చేతిలో రూ.6 లక్షలు ఉంటే చాలు.. డాక్టర్లు, ఇంజనీర్లకు బాగా ఇష్టమైంది

భారతీయ కార్ల మార్కెట్లో ప్రతి ఏడాది కొత్త మోడళ్లు, కొత్త టెక్నాలజీలు, కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కార్లు మాత్రం కాలం మారినా, పోటీ పెరిగినా తమ క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోవు. అలాంటి అరుదైన మోడళ్లలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (maruti Suzuki wagonr) ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంటూ వస్తున్న ఈ హ్యాచ్‌బ్యాక్, ప్రస్తుతం కూడా అమ్మకాల పరంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రాక్టికాలిటీ, విశాలమైన క్యాబిన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి అంశాలు వ్యాగన్‌ఆర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు మొదటి ఎంపికగా మార్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ ఈ కారును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, కొత్త ఫీచర్లు, భద్రతా సాంకేతికతలను జోడిస్తూ వస్తోంది.

హీరో స్ప్లెండర్‌కు పోటీగా హోండా కొత్త బైక్ రాబోతోంది!

భారత ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో, ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు కూడా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన ఫ్లెక్స్-ఫ్యూయల్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్‌లు E85 ఇంధనంతో నడిచేలా రూపొందించబడ్డాయి. అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో కూడిన ఇంధనాన్ని ఉపయోగించగల సామర్థ్యం వీటికి ఉంది.

మధ్యతరగతి మనసు గెలిచిన SUV.. అమ్మకాలలో రికార్డు వృద్ధి!

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యం, అలాగే మారుతి సుజుకి బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకం కారణంగా ఈ ఎస్‌యూవీకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, తక్కువ ఇంధన వ్యయంతో మెరుగైన పనితీరు కోరుకునే కస్టమర్లను గ్రాండ్ విటారా బాగా ఆకట్టుకుంది. 2026 మే నెల అమ్మకాల గణాంకాలు ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా అమ్మకాలు నమోదు చేస్తూ వచ్చిన గ్రాండ్ విటారా, మే నెలలో మరింత జోరు ప్రదర్శించింది.

సస్పెన్షన్ సిస్టమ్ సమస్యలు ముందే ఎలా గుర్తించాలి? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Vehicle Suspension Maintenance. మీ కారు సస్పెన్షన్ పాడైందని చెప్పే ముఖ్యమైన సంకేతాలు ఇవే. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఖర్చు పెరగడమే కాకుండా ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది.
Advertisement

ఈ కారు కొంటే ఏకంగా రూ.70,000 డిస్కౌంట్ ఇస్తున్నారు

సొంతంగా ఒక మంచి ఎస్‌యూవీ (SUV) కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా (Mahindra) ఈ జూన్ 2026 నెలలో తన వివిధ రకాల మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO పై అదిరిపోయే తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ జూన్ నెలలో ఈ కారును సొంతం చేసుకోవడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 70,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త i20.. చూశారంటే చూపుతిప్పుకోలేరంతే

గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త ఫోర్త్-జనరేషన్ (నాల్గవ తరం) i20 స్మార్ట్ కారును బ్రెజిల్ దేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అత్యంత అధునాతనమైన కే3 (K3) మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించింది. ఈ సరికొత్త మోడల్‌ను పూర్తిగా కొత్త డిజైన్, లగ్జరీ ఇంటీరియర్‌, డ్యూయల్ స్క్రీన్లు, అధునాతన ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. బ్రెజిల్ మార్కెట్లో దీని ప్రారంభ ధర బిఆర్ఎల్ 99,990 (మన భారత కరెన్సీలో సుమారు రూ.18.77 లక్షలు)గా నిర్ణయించారు. అక్కడి మార్కెట్లో ఇది హెచ్‌బి20, క్రెటా మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.

వర్షాకాలంలో వాహనాల మైలేజ్ ఎందుకు తగ్గిపోతుంది? అసలు కారణాలు ఇవే!

Fuel efficiency tips in monsoon. వర్షాకాలంలో మీ వాహనం మైలేజ్ ఎందుకు తగ్గుతుందో తెలుసుకోండి. టైర్ల ఘర్షణ, ఎలక్ట్రికల్ లోడ్ మరియు ఇంజిన్ పనితీరుపై వర్షం చూపే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ కంపెనీ కార్లు కూడా ప్రాణాలకు ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాయ్

భారతీయ ఆటోమొబైల్ కస్టమర్ల మధ్య జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన ఫోక్స్ వ్యాగన్ (Volkswagen) కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్ట్రాంగ్ బాడీ క్వాలిటీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారు ఈ బ్రాండ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. కాగా, ఈ సంస్థ గడచిన మే (2026) నెలకు సంబంధించిన తన కార్ల మోడల్ వైజ్ అమ్మకాల డేటాను అధికారికంగా విడుదల చేసింది. ఈ తాజా నివేదిక ప్రకారం.. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫోక్స్ వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun) అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి నెంబర్-1 స్థానాన్ని సొంతం చేసుకుంది.
Advertisement

