5 లక్షల మంది కొన్నారంటే రేంజ్ ఏంటో అర్థం అవుతుంది

టూ వీలర్ వెహికల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), ఈ ఏడాది సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆ కంపెనీకి చెందిన గంభీరమైన స్పోర్ట్స్ బైక్ 'టీవీఎస్ అపాచీ' (TVS Apache) అప్రతిహతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. 21 ఏళ్ల తన ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో 5 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసి మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 (FY2026) ఒక చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ఒకవైపు జూపిటర్ స్కూటర్లు రికార్డు స్థాయిలో 2.30 మిలియన్ల విక్రయాలతో దూసుకెళ్లగా, మరోవైపు అపాచీ సిరీస్ బైకులు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. మొత్తం మీద టీవీఎస్ కంపెనీ 4.24 మిలియన్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో అపాచీ వాటా అత్యంత కీలకంగా మారింది. సియామ్ (SIAM) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అపాచీ సిరీస్ ఈ ఏడాది 5,71,376 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (FY2025) విక్రయించిన 4,46,218 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 28 శాతం పెరుగుదల. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 1.44 లక్షల అదనపు బైకులను కంపెనీ విక్రయించగలిగింది. టీవీఎస్ మొత్తం బైకుల అమ్మకాల్లో అపాచీ వాటా ఇప్పుడు 40 శాతానికి చేరింది. యువతలో ఉన్న క్రేజ్ కారణంగానే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. టీవీఎస్ అపాచీ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో 5 లక్షల మార్కును దాటడం విశేషం. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అపాచీ బ్రాండ్ మొత్తం 7 మిలియన్ల (70 లక్షలు) యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్ల కాలంలోనే 4.38 మిలియన్ల బైకులు అమ్ముడయ్యాయంటే, ఈ బ్రాండ్ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అపాచీ ప్రయాణాన్ని గమనిస్తే.. 2015లో కేవలం 1.98 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, 2018 నాటికి అది 3.99 లక్షలకు చేరింది. 2020 నుంచి 2022 వరకు కరోనా, చిప్ కొరత కారణంగా అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల (డిగ్రోత్) కనిపించినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. 2023లో 3.49 లక్షలు, 2024లో 3.78 లక్షలు, 2025లో 4.46 లక్షల యూనిట్ల సేల్స్ జరిగాయి. ఇప్పుడు 2026లో ఏకంగా 5.71 లక్షల విక్రయాలతో ఆల్ టైమ్ హై రికార్డును సెట్ చేసింది. అపాచీ విజయంలో దాని వైవిధ్యభరితమైన మోడల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో RTR 160 2V, RTR 160 4V, RTR 165, RTR 180, RTR 200 4V వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ.1,11,400 నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ. 1,48,600 వరకు ఉంటుంది. విభిన్న బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా మోడల్స్ ఉండటంతో అన్ని వర్గాల యువత అపాచీ వైపు మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో అపాచీకి ప్రధానంగా బజాజ్ పల్సర్, యమహా MT-15, కేటీఎం డ్యూక్ 200, సుజుకి జెిక్సర్ మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ వంటి బైకుల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ, టీవీఎస్ అందిస్తున్న రేసింగ్ టెక్నాలజీ, మైలేజీ, స్టైలిష్ లుక్స్ అపాచీని రేసులో ముందుంచుతున్నాయి. అపాచీతో పాటు టీవీఎస్ రైడర్ (4.26 లక్షల యూనిట్లు), రోనిన్ (80 వేల యూనిట్లు) కూడా మంచి అమ్మకాలతో కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని టీవీఎస్ తన అపాచీ బ్రేడ్ లో మరిన్ని అప్‌డేటెడ్ ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రేసింగ్ డీఎన్‌ఏను మరింత బలోపేతం చేస్తూ, కొత్త కలర్ ఆప్షన్లు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను జోడించనుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, స్పోర్ట్స్ బైక్ ల పట్ల క్రేజ్ తగ్గకపోవడం అపాచీ వంటి బ్రాండ్లకు వరంగా మారింది.

