లాంగ్ రైడ్ చేసేందుకు అద్భుతమైన టాప్ 5 బైక్స్

బైక్ పట్టుకుని ఒంటరిగా కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణించడం, ప్రకృతిని ఆస్వాదించడం అనేది ప్రతి రైడర్ కనే ఒక అందమైన కల. అయితే ఒక వెయ్యి లేదా రెండు వేల కిలోమీటర్ల లాంగ్ జర్నీ చేయాలంటే కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు. సరైన బైక్ కూడా ఉండాలి. మన దేశంలో రోడ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ఒకవైపు మెరిసిపోయే ఎక్స్‌ప్రెస్‌వేలు ఉంటే, మరోవైపు రాళ్లు రప్పలతో నిండిన కొండ దారులు ఉంటాయి. ఇలాంటి విభిన్నమైన దారుల్లో మిమ్మల్ని అలసిపోనివ్వకుండా, గమ్యాన్ని సురక్షితంగా చేర్చే 5 అద్భుతమైన బైకుల వివరాలు మీకోసం..

క్లచ్‌తో పనిలేకుండానే గేర్లు మార్చేయొచ్చు.. అడ్వెంచర్ ప్రియుల కలల బైక్ ఎలా ఉందంటే ?

BMW F 450 GS Review : ఒక మంచి బైక్ కొనే కల చాలా మందికి కేవలం ప్రయాణం కోసం కాదు... అది ఒక ఫీలింగ్. వీకెండ్ వచ్చిందంటే బ్యాగ్ వేసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలి, లాంగ్ రైడ్స్‎లో మనసు ఫ్రీ అవ్వాలి, ప్రతి మలుపులో కొత్త అనుభవం దొరకాలి. ఇలా కలలు కనే రైడర్స్ కోసం ఒక బైక్ ఉంటే అది స్పెషల్ గానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి అడ్వెంచర్ డ్రీమ్‌ను నిజం చేయడానికి BMW F 450 GS భారత్‌లోకి వచ్చింది. రోడ్డుపైనే కాదు... మనసులో కూడా ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసే బైక్‌గా ఇది ఇప్పటికే రైడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

నాన్నలు మనల్ని ఎక్కించుకుని తిప్పిన బైక్..కాలగర్భంలో కలిసిపోనుందా?

ఒకప్పుడు ఇంట్లో కొత్త బైక్ కొంటే... నాన్న గర్వంగా కీలు తిప్పి బయటకు తీసుకొచ్చేది అదే. పిల్లలు వెనుక కూర్చుని షికార్లకు వెళ్లిన మొదటి జ్ఞాపకం కూడా అదే. ఎక్కువ ఖర్చు లేకుండా, నమ్మకంగా రోజూ ఆఫీస్‌కు తీసుకెళ్లే కుటుంబ సభ్యుడిలా ఉండేది ఆ బైక్. కానీ ఇప్పుడు కాలం మారింది... కొత్త మోడల్స్, కొత్త స్టైల్ మధ్య ఆ పాత నేస్తం నెమ్మదిగా కనుమరుగవుతోంది. అదే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్( TVS Star City Plus) ఒకప్పుడు లక్షల మంది హృదయాలను గెలిచిన బైక్, ఇప్పుడు కేవలం జ్ఞాపకాలలో మిగిలిపోతుందా అనే స్థితికి చేరుకుంది.

