దీన్ని చూస్తే కోట్లు విలువ చేస్తుందేమో అనుకుంటాం.. కానీ ధర మాత్రం లక్షల్లోనే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల (SUV) హవా నడుస్తోంది. మునుపటిలా కాకుండా, ఇప్పుడు కస్టమర్లు కేవలం కారు సౌకర్యాలనే కాకుండా, దాని లుక్, రోడ్ ప్రెజెన్స్‎కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) వంటి గంభీరమైన, బాక్సీ డిజైన్ ఉన్న కార్లంటే మనవాళ్లకు క్రేజ్ ఎక్కువ.

యూత్ క్రేజ్ పెంచే బైక్స్.. ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్

ప్రీమియం స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్ల విభాగం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో ఉన్న యెజ్డీ (Yezdi), బీఎస్ఏ (BSA) ఒకేసారి రెండు కొత్త మోడళ్లతో మార్కెట్‌లో బలమైన అడుగు పెట్టాయి. గురువారం జరిగిన ఈ లాంచ్ ద్వారా ఈ రెండు బ్రాండ్‌లు తమ దృష్టిని స్పష్టంగా తెలియజేశాయి. పట్టణ రోడ్ల నుంచి హైవేలు, అక్కడి నుంచి తేలికపాటి ఆఫ్‌-రోడింగ్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ సరిపడే బైక్‌లను భారతీయ రైడర్లకు అందించడం. ఈ సందర్భంగా పరిచయం చేసిన యెజ్డీ స్క్రాంబ్లర్ 350 (Yezdi Scrambler 350) ప్రారంభ ధర రూ.1,99,950గా ఉండగా, మరింత శక్తివంతమైన బీఎస్ఏ స్క్రాంబ్లర్ (BSA Scrambler 650) రూ.3,24,950 నుంచి అందుబాటులోకి వచ్చింది.

పెద్ద కుటుంబానికి ఏది సరైనది? ఇన్విక్టో vs హైక్రాస్

పెద్ద కుటుంబాలతో ప్రయాణం చేయడం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడమే కాదు, అందరూ కలిసి కంఫర్ట్‌గా, ఇబ్బంది లేకుండా ప్రయాణించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. అలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వాహనాలే ఎంవీపీలు (MPVs). ఇవి సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ స్పేస్, మెరుగైన సీటింగ్ అమరిక, ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే విధంగా ప్రాక్టికల్ డిజైన్‌ను అందిస్తాయి. ప్రత్యేకంగా పెద్ద కుటుంబాల కోసం చూస్తే, ఎంవీపీలు ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎంపీవీ విభాగంలో టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross), మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) వంటి రెండు ప్రసిద్ధి చెందాయి. వీటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

టాప్-15 ఎస్‌యూవీల లిస్టులో మహీంద్రాదే పైచేయి

భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల (SUV) హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 4.5 మీటర్ల నుంచి 4.8 మీటర్ల పొడవు ఉండే భారీ ఎస్‌యూవీల విభాగంలో పోటీ మామూలుగా లేదు. అయితే, మార్చి 2026 సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఒకే ఒక్క పేరు మార్కెట్‌ను శాసిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్, టాటా హారియర్, సఫారీ వంటి దిగ్గజ కార్లు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి మహీంద్రా స్కార్పియో తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. విచిత్రమేమిటంటే, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్స్ మహీంద్రా XEV 9e లేదా XUV7X0 కూడా స్కార్పియో దరిదాపుల్లోకి రాలేకపోయాయి.
Advertisement

ఈ స్కూటర్‌కు డిమాండ్ పెరుగుతోంది.. iQube అమ్మకాల్లో భారీ గ్రోత్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) తనదైన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. విశ్వసనీయ బ్రాండ్ ఇమేజ్, ప్రాక్టికల్ డిజైన్, నగర ప్రయాణాలకు అనువైన పనితీరు కలిపి ఈ స్కూటర్‌ను వినియోగదారుల మధ్య మంచి ఎంపికగా మార్చాయి. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. 2026 మార్చి నెలలో మాత్రమే 38,757 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఇదే సమయంలో గత సంవత్సరం మార్చిలో 26,499 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది.