పెద్దగా పెరగకపోయినా.. యమహా సేల్స్‌లో ప్లస్ కనిపించింది

యమహా(Yamaha) అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, పనితీరు, స్టైలిష్ డిజైన్‌లకు పేరుగాంచిన ప్రముఖ ఆటోమొబైల్, టూ-వీలర్ తయారీ సంస్థ. జపాన్‌కు చెందిన ఈ కంపెనీ, ముఖ్యంగా బైక్‌ల రంగంలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. యమహా తయారు చేసే బైక్‌లు స్పోర్టీ లుక్, స్మూత్ ఇంజన్ పనితీరు, అలాగే ఆధునిక టెక్నాలజీకి ప్రసిద్ధి చెందాయి. ఇండియాలో ఈ కంపెనీ మంచి మార్కెట్ కలిగి ఉంది. యమహా కంపెనీ కేవలం కమ్యూటర్ బైక్‌లకే పరిమితం కాకుండా, స్పోర్ట్స్ బైక్‌లు, స్కూటర్లు, అలాగే ప్రీమియం సెగ్మెంట్ వాహనాల్లో కూడా తన స్థాయిని నిరూపించింది. నూతన టెక్నాలజీలను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. యువతను ఆకర్షించే డిజైన్, మంచి మైలేజ్, అలాగే రేసింగ్ డీఎన్ఏ కలిగిన ఇంజన్లతో యమహా బైక్‌లు ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ట్యాక్సీ డ్రైవర్లకు పండగే.. ఎంజీ విండ్సర్ కమ్యూట్ వచ్చేసింది

దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ (JSW-MG Motor) తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ విండ్సర్ ఈవీలో సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా ట్యాక్సీ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విండ్సర్ కమ్యూట్ (MG Windsor Commute) అనే వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ మోడల్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న ఈ వేరియంట్ ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ధర, ఫీచర్లు, రేంజ్, ఇతర పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

డీజిల్ SUV కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ కార్లు ఇవే!

కొత్తగా డీజిల్ కార్ కొనాలంటే ఇప్పుడు వినియోగదారులకు అంత సులభం కాదు. మార్కెట్‌లో డీజిల్ వేరియంట్లు అందించే కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. దేశంలో అగ్రగామి ఆటోమొబైల్ తయారీదారైన మారుతి సుజుకి డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేసిన తర్వాత, రోడ్లపై కూడా ఈ వాహనాల ఉనికి తగ్గుతూ వచ్చింది. మిగతా కంపెనీలు కూడా క్రమంగా తమ డీజిల్ కార్ల విడుదలను చాలా వరకు తగ్గించాయి. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఉద్గార నిబంధనలు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతూ ఉండటం కూడా డీజిల్ కార్ల డిమాండ్ తగ్గడానికి దోహదపడుతోంది. ఇదిలా ఉంటే డీజిల్ కార్లను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆ కార్లను ఈ కింది కథణంలో చూద్దాం.
Advertisement

కుటుంబ భద్రత కోసం బెస్ట్ SUV.. 5 స్టార్ సాధించిన డస్టర్

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్(Renault) భారత మార్కెట్‌లో చాలా కాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. భారీ పోటీ ఉన్నప్పటికీ, స్థిరమైన ప్రదర్శనతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడంలో ఈ సంస్థ విజయవంతమైంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మళ్లీ కొత్త అవతారంలో మార్కెట్లోకి రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. 2026 మోడల్ రూపంలో తిరిగి వచ్చిన ఈ లెజెండరీ SUV, కేవలం డిజైన్ లేదా ఫీచర్ల పరంగా మాత్రమే కాకుండా, భద్రత విషయంలో కూడా కొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. తాజా Bharat NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కొత్త డస్టర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం, దీనిపై కంపెనీ పెట్టిన ఫోకస్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

పూర్తి బ్లాక్ లుక్‌తో హ్యుందాయ్ వెన్యూ అదిరిపోతుంది!

కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అంటే ఇప్పటికీ ప్రధానంగా టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి మోడళ్లే ముందుంటాయి. ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్నప్పటికీ, హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue) మాత్రం నెమ్మదిగా, కానీ స్థిరంగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభం నుంచి పెద్దగా ఫిర్యాదులు లేకుండా, మంచి పనితీరు, ప్రాక్టికాలిటీతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకు సాగింది. ఇటీవల ఈ మోడల్‌ను కొత్త తరానికి అప్‌గ్రేడ్ చేయడంతో, మార్కెట్‌లో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ SUVని కొనాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ వేగాన్ని మరింత పెంచేందుకు, దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యూందాయ్ మరో కొత్త స్టైల్‌ను జోడించింది. అదే హ్యూందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ (Hyundai Venue Night Edition).

2026 కియా సైరోస్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు

భారతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకునేందుకు కియా ఇండియా (Kia India) మరో కీలక అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్న మోడల్ కియా సైరోస్ (Kia Syros)కు MY26 వెర్షన్‌ను పరిచయం చేస్తూ, డిజైన్, వేరియంట్ ఎంపికలు, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ మోడల్‌ను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ధరల పరంగా చూస్తే, ఈ అప్‌డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 8.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. అయితే అసలు ఆకర్షణ మాత్రం ఇందులో తీసుకొచ్చిన కొత్త ట్రిమ్ నిర్మాణంలోనే ఉంది.

ఎగుమతుల్లో మారుతి సుజుకి సత్తా.. టాప్ 10 కంపెనీల జాబితా

అంచనాలు నిజం అవుతున్నట్లుగానే, భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల (PV) ఎగుమతుల రంగం FY2026లో గణనీయమైన ఊపును నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లలో భారతీయ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 7,70,296 యూనిట్ల ఎగుమతులతో పోలిస్తే, ఈసారి మొత్తం ఎగుమతులు 9,05,137 యూనిట్లకు చేరుకోవడం విశేషం. అంటే ఏకంగా 17.5 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగం బలంగా ఎదుగుతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ పెరుగుదల వెనుక భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల వ్యూహాత్మక ప్రణాళికలు, కొత్త మార్కెట్లలో ప్రవేశం, అలాగే నాణ్యత పరంగా పెరిగిన నమ్మకం కీలక పాత్ర పోషించాయి.
Advertisement

లీటరుకు 71.33 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) భారతదేశంలోని స్కూటర్ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్‌ను బలంగా పట్టుకున్న కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ, యమహా తన వ్యూహాలను క్రమంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్కూటర్లను ప్రవేశపెట్టి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యం, సింపుల్ డిజైన్ కోరుకునే వారికి Yamaha Fascino 125 ను అందించగా, యువతకు స్పోర్టీ లుక్, స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వారికి Yamaha Ray ZR 125 ను రూపొందించింది.

చిన్న ఫ్యామిలీ కోసం బుల్లి ఎలక్ట్రిక్ కారు

వియత్నాం‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. మొదటగా ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెట్టిన ఈ కంపెనీ, VinFast VF 6, VinFast VF 7 వంటి ఆధునిక ఎలక్ట్రిక్ SUVలను పరిచయం చేసింది. ఆ తరువాత కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని VinFast VF MPV 7 అనే కొత్త మోడల్‌ను కూడా తన లైన్‌ప్‌లో చేర్చి, భారతదేశంలో తన ఉనికిని మరింత బలపరిచింది. ఈ మూడు మోడళ్లు ఫీచర్లు, డిజైన్, టెక్నాలజీ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, వీటి ధరలు రూ.10 లక్షలకు పైగా ఉండటం వల్ల ఇవి ప్రధానంగా ప్రీమియం వినియోగదారులకే పరిమితమయ్యాయి.

యువత ఫేవరెట్ బైక్ సేల్స్ బూస్ట్.. తాజా రిపోర్ట్ ఇదే!