దీని ఎంట్రీతో ప్రపంచంలోని అన్ని కంపెనీలు గజగజ వణుకుతున్నాయి

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. ఇప్పటి వరకు బడ్జెట్ ఈవీ అనగానే టాటా టియాగో ఈవీ లేదా ఎంజీ కామెట్ పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ, వీటన్నింటికీ గట్టి పోటీ ఇస్తూ, ప్రపంచ ఈవీ దిగ్గజం BYD (Build Your Dreams) తన అత్యంత చవకైన కారు సీగుల్ (Seagull)ను భారత్‌లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. కేవలం రూ.10 లక్షల లోపు ధరలోనే, లగ్జరీ ఫీచర్లు, ఊహించని రేంజ్‌తో ఈ కారు రాబోతుండటం ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం BYD ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో టెస్లా వంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే భారతదేశంలో సీలియన్ 7, అట్టో 3 వంటి ప్రీమియం మోడల్స్‌తో సత్తా చాటుతున్న ఈ కంపెనీ, ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్‌పై కన్నేసింది. 2023లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన సీగుల్ ఈవీకి చైనాలో మొదటి 24 గంటల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్ రావడం దీని క్రేజ్‌కు నిదర్శనం. ఇప్పటికే ఈ కారు ట్రేడ్‌మార్క్ పనులు భారత్‌లో పూర్తయ్యాయి, అంటే ఏ క్షణమైనా ఇది మన రోడ్లపైకి రావచ్చు. సీగుల్ ఒక 5-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. దీని బాహ్య రూపం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఐస్ బ్రేకింగ్ ఐస్ హెడ్‌లైట్లు, వెనుక వైపు కనెక్టింగ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు దీనికి ఒక మోడ్రన్ లుక్ ఇస్తాయి. కారు లోపల అడుగుపెడితే, అది ఒక బడ్జెట్ కారులా అస్సలు అనిపించదు. 12.8 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 5 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సామాన్యుడి కారులో కూడా ఇంతటి లగ్జరీ ఉండటం విశేషం. BYD సీగుల్ ఈవీ ప్లాట్‌ఫామ్ 3.0 స్కేట్‌బోర్డ్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 30 kWh బ్యాటరీ ప్యాక్ దాదాపు 305 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 38 kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 405 కిలోమీటర్ల (CLTC) రేంజ్ ఇస్తుంది. 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పెట్రోల్ ఖర్చుల నుంచి విముక్తి పొందాలనుకునే వారికి, ముఖ్యంగా సిటీలో తిరిగే వారికి ఇది ఒక గొప్ప వరం. టమ్మీ టెర్రర్ లాంటి ఈ కారు, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీల అమ్మకాలకు గండి కొట్టడం ఖాయం. చైనా మార్కెట్లో సీగుల్ ధర దాదాపు రూ. 9.4 లక్షల నుంచి రూ. 11.4 లక్షల మధ్య ఉంది. భారత్‌లో కూడా దీనిని రూ. 10 లక్షల లోపే లాంచ్ చేస్తారని అంచనా. ప్రస్తుతం భారత్‌లో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలు బడ్జెట్ ఈవీ విభాగంలో రారాజులుగా ఉన్నాయి. కానీ సీగుల్ ఇచ్చే రేంజ్, ఫీచర్లతో పోలిస్తే, అవి కొంత వెనకబడి ఉన్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా లో మెయింటెనెన్స్, ప్రీమియం ఫీల్ కోరుకునే వారు ఈ కారు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో BYD సీగుల్ వంటి కార్లు మార్కెట్లోకి రావడం వల్ల పోటీ పెరిగి, వినియోగదారులకు తక్కువ ధరకే మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చివర్లోపు సీగుల్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు కూడా ఒక బడ్జెట్ ఈవీ కొనే ఆలోచనలో ఉంటే, మరికొన్నాళ్లు ఆగి ఈ సీగుల్ మ్యాజిక్ చూశాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Advertisement

5.38 లక్షల మంది కొన్న టాప్ 3 మోడల్స్ ఇవే

భారతీయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కారు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేయడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కేవలం 365 రోజుల్లో మారుతికి చెందిన మూడు కార్లు ఏకంగా 5.38 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఈ కార్ల అమ్మకాలు, వాటి ప్రత్యేకతలు, సామాన్యుడికి ఇవి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం. 2026 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 కార్ల జాబితాను నిశితంగా గమనిస్తే.. అందులో సగం మారుతి సుజుకి మోడల్స్ ఉండడం విశేషం. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన మారుతి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బలెనో కార్లు కలిసి మొత్తం 5,38,044 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. ఈ మూడు కార్లు కూడా ఏడాదిలో లక్ష కంటే ఎక్కువ మంది కస్టమర్లను సొంతం చేసుకున్న ఏకైక మోడల్స్‌గా నిలిచాయి.