20 ఏళ్ల ప్రస్థానానికి స్వస్తి పలికిన హోండా.. ఇక కార్లు దొరకవు

జపాన్ కార్ల దిగ్గజం హోండా (Honda) ఆసియా మార్కెట్లలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా దక్షిణ కొరియా (South Korea) ఆటోమొబైల్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలగాలని హోండా సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 చివరి నాటికి అక్కడ కార్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కొరియాలో అత్యధిక కార్లు అమ్మిన విదేశీ బ్రాండ్‌గా వెలిగిన హోండా, ఇప్పుడు ఇలా ఖాళీ చేయడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. హోండా కంపెనీ సౌత్ కొరియాలో తన ప్రయాణాన్ని 2001లో ప్రారంభించింది. అయితే 2004లో అధికారికంగా కార్ల అమ్మకాలను మొదలుపెట్టింది. అప్పట్లో హోండా అకార్డ్ (Accord), సీఆర్-వీ (CR-V) మోడళ్లకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే, 2008 సంవత్సరంలో దక్షిణ కొరియాలో ఏడాదికి 10,000 కంటే ఎక్కువ కార్లు అమ్మిన మొట్టమొదటి విదేశీ కార్ల బ్రాండ్‌గా హోండా చరిత్ర సృష్టించింది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. స్థానిక బ్రాండ్లు అయిన హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు బలంగా ఎదగడం, మరోవైపు చైనా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్లు రావడంతో హోండా బేరాలు దెబ్బతిన్నాయి. దక్షిణ కొరియా ఆటో మార్కెట్ గత కొన్నేళ్లుగా భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ పెరిగింది. టెస్లా (Tesla), చైనాకు చెందిన బివైడి (BYD) వంటి కంపెనీలు కొరియా మార్కెట్లోకి చొచ్చుకుపోతున్నాయి. హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో కొంచెం వెనకబడి ఉండటం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది హోండా కార్ల విక్రయాలు కొరియాలో ఏకంగా 22 శాతం పడిపోయి కేవలం 1,951 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంత తక్కువ సేల్స్ తో వ్యాపారాన్ని కొనసాగించడం భారంగా మారడంతో, వనరులను ఆప్టిమైజ్ చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా స్పష్టం చేసింది. కేవలం దక్షిణ కొరియాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో కూడా హోండా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2025లో చైనాలో హోండా విక్రయాలు 6,46,000 వాహనాలకు పడిపోయాయి. ఇది ఐదేళ్ల క్రితం నాటి అమ్మకాలతో పోలిస్తే 60 శాతం తక్కువ. చైనాలో ఉన్న కనీసం ఒక జాయింట్ వెంచర్ ప్లాంట్‌ను కూడా హోండా మూసివేయబోతున్నట్లు సమాచారం. అక్కడ చైనాకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఇచ్చే ధరల యుద్ధాన్ని తట్టుకోలేక హోండా సతమతమవుతోంది. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కూడా హోండా సేల్స్ గతేడాది తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కొరియాలో కార్ల అమ్మకాలు నిలిపివేసినప్పటికీ, హోండా తన మోటార్ సైకిల్ (Motorcycle) వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అక్కడ హోండా బైకులకు ఇంకా మంచి డిమాండ్ ఉంది. అలాగే, అప్పటికే హోండా కార్లు కొన్న కస్టమర్ల కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (After-sales service) అందుబాటులో ఉంటుంది. అంటే కారు రిపేర్లు, స్పేర్ పార్ట్స్ సరఫరా, వారంటీ సపోర్ట్ వంటి సేవలను హోండా కొరియా అందిస్తూనే ఉంటుంది. ఇది పాత కస్టమర్లకు కొంత ఊరటనిచ్చే విషయమే. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి హోండా తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వ్యూహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం సుమారు 16 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. గతంలో సోనీతో కలిసి చేయాలనుకున్న ఈవీ ప్రాజెక్టును నిలిపివేసిన హోండా, ఇప్పుడు సొంతంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెడుతోంది. గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం పెట్రోల్ కార్లపైనే ఆధారపడితే సరిపోదని, భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని హోండా గుర్తించింది. ఈ క్రమంలోనే తక్కువ లాభాలు ఉన్న కొరియా వంటి మార్కెట్ల నుంచి తప్పుకుని, వనరులను ఈవీ రంగం వైపు మళ్లిస్తోంది.

