కార్ లాంచ్ అయ్యిందో లేదో భారీగా సేల్స్

Nissan : భారత ఆటోమొబైల్ రంగంలో జపాన్ దిగ్గజం నిస్సాన్ (Nissan) మళ్ళీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గత కొన్నాళ్లుగా నిలకడగా ఉన్న అమ్మకాలు, కొత్త మోడల్ నిస్సాన్ గ్రావిటే(Nissan Gravite) ఎంట్రీతో ఒక్కసారిగా రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. ఫిబ్రవరి 2026 నెల నిస్సాన్ సంస్థకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేసి, ప్రత్యర్థి కంపెనీలకు నిస్సాన్ గట్టి సవాల్ విసిరింది. కొత్త కారు లాంచ్ అయిన వెంటనే కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కట్టడం ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

RX 100ని గుర్తుకు తెస్తూ మార్కెట్లోకి కొత్త బైక్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా తన ఇంజిన్ పనితీరు, డిజైన్ ఫిలాసఫీ, రేసింగ్ వారసత్వంతో ప్రత్యేక గుర్తింపు పొందిన యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) తాజాగా భారత మార్కెట్‌లో మరోసారి యువత దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఆధునిక రెట్రో శైలిలో విడుదలైన యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR155) కు ఇప్పుడు మరింత స్టైల్ జోడిస్తూ 'మెటాలిక్ బ్లాక్' ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1,58,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. గత సంవత్సరం నవంబర్‌లో ప్రారంభమైన XSR155 తక్కువ సమయంలోనే రైడర్ల నుంచి మంచి స్పందన పొందింది. యమహా డిజైన్ తత్వం ప్రకారం, పాతకాలపు క్లాసిక్ లుక్‌ను ఆధునిక టెక్నాలజీతో కలిపి రూపొందించిన ఈ బైక్ యువతతో పాటు రెట్రో స్టైల్‌ను ఇష్టపడే రైడర్లను ఆకట్టుకుంది.

ఓలా పాత కస్టమర్లకు పండగే

Ola Electric : భారతదేశపు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో షేరు ధర పతనం, మరోవైపు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో కంపెనీ ఇమేజ్ కాస్త డీలా పడింది. ఈ నేపథ్యంలో, తన పాత కస్టమర్లను బుజ్జగించడానికి, కొత్త అమ్మకాలను పెంచుకోవడానికి ఓలా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ఓలా ఇన్సైడర్స్ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్. పది లక్షల మందికి పైగా ఉన్న తన పాత కస్టమర్ల కోసం ఏకంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను ప్రకటిస్తూ ఓలా మళ్ళీ రేసులోకి రావాలని చూస్తోంది.

భారత కార్ల మార్కెట్‌లో దుమ్మురేపిన నెక్సాన్, డిజైర్, పంచ్!

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న, అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో మధ్యతరగతి వృద్ధి, పెరుగుతున్న నగరీకరణ, సులభమైన ఫైనాన్స్ సదుపాయాలు, అలాగే విభిన్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న మోడళ్ల వల్ల కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రతి నెలా విడుదలయ్యే సేల్స్ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు; అవి వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ ట్రెండ్స్, బ్రాండ్ల మధ్య ఉన్న తీవ్ర పోటీని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన టాప్ 10 కార్ల జాబితా విడుదల కావడం ఆటో రంగంలో ఆసక్తికర చర్చలకు దారితీసింది. వాటి గురించి కింది కథణంలో చూద్దాం.
Advertisement

ఎలక్ట్రిక్ నుంచి బైక్‌ల వరకు టీవీఎస్ దూకుడు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థల్లో ఒకటైన టీవీఎస్ (TVS Motor Company) మరోసారి అద్భుతమైన ప్రదర్శనతో ముందుకొచ్చింది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తన స్థాయిని మరింత బలోపేతం చేస్తూ, ఫిబ్రవరి 2026లో గణనీయమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఆ ఒక్క నెలలోనే కంపెనీ మొత్తం 5,29,308 యూనిట్ల టూవీలర్, త్రీవీలర్ వాహనాలను విజయవంతంగా విక్రయించింది. ఇందులో దేశీయంగా అమ్ముడైన వాహనాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే ఫిబ్రవరి 2025లో కంపెనీ 4,03,976 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈసారి నమోదు చేసిన సంఖ్యతో పోలిస్తే అమ్మకాలు సంవత్సరానికి 31 శాతం పెరగడం విశేషం.