డౌన్ పేమెంట్ అవసరం లేదు.. నిస్సాన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ షాక్!

భారత మార్కెట్లో తన స్థిరత్వాన్ని పెంచుకోవడానికి నిస్సాన్ (Nissan) కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కేవలం కొత్త కార్లు విడుదల చేయడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు కొనుగోలు విధానాల్లో కూడా కొత్త ఆప్షన్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టి మార్కెట్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్, గ్రావైట్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇవి ఇప్పటికే ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా వినియోగదారుల మధ్య మంచి గుర్తింపును పొందాయి. ఇప్పుడు ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేయడానికి సంప్రదాయ ఫైనాన్స్ లేదా క్యాష్ ఆప్షన్‌లతో పాటు, లీజు, సబ్‌స్క్రిప్షన్ వంటి కొత్త విధానాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

బడ్జెట్ ధరలో 30కిమీ మైలేజ్ ఇచ్చే మహింద్రా పవర్‌ఫుల్ కారు

దేశీ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా (Mahindra and Mahindra) నుంచి ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహింద్రా మొదటి సీఎన్‌జీ (CNG) కారు రోడ్లపైకి రావడానికి ముహూర్తం ఖరారైంది. తన పాపులర్ మోడల్ మహింద్రా XUV 3XOలో సీఎన్‌జీ పవర్‌ట్రైన్‌ను జోడించేందుకు కంపెనీ రెడీ అయింది. దీనివల్ల టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న మిడిల్ క్లాస్ వాహనదారులకు ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సీఎన్‌జీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వినియోగదారులు మైలేజీనిచ్చే సీఎన్‌జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు ఈ విభాగంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ మాత్రమే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అయితే, మహింద్రా ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం భారీ డీజిల్ ఎస్‌యూవీలకే పరిమితం కాకుండా, సామాన్యులకు చేరువయ్యేందుకు XUV 3XO మోడల్‌లో సీఎన్‌జీని ప్రవేశపెడుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ గత రెండేళ్లుగా రారాజుగా వెలుగుతోంది. గత ఏడాది (2025) గణాంకాలను పరిశీలిస్తే.. మహింద్రా 3XO సుమారు లక్ష యూనిట్లు విక్రయించగా, నెక్సాన్ ఏకంగా 2 లక్షలకు పైగా యూనిట్లను అమ్మింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే నెక్సాన్‌కు పోటీగా సీఎన్‌జీ మోడల్ ఉండాలని మహింద్రా భావించింది. ఇప్పుడు 3XO సీఎన్‌జీ రావడంతో, కస్టమర్లకు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ అనే నాలుగు ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా అన్ని రకాల ఇంజన్ ఆప్షన్లు ఉన్న కారుగా 3XO సెన్సేషన్ సృష్టించబోతోంది. మహింద్రా ప్రస్తుతం XUV 3XO లో రెండు రకాల 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి 111hp పవర్ ఇచ్చే మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (MPFI), రెండోది 131hp ఇచ్చే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్. అయితే, సీఎన్‌జీ కోసం మహింద్రా మొదటి ఆప్షన్ అయిన MPFI ఇంజన్‌ను ఎంచుకుంది. ఎందుకంటే ఈ తరహా ఇంజన్లు సీఎన్‌జీ కిట్లను అమర్చడానికి సులభంగా ఉండటమే కాకుండా, తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. XUV 3XO లో ఉన్న ప్రధాన సమస్య దాని బూట్ స్పేస్. ఇప్పటికే దీనిలో కేవలం 295 లీటర్ల స్పేస్ మాత్రమే ఉంది. ఒకవేళ సాధారణ సీఎన్‌జీ సిలిండర్ పెడితే, సామాన్లు పెట్టుకోవడానికి అస్సలు చోటు ఉండదు. దీనిని అధిగమించడానికి మహింద్రా, టాటా నెక్సాన్ లాగే ట్విన్ సిలిండర్ (Twin Cylinder) టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. లేదా మారుతి తన విక్టోరిస్ కారులో వాడినట్లుగా అండర్ బాడీ ట్యాంక్ విధానాన్ని అనుసరించవచ్చు. దీనివల్ల వినియోగదారులకు మైలేజీతో పాటు లగేజీ పెట్టుకోవడానికి కూడా తగినంత స్థలం లభిస్తుంది. ఆటోకార్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, మహింద్రా XUV 3XO సీఎన్‌జీ మోడల్ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి సీఎన్‌జీ సెంట్రిక్ మార్కెట్లలో తన పట్టును పెంచుకోవాలని మహింద్రా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాబోయే కఠినమైన CAFE 3 నిబంధనలను పాటించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ సీఎన్‌జీ మోడల్ మహింద్రాకు ఎంతో కీలకం కానుంది. మొత్తానికి మహింద్రా తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెను మార్పులకు కారణం కానుంది. ఒకప్పుడు కేవలం ఆఫీస్ పనులకు లేదా కమర్షియల్ అవసరాలకు మాత్రమే సీఎన్‌జీ వాడేవారు. కానీ ఇప్పుడు లగ్జరీ ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీల్లో కూడా సీఎన్‌జీ రావడం వల్ల వినియోగదారులకు అటు సౌకర్యం, ఇటు పొదుపు రెండూ లభిస్తాయి. మహింద్రా బ్రాండ్ ఇమేజ్, XUV 3XO లోని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు తోడైతే, సీఎన్‌జీ మార్కెట్లో మహింద్రా తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.