నెక్స్ట్ లెవెల్ లుక్‌తో మరింత అందంగా ముస్తాబై వచ్చిన రైడర్‌

భారతీయ రెండు చక్రాల వాహన మార్కెట్లో 125cc సెగ్మెంట్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మంచి మైలేజ్, సరైన పనితీరు, అలాగే యువతను ఆకట్టుకునే డిజైన్ కలిపి ఈ విభాగాన్ని అత్యంత పోటీగా మార్చాయి. ఈ సెగ్మెంట్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న బైక్‌లలో టీవీఎస్ రైడర్ (TVS Raider 125) ఒకటి. స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరతో ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇప్పుడీ క్రేజ్‌ను మరింత పెంచేలా కంపెనీ ఒక చిన్న కానీ ఆకర్షణీయమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. రైడర్ 125కు 'నైట్రో గ్రీన్' అనే కొత్త రంగును పరిచయం చేసింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ బైక్‌కు మరింత స్పోర్టీ, ఫ్రెష్ లుక్‌ను అందిస్తూ, ముఖ్యంగా యువతను ఆకర్షించేలా డిజైన్ చేయబడింది.

తక్కువ ధరలో ఒకే ఛార్జ్‌తో 400 కి.మీ పైగా వెళ్లే ఎలక్ట్రిక్ కార్లు

ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారుల దృష్టి వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో పాటు, పర్యావరణంపై అవగాహన పెరగడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఈవీలు పరిమిత ఎంపికలతో ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విభిన్న ధరల పరిధిలో, విభిన్న అవసరాలకు సరిపోయేలా అనేక మోడళ్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులకు ఎంపికలు విస్తరించాయి. ప్రత్యేకంగా మధ్యతరగతి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెడుతున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న వాహనాలు రోజువారీ ప్రయాణాలకే కాకుండా, పొడవైన ట్రిప్‌లకూ అనుకూలంగా మారుతున్నాయి.
Advertisement

స్కూటర్ అంటే ఇదేరా బాబూ.. ఏకంగా 90కిమీ మైలేజ్

భారతీయ టూ వీలర్ మార్కెట్లో, జపాన్ తయారీ సంస్థ సుజుకి హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇస్తోంది, వాస్తవానికి చెప్పాలంటే.. వాటికి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఈ సంస్థకు చెందిన సుజుకి యాక్సెస్(Suzuki Access) స్కూటర్ ప్రస్తుతం అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తన ఆకర్షణీయమైన రూపం, అద్భుతమైన పనితీరుతో, ఈ స్కూటర్ యువతను, ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా, సమీప భవిష్యత్తులో ఇది CNG వేరియంట్‌లో విడుదల కానుందని, తన ఇంధన సామర్థ్యంతో అద్భుతాలు సృష్టించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. తాజా అమ్మకాల నివేదిక ప్రకారం.. సుజుకి యాక్సెస్ స్కూటర్ అమ్మకాల గణాంకాలలో విశేషమైన వృద్ధిని ప్రదర్శించింది. మార్చి 2026 నాటికి, ఈ సంస్థ ఏకంగా 72,658 స్కూటర్లను విక్రయించింది. గత సంవత్సరం (2025) ఇదే నెలలో (మార్చి) విక్రయించిన 66,362 యూనిట్లతో పోలిస్తే, ఇది 9.49 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏడాది వ్యవధిలో సుమారు 6,296 అదనపు స్కూటర్లను విక్రయించడం ద్వారా, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్కూటర్ల జాబితాలో సుజుకి యాక్సెస్ విజయవంతంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్‌లో, 259,670 యూనిట్ల అమ్మకాలతో హోండా యాక్టివా(Honda Activa) అగ్రస్థానంలో నిలవగా, 124,771 యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ జూపిటర్(TVS Jupiter) రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే, కేవలం 125cc విభాగంలోనే పోటీపడుతూ సుజుకి యాక్సెస్ ఇంతటి భారీ అమ్మకాల పరిమాణాన్ని సాధించడాన్ని మార్కెట్ నిపుణులు ఒక గణనీయమైన విజయంగా పరిగణిస్తున్నారు. యువత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని వారు, యాక్సెస్ స్కూటర్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సుజుకి యాక్సెస్ స్కూటర్ 124cc, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6.2 kW శక్తిని, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా చూస్తే, సుజుకి యాక్సెస్ పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర కేవలం రూ.82,906 మాత్రమే. ఫీచర్ల విషయానికి వస్తే, ఇది మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, LED హెడ్‌ల్యాంప్ వంటి అత్యాధునిక సదుపాయాలతో వస్తుంది. ప్రస్తుత EV (ఎలక్ట్రిక్ వాహనాల) పోకడలకు అనుగుణంగా, సుజుకి కూడా E-Access పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌లో 3.072 kWh సామర్థ్యం కలిగిన పవర్ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని (రైడింగ్ రేంజ్) కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధరను రూ.1,91,962 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. పెట్రోల్ ధరల సంబంధిత ఇబ్బందులను తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ప్రస్తుతం ఆటోమోటివ్ రంగంలో అత్యంత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, సుజుకి యాక్సెస్ స్కూటర్ ఇప్పుడు CNG వేరియంట్‌లో విడుదల కాబోతోందని వచ్చిన ప్రకటన. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసి బజాజ్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఇప్పుడు సుజుకి కూడా అదే బాటలో పయనిస్తోంది.

