మనదేశంలో టాప్..విదేశాల్లో మాత్రం ప్లాప్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. గత కొన్నేళ్లుగా ఈ కారు దేశీయ రహదారులపై రారాజులా ఏలుతోంది. అయితే, తాజాగా వెలువడిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే క్రెటాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ కారు మన దేశంలో ఎంతలా అమ్ముడవుతుందో, విదేశాల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇంట్లో ఈ పులి.. బయట మాత్రం పిల్లి అన్నట్లుగా దీని పరిస్థితి తయారైంది. ఫిబ్రవరి 2026లో ఏకంగా 17,938 యూనిట్ల విక్రయాలతో దేశంలో టాప్-10 కార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన క్రెటా, విదేశీ మార్కెట్లలో మాత్రం కేవలం 608 యూనిట్లకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సామాన్యుల కోసం తక్కువ ధరలో చిన్న కార్లు వస్తున్నాయి

భారతదేశంలో చిన్న SUVలు, ముఖ్యంగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVల విభాగం ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటి. కుటుంబ ప్రయాణాలకు సరిపోయే స్థలం, ఆకర్షణీయమైన డిజైన్, అలాగే తక్కువ ధరలో లభించడం వంటి కారణాల వల్ల ఈ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ SUVలు ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా మంచి క్యాబిన్ స్పేస్‌ను అందిస్తాయి. అందుకే చిన్న కుటుంబాల కోసం ఇవి ఉత్తమ ఎంపికగా మారాయి. నగర రహదారులపై సులభంగా నడపడం, పార్కింగ్ చేయడం కూడా వీటి మరో ప్రధాన ప్రయోజనం. ఇదిలా ఉంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో కూడిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVలను పలు కంపెనీలు సామాన్యులు కొనగలిగే ధరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఈ కథణంలో.

ఇది కారు కాదు రోడ్డుపై వెళ్లే బుల్లెట్ రైలు

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా దిగ్గజం BYD(Build Your Dreams), తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ BYD గ్రేట్ టాంగ్ (Great Tang)తో ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ఆకట్టుకున్న ఈ కారు మార్చి 5, 2026న అధికారికంగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన ఇంటీరియర్ ఫోటోలు, ఫీచర్లు చూస్తుంటే, ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై వెళ్లే ఒక విలాసవంతమైన విల్లా అనిపిస్తోంది. ఏకంగా 950 కిలోమీటర్ల రేంజ్, 4 భారీ స్క్రీన్లు, లిడార్ (LiDAR) టెక్నాలజీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ కారు రూపొందింది. BYD గ్రేట్ టాంగ్ లోపలికి అడుగుపెడితే మనకు ఒక ఫ్యూచరిస్టిక్ ప్రపంచం కనిపిస్తుంది. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఇచ్చారు. అంటే మొత్తం ఏడుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. డాష్‌బోర్డ్‌పైనే మూడు భారీ స్క్రీన్‌లు అమర్చారు.

రూ.2.5 లక్షల అడ్వెంచర్ బైక్ రూ.1.49 లక్షలకే

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) మరో కీలక నిర్ణయంతో వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల తన X-47 అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసి మంచి స్పందన పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు వినియోగదారులకు మరింత సులభంగా బైక్ కొనుగోలు చేసేలా బ్యాటరీ ఫ్లెక్స్ (Battery-as-a-Service - BaaS) అనే కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ప్రారంభ ఖర్చు గణనీయంగా తగ్గి, మరింత సరసమైన ధరలో అధునాతన ఎలక్ట్రిక్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది.
Advertisement