ఇది కారా లేక లగ్జరీ సోఫానా!

రోడ్ల మీద తిరిగే ఒక రాజప్రసాదం.. అడుగుపెడితే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న అనుభూతి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, అత్యంత నిశ్శబ్దంగా, విలాసవంతంగా సాగిపోయే ప్రయాణం.. ఇవన్నీ వినడానికి ఏదో హాలీవుడ్ సినిమాలో కార్లలా అనిపిస్తున్నాయా? కానీ, నిజంగానే ఇలాంటి ఒక చక్రాల మీద నడిచే విలాస నౌకను మెర్సిడిస్-బెంజ్ సంస్థ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, తన పాపులర్ ఎంబీవీ (MPV) మోడల్ వి-క్లాస్(V-Class) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నేడు (మార్చి 2, 2026) అధికారికంగా లాంచ్ చేసింది. కోట్లాది రూపాయల ఖరీదు చేసే ఈ కారు, కేవలం వాహనం మాత్రమే కాదు, ఒక హోదాకు నిదర్శనం.

200 కి.మీ రేంజ్‌తో రోడ్లపైకి రప్తీ T30 EV.. తొలి డెలివరీలు స్టార్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవి కలిసి EVలపై వినియోగదారుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్టప్ బ్రాండ్లు మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ విప్లవంలో భాగమవుతూ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులకు ఎన్నో కొత్త, ఆధునిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులో భాగంగా చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ రప్తి హెచ్‌వీ (Raptee.HV) కూడా ముందడుగు వేసింది.

అందరికీ ఆ సౌండ్ బాగా నచ్చింది

భారత రోడ్ల మీద గంభీరమైన శబ్దంతో దూసుకుపోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతల కాలం నాటి బుల్లెట్ నుంచి నేటి తరం హంటర్ 350 వరకు ఈ బ్రాండ్ తన విలక్షణతను చాటుకుంటూనే ఉంది. తాజాగా ఫిబ్రవరి 2026 నెలలో ఈ స్వదేశీ దిగ్గజం అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గడిచిన నెలలో ఏకంగా ఒక లక్షకు పైగా బైక్‌లను విక్రయించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం వెనుక ఉన్న కారణాలు, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, బైక్ రైడర్స్ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Advertisement

కియా కార్లను కొనడానికి ఎగబడిన ప్రజలు

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ (Kia Motors) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆశ్చర్యకరమైన వేగంతో ఎదుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే దేశంలోని స్థిరపడిన వాహన తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ, ఫీచర్లతో నిండిన మోడళ్ల ద్వారా భారతీయ వినియోగదారుల మనసును గెలుచుకుంది. ప్రస్తుతం కియా ఇండియా (Kia India)కి చెందిన కార్లు దేశంలోని చిన్న పట్టణాల నుంచి మహానగరాల వరకు ప్రతి ఊరిలో కనిపిస్తున్నాయి. ఇది బ్రాండ్‌కు వచ్చిన ఆదరణ ఎంత విస్తృతంగా ఉందో చూపిస్తోంది. ప్రారంభం నుంచే వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, సరైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించడం కంపెనీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

అతి తక్కువలో బెస్ట్ 7 సీటర్

ఫ్యామిలీతో కలిసి చేసే ప్రతి ప్రయాణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సెలవులు, పండుగలు, పెళ్లిళ్లు లేదా వీకెండ్ ట్రిప్స్ ఏ సందర్భమైనా అందరూ ఒకే వాహనంలో కూర్చొని వెళ్లడం అనేది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. అందుకే భారతీయ మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. పెద్ద కుటుంబాలు ఉన్న దేశంగా భారత్‌లో ఒకే కారులో అందరూ కలిసి ప్రయాణించగలిగే సౌకర్యం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ అవసరాలకు సరిపోయేలా విస్తృతమైన స్థలం, మంచి మైలేజ్, అందుబాటు ధర కలిగిన ఎంపీవీ మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

