ఈ మేలో హోండా బంపర్ ఆఫర్..! రూ.2 లక్షలకు పైగా తగ్గింపుతో కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు హోండా కార్స్ ఇండియా (Honda Cars India) గట్టిగా రెడీ అవుతోంది. గత నెలలో అమ్మకాలలో కొంత మందగమనం కనిపించినప్పటికీ, దాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వస్తోంది. కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ఆకట్టుకోవాలన్న ప్లాన్‌తో పాటు, ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, మే 2026 నెల కోసం హోండా భారీ క్లియరెన్స్ సేల్స్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లలో భాగంగా, గరిష్టంగా రూ. 2.12 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించడం కొనుగోలుదారులకు పెద్ద ఆకర్షణగా మారింది. అంటే, ఇప్పటి వరకు కొనాలని అనుకున్న వారు ఇప్పుడు మరింత తక్కువ ఖర్చుతో హోండా కారును తమ ఇంటికి తీసుకెళ్లే అవకాశం దక్కుతోంది.

ఇప్పుడు కొంటే ఏకంగా రూ.1.05లక్షలు ఆదా చేసుకోవచ్చు

కొత్త కారు కొనాలనే మధ్యతరగతి ప్రజల కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ మే 2026 నెలలో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీల నుంచి చిన్న హ్యాచ్‎బ్యాక్ కార్ల వరకు అన్నిటిపైనా భారీగా ధరలను తగ్గించింది. ముఖ్యంగా క్రెటా, అల్కాజార్, గ్రాండ్ i10 నియోస్ వంటి పాపులర్ మోడళ్లపై ఏకంగా లక్ష రూపాయలకు పైగా ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మే నెలకు సంబంధించిన ఈ బంపర్ డీల్స్ వివరాలను తెలుసుకుందాం.

పెట్రోల్ ఖర్చులకు గుడ్‌బై.. CNG గ్రావైట్ వచ్చేసింది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్ తర్వాత అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ఇంధనం CNG. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో పాటు, మైలేజ్, ఖర్చు పరంగా లాభాలు ఉండటంతో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు CNG వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన దేశీయ, విదేశీ కార్ తయారీ సంస్థలు వరుసగా కొత్త CNG మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి పోటీలో భాగంగా నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) కూడా తన స్థానం బలపర్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒక CNG మోడల్‌ను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు తన ప్రముఖ SUV అయిన నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) కోసం ప్రభుత్వ అనుమతి పొందిన CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది.

రూ.3.47 లక్షలకే 1200 కిమీ రేంజ్..చైనా బుజ్జి ఈవీ అదుర్స్

పెట్రోల్ ధరలు చూసి బైక్ బయటకు తీయడానికి కూడా భయపడుతున్నారా? అలాంటిది ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం కాదు... నెలరోజులు కూడా టెన్షన్ లేకుండా తిరిగే కారు వస్తే ఎలా ఉంటుంది? అదీ కేవలం రూ.3.5 లక్షల బడ్జెట్‌లోనే అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు బైక్ బయటకు తీయాలన్నా జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లుతోంది.
Advertisement

500లీటర్లకు పైగా బూట్ స్పేస్ ఉన్న టాప్ 5 కార్లు

ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తే సూట్‌కేసులు, బ్యాగులతో కారు నిండిపోయి టెన్షన్ పడ్డారా ఎప్పుడైనా ? ఇప్పుడు ఆ సమస్యకు చాలా కంపెనీలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. మన దేశంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే.. కానీ ఇప్పుడు అది ఒక హోదాకు హోదాకు, సౌకర్యానికి చిహ్నం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే మన దేశంలో కారు కొనేటప్పుడు ఇంజిన్ పవర్, మైలేజీతో పాటు చూసే మరో ముఖ్యమైన విషయం బూట్ స్పేస్.

మార్కెట్‌లో రెనాల్ట్ బ్లాస్ట్..! డస్టర్ రీఎంట్రీతో అమ్మకాల జోరు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎక్కువ మోడల్స్ లేకపోయినా, తక్కువ లైనప్‌తోనే బలమైన స్థానం సంపాదించుకున్న కంపెనీగా రెనాల్ట్ ఇండియా (Renault India) ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా కొనసాగుతూ, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని సరైన ధరల్లో ప్రాక్టికల్ కార్లను అందించడం ద్వారా ఈ బ్రాండ్ తనకంటూ ఒక నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడంతో, రెనాల్ట్ ఇండియా మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆ నెలలో కంపెనీ మొత్తం 5,413 యూనిట్ల కార్లను విక్రయించింది. సంఖ్య పరంగా ఇది పెద్దగా కనిపించకపోయినా, అసలు కథ దాని వృద్ధిలో ఉంది.