తక్కువ ధరలో టాప్-5 సీవీటీ కార్లు ఇవే

ప్రస్తుత కాలంలో సిటీ రోడ్లపై వాహనం నడపడం అంటే మామూలు విషయం కాదు. విపరీతమైన ట్రాఫిక్, గంటల కొద్దీ నిరీక్షణ.. ఈ క్రమంలో మాన్యువల్ గేర్లు మార్చుతూ, పదే పదే క్లచ్ నొక్కుతూ డ్రైవర్లు విసిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు కార్లు కొనేవారు ఎక్కువగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహిళా డ్రైవర్లు, నగరాల్లో నివసించే వారు క్లచ్ లేని ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఆటోమాటిక్ కార్లలో ఏఎంటీ (AMT), డీసీటీ (DCT), సీవీటీ (CVT) అని రకరకాలు ఉంటాయి. వీటిలో ప్రయాణం చాలా స్మూత్‌గా సాగడానికి, ల్యాగ్ లేకుండా ఉండటానికి సీవీటీ(Continuously Variable Transmission) టెక్నాలజీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ సీవీటీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్

ఆటోమొబైల్ ప్రపంచంలో భారతీయ కంపెనీల జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో జపాన్, యూరప్ దిగ్గజాలకు మన దేశీ బ్రాండ్లు గట్టి పోటీనిస్తూ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇప్పుడు ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ల విక్రయాల్లో జపాన్ దిగ్గజం యమహా (Yamaha)ను అధిగమించి, గ్లోబల్ సేల్స్‌లో టీవీఎస్ మూడవ స్థానానికి చేరుకోవడం ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

MG కంపెనీకి భారీ ఊపు.. ఫిబ్రవరిలో 24% సేల్స్ జంప్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అనేక అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్లు భారత మార్కెట్లోకి తమ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి ముందుకొస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖంగా నిలుస్తున్న కంపెనీలలో ఒకటి ఎంజీ (MG Motor). ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. మొదట ఇంధనంతో నడిచే కార్లను పరిచయం చేసినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టుతోంది.

ఫిబ్రవరిలో 5 లక్షలకుపైగా డెలివరీలు!

హోండా మోటార్ సైకిల్ ఇండియా భారత టూవీలర్ వాహన మార్కెట్‌లో తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఈ కంపెనీ, 2026 ఫిబ్రవరిలో అద్భుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. వినియోగదారుల విశ్వాసం, విశ్వసనీయమైన ఇంజిన్ పనితీ, మంచి మైలేజ్ వంటి అంశాలు హోండా వాహనాలకు నిరంతర డిమాండ్ తీసుకొస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో హోండా మొత్తం 5,67,351 యూనిట్ల ద్విచక్ర వాహనాలను డెలివరీ చేయగా, గత సంవత్సరం ఇదే కాలంలో 4,22,449 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చితే సంవత్సర ప్రాతిపదికన (YoY) సుమారు 34 శాతం వృద్ధి నమోదైంది.
Advertisement

కారు లోపల సీట్లు తిరుగుతాయి

టాటా మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టాటా సియెర్రా రీ-ఎంట్రీతో మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ దేశీ దిగ్గజం, ఇప్పుడు మరింత విలాసవంతమైన, అత్యంత శక్తివంతమైన అవిన్యా (Avinya) అనే లగ్జరీ బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది. 2027లో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ బ్రాండ్ గురించి కంపెనీ ఇటీవలే కీలక వివరాలను వెల్లడించింది. టయోటాకు లెక్సస్, హ్యుందాయ్‌కు జెనెసిస్ ఎలాగో.. టాటా మోటార్స్‌కు అవిన్యా అలా ఒక ప్రీమియం గుర్తింపును తీసుకురాబోతోంది.

డస్టర్ తమ్ముడు డిఫెండర్ లుక్‌లో వస్తున్నాడు

భారతదేశంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చిన కార్లలో డస్టర్ (Duster) ఒకటి. ఈ SUV భారత మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా మంచి డిమాండ్‌ను పొందుతూ, కుటుంబాలకు అనువైన బలమైన వాహనంగా పేరు సంపాదించింది. తాజాగా ఈ డస్టర్‌ను కంపెనీ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి మళ్లీ పరిచయం చేసింది. ఈ కొత్త లుక్‌తో వచ్చిన డస్టర్ ఆటో ప్రియులలో మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉండగా, రెనాల్ట్ ఇప్పుడు భారత మార్కెట్ కోసం మరో కొత్త SUVపై పని చేస్తోంది. డస్టర్‌ను పోలిన డిజైన్‌తో, అయితే దానికంటే పెద్దదిగా ఉండే ఈ కొత్త వాహనం 7 మంది కూర్చునేలా రూపొందించబడుతోంది.