పెద్ద, చిన్న ఫ్యామిలీ కోసం హ్యుందాయ్, కియా మాస్టర్ ప్లాన్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ మొబిలిటీ వాహనాలకు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా పెట్రోల్ భారం తగ్గించే హైబ్రిడ్ కార్లపై భారతీయ కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ముందే పసిగట్టిన దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ (Hyundai), కియా (Kia) దేశీయ హైబ్రిడ్ వెహికల్ సెగ్మెంట్‌లో భారీ ఎంట్రీ ఇవ్వడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి రాబోయే 2027 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో సరికొత్త హైబ్రిడ్ కార్లను పరిచయం చేయబోతున్నాయి.

దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల (EVs) హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఈవీ కార్లు కేవలం ధనవంతులకే పరిమితం అనుకునే రోజులు పోయి.. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కస్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం, బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు కంపెనీలు బడ్జెట్ ధరలోనే కార్లను లాంచ్ చేయడం ఇందుకు ముఖ్య కారణం. ప్రస్తుతం మన దేశంలో సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉన్న టాప్-5 అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాను, వాటి ప్రత్యేకతలను చూద్దాం.

టెస్టింగ్ చేస్తుండగా దొరికిపోయిన మారుతి సీక్రెట్ వెపన్

భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ (Fronx) ఎస్‌యూవీ.. చాలా తక్కువ కాలంలోనే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న కార్ల నుంచి సబ్-కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మళ్లుతున్న కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ కారును డిజైన్ చేశారు.

ట్రాఫిక్‌లో కూడా క్లచ్ లైఫ్‌ను రెట్టింపు చేయాలా? ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అయితే చాలు!

Car Maintenance Tips: ట్రాఫిక్‌లో కారు క్లచ్ త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. క్లచ్ ప్లేట్ లైఫ్ పెంచుకోవడానికి డ్రైవింగ్ అలవాట్లలో మార్పులు చేసుకోండి.
Advertisement

ఆఫీస్‌కు వెళ్లే ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన 3 బైక్‌లు!

భారతదేశంలో రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కలిగిన బైక్‌లను ఎంచుకుంటారు. ఈ విషయంలో 125cc సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇవి 100cc బైక్‌ల కంటే మెరుగైన పనితీరును అందిస్తూనే, ఇంధన పొదుపులో కూడా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో హీరో సూపర్ స్ప్లెండర్, హోండా షైన్ 125, టీవీఎస్ రైడర్ 125 అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా ఉన్నాయి. రోజు ఆఫీసులకు ప్రయాణించే వారికి ఇవి మంచి విలువను అందించే బైక్‌గా చెప్పవచ్చు. ఇప్పుడు వీటి ధర, మైలేజ్ ఇతర వివరాలు ఒకసారి చూద్దాం.

ప్రీమియం SUVకి ఊహించని షాక్.. 30% తగ్గిన సేల్స్!

భారతీయ మార్కెట్లో ప్రీమియం కార్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) తన ప్రత్యేక డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ అనుభవంతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్ (Skoda Kylaq) కూడా మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి స్పందనను దక్కించుకుని కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్‌కు గతంతో పోలిస్తే డిమాండ్ కొంత మేర తగ్గినట్లు తెలుస్తోంది. స్కోడా కైలాక్ మే 2026 నెలలో మొత్తం 3,443 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఇండియన్ మార్కెట్లోకి త్వరలోనే 3 అదిరిపోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీలు

భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఈ ఏడాది 2026 ప్రారంభం అత్యంత అద్భుతంగా సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌లో మొదటి ఆరు నెలల్లోనే ఒకదానిని మించి ఒకటి ఏకంగా ఆరు సరికొత్త వాహనాలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇందులో ఆల్-న్యూ కియా సెల్టోస్, న్యూ స్కోడా కుషాక్, ఆల్-న్యూ రెనో డస్టర్, మారుతి ఈ విటారా, న్యూ ఫాక్స్‌వ్యాగన్ టైగూన్, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వంటి పవర్‌ఫుల్ కార్లు ఉన్నాయి. అయితే, అసలు సినిమా ఇంకా ముందుంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ మరో మూడు సరికొత్త మైండ్ బ్లోయింగ్ ఎస్‌యూవీలు మార్కెట్లో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

రూ.4.99 లక్షల కారు మీద ఏకంగా రూ.1.1 లక్షల డిస్కౌంట్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ ఇండియా (Citroen India) జూన్ నెలలో కొత్త కారు కొనాలనుకునే వినియోగదారుల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రొడక్ట్ రేంజ్‌లోని కార్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన పాపులర్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయిన్ C3 (Citroen C3) మోడల్‌పై ఏకంగా రూ.1.10 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో, సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ధరను తగ్గించినట్లు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
Advertisement

హైవే డ్రైవింగ్‌లో చేసే చిన్న తప్పులు వెహికల్ లైఫ్ ఎంతగా తగ్గిస్తాయో తెలుసా? ఇవి నిజంగా షాకింగ్!