ఇండియాలో అత్యంత చౌకైన బెంజ్ కారు లాంచ్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) భారత మార్కెట్లో కూడా తన ప్రాధాన్యాన్ని నిరంతరం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, కొత్త డిజైన్‌లతో కార్లను విడుదల చేస్తూ, ప్రతి సెగ్మెంట్‌లోనూ తన ఉనికిని బలపరచడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా చూస్తే, బెంజ్ ఇండియాలో కొత్త మోడళ్లను తరచుగా పరిచయం చేస్తూ వినియోగదారుల ఆసక్తిని నిలబెట్టడంలో విజయవంతమైంది. ఇప్పుడు అదే జోష్‌తో కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్-బెంజ్ కూడా తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమైంది.
Advertisement

ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే చాలు.. ఈ కారే కావాలని ఫిక్స్ అయిపోతారు

ఈ రోజుల్లో కారు కొనడం అంటే కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు.. స్టైల్, స్టేటస్, టెక్నాలజీ అన్నీ కలిపి ఓ ప్యాకేజ్‎లా ఉండాలి.. అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య, తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీల్ ఇచ్చే కార్లు ఉంటేనే మధ్యతరగతి కస్టమర్లు వెంటనే ఆకర్షితులవుతున్నారు. ఇదే ట్రెండ్‌ను సరిగ్గా అర్థం చేసుకున్న కియా మోటార్స్ తన కియా సోనెట్‎తో మార్కెట్లో నిజంగానే సునామీ సృష్టిస్తోంది.

35kmpl మైలేజ్‌తో కొత్త ఫ్రాంక్స్.. హైబ్రిడ్ + ADAS ఫీచర్లతో రాబోతుంది!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ సైజ్, అలాగే ఫీచర్ల పరంగా మంచి బ్యాలెన్స్ ఈ మూడు అంశాలు కలిపి ఈ కారును ప్రతి నెలా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలబెట్టాయి. నగరాల్లో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, ఫ్యామిలీ యూజ్‌కు కూడా సరిపోయే విధంగా రూపొందించబడటం దీని ప్రధాన బలం. ముఖ్యంగా Maruti Suzuki బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా ఫ్రాంక్స్ విజయానికి కారణమైంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజ్, అలాగే రీసేల్ వ్యాల్యూ ఇవి వినియోగదారులను ఆకర్షించే అంశాలుగా నిలుస్తున్నాయి.