దేశంలోనే నంబర్ వన్ కారు

భారతీయ రోడ్ల మీద ఎన్నో కార్లు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం జనాల గుండెల్లో గట్టిగా పాగా వేస్తాయి. అలాంటి కార్ల జాబితా తీస్తే మొదటి వరుసలో ఉండే పేరు మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire). ఒకప్పుడు సెడాన్ కార్లు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, ఆ ముద్రను చెరిపేసి సామాన్యుడికి కూడా సెడాన్ కారును అందుబాటులోకి తెచ్చిన ఘనత డిజైర్‌దే. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే, ఎస్‌యూవీల (SUV) జోరు నడుస్తున్న ఈ కాలంలో కూడా డిజైర్ తన పట్టును ఏమాత్రం కోల్పోలేదని అర్థమవుతోంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 19,326 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సెడాన్ కారుగా రికార్డు సృష్టించింది.

కారు, బైక్ ఉందా? మీ కోసమే ఈ ఆర్టికల్

భారతదేశం అంటే పండుగల పర్వదినాల దేశం. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పండుగను ఘనంగా, ఆనందంగా జరుపుకోవడం భారతీయుల ప్రత్యేకత. అలాంటి ప్రధాన పండుగల్లో ఒకటి హోలీ (Holi). రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలో చిన్నా పెద్దా, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొంటారు. వీధులు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు అన్నిచోట్లా నవ్వులు, రంగులు, సంబరాల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ ఆనంద వేడుకల మధ్య వాహనాదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. రంగుల పండుగలో కార్లు, బైకులు కూడా రంగుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Advertisement

డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువగా ఇష్టపడేకారు

సగటు మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల తర్వాత అత్యంత ముఖ్యమైనది సొంత కారు కొనుక్కోవడం. అయితే ప్రస్తుత కాలంలో కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో బడ్జెట్ ధరలో లభిస్తూ, అదిరిపోయే మైలేజీని ఇచ్చే కార్ల కోసం జనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసిన మారుతి సుజుకి తన ఐకానిక్ మోడల్ మరూతి వ్యాగన్ఆర్‎తో మార్కెట్‌ను ఏలుతోంది. ఫిబ్రవరి 2026 నెలలో వెలువడిన సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే, వ్యాగన్ఆర్ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన సెడాన్లు, స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌లు ఎన్ని ఉన్నా.. సగటు మధ్యతరగతి వాడి ఫేవరెట్ మాత్రం ఎప్పుడూ వ్యాగన్ఆరేనని మరోసారి నిరూపితమైంది.

ఇండియాలో నెం.1 కారు ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు వస్తున్నా, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందంజలో నిలుస్తున్న SUVల్లో ఒకటి టాటా నెక్సాన్ (Tata Nexon). ఈ కారు కేవలం ఒక సాధారణ SUV మాత్రమే కాదు, నమ్మకానికి మరో పేరు అన్నట్టుగా మారింది. అందుకే దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. 2026 ఫిబ్రవరిలో ఈ SUV అద్భుతమైన అమ్మకాలతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఒక్క నెలలోనే మొత్తం 19,430 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం చిన్న విషయం కాదు. అంతకుముందు జనవరి నెలలో కూడా ఇదే జోష్ కొనసాగింది. అప్పట్లో దాదాపు 23,365 యూనిట్లు అమ్ముడై మార్కెట్‌లో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

7-సీటర్ కార్ల కోసం షోరూంల ముందు జనం క్యూ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. క్వాలిటీ, కంఫర్ట్, ఇంజన్ లైఫ్ విషయంలో టోయోటాకు సాటి మరెవరూ లేరని కార్ లవర్స్ నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఇప్పుడు విక్రయాల రూపంలో కనిపిస్తోంది. ఫిబ్రవరి 2026 నెల టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (TKM) పాలిట ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ ఏకంగా 34,034 యూనిట్ల మొత్తం అమ్మకాలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 2025లో నమోదైన 28,414 యూనిట్లతో పోలిస్తే, ఈసారి కంపెనీ దాదాపు 20 శాతం వృద్ధిని సాధించి మార్కెట్లో తన పట్టును మరింత బిగించింది.

ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలంటోది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో రాజీ పడని వాహనాలను అందిస్తూ, మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరి మనసు గెలుచుకుంటోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 విక్రయాల గణాంకాలు చూస్తుంటే, టాటా కార్లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.
Advertisement

ఇది కారు కాదు రోడ్ల మీద తిరిగే ప్రైవేట్ థియేటర్

భారతదేశపు రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల సందడి కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేస్తూ, విలాసానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలా XEV 9e సినీలక్స్ ఎడిషన్ (CineLux Edition)ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. టెస్లా సైబర్‌ట్రక్‌ను తలపించేలా అత్యంత ఆధునికమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్, సాధారణంగా లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే హై-ఎండ్ ఫీచర్లతో రూపొందిన ఈ కారు ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక ఎడిషన్ విశేషాలను పరిశీలిస్తే, ఇది కేవలం రవాణా సాధనంగానే కాకుండా ఒక కదిలే విలాసవంతమైన గృహంలా అనిపిస్తుంది.

చిన్న కారుతో జనాల మనసు దోచుకోనున్న టాటా

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకున్న మోడల్ టాటా టియాగో ఈవీ (Tata Tiago.ev). సరసమైన ధర, సిటీ డ్రైవింగ్‌కు తగ్గ రేంజ్‌తో దూసుకుపోతున్న ఈ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ ఈ పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ జరుగుతుండగా తీసిన స్పై చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కవర్‌తో ఉన్నప్పటికీ, ఈ కారులో రాబోయే విప్లవాత్మక మార్పులు ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నాయి. స్పై చిత్రాల ప్రకారం.. 2026 టాటా టియాగో ఈవీ డిజైన్ పరంగా భారీ మార్పులకు లోనవుతోంది. దీనికి సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ (LED Headlamps) అమర్చారు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న రిఫ్లెక్టర్ల స్థానంలో పవర్‌ఫుల్ ప్రొజెక్టర్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, హెడ్‌లైట్ల పైన అమర్చిన స్లిమ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ (LED DRLs) కారుకు ఒక అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

మార్కెట్లోకి మహీంద్రా 5 బ్రహ్మస్త్రాలు

భారతీయ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా పేరు వింటేనే ఒక తెలియని క్రేజ్ కనిపిస్తోంది. రఫ్ అండ్ టఫ్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్లకు పెట్టింది పేరు మహీంద్రా. ఇప్పటికే XUV 7XO, XUV 3XO వంటి మోడళ్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఈ దేశీ దిగ్గజం, రాబోయే కాలంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. ఎస్‌యూవీ లవర్స్‌కు కన్నుల పండుగ చేసేలా వచ్చే ఏడాది కాలంలో 5 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ కార్లన్నీ టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఆ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

కారు కంటే ఎక్కువ వారంటీ ఎలక్ట్రిక్ స్కూటర్లివే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఒక ఈవీ స్కూటర్ కొనాలని షోరూమ్‌కు వెళ్లినప్పుడు మనం కేవలం దాని లుక్స్, స్పీడ్, రేంజ్ మాత్రమే చూస్తాం. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది బ్యాటరీ వారంటీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరలో దాదాపు 40 నుంచి 50 శాతం ఖర్చు కేవలం బ్యాటరీ ప్యాక్‌కే అవుతుంది. ఒకవేళ వారంటీ లేని సమయంలో బ్యాటరీ పాడైతే, కొత్తది కొనడం అంటే దాదాపు సగం కారు లేదా కారు ధర చెల్లించినట్లే అవుతుంది. అందుకే ఇప్పుడు కంపెనీలు కస్టమర్ల భయాలను పోగొట్టేందుకు ఏకంగా 8 ఏళ్ల వరకు వారంటీని ప్రకటిస్తున్నాయి. ఓలా నుంచి ఎథర్ వరకు ఏయే కంపెనీలు ఎంత వారంటీ ఇస్తున్నాయో ఈ ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