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో బడ్జెట్ రేంజ్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పనితీరు, అలాగే స్టైలిష్ లుక్ బైక్ కావాలని ప్రతి వినియోగదారు కోరుకుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది టీవీఎస్. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ బైక్, తన స్పోర్టీ డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్ పనితీరు, అలాగే ఆకర్షణీయమైన స్టైలింగ్ కలగలిపి ఈ బైక్‌ను ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌గా మార్చాయి. అందుకే ఇది యువ రైడర్స్‌కు మాత్రమే కాకుండా, రోజువారీ ఉపయోగానికి కూడా అనువైన బైక్‌గా గుర్తింపు పొందుతోంది.

స్కూటర్ కొనేవాళ్ల ఫేవరెట్ ఇదే.. జూపిటర్ సేల్స్ మళ్లీ పెరిగాయి!

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి సరిపోయే సౌకర్యాలతో ఈ స్కూటర్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల మనసులు గెలుచుకుంది. అందుకే ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి నెలా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ వస్తున్న జూపిటర్, 2026 మార్చి నెలలో కూడా అదే జోరును కొనసాగించింది. తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి 2026లో మొత్తం 1,24,771 యూనిట్ల జూపిటర్ స్కూటర్లు అమ్ముడవడం గమనార్హం.
Advertisement

డిజైర్ తర్వాత ఈ కారునే అందరూ కొంటున్నారు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో చాలా కాలంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, నాణ్యత, నమ్మకం, డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలతో ఈ బ్రాండ్ నిరంతరం వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా సెడాన్ విభాగంలో హోండా స్థానం ఎంతో బలంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో హోండా అమేజ్ (Honda Amaze) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. సింపుల్ డిజైన్, సౌకర్యవంతమైన క్యాబిన్, మంచి మైలేజ్ ఈ మూడు అంశాల సమ్మిళితంతో అమేజ్ భారత కుటుంబాలకి దగ్గరైంది. సాధారణంగా సెడాన్ మార్కెట్‌లో అమ్మకాల పరంగా మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో ఉండగా, దానికి సమీపంగా నిలిచి పోటీ ఇస్తున్న మోడల్‌గా అమేజ్ గుర్తింపు పొందింది.

ఏనుగు సైజు కారు.. ఒక్కసారిగా కుప్పకూలిన అమ్మకాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం ఎంపీవీ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) ఒకటి. మారుతి సుజుకి లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ స్థానం దక్కించుకున్న ఈ వాహనం, అధునాతన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్ స్పేస్, అలాగే హైబ్రిడ్ టెక్నాలజీతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ఇది ఒక మంచి ఎంపికగా నిలిచింది. అయితే, ఈ ఆకర్షణీయ లక్షణాలున్నప్పటికీ మార్కెట్‌లో ఇన్విక్టో అమ్మకాల ట్రెండ్ మాత్రం కాస్త ఆందోళన కలిగించేలా మారింది. తాజాగా విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే, అమ్మకాల పరంగా ఈ కారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ఈ స్కూటర్ ఒక్కసారి కొంటే పదేళ్లు టెన్షన్ ఉండదు

భారత టూవీలర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది, స్కూటర్లకు మళ్లీ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు బైక్‌లే ప్రధానంగా అమ్ముడయ్యే ఈ మార్కెట్‌లో, ఇప్పుడు నగర జీవనశైలి మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు, అలాగే సౌకర్యవంతమైన రైడింగ్ అవసరం వంటి కారణాలతో స్కూటర్లు మళ్లీ వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, అలాగే రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు స్కూటర్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఎప్పటిలాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది హోండా యాక్టివా (Honda Activa). సంవత్సరాలుగా నమ్మకానికి ప్రతీకగా నిలిచిన యాక్టివా, తన సరళమైన డిజైన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో భారత వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