మార్కెట్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్.. గ్లాంజా 8% సేల్స్ గ్రోత్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. స్టైలిష్ లుక్, మంచి ఫీచర్లు, కంఫర్ట్‌తో పాటు విశ్వసనీయతను కోరుకునే వినియోగదారులు ఎక్కువగా ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో టయోటా గ్లాంజా (Toyota Glanza) తనదైన గుర్తింపును సృష్టించుకుని, స్థిరంగా డిమాండ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే కాంపాక్ట్ సైజ్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కలిపి ఈ కారును మధ్యతరగతి కుటుంబాలకు ఒక మంచి ఎంపికగా నిలబెడుతున్నాయి. ఈ కారుకు ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, మార్కెట్లో దీని స్థిరమైన స్థానం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

త్వరలో మార్కెట్లో సంచలనం సృష్టించనున్న మూడు కార్లు

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా, పెట్రోల్ ఖర్చులను తగ్గించేలా అద్భుతమైన మైలేజీని అందించే, కానీ కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా పదే పదే రీఛార్జ్ చేయాలనే ఆందోళన లేని ఒక కారు కోసం మీరు వెతుకుతున్నారా? అయితే, మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కోసం వేచి ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో, మూడు స్పెషల్ హైబ్రిడ్ కార్లు భారతీయ రోడ్లపైకి రాబోతున్నాయి. Honda, JSW, MG వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీలో ముందంజలో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ బైక్ కావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి

ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM, తన చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్, అత్యంత వేగవంతమైన మోటార్ సైకిల్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించింది. అదే 2026 KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్. పేరులోనే ఉన్నట్లుగా, ఇది కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడిన ట్రాక్-ఓన్లీ మోడల్. అంటే ఈ బైక్‌ను మీరు సాధారణ రోడ్ల మీద నడపలేరు. కానీ, రేస్ ట్రాక్ మీద మాత్రం ఇది తిరుగులేని రారాజుగా నిలుస్తుంది. ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత దాని లభ్యత. KTM సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేస్తోంది. మే 2026 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. పరిమిత సంఖ్యలో ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ కలెక్టర్లు, రేసింగ్ లవర్స్ దీని కోసం పోటీ పడుతున్నారు. దీని ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో ఉపయోగించిన హార్డ్‌వేర్, దీని ఎక్స్‌క్లూజివిటీని బట్టి చూస్తే, ఇది భారీ ధరకే విక్రయించబడే అవకాశం ఉంది. ఈ బైక్ గుండెకాయ వంటి ఇంజిన్ గురించి చెప్పుకుంటే.. ఇందులో 1350cc, 75-డిగ్రీ V-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది అక్షరాలా 198 bhp గరిష్ట శక్తిని, 151 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. KTM ఇప్పటివరకు విడుదల చేసిన ఏ ప్రొడక్షన్ మోడల్‌లోనూ ఇంతటి పవర్ చూడలేదు. దీనికి తోడు Akrapovic ఎవల్యూషన్ లైన్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను జోడించారు. ఇది బైక్ పనితీరును పెంచడమే కాకుండా, బరువును గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణ రోడ్-లీగల్ బైక్‌లతో పోలిస్తే, ఈ RR ట్రాక్ ఎడిషన్ చాలా తేలికైనది.ఇది స్టాండర్డ్ 1390 సూపర్ డ్యూక్ R కంటే 20 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. రోడ్-లీగల్ RR వెర్షన్ కంటే 9 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. ఈ బరువు తగ్గింపు కోసం కార్బన్ ఫైబర్ బాడీ వర్క్, ఫోర్జడ్ మెగ్నీషియం వీల్స్, టైటానియం స్క్రూలను ఉపయోగించారు. రోడ్డు మీద నడిపేందుకు అవసరమైన హెడ్ లైట్లు, ఇండికేటర్లు, మిర్రర్లు వంటి వస్తువులను తొలగించడం వల్ల కూడా బరువు తగ్గింది. రేస్ ట్రాక్ మీద బైక్ కంట్రోలింగ్ అత్యంత ముఖ్యం. అందుకే ఇందులో MotoGPలో ఉపయోగించే WP ప్రో కాంపోనెంట్స్ సస్పెన్షన్‌ను వాడారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, అల్ట్రా-ప్రీమియం బ్రెంబో (Brembo GP4 MS) మోనోబ్లాక్ ఫోర్-పిస్టన్ కాలిపర్లను అమర్చారు. వీటికి T-Drive ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లు జతచేశారు. అలాగే, సర్క్యూట్ మీద అత్యుత్తమ గ్రిప్ కోసం మిచెలిన్ పవర్ పెర్ఫార్మెన్స్ స్లిక్స్ టైర్లను అందించారు. రేసర్లకు గరిష్ట సౌకర్యం అందించేలా దీని బాడీ డిజైన్ ఉంది. బైక్ ట్యాంక్ కొంచెం బయటికి వంగి ఉంటుంది, ఇది రైడర్ పూర్తిగా బైక్‌పై పడుకున్నప్పుడు మంచి సపోర్ట్ ఇస్తుంది. హ్యాండిల్ బార్ కొంచెం కిందకు ఉంటుంది, దీనివల్ల హై-స్పీడ్ వద్ద బైక్ కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. కార్బన్ ఫైబర్ అండర్ ట్రేపై అమర్చిన సింగిల్ రేస్ సీటు ఈ బైక్ కు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్ అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. FIM రేస్ ట్రాక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ఈ బైక్, రేసింగ్ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. భారతీయ సంపన్న రేసింగ్ లవర్స్ కూడా ఈ 100 యూనిట్లలో ఒక దానిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
Advertisement

ఒక్క ఏడాదిలోనే 68వేల యూనిట్లు.. ఆరా సక్సెస్ ఫుల్ రన్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ సెడాన్ విభాగం ఎప్పుడూ స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో హ్యూందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఇటీవలి కాలంలో సాధించిన వృద్ధి గమనించదగ్గది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరా అమ్మకాల ప్రదర్శన కంపెనీకి విశేష ఉత్సాహాన్ని ఇచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు మొత్తం 68,066 యూనిట్లు విక్రయించబడింది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, మార్కెట్‌లో ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా చూపించే సూచికగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంపాక్ట్ సెడాన్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు ధర, మైలేజ్, ఫీచర్లు అంశాలను సమతుల్యం చేసే కార్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

రూ.17 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ వాహనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో, ఏథర్ ఎనర్జీ (Ather Energy) వినియోగదారులను మరింతగా ఆకర్షించే ప్రయత్నంలో ముందుకు వచ్చింది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన స్కూటర్ కోసం చూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్ ఏథర్ రిజ్టాపై (Ather Rizta)పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోజనాలను పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఆఫర్లు కేవలం డిస్కౌంట్‌లకే పరిమితం కాకుండా, వినియోగదారులకు నిజమైన విలువను అందించే విధంగా రూపొందించబడ్డాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో ధర ఒక ముఖ్యమైన అంశం అవుతుంది.

ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఉన్న టాప్ 5 ఈవీలు ఇవే

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి దారి తెలియక ఇబ్బంది పడటం మామూలే. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టి, నేరుగా స్కూటర్ డిస్‌ప్లేలోనే మ్యాప్స్ చూపిస్తే ఎంత బాగుంటుందో కదా. భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామి కంపెనీలు ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ప్రధానంగా అందిస్తున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఫీచర్‌తో దూసుకుపోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

NS400Zకు మేజర్ అప్డేట్.. కానీ ధరలో మార్పే లేదు

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తన ప్రత్యేక స్టైల్, పనితీరుతో గుర్తింపు పొందిన బజాజ్ ఆటో (Bajaj Auto) మరోసారి తన ప్రాచుర్యం పొందిన మోడల్‌లో కీలక మార్పు చేసి మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. కంపెనీకి చెందిన బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ (Bajaj Pulsar NS400Z) మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈసారి చేసిన మార్పు సాధారణ అప్డేట్ కాదని చెప్పాలి, ఇది నేరుగా ఇంజన్ సెగ్మెంట్‌కే సంబంధించినది. ఇప్పటివరకు ఈ బైక్‌లో ఉపయోగించిన 373 సిసి ఇంజన్‌కు బదులుగా, ఇప్పుడు 349 సిసి సామర్థ్యం గల కొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. సాధారణంగా ఇంజన్ సామర్థ్యాన్ని తగ్గించడం అంటే పనితీరుపై ప్రభావం ఉంటుందనే భావన వినియోగదారుల్లో ఉంటుంది.
Advertisement

టెస్లా కొత్త కారు ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla), భారతీయ వాహనదారులకు ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన పుట్టినిల్లు అయిన అమెరికాలో కూడా ఇంకా లాంచ్ చేయని ఒక సరికొత్త వేరియంట్‌ను, ఇండియాలో ముందుగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ, భారతీయ మార్కెట్‌పై తనకు ఎంతటి మక్కువ ఉందో ఈ చర్యతో నిరూపించుకుంది. అదే టెస్లా మోడల్ వై ఎల్ (Tesla Model Y L). టెస్లా కంపెనీ 2025 జూలైలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మోడల్ వై (Model Y) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. మొదట్లో ఇందులో రెండు వేరియంట్లు ఉండగా, ఇప్పుడు మూడవ వేరియంట్ మోడల్ వై ఎల్ (Model Y L)ను ఈ రోజే (ఏప్రిల్ 22) అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ రాకతో టెస్లా లైనప్ మరింత పటిష్టమైంది. దీని ధరను రూ.61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను ముందుగా తన స్వదేశంలో లాంచ్ చేస్తుంది. కానీ టెస్లా ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వెళ్ళింది. ఈ ఎల్ వేరియంట్ టెస్లా పుట్టినగడ్డ అయిన అమెరికాలో కూడా ఇంకా అమ్మకానికి రాలేదు. భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని, ఇక్కడి కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఎలోన్ మస్క్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

హీరో ముఖంలో చిరునవ్వు.. డెస్టినీ సేల్స్ భారీగా జంప్

భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన పోటీదారులతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ రెండు మోడళ్లు మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, హీరో కూడా పలు స్కూటర్ మోడళ్లను ప్రవేశపెట్టి తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా నిలబడలేకపోయినా, హీరో డెస్టినీ (Hero Destini) మాత్రం తెలివిగా ముందుకు సాగుతూ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తన స్కూటర్ వ్యూహాన్ని మరింత స్పష్టంగా మార్చుకుంది.

విదేశాల్లో దీనిదే హవా.. రూ.3.50 లక్షల మారుతి కారు కొత్త రికార్డు

భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో జనం పెద్దగా పట్టించుకోని ఒక కారు, విదేశీయులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభించే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 2026 గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారు ఎగుమతుల్లో ఏకంగా 216 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బడ్జెట్‌లోనే స్టైలిష్ అప్‌డేట్.. అవెనిస్‌కు ఫ్రెష్ లుక్

భారతదేశ టూవీలర్ మార్కెట్‌లో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కంపెనీ తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విభిన్న కేటగిరీలలో స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన సుజుకి అవెనిస్ (Suzuki Avenis) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. ఇదే సమయంలో, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా, విశ్వసనీయతకు పేరుగాంచిన Suzuki Access 125, ప్రీమియం స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి సరిపోయే Suzuki Burgman Street వంటి మోడళ్లతో సుజుకి విభిన్న వినియోగదారులను చేరుకుంటోంది. అయితే కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి.
Advertisement

నం.1 కారు అమ్మకాల్లో ఎందుకీ తేడా ?