కాలేజీ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బైక్స్ ఇవే

కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు బైక్ అంటే కేవలం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే సాధనం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్. అయితే స్టైల్‌తో పాటు జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే తక్కువ మెయింటెనెన్స్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బైక్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, లీటరుకు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే ఆ కిక్కే వేరు.

ఈ ఏడాదిలో టాటా నుంచి 3 కార్లు!

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో, టాటా మోటార్స్ (Tata Motors) ఈ మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ముందుకు సాగుతోంది. సస్టైనబుల్ మొబిలిటీ వైపు దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం టాటా మోటార్స్‌కు ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ ఏడాదిలో కంపెనీ పలు కీలక ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా టియాగో ఈవీ (Tata Tiago EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, అలాగే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియోర్రా ఈవీ (Tata Sierra EV), భవిష్యత్తు టెక్నాలజీని ప్రతిబింబించే అవిన్య ఈవీ (Tata Avinya EV) వంటి మోడళ్లు ఉండనున్నాయి. వీటి గురించి ఈ కథణంలో తెలుసుకుందాం.
Advertisement

సెకండ్ హ్యాండ్‌లో అమ్మిన ఎగబడి కొంటారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే తప్పకుండా ప్రస్తావనకు వచ్చే మోడల్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). స్టైలిష్ డిజైన్, విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్ల కలయికతో ఈ కారు చాలా తక్కువ సమయంలోనే యువత నుంచి కుటుంబాల వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడటం దీని ప్రీమియం ఇమేజ్‌ను మరింత బలపరిచింది. బాలెనో మొదటిసారి 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలక్రమేణా డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్ల పరంగా పలు మార్పులతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఈ చిన్న చిట్కాతో బండిని మెరిపించండి!

హోలీ పండుగ అంటేనే రంగుల హంగామా. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆనందంగా గడిపే ఈ పండుగలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన వాహనాలపై రంగులు పడటం సహజం. అయితే, ఈ రంగులు పడటం వరకు బానే ఉంటుంది కానీ, వాటిని వదిలించడమే అసలైన టాస్క్. ముఖ్యంగా ఎండలో ఆ రంగులు వాహనంపై ఆరిపోతే, అవి మొండి పచ్చల్లా మారిపోతాయి. వాటిని వదిలించడానికి మనం సర్ఫ్ లేదా గట్టి సబ్బులతో రుద్దితే, వాహనం ఒరిజినల్ పెయింట్ పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎటువంటి ఖరీదైన కెమికల్స్ వాడకుండా, మీ ఇంట్లో ఉండే కేవలం రెండు మూడు వస్తువులతో మీ కారు లేదా బైక్‌ను సరికొత్తగా ఎలా మార్చుకోవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పేదలు సైతం ఈ కారును కొనగలరు

భారత మార్కెట్లో వ్యాన్ సెగ్మెంట్‌ అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు చాలా మందికి మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). సాధారణ కుటుంబాల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజ్ ఇవన్నీ కలిపి ఈ మోడల్‌ను ఒక విశ్వసనీయ ఎంపికగా నిలబెట్టాయి. ఈ విశ్వాసమే ఫిబ్రవరి 2026లో కూడా అమ్మకాల రూపంలో స్పష్టంగా కనిపించింది. ఫిబ్రవరి 2026 నెలలో మాత్రమే దేశవ్యాప్తంగా 11,620 యూనిట్ల ఈకో విక్రయించడం ద్వారా మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది.