స్కూటర్ అంటే ఇదే.. అన్ని వర్గాల వారికి అచ్చొచ్చిన బండి

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో స్కూటర్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, ఆఫీసులకు వెళ్లేవారికి స్కూటర్లే ప్రధాన రవాణా సాధనాలుగా మారాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో స్కూటర్ల అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ రేసులో ఎప్పటిలాగే హోండా యాక్టివా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కేవలం ఏడాది కాలంలోనే లక్షలాది మంది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడం విశేషం. మిగిలిన కంపెనీలు కూడా గట్టి పోటీని ఇస్తూ టాప్-10 జాబితాలో నిలిచాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో హోండా యాక్టివా ఎప్పుడూ ముందే ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో ఈ స్కూటర్ ఏకంగా 28,45,052 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే నెలకు దాదాపు 2.3 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న స్కూటర్ కంటే యాక్టివా రెండింతలు ఎక్కువ అమ్మకాలను సాధించడం గమనార్హం. దీని మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్, రీసేల్ వాల్యూ కారణంగా ప్రజలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.

పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్ SUV.. MG మేజెస్టర్ పూర్తి విశ్లేషణ

భారత ఆటోమొబైల్ రంగంలో భారీ హైప్ మధ్య జరిగిన Bharat Mobility Global Expo 2025లో MG Motor అనేక కొత్త మోడళ్లను టీజ్ చేసింది. అందులో MG Cyberster, MG M9 ఇప్పటికే రోడ్లపై కనిపిస్తున్నాయి. అయితే దాదాపు ఏడాది నరంగా టీజ్ చేస్తూ వచ్చిన MG Majestor ఇప్పుడు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫుల్-సైజ్ బాడీ-ఆన్-ఫ్రేమ్ SUV, డీ-సెగ్మెంట్‌లో రాజుగా పేరున్న Toyota Fortunerకు నేరుగా పోటీగా నిలవబోతోంది. మరి నిజంగా ఇది ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలదా? దీని డ్రైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ SUVను డ్రైవ్ చేశాం. ఆ అనుభవం వివరాలు ఈ కింది కథణంలో.
Advertisement

అంచనాలు ఆకాశంలో.. అమ్మకాలు నేలమట్టం

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు భారీ అంచనాలతో అడుగుపెట్టిన జీప్ (Jeep) బ్రాండ్‌కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు అన్న మాట వినిపిస్తోంది. గ్లోబల్‌గా బలమైన ఇమేజ్ ఉన్న ఈ కంపెనీ, ఇండియాలో మాత్రం ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోతోంది. ప్రారంభంలో జీప్ కంపాస్ (Jeep Compass) మోడల్‌తో మంచి ఎంట్రీ ఇచ్చిన జీప్, ఆ కారుతో మార్కెట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. స్టైలిష్ డిజైన్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, అలాగే ప్రీమియం ఫీలింగ్ ఈ మూడు అంశాలు కంపాస్‌ను కస్టమర్లలో పాపులర్ చేశాయి. అయితే ఆ మంచి ఆరంభాన్ని కంపెనీ కొనసాగించలేకపోయింది. కంపాస్ తర్వాత వచ్చిన మోడళ్లలో ఏదీ కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. చుట్టుపక్కల ఊర్లన్నీ చుట్టేసి రావచ్చు

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఛార్జింగ్ టైమ్, రేంజ్ గురించి ఇంకా సందేహాలు ఉన్నాయి... ఈ రెండింటి మధ్య ఇరుక్కున్నవారికి ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. జపాన్ దిగ్గజం Yamaha నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో నెమ్మదిగా కానీ స్ట్రాంగ్‌గా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ మోడల్... ఇప్పుడు అమ్మకాలలో డబుల్ స్పీడ్ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైల్, రేంజ్, బ్రాండ్ నేమ్ ఇలా అన్నీ కలిపి చూస్తే ఇది మిడ్‌రేంజ్ EV సెగ్మెంట్‌లో గేమ్ చెంజర్ అవుతుందా అన్న చర్చ మొదలైంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో బాంబ్.. కొత్త స్క్రాంబ్లర్ 450 రాబోతోంది!