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కారు పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. దేశీయంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో రారాజుగా వెలుగొందుతుంది హ్యుందాయ్ క్రెటా. మన దేశంలో ఈ కారును కొనడానికి జనం ఎగబడుతుంటే, విదేశీయులు మాత్రం దీని వైపు చూడటానికే ఆసక్తి చూపడం లేదు. గత నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆసక్తికరమైన, కాస్త షాకింగ్ అనిపించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ క్రెటా భారతీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మార్చి నెలలో భారతదేశంలో ఏకంగా 17,838 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. టాప్-10 కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఇదే కారును విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం గణంకాలు నిరాశపరిచాయి. మార్చి నెలలో కేవలం 904 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అంటే మన దేశంలో అమ్ముడైన దాంట్లో ఇది కేవలం 5 శాతం కూడా లేదు. ఎగుమతి అయ్యే టాప్-30 కార్ల జాబితాలో క్రెటా 21వ స్థానానికి పడిపోయింది. హ్యుందాయ్ క్రెటా మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రధాన కారణం దాని ధర, ఫీచర్లు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.72 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హ్యుందాయ్ఈ కారును మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి: E, EX, S, S(O), SX, SX Tech, SX (O). ముఖ్యంగా బేస్ వేరియంట్ E కూడా చూడటానికి ప్రీమియం లుక్‌తో ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. క్రెటా కొత్త మోడల్‌లో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని జోడించారు. ఇందులో మొత్తం 70కి పైగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు దీని సొంతం. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు హ్యుందాయ్ డిజైన్‌లో పెద్దగా తేడాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. దీనివల్ల కారు లుక్ అన్ని వేరియంట్లలోనూ అద్భుతంగా ఉంటుంది. ఇన్వర్టెడ్ L-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) కారుకు కొత్త ఆకర్షణను తెచ్చాయి. కారు లోపలి భాగం (ఇంటీరియర్) చాలా విలాసవంతంగా ఉంటుంది. బేస్ మోడల్ E వేరియంట్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అయితే ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉండవు. మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్‌బీ పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి కనీస సౌకర్యాలన్నీ ఉన్నాయి. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఇవ్వడం ద్వారా సేఫ్టీకి పెద్ద పీట వేశారు. టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి లగ్జరీ ఫీచర్లు భక్తులను కట్టిపడేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా ప్రధానంగా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీనికి తోడు పర్ఫామెన్స్ ప్రియుల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఐవీటీ (IVT), డిసిటి (DCT) వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండటం వల్ల కస్టమర్లకు తమకు నచ్చిన ఛాయిస్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా డీజిల్ ఇంజన్ ఇచ్చే మైలేజ్, పవర్ క్రెటాను ఈ విభాగంలో రారాజుగా నిలబెట్టాయి. భారతదేశంలో క్రెటాకు ఉన్న క్రేజ్ విదేశాల్లో ఎందుకు లేదన్న దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రెటా స్థానంలో హ్యుందాయ్ టక్సాన్ (Tucson) లేదా ఇతర అంతర్జాతీయ మోడళ్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. అలాగే విదేశాల్లో భద్రతా ప్రమాణాలు (Crash Test Ratings), ఎమిషన్ నార్మ్స్ విషయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో క్రెటాకు ఉన్న ప్రధాన పోటీదారులు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్. దేశీయంగా ఈ పోటీని తట్టుకుని నిలబడుతున్నా, అంతర్జాతీయంగా మాత్రం ఇతర గ్లోబల్ బ్రాండ్ల నుంచి క్రెటా గట్టి సవాలును ఎదుర్కొంటోంది. ఏదేమైనా, హ్యుందాయ్ క్రెటా భారతీయ వాహనదారుల పాలిట ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. లుక్, ఫీచర్లు, రీసేల్ వాల్యూ పరంగా క్రెటాకు తిరుగులేదు. ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా నెలకు 17 వేల యూనిట్లకు పైగా అమ్ముడవుతుండటం హ్యుందాయ్ బలాన్ని చాటుతోంది. భవిష్యత్తులో హ్యుందాయ్ క్రెటా ఈవీ (EV) వెర్షన్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో ఉంది, ఇది జరిగితే ఎగుమతుల గణాంకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

కొత్త ప్లాన్‎తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న అడ్వెంచర్ బైక్

బైక్ ప్రియులకు, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది ఒక అదిరిపోయే గుడ్‎న్యూస్. పాత హిమాలయన్ 411 డిజైన్ అంటే పడిచచ్చే కుర్రాళ్ల కోసం కంపెనీ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 మార్కెట్లోకి రాబోతోంది. పాత కాలపు రఫ్ అండ్ టఫ్ లుక్, మోడ్రన్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇంజన్.. ఈ కాంబినేషన్ వింటేనే అడ్వెంచర్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ బైక్ రోడ్లపై గర్జించబోతోంది.

హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు లాంచ్

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో హ్యుందాయ్ (Hyundai) మరో సంచలనానికి తెరలేపింది. లగ్జరీ ఫీచర్లు, అదిరిపోయే రేంజ్, అందరికీ అందుబాటులో ఉండే ధర.. ఇవే లక్ష్యంగా సరికొత్త హ్యుందాయ్ అయానిక్ 3 (Hyundai Ioniq 3)ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. మిలన్ డిజైన్ వీక్ 2026 వేదికగా పరిచయం చేసిన ఈ కారు, అయానిక్ సిరీస్‌లోనే అత్యంత చౌకైన మోడల్‌గా నిలవబోతోంది. దీని లుక్ చూస్తుంటే భవిష్యత్తులో కార్లు ఇలాగే ఉంటాయేమో అన్నంత ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. హ్యుందాయ్ అయానిక్ 3ని ఆర్ట్ ఆఫ్ స్టీల్(Art of Steel) అనే సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. దీనిని చూస్తుంటే చాలా సింపుల్‌గా అనిపించినా, లోతుగా గమనిస్తే అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లు కనిపిస్తాయి. దీని ముందరి భాగంలో ఉండే సన్నని లైట్లు, పిక్సెల్-ఇన్‌స్పైర్డ్ లైటింగ్ కారుకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాయి. దీనిని కంపెనీ ఏరో హ్యాచ్ అని పిలుస్తోంది. అంటే గాలి ఒత్తిడిని తట్టుకుని వేగంగా దూసుకెళ్లేలా దీని బాడీని డిజైన్ చేశారు. కారు సైజ్ చిన్నదైనా, దీని ఫ్లాట్ ఫ్లోర్, పొడవైన రూఫ్ వల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా విశాలమైన స్థలం లభిస్తుంది. హ్యుందాయ్ అయానిక్ 3లో కస్టమర్ల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నారు:* స్టాండర్డ్ మోడల్: ఇందులో 42.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై సుమారు 344 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లోకల్ ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక.* లాంగ్ రేంజ్ మోడల్: ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం 61 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 496 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ ఇస్తుంది.

పల్లె పట్టణం ఈ బైకే కావాలంటున్నాయి

భారతీయ రోడ్లపై టూ-వీలర్ల హవా మామూలుగా లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆరాధ్య దైవమైన హీరో మోటోకార్ప్ మరోసారి తన సత్తా చాటింది. గడిచిన 12 నెలల్లో అంటే 2026 ఆర్థిక సంవత్సరంలో, ఏకంగా 65 లక్షల ఇళ్లలోకి తన బైకులను చేర్చి దేశంలోనే నంబర్-1 టూ-వీలర్ కంపెనీగా రికార్డు సృష్టించింది. కేవలం హీరో మాత్రమే కాదు, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు కూడా ఈ ఏడాది అదిరిపోయే అమ్మకాలతో పోటీని రసవత్తరంగా మార్చాయి.
Advertisement

పండగ రోజు రికార్డ్.. ఒక్క రోజులో 610 ఎలక్ట్రిక్ కార్లు ఇచ్చిన మహీంద్రా

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయ (Akshaya Tritiya)కు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ శుభదినాన బంగారం కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, అదే విధంగా కొత్త వాహనాలను సొంతం చేసుకోవడం కూడా చాలా మందికి ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహం కనిపించింది. దేశవ్యాప్తంగా మహీంద్రా షోరూమ్‌ల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించగా, ఆ ఉత్సాహాన్ని కంపెనీ అద్భుతంగా వినియోగించుకుంది. ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా ఈ ప్రత్యేక రోజున తన ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలను భారీ స్థాయిలో పూర్తి చేసింది. ఏప్రిల్ 19న జరిగిన ఈ పండుగ సందర్భంగా, ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 610కి పైగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను వినియోగదారులకు అందించడం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.