టాటా కొత్త స్కీమ్ అదిరిపోయిందిగా

భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లను ఆకట్టుకోవడానికి కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎంజీ మోటార్, మారుతి సుజుకి వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి టాటా ఒక భారీ మాస్టర్ ప్లాన్ వేసింది.
Advertisement

రూ.10 లక్షల లోపు అదిరిపోయే టర్బో కార్లు

ప్రస్తుతం భారతీయ కార్ల మార్కెట్‌లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కారు చిన్నదైనా, పెద్దదైనా సరే.. ఇంజిన్ మాత్రం అదిరిపోయే పవర్ ఇవ్వాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. అందుకే సాధారణ పెట్రోల్ ఇంజిన్ల కంటే టర్బో-పెట్రోల్ (Turbo-Petrol) ఇంజిన్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. టర్బో ఇంజిన్ల వల్ల కారు వేగంగా దూసుకుపోవడమే కాకుండా, మైలేజీ విషయంలో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు కూడా రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో పవర్‌ఫుల్ టర్బో కారు కోసం చూస్తున్నట్లయితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 12 ఆప్షన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక్క నెలలోనే 5.58 లక్షల హీరో అమ్మకాలు!

భారతదేశంలో టూవీలర్ మార్కెట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp). దేశపు అతిపెద్ద టూవీలర్ తయారీదారుగా ఉన్న ఈ సంస్థ, అమ్మకాల పరంగా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. హోండా, టీవీఎస్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువవుతూ హీరో మోటోకార్ప్ దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలు ఈ జోరును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 5,58,216 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,88,068 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం భారీ వృద్ధి.

మళ్లీ నంబర్ వన్ మారుతి.. ఒక్క నెలలోనే 2 లక్షలకుపైగా కార్లు!

భారతదేశంలో కారును కొనుగోలు చేయాలనుకునే సాధారణ కుటుంబం నుంచి మధ్యతరగతి వరకు మొదట గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి (Maruti Suzuki). సరసమైన ధరలు, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ మూడు అంశాల సమ్మేళనం వల్లే మారుతి సుజుకి దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఎదిగింది. దశాబ్దాలుగా ఈ కంపెనీ భారతీయుల నమ్మకాన్ని గెలుచుకుంటూ, మార్కెట్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలు ఈ ఆధిపత్యాన్ని మరొకసారి స్పష్టంగా చూపించాయి. ఆ నెలలో మారుతి సుజుకి మొత్తం 2,13,995 యూనిట్ల కార్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 1,99,400 యూనిట్లతో పోలిస్తే, ఇది గణనీయమైన వృద్ధి. అంటే సంవత్సరానికి మంచి పెరుగుదల నమోదు కావడం కంపెనీ బలాన్ని చాటుతోంది.

స్కూటర్ అంటే టీవీఎస్ అంటున్న జనం

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2026 ఫిబ్రవరి నెల ఈవీ (EV) మార్కెట్‌లో పెను మార్పులకు వేదికైంది. విక్రయాల పరంగా చూస్తే ఈ విభాగం ఏకంగా 46 శాతం వార్షిక వృద్ధిని సాధించి, మొత్తం 1,11,000 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డును సృష్టించింది.
Advertisement

చరిత్ర సృష్టిస్తున్న టాటా కారు

ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక లెజెండ్ మళ్లీ పునర్జన్మ పొందితే ఎలా ఉంటుంది? ఒకప్పుడు 90లలో యువత హృదయాలను గెలుచుకున్న ఆ పేరు తిరిగి మార్కెట్లోకి వస్తే ఏం జరుగుతుందో తాజాగా చూశాం. అదే కొత్త తరం టాటా సియోర్రా (Tata Sierra) కథ. 1990లలో ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో సంచలనం సృష్టించిన సియెర్రా, సంవత్సరాల తర్వాత మళ్లీ కొత్త అవతారంలో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. 2025 నవంబర్ 25న అధికారికంగా ప్రారంభమైన ఈ SUV, విడుదలైన మొదటి రోజు నుంచే కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక టచ్‌తో మేళవించడం, శక్తివంతమైన ప్రెజెన్స్, టాటా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలిసి ఈ మోడల్‌ను హాట్ టాపిక్‌గా మార్చాయి. డెలివరీలు 2026 జనవరి 15న ప్రారంభమయ్యాయి.