35 కిలోమీటర్ల మైలేజ్ కారు! మారుతి బిగ్ సర్ప్రైజ్

భారత కార్ మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు ఈ మూడు అంశాలతో బాలెనో చాలా కాలంగా వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు ఫ్యామిలీ కస్టమర్లకు కూడా ఇది ఒక బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అందుకే ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా బాలెనోలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా పెద్ద అప్‌డేట్ లేకపోవడంతో, పోటీగా ఉన్న ఇతర కంపెనీలు కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్‌లతో ముందుకు రావడం ప్రారంభించాయి.
Advertisement

ప్రతిఒక్కరూ ఈ బైక్‌ను కళ్లు మూసుకుని కొనచ్చు

భారతీయ టూ-వీలర్ మార్కెట్లో విశ్వసనీయతకు మరో పేరుగా నిలిచిన హోండా షైన్ (Honda Shine), మధ్యతరగతి వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రోజువారీ ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలిచే ఈ బైక్, సింపుల్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, అలాగే హోండా ఇంజిన్‌పై ఉన్న నమ్మకం కలిసొచ్చి దీన్ని సంవత్సరాలుగా ఒక స్థిరమైన సక్సెస్ మోడల్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ఆఫీస్ వెళ్లే ఉద్యోగులు, డైలీ కమ్యూటర్స్, మంచి మైలేజ్ కోరుకునే వారికి షైన్ ఎప్పటికీ ఫేవరెట్‌గా ఉంటుంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు కూడా ఈ బైక్ మార్కెట్లో ఎంత బలంగా కొనసాగుతోందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2026 మార్చి నెలలో హోండా షైన్ మొత్తం 1,73,098 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

రూ. 1 లక్ష తగ్గింపుతో మారుతి కారు.. 28.65 kmpl మైలేజ్‌ ఇస్తుంది

భారతదేశంలో అమ్మకాల పరంగా ఎప్పుడూ ముందంజలో ఉండే మారుతి సుజుకి (Maruti Suzuki), తన మార్కెట్ స్థితిని మరింత బలోపేతం చేసుకునే దిశగా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పండుగల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో, వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా కొనుగోలు ఆసక్తిని పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో, అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన విక్టోరిస్ (Victoris) పై ఏప్రిల్ నెలలో భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభించడం, ఈ ఆఫర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతోంది.

గ్రీన్ మొబిలిటీలో గీలీ భారీ అడుగు.. 45 kmpl మైలేజీ నిజమైంది!

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్ టెక్నాలజీకి కొత్త దిశను చూపించే ప్రయత్నంగా గీలీ ఆటో (Geely Auto) తమ తాజా ఆవిష్కరణను పరిచయం చేసింది. 'i-HEV' (ఇంటెలిజెంట్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్) పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ హైబ్రిడ్ వ్యవస్థ, భవిష్యత్తు మొబిలిటీకి ఒక కొత్త ప్రమాణంగా నిలవనుందని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 'ఇంటెలిజెంట్ ఎనర్జీ' కాన్సెప్ట్‌పై ఆధారపడి రూపొందించిన ఈ టెక్నాలజీ, సంప్రదాయ హైబ్రిడ్ కార్ల కంటే మరింత మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ సిస్టమ్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేయడం. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్, వేగం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలను రియల్‌టైమ్‌లో విశ్లేషించి, ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజిన్ మధ్య శక్తి వినియోగాన్ని అత్యంత సమర్థవంతంగా సమన్వయం చేస్తుంది.