Highway driving tips. హైవేపై ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు కారు ఇంజిన్, టైర్లు మరియు గేర్‌బాక్స్‌ను ఎలా దెబ్బతీస్తాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

కార్ల ధరలు పెంచిన దిగ్గజ కంపెనీ.. ఆ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి!

భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (tata motors) తన వినియోగదారులకు కీలక ప్రకటన చేసింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల సవరణ అంతర్గత దహన ఇంజిన్ (ICE) కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) కూడా వర్తించనుంది. కొత్త ధరలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మోడల్, వేరియంట్‌ను బట్టి వాహనాల ధరలు గరిష్టంగా 1.5 శాతం వరకు పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్‌పై పెరుగుదల ఒకేలా ఉండదని, వాహనం, దాని వేరియంట్ ఆధారంగా ధరల మార్పులు ఉంటాయని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.

రోడ్లపై మోడిఫైడ్ బైకులతో కనిపిస్తే అంతే సంగతులు

ఈ రోజుల్లో యువత తమ బైకులు లేదా స్కూటర్లను ఇతరుల కంటే భిన్నంగా, స్టైలిష్‌గా చూపించుకోవడం కోసం రకరకాల మోడిఫికేషన్లు చేయించుకోవడం ఒక ట్రెండ్‌గా మార్చుకున్నారు. అయితే ఇలాంటి హాబీలు ఉన్నవారు ఇకపై తమ అలవాట్లను తక్షణమే మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. టూ-వీలర్లలో కంపెనీ డిజైన్‌ను మార్చి ఎలాంటి అక్రమ మార్పులు చేసినా అది నేరుగా చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇలాంటి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దూరం నుంచే గుర్తించి, భారీ ఎత్తున చలాన్లు విధిస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు.

ఫ్యామిలీ కార్ కొనాలంటే చాలామంది ఇదే ఎంచుకుంటున్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా (Kia) ప్రవేశించి కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ, కంపెనీ తన ఉత్పత్తులతో వినియోగదారుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలకు భారతదేశంలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా గుర్తించిన కియా, కారెన్స్ ఎంపీవీ (Carens MPV)ని మార్కెట్లోకి తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకుంది. స్టైలిష్ డిజైన్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరల కారణంగా కారెన్స్ తక్కువ కాలంలోనే భారత కుటుంబాలకు ఫేవరెట్ ఎంపీవీగా మారింది.
Advertisement

ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఈవీని దించుతున్న టాటా మోటార్స్

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఈవీ ప్రియుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV (Tata Sierra EV) ప్రొడక్షన్ మోడల్ లాంచ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సరికొత్త ఆల్-న్యూ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జూన్ 30న భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఒకప్పుడు భారత రోడ్లపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సియెర్రా కారును, ఇప్పుడు సరికొత్త మోడ్రన్ ఎలక్ట్రిక్ అవతారంలో టాటా సంస్థ రీ-లాంచ్ చేస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

10 వేల మార్క్ దాటిన ఇన్నోవా.. ఈ కారుకు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు!

భారతీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా (Toyota Innova)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ వినియోగం, కమర్షియల్ అవసరాలు, దూర ప్రయాణాలు.. ఇలా ఏ కోణంలో చూసినా ఇన్నోవా తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సంవత్సరాలు గడిచినా ఈ ఎంపీవీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం టయోటా ఈ వాహనాన్ని ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఈ రెండు మోడళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మే 2026 నెలలో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ కలిపి మొత్తం 10,325 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ధర కేవలం రూ.4.24 లక్షలే.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1200 కిమీ రేంజ్ ఇచ్చే కారు

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచాలని స్వయంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దీని తర్వాత దేశీయ ఈవీ మార్కెట్‌లో ఊహించని రేంజ్ డిమాండ్ పెరిగింది. చాలా మంది కస్టమర్లు తమ పాత ఐసీఈ (ICE-పెట్రోల్/డీజిల్) వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వాహన నిర్వహణ ఖర్చులు సంవత్సరాలుగా ఎందుకు పెరుగుతాయి? అసలు కారణాలు ఇవే!

Vehicle maintenance tips. వాహనం పాతబడే కొద్దీ మెయింటెనెన్స్ ఖర్చులు ఎందుకు పెరుగుతాయో తెలుసుకోండి. ఇంజిన్ ఆరోగ్యం, విడిభాగాల మార్పు మరియు ఖర్చులను తగ్గించుకునే మార్గాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Advertisement

ఇండియాలో రాబోయే టాప్ 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు

భారత ఆటోమొబైల్ రంగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex Fuel) కార్లకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్ ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైంది. అదే సమయంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ దేశంలోని తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా గుర్తింపు పొందింది. ఇది పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. దీంతో ఈ జాబితా మరింత విస్తరించే అవకాశం ఉంది. త్వరలో రానున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు ఏవో తెలుసుకుందాం.