హోండా నుంచి రాబోతున్న టాప్-4 హైబ్రిడ్ కార్లు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ దిగ్గజం హోండా (Honda) సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా మార్కెట్ వాటాలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా, ఇప్పుడు హైబ్రిడ్ మంత్రంతో మళ్లీ నంబర్ వన్ రేసులోకి రావాలని హోండా పక్కా ప్లాన్ వేసింది. కేవలం పెట్రోల్ కార్లకే పరిమితం కాకుండా, ఎలక్ట్రిక్, పెట్రోల్ కలయికతో వచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపై కంపెనీ భారీగా ఫోకస్ పెట్టింది. రాబోయే CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ) నిబంధనలకు అనుగుణంగా, అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే కార్లను పరిచయం చేయబోతోంది. ఇందులో పాపులర్ మోడల్ హోండా సిటీ నుంచి లగ్జరీ కారు ప్రిల్యూడ్ వరకు ఎన్నో ఆసక్తికరమైన వాహనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

అందరి ఇంటి పేరుగా మారిపోయిన కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన కారు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift). 2005లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మోడల్, అప్పటి నుంచి యువత నుంచి కుటుంబాల వరకు అందరి మనసును గెలుచుకుంది. స్టైలిష్ డిజైన్, చురుకైన పనితీరు, మంచి మైలేజ్ ఈ మూడు లక్షణాల కలయికే స్విఫ్ట్‌ను "ఇంటి పేరు"గా మార్చాయి. స్విఫ్ట్ ప్రయాణం కేవలం ఒక కారు కథ మాత్రమే కాదు; ఇది భారతీయ మధ్యతరగతి కుటుంబాల ఎదుగుదలకు ప్రతీకగా కూడా నిలిచింది. ప్రతి జనరేషన్‌లో కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అప్డేటెడ్ టెక్నాలజీతో వస్తూ మార్కెట్లో తన స్థాయిని నిలబెట్టుకుంది. అందుకే విడుదలైన దాదాపు రెండు దశాబ్దాల తరువాత కూడా స్విఫ్ట్ డిమాండ్ తగ్గలేదు.

ప్రతి జనరేషన్‌లో ఈ కారంటే పిచ్చి

భారతీయ SUV మార్కెట్లో పవర్, ప్రెస్టీజ్, ప్రెజెన్స్ పరంగా గుర్తింపు పొందిన పేరు అంటే మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio). ప్రారంభం నుంచే ఈ SUV ఒక సాధారణ వాహనం కాదు; ఇది ఓ స్టేటస్ సింబల్‌గా మారింది. పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ సమానంగా ఆదరణ పొందుతూ ఇంటింటికీ సుపరిచితమైన బ్రాండ్‌గా ఎదిగింది. ఇటీవలి కాలంలో SUVలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో స్కార్పియో డిమాండ్ మరింత పెరిగింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ మోడల్‌కు 14,665 యూనిట్ల డెలివరీలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 13,618 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు స్పష్టంగా పెరిగాయి. గణాంకాల ప్రకారం సంవత్సరానికి (YoY) 7.69% వృద్ధి నమోదు కావడం స్కార్పియోకు ఉన్న మార్కెట్ బలాన్ని సూచిస్తోంది.
Advertisement

విన్ ఫాస్ట్ స్కెచ్‎కు హ్యుందాయ్ బేజారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల EV) హవా నడుస్తోంది. ఈ రేసులో ఎప్పటి నుంచో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీలకు షాక్ ఇస్తూ ఒక కొత్త కంపెనీ దూసుకుపోతోంది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతేడాది 2025 పండుగ సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ, కేవలం నాలుగు ఐదు నెలల్లోనే తన ఉనికిని బలంగా చాటుకుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, విన్ ఫాస్ట్ ఏకంగా హ్యుందాయ్, బీవైడీ (BYD) వంటి గ్లోబల్ జెయింట్స్‌ను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.