మారుతిని టెన్షన్ పెడుతున్న కారు

భారతదేశంలో ఒక సామాన్యుడు కొత్త కారు కొనాలని భావించినప్పుడు, మొదట గుర్తుకు వచ్చేది మారుతి సుజుకి (Maruti Suzuki). తక్కువ నిర్వహణ ఖర్చు, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం వంటి కారణాలతో ఈ బ్రాండ్‌పై వినియోగదారులకు ఎంతో నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో మారుతి దశాబ్దాలుగా ఆధిపత్యం చాటుతూ వచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు భారీగా అమ్ముడయ్యే చిన్న కార్లకు ఇప్పుడు మార్కెట్లో అంతగా ఆదరణ కనిపించడం లేదు. ఆల్టో కె10, ఎస్‌ ప్రెస్సో, ఇగ్నీస్ వంటి మోడళ్లన్నీ అమ్మకాల పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫేవరెట్‌గా ఉన్న ఈ కార్లు, ఇప్పుడు వినియోగదారుల దృష్టిలో కొంత వెనుకబడ్డాయి.
Advertisement

సిటీ కార్లలో కొత్త ట్రెండ్.. కామెట్ EV దుమ్మురేపుతోంది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మోడల్‌గా ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) నిలుస్తోంది. పరిమాణం చిన్నదైనా, పనితీరు, ఉపయోగకరతలో మాత్రం ఈ కారు పెద్దదే అని చెప్పాలి. నగర జీవనశైలికి పూర్తిగా సరిపోయే సిటీ కారుగా ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటోంది. గత కొన్ని నెలలుగా భారతీయ రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు, 2026 మార్చి నెలలో అద్భుతమైన అమ్మకాల పెరుగుదలను నమోదు చేయడం విశేషం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కామెట్ ఈవీకి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. 2025 మార్చిలో కేవలం 173 యూనిట్లు మాత్రమే అమ్ముడైన ఈ కారు, 2026 మార్చిలో 682 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.

కస్టమర్ల హాట్ ఫేవరెట్‌గా మారిన బడ్జెట్ కారు

భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది రెనాల్ట్ కైగర్ (Renault Kiger). 4 మీటర్ల లోపు పొడవుతో నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ కారు, డిజైన్, ఫీచర్లు, ధర కలిపి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు చిన్న కుటుంబాల మధ్య ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ కారు మార్కెట్లో ఎంత బలంగా నిలబడుతుందో స్పష్టంగా తెలుస్తోంది. 2026 మార్చి నెలలో మొత్తం 1,184 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే కాలంలో అంటే 2025 మార్చిలో కేవలం 762 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఈ రెండు సంఖ్యలను పోల్చితే, ఈసారి 422 యూనిట్లు ఎక్కువగా అమ్ముడవడం గమనార్హం.

