారును మర్చిపోయేలా చేస్తున్న టాటా టియాగో EV!

భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా టియాగో ఈవీ 2026 (Tata Tiago Ev 2026) మోడల్ తాజాగా సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. కొత్త డిజైన్, మరింత ప్రీమియం క్యాబిన్, అదనపు భద్రతా ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలతో ఈ హ్యాచ్‌బ్యాక్ గతంతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా, ప్రారంభ ధరను కూడా తగ్గించడం ద్వారా టాటా మోటార్స్ వినియోగదారులకు మరింత విలువను అందిస్తోంది. 2026 టాటా టియాగో ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ ఎంపికలను యథాతథంగా కొనసాగించినప్పటికీ, డిజైన్, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు చేసింది. దీంతో భారత మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరింత మెరుగైన ఎంపికగా నిలుస్తోంది.

ఇక గేర్లు మార్చే తిప్పలుండవు.. రైడర్లకు పండగే పండగ

భారత టూవీలర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెచ్చుకున్న ప్రముఖ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం దేశంలో ప్రీమియం, మ్యాక్సీ స్కూటర్లకు (Maxi Scooters) క్రేజ్ విపరీతంగా పెరుగుతుండటంతో.. టీవీఎస్ కూడా ఈ సెగ్మెంట్‌పై కన్నేసింది.

టాటా టిగోర్ అమ్మకాలు ఆందోళనకర స్థాయికి!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) పేరు చెప్పగానే ప్రస్తుతం చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేవి పంచ్, నెక్సాన్, కర్వ్ వంటి SUV మోడళ్లే. గత కొన్నేళ్లుగా SUVలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో టాటా మోటార్స్ కూడా ఈ సెగ్మెంట్‌లో అద్భుతమైన విజయాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా పంచ్, నెక్సాన్ వంటి మోడళ్లు ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఒకవైపు ఈ మోడళ్లు మార్కెట్‌ను శాసిస్తుంటే, మరోవైపు టాటా లైనప్‌లోని కొన్ని కార్లు మాత్రం క్రమంగా వినియోగదారుల దృష్టికి దూరమవుతున్నాయి. అలాంటి మోడళ్లలో టాటా టిగోర్ (Tata Tigor) ఒకటి. ఈ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు తీవ్రమైన పోటీ మధ్య తన ఉనికిని నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నట్టు కనిపిస్తోంది.

జనాలు ఎగబడికొంటున్న కారుకు స్పోర్ట్ ఎడిషన్ వచ్చేసింది

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకికి చెందిన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‎లో సరికొత్త స్పోర్ట్ (Fronx Sport) వేరియంట్‌ను లాంచ్ చేసింది. మలేషియా మార్కెట్లో అధికారికంగా విడుదలైన ఈ మోడల్, రెగ్యులర్ వేరియంట్ కంటే ఎంతో స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపుదిద్దారు.
Advertisement

కొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీతో మారుతి జిమ్నీ రెండు కొత్త వేరియంట్స్

ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ లవర్లకు సుజుకి తీపి కబురు అందించింది. తన పాపులర్ మోడల్ జిమ్నీలో ఆల్‌గ్రిప్ ప్లస్ (Allgrip Plus), రైనో ప్లస్ (Rhino Plus) అనే రెండు సరికొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వీటిని 3-డోర్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. స్టైలింగ్, ఫీచర్లు, ముఖ్యంగా సేఫ్టీ విషయంలో ఈ కొత్త వేరియంట్లు పాత వాటి కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. సుజుకి ఈ కార్లను మలేషియాలో లాంచ్ చేసినప్పటికీ, వీటి ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిమ్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మధ్య తరగతి, పెద్ద ఫ్యామిలీల కోసం మారుతి 4 అదిరిపోయే కార్లు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి రోడ్లపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. మారుతున్న కాలం, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఈ ఏడాది తన లైనప్‌ను భారీ మార్పులతో రీ-లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ, హైబ్రిడ్ క్రాస్ ఓవర్, 7-సీటర్ సెగ్మెంట్లలో నాలుగు అదిరిపోయే కార్లను తీసుకురాబోతోంది. ఇవి ఫీచర్లు, మైలేజ్, ధరలో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఏడాది కొత్త కారు కొనాలని చూస్తుంటే, ఈ నాలుగు ఆప్షన్లను ఒకసారి పరిశీలించండి.