భారత బైక్ మార్కెట్‌లో "రాయల్స్" అన్న పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). క్లాసిక్ లుక్, బలమైన ఇంజిన్, లాంగ్ రైడ్స్‌కు సరిపోయే కంఫర్ట్ ఈ మూడు అంశాలతో దశాబ్దాలుగా రైడర్ల మనసులు గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు అదే బ్రాండ్, కొత్త టెక్నాలజీతో యువతను టార్గెట్ చేస్తూ 450 సిసి ప్లాట్‌ఫామ్‌పై భారీ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌పై Royal Enfield Himalayan 450, Royal Enfield Guerrilla 450 మోడళ్లతో మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. హిమాలయన్ 450 అడ్వెంచర్ రైడర్లకు సరైన ఎంపికగా నిలుస్తే, గొరిల్లా 450 అర్బన్ స్ట్రీట్ రైడింగ్‌కు కొత్త స్టైల్ తీసుకువచ్చింది. ఈ రెండు బైకులు 450 సిసి సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

రూ.87 వేలకే పక్కింటోళ్లు కుళ్లుకునే లుక్స్ తో సరికొత్త స్కూటర్

పెట్రోల్ ఖర్చుతో ఇబ్బంది పడుతున్నారా? ఇక టెన్షన్ అవసరం లేదు... రూ.87 వేలకే 118కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్ వచ్చేసింది. భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిడిల్ క్లాస్ ప్రజల ఫేవరెట్ స్కూటర్ ఆంపియర్ మ్యాగ్నస్ నియో(Ampere Magnus Neo)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ ధరల బాధ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఈ స్కూటర్ ఒక వరప్రసాదంలా మారింది. మరింత స్టైలిష్ లుక్, ఆకట్టుకునే కలర్లతో వచ్చిన ఈ కొత్త వెర్షన్, బడ్జెట్ ధరలోనే అదిరిపోయే రేంజ్‎ను ఆఫర్ చేస్తుంది. ఆంపియర్ మ్యాగ్నస్ నియో అప్‌డేటెడ్ వెర్షన్‌లో అత్యంత ఆకర్షణీయమైన మార్పు దాని కలర్స్. కంపెనీ ఈసారి యూత్‎ను, ఫ్యామిలీలను ఆకట్టుకునేలా బటర్ ఎల్లో అనే సరికొత్త షేడ్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు బ్లూ, గ్రీన్, గ్రే వంటి మోడ్రన్ కలర్ ఆప్షన్లలో కూడా ఇది లభిస్తుంది. డిజైన్ పరంగా పాత మోడల్ క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే, ఈ కొత్త రంగులు స్కూటర్‌కు మరింత ఫ్రెష్, ప్రీమియం ఫీల్‌ను ఇస్తున్నాయి. సిటీ రోడ్లపై ఈ స్కూటర్ వెళ్తుంటే అందరి చూపు దీని వైపు మళ్లడం ఖాయం. సాంకేతిక పరంగా చూస్తే, మ్యాగ్నస్ నియో విశ్వసనీయమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో 2.3 కిలోవాట్స్ కెపాసిటీ కలిగిన LFP (Lithium Iron Phosphate) బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీలకు జీవితకాలం ఎక్కువ ఉండటమే కాకుండా, భారతీయ వాతావరణ పరిస్థితులకు ఇవి చాలా వరకు సురక్షితం కూడా. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 118 కిలోమీటర్ల (IDC రేంజ్) వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అంటే సిటీలో ప్రతి రోజూ ఆఫీసు పనులకు లేదా కాలేజీకి వెళ్లే వారికి ఇది పక్కాగా సెట్ అవుతుంది. బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 5 గంటల టైం మాత్రమే పడుతుంది. భారతీయ రోడ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంపియర్ ఈ స్కూటర్‌ను రూపొందించింది. దీని సీటు హైట్ కేవలం 777 మిమీ మాత్రమే, కాబట్టి తక్కువ హైట్ ఉన్నవారు లేదా లేడీస్ కూడా దీనిని చాలా ఈజీగా నడపవచ్చు. కేవలం 106 కిలోల బరువు మాత్రమే ఉండటం వల్ల ట్రాఫిక్‌లో స్కూటర్‌ను నడపడం చాలా ఈజీ. ఈ స్కూటర్ సుమారు 150 కిలోల వరకు బరువులను మోయగలదు, అంటే ఇద్దరు కూర్చున్నా లేదా సామాన్లు ఉన్నా ఇది సులువుగా లాక్కెల్లగలదు. మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ లాంచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దాని ధర. కొత్త ఫీచర్లు, కలర్స్ జోడించినా కంపెనీ పాత ధరనే కొనసాగిస్తోంది. మ్యాగ్నస్ నియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.86,999 గా ఉంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ ఎండీ వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. లో మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీ, స్టైలిష్ లుక్ కోరుకునే మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ స్కూటర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Advertisement