ఎన్ని ఉన్నా ఈ ఒక్క కారుకే పట్టం కట్టిన జనాలు

భారత ఆటోమొబైల్ రంగంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ (Sub-4m SUV) సెగ్మెంట్ ప్రస్తుతం ఓ రణరంగంలా మారింది. మిడిల్ క్లాస్ ప్రజల డ్రీమ్ కార్లుగా మారిన ఈ బుజ్జి ఎస్యూవీల విక్రయాల్లో గత నెల అంటే మార్చి 2026లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోగా, కియా వంటి దిగ్గజ కంపెనీకి చెందిన ఒక మోడల్ మాత్రం ఘోర పరాజయాన్ని అందించింది. నెక్సాన్, బ్రెజ్జా, సోనెట్ వంటి ఉద్దండ పిండాలను సైతం వెనక్కి నెట్టి టాటా పంచ్ (Tata Punch) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. గత నెలలో భారతీయ కస్టమర్లు టాటా పంచ్ (Punch) పై తమ మనసు పారేసుకున్నారు. ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ చిన్న ఎస్యూవీ మార్చి 2026లో ఏకంగా 20,977 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది మార్చిలో అమ్ముడైన 17,714 యూనిట్లతో పోలిస్తే ఇది 18.42 శాతం వృద్ధిని కనబరిచింది. సెగ్మెంట్‌లో 17.09 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుని, ఇతర 13 మోడళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని మైలేజీ, సేఫ్టీ రేటింగ్, ధర సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యాయి. టాటా మోటార్స్ నుండి వచ్చిన మరో దిగ్గజం నెక్సాన్ (Nexon) కూడా దూసుకుపోతోంది. మార్చి 2026లో 19,810 యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో దీని విక్రయాలు 16,366 యూనిట్లుగా ఉండేవి, అంటే 21.04 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో నెక్సాన్ కి పోటీ లేకపోవడం, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. టాప్-2 స్థానాలు టాటా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌ను ఏలిన మారుతి బ్రెజ్జా (Brezza) మూడో స్థానానికి పడిపోయింది. గత నెలలో 16,130 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది కంటే 2.51 శాతం తక్కువ. అయితే మారుతికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఫ్రాంక్స్ (Fronx). ఇది 15,540 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 13.69 శాతం గ్రోత్ సాధించి మారుతి పరువును కాపాడింది. అయినా టాటా దూకుడును అందుకోవడంలో మారుతి విఫలమైందనే చెప్పాలి. కియా సోనెట్ (Sonet) ఈసారి అద్భుతమైన పుంజుకుంది. మార్చి 2026లో 12,012 యూనిట్లు అమ్ముడై, గతేడాది కంటే ఏకంగా 55.9 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్ వెన్యూ (Venue) కూడా 11,147 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. ఇక మహీంద్రా XUV3XO/EV విక్రయాలు కూడా 30 శాతం పెరిగి 9,199 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, స్కోడా కైలక్ వంటివి మిక్సడ్ రిజల్ట్స్ అందించాయి. ఈ రిపోర్టులో అందరినీ షాక్ కి గురిచేసిన పేరు కియా సిరోస్ (Kia Syros). గతేడాది మార్చి 2025లో 5,015 యూనిట్లు అమ్ముడైన ఈ మోడల్, ఇప్పుడు మార్చి 2026లో కేవలం 59 యూనిట్లకు పరిమితమైంది. అంటే విక్రయాలు ఏకంగా 98.82 శాతం పడిపోయాయి. ఒకప్పుడు బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా ఉన్న ఈ కారుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ కంపెనీకే తెలియాలి. బహుశా మార్కెట్లో వచ్చిన కొత్త పోటీ లేదా కస్టమర్ల అభిరుచి మారడమే దీనికి కారణం కావచ్చు. మొత్తంగా చూస్తే మార్చి నెలలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 1,22,710 కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 8.87 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 2026 తో పోలిస్తే కూడా మార్కెట్ 7.14 శాతం వృద్ధిని కనబరిచింది. కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా సేఫ్టీకి (టాటా), మైలేజీకి (మారుతి), టెక్నాలజీకి (కియా/హ్యుందాయ్) ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ రేసులో టాటా మోటార్స్ పంచ్ మ్యాజిక్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాబోయే పండగ సీజన్లలో ఈ పోటీ మరింత ముదిరే అవకాశం ఉంది.

ఒక్క నెలలో 3.33 లక్షల బైకుల విక్రయం.. నంబర్-1గా రికార్డు

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో గత నెల (మార్చి 2026) సేల్స్ లెక్కలు తేలాయి. ఎప్పటిలాగే సామాన్యుడి నేస్తం హీరో స్ప్లెండర్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఇతర కంపెనీల బైకులు, స్కూటర్లు కూడా పోటాపోటీగా అమ్ముడయ్యాయి. ఈ మార్చి నెలలో టాప్-10 స్థానాల్లో నిలిచిన వాహనాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

తాళం అవసరం లేదు, పెడల్ తొక్కకుండానే 70 కి.మీ!

భారతదేశంలో పర్యావరణ హితమైన ప్రయాణ సాధనాలపై ఆసక్తి పెరుగుతున్న ఈ కాలంలో, ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ అయిన ఇమోటోరాడ్ (EMotorad) మరో వినూత్న అడుగుతో ముందుకు వచ్చింది. నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక మంచి పరిష్కారంగా నిలవబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా ఇమోటోరాడ్ వైపర్ ఎలక్ట్రిక్ సైకిల్ (EMotorad Viper Electric Cycle) అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వైపర్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది NFC (Near Field Communication) టెక్నాలజీ.