బైక్ లాగా మైలేజ్ ఇచ్చే కారు.. దేశంలో చాలా మంది కొనేశారు

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న మధ్యతరగతి వాహనదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) సూపర్ న్యూస్ చెప్పింది. జూన్ 2026 నాటికి తన విభిన్న మోడళ్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగానే, మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) పై భారీ తగ్గింపును అందిస్తోంది. మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయేలా ఈ కారు ధర ఉండటంతో పాటు ఇప్పుడు ఆఫర్లు కూడా తోడవడంతో షోరూమ్‌ల వద్ద కస్టమర్ల రద్దీ పెరుగుతోంది.

23 కిమీ మైలేజ్ ఇచ్చినా ఇది మారుతి సుజుకి చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మారుతి సుజుకి కంపెనీకి ఒక పెద్ద షాక్ తగిలింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ మోడల్‌గా ప్రవేశపెట్టిన మారుతి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
Advertisement

టాప్‎లోకి దూసుకొచ్చిన మధ్య తరగతి ఎక్కువగా కొనే కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. గత నెల, అంటే మే 2026 సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే టాటా కార్లకు కస్టమర్లు బ్రహ్మరథం పట్టారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మోడల్ వైజ్ కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని మార్కెట్లో రారాజుగా నిలిచింది. ఈ ఒక్క మోడల్ అమ్మకాల ధాటికి కంపెనీకి చెందిన మిగిలిన 8 మోడళ్లు వెనుకబడిపోయాయి.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ ఇదే.. ఎర్టిగా రికార్డ్ సేల్స్!

భారత మార్కెట్లో 7-సీటర్ MPV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కుటుంబాల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఈ MPV, మే 2026లో కూడా అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచి తన నంబర్-1 స్థానాన్ని కొనసాగించింది. మే 2026లో మారుతి సుజుకి మొత్తం 20,350 ఎర్టిగా యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రస్తుతం SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఉండే ఎర్టిగాపై వినియోగదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బడ్జెట్ కార్లలో కింగ్ మళ్లీ ఇదే! ఆల్టో K10 సేల్స్‌లో డబుల్ గ్రోత్ హీట్

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల కారు కలను నిజం చేసిన వాహనాల గురించి మాట్లాడితే, మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. దశాబ్దాలుగా భారతీయుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల తొలి నాలుగు చక్రాల ప్రయాణానికి నాంది పలికిన మధుర జ్ఞాపకం. 1990ల చివరలో భారత రోడ్లపై అడుగుపెట్టి, కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు, అప్‌డేట్లను అందుకుంటూ నేటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రారంభంలో 800cc ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ప్రస్తుతం మరింత శక్తివంతమైన 1.0-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. చిన్న కుటుంబాలకు, నగర ప్రయాణాలకు అనువైన కారుగా ఆల్టో K10 ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.

దేశంలో ఇంత మంచి కారు చూపించగలరా?

భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత రోడ్లపై తనదైన ముద్ర వేసిన ఈ కారు, యువత నుంచి కుటుంబాల వరకు ప్రతి వర్గం వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, చురుకైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్ కారణంగా స్విఫ్ట్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు వచ్చినా, SUVల హవా పెరిగినా, స్విఫ్ట్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ ఈ కారు తనకు ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపిస్తూనే ఉంది. తాజా అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

దేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా SUVల హవా కొనసాగుతోంది. చిన్న కార్ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఎక్కడ చూసినా SUVలకే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునే చాలా మంది వినియోగదారులు కూడా SUVల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెడాన్ కారు మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఆ కారు మరెదో కాదు.. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). ఒకప్పుడు భారతీయ కుటుంబాల తొలి ఎంపికగా నిలిచిన సెడాన్ కార్లకు SUVల రాకతో డిమాండ్ తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ డిజైర్ మాత్రం ఆ అంచనాలను తప్పు చేస్తూ వరుసగా అమ్మకాల పరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.