ట్రాఫిక్‎లో చూసినా, షోరూమ్‎లో ఎక్కడ చూసినా ఇదే

భారతదేశంలో టూ-వీలర్ నడిపే ప్రతి ఒక్కరికీ హోండా యాక్టివా స్కూటర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన వెహికల్‎గా మారిన ఈ స్కూటర్, సేల్స్ పరంగా మరోసారి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మే 2026 నెల అమ్మకాల గణాంకాలను చూస్తే యాక్టివా డిమాండ్ ముందు మిగతా మోడల్స్ అన్నీ చాలా వెనుకబడిపోయాయి. ఈ స్కూటర్ పాపులారిటీ ఎంతలా ఉందంటే, మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారులుగా ఉన్న టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్‎ల మొత్తం కంబైన్డ్ సేల్స్ కూడా యాక్టివా సింగిల్ సేల్స్ కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి.

3 సెకన్లలో 100 కిమీ వేగం.. పోర్షే కొత్త రేసింగ్ రాక్షసుడు వచ్చేశాడు!

ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ కార్ల అభిమానుల కలల కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన పోర్షే 911 GT3 ఇప్పుడు భారత మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. 2026 మోడల్ ఇయర్‌కు చెందిన అప్‌డేట్ చేసిన 911 GT3ను భారతీయ కస్టమర్ల కోసం విడుదల చేసింది. ట్రాక్‌పై అసాధారణ పనితీరును అందించడమే కాకుండా, రోడ్డుపై కూడా అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించే ఈ సూపర్‌కార్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అదే కారు అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన ఏరోడైనమిక్స్, మరింత పదునైన పనితీరుతో భారత మార్కెట్లోకి రావడం స్పోర్ట్స్ కార్ ప్రేమికులకు పెద్ద శుభవార్తగా మారింది. భారతదేశంలో ఈ సూపర్‌కార్‌ను పోర్షే రూ.3.33 కోట్ల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది.

పెద్ద మెకానికల్ సమస్యలకు ముందే కనిపించే ఈ హెచ్చరికలు మిస్ అయితే భారీ నష్టం తప్పదు!

Car Maintenance Tips: మీ కారు ఇచ్చే ఈ చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. పెద్ద ఖర్చుల నుండి తప్పించుకోవడానికి ఈ ముఖ్యమైన సంకేతాలను ఇప్పుడే తెలుసుకోండి.

3 లక్షల మంది కొనేసిన క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM) దేశీయ మార్కెట్లో ఏకంగా 3,00,000 యూనిట్ల రిటైల్ విక్రయాల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్(Vahan Portal) నుంచి సేకరించిన డేటా ప్రకారం.. మే 2019 నుంచి జూన్ 17, 2026 వరకు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆంపియర్ వెహికల్స్ రెండూ కలిపి మొత్తం 3,00,293 ఎలక్ట్రిక్ టూ-వీలర్ డెలివరీలను పూర్తి చేశాయి. ఈ ఘనతతో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈవీ బ్రాండ్లలో ఒకటిగా ఇది అవతరించింది.
Advertisement

మళ్లీ పేదవాడి బండికే పట్టం కట్టిన జనాలు

భారతదేశంలో టూ-వీలర్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన మే 2026 నాటి దేశీయ వాహనాల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఈ నెలలో కూడా ఎప్పటిలాగే మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి హీరో స్ప్లెండర్ (Hero Splendor) అమ్మకాల్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

మీ వాహనం రీసేల్ విలువ పెరగాలా? ఈ సింపుల్ అలవాట్లు ఫాలో అయితే చాలు!

Car Maintenance Tips: మీ కారు రీసేల్ విలువను పెంచుకోవడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం మరియు పత్రాలను భద్రపరుచుకోవడం వంటి సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

చిన్న కారు.. పెద్ద రేంజ్.. MG నుంచి 500 కి.మీ వెళ్లే EV రాబోతోంది!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఎంజీ మోటార్ (Mg Motor) మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కామెట్ EV, విండ్సర్ EV వంటి మోడళ్లతో దేశీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ఇప్పుడు మరింత సరసమైన ధరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ కొత్త మోడల్ త్వరలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో వులింగ్ బింగువో (Binguo) పేరుతో విక్రయించబడుతున్న ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇటీవల భారతీయ రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కనిపించింది.

కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ నెలాఖరు వరకే ఛాన్స్

సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తున్న మధ్య తరగతి, ప్రీమియం కస్టమర్లకు ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) గట్టి జలక్ ఇచ్చింది. తన వాహన శ్రేణి అంతటా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల, అంటే జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. వాహనాల తయారీకి అయ్యే ముడిసరుకుల ధరలు (Commodity Prices), ఇతర ఇన్పుట్ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ భారాన్ని ఆంశికంగా కస్టమర్లపై వేయక తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది.
Advertisement

దేశంలో అత్యధిక మంది కొంటున్న బైక్ ఇదే

భారత టూవీలర్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది హీరో స్ప్లెండర్ (Hero Splendor). దశాబ్దాలుగా భారతీయుల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ బైక్, కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్, నమ్మకమైన పనితీరు, అందుబాటు ధర వంటి అంశాలు స్ప్లెండర్‌ను దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌గా నిలబెట్టాయి. మార్కెట్లో ప్రతి ఏడాది కొత్త మోడళ్లు, కొత్త టెక్నాలజీలు ప్రవేశిస్తున్నప్పటికీ స్ప్లెండర్‌కు ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తాజా అమ్మకాల గణాంకాలే నిదర్శనం.

స్కూటర్ కొనాలంటే ఇప్పటికీ ఇదే మొదటి ఆప్షన్

భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). రెండు దశాబ్దాలకు పైగా భారతీయ రోడ్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ స్కూటర్, కేవలం ఒక టూవీలర్ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కారణంగా యాక్టివా సంవత్సరాలుగా వినియోగదారుల తొలి ఎంపికగా నిలుస్తోంది. అందుకే మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ, యాక్టివా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి నిదర్శనంగా తాజా అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి.

బ్రెజ్జా, నెక్సాన్‌లకు పోటీగా ఫోక్స్‌వ్యాగన్ సరికొత్త అస్త్రం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత రసవత్తరంగా సాగుతున్న విభాగం సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కార్ల హవా నడుస్తోంది. ఈ పాపులర్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సంచలన ప్లాన్ సిద్ధం చేసింది. తన అద్భుతమైన జర్మన్ బిల్డ్ క్వాలిటీ, మోడ్రన్ డిజైన్‌తో మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది.

కి.మీకు రూ.2.26 ఖర్చే.. రూ.6.89 లక్షలకే కొత్త ఈవీ కారు!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన తాజా ఎలక్ట్రిక్ కారు eC3X ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు, అందుబాటు ధరల కలయికతో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు దేశీయ EV కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందించబడింది. ముఖ్యంగా తొలిసారిగా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మోడల్ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కంపెనీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. 2026 మోడల్‌గా వచ్చిన ఈ సిట్రోయెన్ ఇసీ3ఎక్స్‌లో (Citroen eC3X) ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.10.25 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఇది పోటీ ధరగా చెప్పవచ్చు.
Advertisement

ఇండియన్ మార్కెట్లోకి టాప్-3 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల (eSUV) విభాగం చాలా వేగంగా విస్తరిస్తోంది. పర్యావరణ హితంతో పాటు తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ప్రయాణించేందుకు కస్టమర్లు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను మరింతగా వాడుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్, కియా ఇండియా, హోండా కార్స్ సరికొత్త ప్లాన్‌లతో ముందుకొచ్చాయి. రాబోయే కొద్ది నెలల వ్యవధిలోనే మన దేశీయ రోడ్లపై మూడు మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సందడి చేయనున్నాయి.

లైసెన్స్, నంబర్ ప్లేట్ అవసరం లేని కొత్త స్కూటర్

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంపియర్ సంస్థ తాజాగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Reo vyb (రియో VYB)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సరసమైన ధర, సులభమైన వినియోగం, తక్కువ నిర్వహణ ఖర్చులతో ఈ స్కూటర్ నగర ప్రాంతాల్లో ప్రయాణించే వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించబడింది. ఆంపియర్ రియో VYB పనితీరు విషయానికి వస్తే, ఇందులో 1.44 kWh సామర్థ్యం గల LFP (లిథియం ఫెర్రో ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.

భారీ రిపేర్ ఖర్చులు రాకముందే ఎలా ఆపాలి? ఈ స్మార్ట్ టిప్స్ తప్పక తెలుసుకోండి!

Vehicle maintenance tips. కారు లేదా బైక్ రిపేర్ ఖర్చులు పెరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. ఇంజిన్ ఆయుష్షు పెంచే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

భారత మార్కెట్లోకి BaaSతో కేవలం రూ.6.89 లక్షలకే కొత్త ఈవీ కార్

భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో రోజురోజుకూ సరికొత్త విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్, దేశీయ ఈవీ ప్రియులను ఆకట్టుకోవడానికి తమ సరికొత్త అప్‌డేటెడ్ మోడల్ 2026 సిట్రోయెన్ eC3X ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ సెడాన్ కారును మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌లో పాత వెర్షన్ కంటే డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా ఎన్నో సరికొత్త అప్‌డేట్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సిట్రోయెన్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లలో ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి.
Advertisement

చెన్నైలోనే తయారీ.. భారీగా తగ్గిన లగ్జరీ కార్ మినీ లాంచ్

ఆటోమొబైల్ రంగంలో స్టైలిష్ లుక్, లగ్జరీ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మినీ (Mini) బ్రాండ్.. భారతీయ మార్కెట్లోకి తమ సరికొత్త క్రాస్‌ఓవర్ మోడల్ మినీ కంట్రీమ్యాన్ Cని జూన్ 17, 2026న అధికారికంగా విడుదల చేసింది. లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో మరింత గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. ప్రీమియం అర్బన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే కస్టమర్లను, ముఖ్యంగా మినీ బ్రాండ్‌కు ఉన్న సిగ్నేచర్ స్టైలింగ్‌ను కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ రంగంలోకి దించింది. ఈ సరికొత్త మినీ కంట్రీమ్యాన్ C మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.47.5 లక్షలుగా నిర్ణయించింది. గతంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించిన పవర్‌ఫుల్ మోడల్ కంట్రీమ్యాన్ JCW All4 ధర రూ.64.9 లక్షలుగా ఉండేది.

హైవేలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు ఏవి? ప్రతి డ్రైవర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Highway safety tips. హైవేపై ప్రయాణించేటప్పుడు టైర్ పేలడం లేదా బ్రేక్ ఫెయిల్యూర్ వంటి అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. అయినా ఆకట్టుకోలేకపోతుంది

భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకి సంస్థకు మే 2026 సేల్స్ పరంగా ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మిడిల్ క్లాస్ ఫేవరెట్ కారుగా పేరు తెచ్చుకున్న మారుతి బ్రెజ్జా, దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్ల జాబితా నుంచి మొదటిసారిగా అవుట్ అయింది. గత నెలలో ఈ కారు 13,245 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినప్పటికీ, ప్రత్యర్థి కంపెనీల కార్ల జోరు ముందు నిలవలేకపోయింది. గత ఏడాది మే నెలలో అమ్ముడైన 15,566 యూనిట్లతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది బ్రెజ్జా వార్షిక అమ్మకాలు ఏకంగా 14 శాతం పడిపోవడం గమనార్హం.

లైసెన్స్ అక్కర్లేదు.. రిజిస్ట్రేషన్ అస్సలే వద్దు.. క్రేజీ బైక్ గురూ!

భారతీయ ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి చిన్న అవసరానికి సైకిల్ తొక్కడం కష్టంగా అనిపిస్తుంది.. అలాగని లక్ష రూపాయలు పెట్టి పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసమే సరిగ్గా సైకిల్‌కు పైన, స్కూటర్‌కు కింద ఉండేలా ఒక సరికొత్త ఇంటర్మీడియట్ ఈవీ టూవీలర్‌ను కోమాకి కంపెనీ పరిచయం చేసింది. అదే కోమాకి XR1 (Komaki XR1) ఎలక్ట్రిక్ మొపెడ్. నగరాల్లో, గ్రామాల్లో తక్కువ దూరాలు ప్రయాణించడానికి ఇది అత్యంత అనుకూలమైన వాహనంగా పేరు తెచ్చుకుంది.
Advertisement

బడ్జెట్ ధరలో వస్తున్నా పడిపోతున్న ఆ కంపెనీ కార్ సేల్స్

భారత మార్కెట్లో నిస్సాన్ ఇండియా కంపెనీ మే నెల మోడల్ వైజ్ సేల్స్ డేటా అధికారికంగా విడుదలైంది. ప్రస్తుతం నిస్సాన్ సంస్థ భారతీయ మార్కెట్లో ప్రధానంగా రెండు మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ఒకటి సూపర్ హిట్ ఎస్‌యూవీ మాగ్నైట్ కాగా.. మరొకటి ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన చౌకైన 7-సీటర్ ఎమ్‌పీవీ గ్రావైట్ (Gravite). అయితే గత మే నెల నిస్సాన్ కంపెనీకి కాస్త నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన కొత్త 7-సీటర్ గ్రేవైట్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మే నెలలో నిస్సాన్ మొత్తం 2,948 యూనిట్లను విక్రయించగా.. అందులో మాగ్నైట్ కారు 1,665 యూనిట్ల సేల్స్‌తో టాప్‌లో నిలిచింది.

త్వరలోనే మార్కెట్లోకి ఇథనాల్‌తో నడిచే 5 సరికొత్త కార్లు

భారత ఆటోమొబైల్ రంగం రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలవబోతోంది. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ రోడ్లపై 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) ఇంధనంతో నడిచే కార్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

ఇంజిన్ ఐడ్లింగ్ వల్ల ఇంధనం ఎంత వృథా అవుతుందో తెలుసా? ఈ నిజం షాక్ ఇస్తుంది!

Engine Idling Fuel Waste. కారు లేదా బైక్ ఇంజిన్ ఆన్ చేసి ఉంచడం వల్ల ఎంత పెట్రోల్ వృథా అవుతుందో తెలుసా? ఐడ్లింగ్ వల్ల కలిగే నష్టాలు మరియు ఇంధనం ఆదా చేసే చిట్కాలు ఇక్కడ చూడండి.

చిన్న కుటుంబానికి చింత లేని కారు.. 32+ కిమీ మైలేజ్‌తో పేదోడి కళ్లలో ఆనందం!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అందుబాటు ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) ఒకటి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే కుటుంబాలు, పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఈ కారును ఎంచుకుంటుంటారు. నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెలెరియోకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లు, మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడం ఈ కారు విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, సెలెరియోపై వినియోగదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

రాబోయే 2 నెలల్లో మార్కెట్లోకి 6 అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ SUVలు

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్ల హవా కొనసాగుతోంది. కస్టమర్లలో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ పాత హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడల్స్ పక్కన పెట్టి, సరికొత్త ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్ కార్లపైనే పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్, అప్‌డేటెడ్ హారియర్, సఫారి, మహీంద్రా XUV 7XO వంటి కార్లు సృష్టించిన సంచలనం మనందరికీ తెలిసిందే. అయితే రాబోయే రెండు నెలలు (జులై, ఆగస్టు) కార్ల లవర్స్‌కు మరింత పండగలా మారబోతున్నాయి. దేశంలో లాంచ్ కాబోతున్న ఆ 6 SUVల గురించి తెలుసుకుందాం.