టాటా కర్వ్ EV కొత్త వేరియంట్లు లాంచ్

ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే బ్యాటరీ భయం పెద్ద సమస్య... కానీ ఇప్పుడు టాటా దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన కస్టమర్ల కోసం మరో అదిరిపోయే అప్డేట్ మోసుకొచ్చింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ అయిన కర్వ్ ఈవీ (Curvv.ev)లో సరికొత్తగా SeriesX శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

పెట్రోల్‌కు గుడ్‌బై చెప్పే బుల్లెట్..! చెన్నైలో టెస్ట్‌లో E85 క్లాసిక్ 350

బుల్లెట్ అంటేనే గుర్తుకొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). దశాబ్దాలుగా రైడర్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఇప్పుడు మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. పెట్రోల్‌పై పూర్తిగా ఆధారపడే రోజుల నుంచి బయటకు వచ్చి, పర్యావరణానికి మేలు చేసే మార్గంలో అడుగులు వేస్తోంది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన క్లాసిక్ 350 మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే చెన్నై నగరంలో ఈ ఐకానిక్ బైక్ కొత్త అవతారంలో టెస్ట్ రన్స్ చేస్తుండటం పెద్ద చర్చకు దారి తీసింది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త క్లాసిక్ 350, భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది.
Advertisement

ట్రెండింగులో త్రిష.. రూ.100 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్ల డీటెయిల్స్ ఇవే

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటే గుర్తొచ్చే పేరు త్రిష కృష్ణన్. దాదాపు పాతికేళ్లుగా వెండితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతున్న ఈ చెన్నై చిన్నది, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే కేవలం నటనలోనే కాదు, సంపాదనలోనూ, ఆస్తులు కూడబెట్టడంలోనూ త్రిష ఏమాత్రం తగ్గడం లేదు.

దళపతి సీఎం అయితే ఏ కారు వాడతారు?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ, కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటి వరకు ద్రవిడ పార్టీలే ప్రధానంగా ఆధిపత్యం చెలాయించిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు టీవీకే (TVK) ముందంజలో నిలవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇది కేవలం ఎన్నికల ఫలితాల మార్పు మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో మూడవ శక్తి బలపడుతున్నదానికి ఇది స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా రెండు పార్టీల మధ్యే తిరిగిన రాజకీయ సమీకరణాలకు ఇది ఒక సవాలు. ప్రత్యేకంగా, ఈ విజయంతో విజయ్ (Vijay) సాధించిన ప్రభావం గురించి మాట్లాడుకోవాల్సిందే.

దేశంలోనే ఛీపెస్ట్ కారు పై ఇంకా 37,500 డిస్కౌంట్

మధ్య తరగతి భారతీయుడి సొంత కారు కలను నిజం చేయడంలో ఎల్లప్పుడూ మారుతి సుజుకీనే ముందుంటుంది. తాజాగా మే 2026 నెలలో మారుతి తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా పేరుగాంచిన మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) పై అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మారుతి సుజుకి సంస్థ తన ఎస్-ప్రెస్సో మోడల్‌పై ఈ నెలలో గరిష్టంగా రూ.37,500 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందులో నేరుగా లభించే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు కారు వేరియంట్, మీరు ఉండే నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఆఫర్ల గురించి పూర్తి క్లారిటీ కావాలంటే మీ సమీపంలోని మారుతి సుజుకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది. బడ్జెట్ తక్కువగా ఉండి కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ మే నెల ఆఫర్లు కచ్చితంగా కలిసొస్తాయి.

మారుతి తర్వాత టాటా దూకుడు! ఒక్క నెలలో 59 వేల కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకి అగ్రస్థానంలో దూసుకుపోతూనే ఉంది. కానీ అసలు ఆసక్తికరమైన పోటీ మాత్రం రెండో స్థానానికి. ఈ స్థానం కోసం టాటా మోటార్స్, మహీంద్రా, హ్యూందాయ్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గట్టిపోటీ కొనసాగుతోంది. ఇటీవల వరకు ఈ రేసులో మహీంద్రా మంచి జోరుతో ముందంజలో నిలిచింది. SUV సెగ్మెంట్‌లో తమ బలమైన ప్రెజెన్స్‌తో రెండో స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఏప్రిల్ నెలలో ఆట పూర్తిగా మలుపు తిరిగింది. ఈసారి టాటా మోటార్స్ తన విక్రయ శక్తిని పూర్తిగా ప్రదర్శిస్తూ మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. ఏప్రిల్‌లో టాటా మోటార్స్ మొత్తం 59,701 కార్లను విక్రయించడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది.
Advertisement

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయండి

ప్రస్తుతం కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి బ్రాండ్ కారు వస్తుందన్న ఆశతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లేదా లోకల్ డీలర్ల దగ్గర కార్లను పరిశీలిస్తుంటారు. OLX, Cars24, Spinny లాంటి ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఇంట్లో కూర్చునే కారు ఫైనల్ చేసేయొచ్చు. అయితే, ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ సృష్టించిన నిస్సాన్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) మరోసారి భారత మార్కెట్‌పై తన నిబద్ధతను గట్టిగా తెలియజేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే, నిస్సాన్ దేశీయ మార్కెట్లో 75 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇది సాధారణ పెరుగుదల కాదు, మార్కెట్‌లో తమ బ్రాండ్‌పై మళ్లీ వినియోగదారుల నమ్మకం పెరుగుతోందనే సంకేతం. ఏప్రిల్ నెలలోనే ఎగుమతులు, దేశీయ విక్రయాలను కలిపి మొత్తం 5,388 యూనిట్లను అమ్మగలగడం, కంపెనీ పునరుజ్జీవనానికి ఒక స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, భారత్‌లో నిస్సాన్ బ్రాండ్ మళ్లీ పుంజుకుంటోందని చెప్పే బలమైన కథ. గతంలో ఎదురైన సవాళ్లను దాటుకుని, కొత్త మోడళ్లతో, వినియోగదారులకు చేరువయ్యే వ్యూహాలతో నిస్సాన్ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందని చెప్పవచ్చు.

ఈ 5 బైక్స్ చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది

భారతదేశంలో ఒకప్పుడు బైక్ ఒకప్పుడు బైక్ అంటే కేవలం ఆఫీసుకో, కాలేజీకో వెళ్లడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటితరం యువత బైకులో పవర్, స్టైల్, హ్యాండ్లింగ్.. ఇలా అన్నింటినీ వెతుకుతోంది. అందుకే కంపెనీలు కూడా కేవలం లక్షల్లో ఖర్చు పెడితేనే దొరికే పర్ఫార్మెన్స్ బైక్స్‎ను ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి, అంటే రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నాయి. మీరు కూడా కొత్తగా ఒక అదిరిపోయే బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే 2026 మే నెలలో మార్కెట్ను ఊపేస్తున్న టాప్-5 బైక్స్ వివరాలు తెలుసుకుందాం.

చూసి కొనండి.. Activa vs Jupiter రెండింటిలో ఏది బెస్ట్ ?

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే మొదటి రెండు పేర్లు హోండా, టీవీఎస్. ముఖ్యంగా ఫ్యామిలీ సెగ్మెంట్‌లో 125cc స్కూటర్ కొనాలనుకునే వారికి హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపిటర్ 125 మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరు బ్రాండ్ వాల్యూ, మైలేజీలో రారాజు అయితే.. మరొకరు ఫీచర్లు, స్టోరేజ్ స్పేస్‌లో కింగ్. మరి 2026లో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ స్కూటర్ బెస్ట్? ఏది కొంటే మీ డబ్బుకు సరైన విలువ దక్కుతుంది? ఈ కంపారిజన్లో తెలుసుకుందాం.
Advertisement

దేశంలోనే చీపెస్ట్ 7 సీటర్.. ఇప్పుడు కొంటే 37,500 డిస్కౌంట్

భారతదేశంలో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయే కారు కొనాలి అంటే చాలా మందికి మొదట గుర్తొచ్చేది బడ్జెట్. 7 సీటర్ అంటే ఖచ్చితంగా 10 లక్షలు దాటుతుందని అనుకునే వాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. తక్కువ ధరలోనే ఫ్యామిలీ మొత్తం కూర్చునే కార్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒక మోడల్ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది.

గంటకు 778 యూనిట్లు అమ్ముడవుతున్న పేదవాడి బండి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నా... ఒక కంపెనీ మాత్రం తగ్గడం లేదు. ఒక్క గంటలోనే వందల బైక్‌లు అమ్ముతూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 2026లో Honda Motorcycle and Scooter India చేసిన రికార్డ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి భారతీయ రోడ్ల మీద టూ వీలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో హోండా (Honda Motorcycle & Scooter India) ఒకటి.

రోడ్ టాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు

భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. పెట్రోల్ కొట్టించాలంటే బంకుల దగ్గర క్యూ కట్టడం, పెరుగుతున్న ధరలతో జేబులు గుల్ల చేసుకోవడం ఇష్టం లేని సామాన్యుడు ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నాడు. కేవలం పర్యావరణం మీద ప్రేమతో మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అదిరిపోయే ఆఫర్లు, సబ్సిడీల దెబ్బకు ఈవీ (EV) మార్కెట్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యాటరీ వాహనాల సందడి కనిపిస్తోంది.

కారు ఓవర్‌హీట్ అవుతోందా?

సమ్మర్ వచ్చిందంటే చాలు.. భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తాడు. 40 నుంచి 45 డిగ్రీల ఎండలో మనం బయట అడుగుపెట్టడానికే భయపడుతుంటాం. మరి అలాంటి ఎండలో గంటల కొద్దీ రోడ్లపై తిరిగే మన కారు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? వేడి తాకిడికి మనుషులకే కాదు, యంత్రాలకు కూడా ముచ్చెమటలు పడతాయి.
Advertisement

పేద మధ్యతరగతి కోసం బెస్ట్ 5 కార్లు ఇవే

కారు కొనాలి అనిపిస్తుంది... కానీ బడ్జెట్ అడ్డంకి. ఇదే పరిస్థితి చాలా మందిది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బైక్ ధరలోనే కారు కొనొచ్చు... సొంత కారు అనేది ప్రతి సామాన్యుడి కల. కానీ ఆ కారు కొన్న తర్వాత పెట్రోల్ ధరల సెగ తట్టుకోవాలి అనే భయంతో చాలా మంది ఆ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు రోజులు మారాయి.

ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై అనిశ్చితిని తీసుకొచ్చాయి. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయా లేదా అన్న సందేహం ప్రజల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చాలామంది వినియోగదారులు సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు కొనడం ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాకుండా ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తూ, రోజురోజుకీ మరింత బలపడుతోంది. ఇప్పుడు ఈ కథణంలో ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని ఈవీ కార్లను చూద్దాం.

రాత్రి డ్రైవింగ్‌లో జరిగే ప్రమాదాలకి ఇదే కారణం

Night Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్ అంటే చాలా మందికి భయం. కానీ నిజం ఏంటంటే... చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా తక్కువ విజిబిలిటీ, ఎదురుగా వచ్చే లైట్ల గ్లేర్, అంచనా తప్పడం.. ఇవి అన్నీ కలిసి రిస్క్‌ను పెంచేస్తాయి.

కఠిన పరిస్థితుల్లో కూడా ఎంజీ సేల్స్ పెరిగాయి!

ప్రతి నెల ముగిసిన వెంటనే వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించడం ఆటోమొబైల్ రంగంలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇదే తరహాలో ప్రముఖ కార్ల తయారీదారు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) కూడా ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన తన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాలు చూస్తే, కంపెనీ భారత మార్కెట్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 2026లో ఎంజీ మొత్తం 6,018 వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్యలో పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే, అన్ని సెగ్మెంట్లలో కంపెనీ సమతుల్యంగా ప్రదర్శన కనబరుస్తోందని చెప్పవచ్చు.
Advertisement

మార్కెట్‌ను షేక్ చేసిన మారుతి.. ఏప్రిల్‌లో సేల్స్ బూస్ట్!

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చాలా కాలంగా ప్రతి నెల అమ్మకాలలో ముందంజలో ఉండే ఈ సంస్థ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2026లో మారుతి సుజుకి మొత్తం 2,39,646 (దేశీయ+ఎగుమతులు) వాహనాలను విక్రయించింది. ఇది కేవలం ఒక మంచి సంఖ్య మాత్రమే కాదు కంపెనీ నెలవారీ అమ్మకాల చరిత్రలో కొత్త గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 1,79,791 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈసారి దాదాపు 33.29 శాతం వృద్ధిని సాధించడం విశేషం.