ఒకటో రెండో కాదు భయ్యా.. రోజుకు వేలల్లో బైకుల విక్రయం

భారతీయ టూ వీలర్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) మార్చి 2026 నెలకు సంబంధించిన సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, తనదైన శైలిలో దూసుకుపోతున్న బజాజ్ మోడల్స్ సేల్స్ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పల్సర్ బ్రాండ్ క్రేజ్ అస్సలు తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. మోడల్ వారీగా బజాజ్ సాధించిన ప్రగతిని గురించి తెలుసుకుందాం.

బడ్జెట్‌లో బెస్ట్ బైక్.. హీరో HF డీలక్స్ సేల్స్ ఎలా ఉన్నాయి?

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్‌ల ప్రాధాన్యం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు తమ డైలీ రైడ్ కోసం ఈ తరహా బైక్‌లపైనే ఆధారపడుతున్నారు. తక్కువ ధరలో లభించడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా లేకపోవడం, ముఖ్యంగా లీటర్‌కు మంచి మైలేజ్ ఇవ్వడం, ఇవి అన్నీ కలిపి ఈ సెగ్మెంట్‌ను మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కోసం అత్యంత అనువుగా మార్చాయి. ఈ విభాగంలో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తయారు చేసిన ఈ బైక్ సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ, స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

ఆటో రంగంలో సుజుకి సక్సెస్ స్టోరీ.. 20 ఏళ్ల ప్రయాణం పూర్తి

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన సుజుకి (Suzuki), గత రెండు దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ తన స్థానాన్ని బలపరచుకుంది. జపాన్‌కు చెందిన ఈ బ్రాండ్ 2006లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి, నాణ్యత, పనితీరు, ఇంధన సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఈ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రారంభ దశలోనే కంపెనీ Suzuki Heat 125, Suzuki GS 125 వంటి మోడళ్లను ప్రవేశపెట్టి, భారత వినియోగదారులకు తన ఉత్పత్తులను పరిచయం చేసింది. అయితే, నిజమైన మలుపు ఒక్క సంవత్సరానికే వచ్చింది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) విడుదలతో సుజుకి భారత మార్కెట్లో మరింత బలంగా స్థిరపడింది. ఈ స్కూటర్ తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో త్వరగా ప్రజాదరణ పొందింది.

ఏడాదిలో 37 లక్షల బైక్‌లు అమ్మిందంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు

భారతీయ రోడ్లపై ఏ బైక్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే చిన్న పిల్లాడైనా చెప్పే పేరు హీరో స్ప్లెండర్. దశాబ్దాలు గడుస్తున్నా, కొత్త మోడళ్లు ఎన్ని వస్తున్నా స్ప్లెండర్ హవా మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) ఈ బైక్ మరోసారి తన సత్తా చాటింది. కేవలం గతేడాది కాలంలోనే ఏకంగా 37 లక్షల మందికి పైగా ఈ బైక్‌ను కొనుగోలు చేశారంటే, సామాన్యుడికి ఈ బైక్ మీద ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హోండా షైన్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ వంటి ఉద్ధండులను వెనక్కి నెట్టి స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది.
Advertisement