దేశంలో అందరి ఫేవరెట్ కారు రూ.5.99 లక్షలకే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కారు ఉంటే, అది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)నే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టైల్, పనితీరు, సౌకర్యం ఈ మూడు అంశాలను సమతుల్యంగా కలిపిన మోడల్‌గా బాలెనో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారు మొదట 1999లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి ఇది ఒక ఆధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లతో వచ్చిన హ్యాచ్‌బ్యాక్‌గా మంచి గుర్తింపు పొందింది. కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ వచ్చింది. ఫలితంగా నేటికీ బాలెనో యువత నుండి కుటుంబాల వరకు అందరికీ ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. దీని గురించిన వివరాలను ఈ కథణంలో చూద్దాం.

తక్కువ ధరలో కియా కొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అలాగే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కలిసి EVలకు డిమాండ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పును గమనించిన ప్రముఖ బ్రాండ్లు కూడా వేగంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటీవలే Toyota, Maruti Suzuki భారత మార్కెట్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి EV రేసులో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు Kia కూడా మరింత ఆగ్రెసివ్‌గా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కియా వద్ద ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి. అందులో Kia EV6, Kia Carens Clavis EV, Kia EV9 వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్‌కు చెందినవే.

ఇంత మంచి బైకుకు తగ్గిన ఆదరణ

భారతదేశంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp)కు చెందిన హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ (Hero Super Splendor XTEC) బైక్ ఇప్పటికే లక్షలాది మంది రైడర్ల మనసు గెలుచుకుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే పనితీరు, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో ఈ మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కుటుంబ అవసరాల కోసం నమ్మకమైన బైక్ కోరుకునే వారికి ఇది మొదటి ఎంపికగా మారింది. జనవరి 2026లో కూడా ఈ బైక్ అమ్మకాలు గణనీయ స్థాయిలోనే నమోదయ్యాయి. ఆ నెలలో మొత్తం 13,217 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం చిన్న విషయం కాదు.

ఈ ఎన్‌ఫీల్డ్ బైక్ క్రేజ్ మామూలుగా లేదు!

భారతదేశంలో క్లాసిక్ బైక్‌లకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బ్రాండ్‌లో అత్యంత అందుబాటు ధరలో లభించే మోడల్‌గా హంటర్ 350 (Hunter 350) నిలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనగానే భారీ లుక్, ఘనమైన ఇంజిన్ సౌండ్, ప్రీమియం ఫీలింగ్ గుర్తుకు వస్తాయి. అయితే ఆ బ్రాండ్ అనుభూతిని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన మోడల్ హంటర్ 350 కావడం దీని ప్రత్యేకత. తక్కువ ధర, యూత్‌ఫుల్ డిజైన్, నగర ప్రయాణాలకు అనువైన కాంపాక్ట్ సైజ్ ఈ మూడు ప్రధాన కారణాల వల్ల హంటర్ 350 ప్రతి నెలా భారత మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు భారీ ఆదరణ కనిపిస్తోంది.
Advertisement

లుక్ మార్చింది.. పవర్ పెంచింది.. టాటా పంచ్ EV కొత్త వెర్షన్ రివ్యూ!

టాటా పంచ్ EV సమీక్షలో దాని 468 కిమీ రేంజ్, రెండు బ్యాటరీ ఎంపికలు మరియు స్మార్ట్ ఫీచర్లను చూడండి. ఈ కాంపాక్ట్ SUV నగర ప్రయాణాలకు ఎందుకు ఉత్తమమో తెలుసుకోండి.