కేవలం కొద్దిమందికే.. వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ త్వరలో రాబోతోంది

దేశీయ ప్రీమియం స్కూటర్ మార్కెట్‌లో ఇటాలియన్ స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన వెస్పా (Vespa) ప్రస్తుతం మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రత్యేకమైన డిజైన్, క్లాసిక్ లుక్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా వెస్పా స్కూటర్లకు నగరాల్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తన 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వెస్పా, భారత మార్కెట్ కోసం ఒక ప్రత్యేక గిఫ్ట్‌లా కొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ వేడుకల్లో భాగంగా, వెస్పా టెక్ 80వ ఎడిషన్ (Vespa Tech 80th Edition) అనే స్పెషల్ ఎడిషన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడళ్లకు భిన్నంగా, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక ప్రత్యేక మార్పులతో రూపొందించబడుతోంది.

మార్కెట్ రూపురేఖలు మార్చే విధంగా మారుతి మాస్టర్ ప్లాన్

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మూడు సరికొత్త కార్లను లాంచ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన పాపులర్ మోడల్స్ అయిన బలెనో, బ్రెజా కార్లను కొత్త హంగులతో (Facelift) తీసుకురావడంతో పాటు, మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ గ్రాండ్ విటారాను కూడా రంగంలోకి దించుతోంది. ఈ మూడు కార్లు కూడా అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో రానున్నాయి.

రికార్డు సృష్టించిన మారుతి సుజుకి.. ఒక్క ఏడాదిలో 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

భారత ఆటోమొబైల్ రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత బలపరుస్తూ మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి రికార్డు స్థాయి ప్రదర్శన చేసింది. గత ఒక్క సంవత్సరంలోనే కంపెనీ సుమారు 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు సాగిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఈ ఫలితం, మారుతి సుజుకి చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తిగా నిలవడం విశేషం. ఇంతకు ముందు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయి ఉత్పత్తి నమోదు కాలేదు. గత ఆర్థిక సంవత్సరమైన 2024-25లో కంపెనీ సుమారు 21 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఆ సంఖ్యతో పోలిస్తే, తాజా గణాంకాలు దాదాపు 11.66 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.

ఇక ప్రతి నెల అద్దె చెల్లించి నచ్చిన కారు తీసుకెళ్లొచ్చు

కారు కొనాలనేది మధ్యతరగతి భారతీయుల అతిపెద్ద కల. కానీ మారుతున్న కాలంతో పాటు కార్ల వినియోగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కారు కొనాల్సిన పనిలేదు, నెలనెలా అద్దె చెల్లించి మీకు నచ్చిన మోడల్‌ను యజమానిలా వాడుకోవచ్చు. ఈ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత్‌లో అడుగుపెట్టింది. నిస్సాన్ తన పాపులర్ మోడల్స్ అయిన మ్యాగ్నైట్ (Magnite), గ్రావైట్ (Gravite) కార్లను లీజుకు ఇచ్చేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Advertisement

అందుబాటులో లగ్జరీ SUV.. మినీ నుంచి కొత్త అవకాశం

బ్రిటిష్ మూలాలు కలిగిన లగ్జరీ కార్ల బ్రాండ్ మినీ(Mini)కు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. క్లాసిక్ డిజైన్, కాంపాక్ట్ సైజ్, అలాగే ప్రీమియం ఫీలింగ్ కలగలిపిన ఈ బ్రాండ్, నగర జీవనశైలికి సరిగ్గా సరిపోయే కార్లను అందిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం జర్మన్ ఆటో దిగ్గజం BMW Group ఆధ్వర్యంలో కొనసాగుతున్న మినీ, తన గ్లోబల్ స్టాండర్డ్స్‌ను భారత మార్కెట్‌కు అనుగుణంగా మార్చుకుంటూ, ప్రతి కొత్త మోడల్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో, లగ్జరీ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో తన స్థాయిని మరింత బలపరచడానికి మినీ మరో కీలక అడుగు వేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా, కొత్త మినీ కంట్రీమ్యాన్ సి (Mini Countryman C) కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది.