ఫాస్టాగ్‌లో ఈ తప్పు ఉంటే ఇక అంతే.. వెంటనే అకౌంట్ బ్లాక్

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. మీ ఫాస్టాగ్ (FASTag) విషయంలో మీరు చేసే చిన్న పొరపాటు మీ ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చేస్తుంది. ఫాస్టాగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకింగ్ సంస్థలకు ఎన్‌హెచ్ఏఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) సరిగ్గా లేని లేదా చెల్లుబాటు కాని ఫాస్టాగ్ అకౌంట్లను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని స్పష్టం చేసింది. డిజిటల్ టోల్ వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వాహనదారుల్లో చర్చనీయాంశమైంది.

టాటాకు ఇలాంటి కారు ఉందని చాలా మందికి తెలియదు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) తన SUVలతో అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నప్పటికీ, ప్రతి మోడల్ ఒకే రీతిలో ప్రదర్శన ఇవ్వడం లేదనే విషయం తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్ (Tata Nexon) వంటి మోడళ్లు ప్రతి నెల భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుంటూ మార్కెట్‌ను లీడ్ చేస్తుంటే, కొన్ని కార్లు మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. అలాంటి కార్లలో ఒకటి టాటా టిగోర్ (Tata Tigor). ఒకప్పుడు మంచి స్థిరమైన అమ్మకాలతో నిలిచిన ఈ సెడాన్, ఇప్పుడు మాత్రం పోటీకి తట్టుకోలేక కొంత వెనుకబడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం టాటాకు ఇలాంటి కారు ఉందని చాలా మందికి తెలియదు అనేలా పరిస్థితులు ఉన్నాయి.

బుకింగ్స్ షురూ అయిన అరగంటలోనే 8000 ఆర్డర్లు

ఆటోమొబైల్ ప్రపంచంలో నిస్సాన్ సంస్థ సరికొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది. కేవలం 30 నిమిషాల్లోనే 8,000 బుకింగ్స్ సాధించిందంటే ఈ కారు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిస్సాన్ NX8 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV), ఫీచర్ల పరంగా లగ్జరీ కార్లకు గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా దీని రేంజ్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 1,450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే మన హైదరాబాద్ నుంచి బయలుదేరితే నార్త్ ఇండియాలోని లఖ్‌నవూ లేదా పాట్నా వరకు అస్సలు ఆగకుండా వెళ్ళిపోవచ్చు.

చేతిలో రూ.3 లక్షలు ఉంటే ఈ కారు కొనచ్చు!

భారతీయ కార్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లతో ముందుకు వస్తూ ఉండే మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ ఏప్రిల్ నెలలో కూడా తన ప్రసిద్ధ చిన్న కారు మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso) పై ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఇప్పటికే దేశంలో అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మోడల్, ఇప్పుడు ఈ డిస్కౌంట్లతో మరింత అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో కంపెనీ మొత్తం రూ. 37,500 వరకు లాభాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు నేరుగా ఉపయోగపడే క్యాష్ డిస్కౌంట్ (యూజర్ డిస్కౌంట్) రూ. 10,000 వరకు ఉంది. అంటే షోరూమ్‌లోనే కార్ ధర నుంచి ఈ మొత్తం తగ్గుతుంది.
Advertisement

పేదవాళ్లు అత్యధికంగా కారుకు మంగళం పాడిన మారుతి

భారతదేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసే ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేస్తోంది. గత కొన్నేళ్లుగా యువతను ఆకట్టుకున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి ఇగ్నిస్ (Ignis) ప్రయాణానికి కంపెనీ ముగింపు పలికింది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ వార్త ఇప్పుడు నిజమైంది. ఇగ్నిస్ స్థానంలో సరికొత్త మైక్రో ఎస్‌యూవీ (Micro SUV)ని తీసుకురావడమే లక్ష్యంగా మారుతి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ సృష్టిస్తున్న ప్రకంపనలకు చెక్ పెట్టేందుకు మారుతి తన కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.15,500 భారీ తగ్గింపు

ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న టీవీఎస్ మోటార్ కంపెనీ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోనే అత్యధిక ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) పై ఏప్రిల్ 2026 నెలలో భారీ తగ్గింపును అందిస్తోంది. ఏకంగా రూ.15,500 వరకు ప్రయోజనాలను కల్పిస్తూ ఓలా, బజాజ్ వంటి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరింది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, అదిరిపోయే రేంజ్ ఉన్న ఈ స్కూటర్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తోంది.

ఇక కారే మీ డాక్టర్.. కూర్చుంటే చాలు మీ వయసు ఎంతో చెప్పేస్తోంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ కార్ల డ్రైవింగ్ సీటు వరకు వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఒక సంచలన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. మీ కారులోని కెమెరా కేవలం మీ ముఖం చూసి మీ వయస్సు ఎంతో చెప్పేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం కాబోతోంది. డ్రైవర్ల భద్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టెస్లా ఈ అధునాతన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. దీనివల్ల డ్రైవింగ్ మరింత సురక్షితం కావడమే కాకుండా, ఎమర్జెన్సీ సమయాల్లో ప్రాణాలను కాపాడే అవకాశం కూడా ఉంటుంది.

రూ. 4 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?.. మారుతి మాస్టర్ ప్లాన్ బయటపడింది!

భారతీయ రహదారులపై దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి (Maruti Suzuki), ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఐసీ ఇంజిన్ కార్లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ కంపెనీ, ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో, మారుతి తన భవిష్యత్ వ్యూహాన్ని బలంగా రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, కంపెనీ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే బడ్జెట్ ఈవీ నుంచి ప్రారంభించి, పెద్ద కుటుంబాలకు అనువైన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ వరకు విస్తరించేలా ఈ లైనప్‌ను డిజైన్ చేస్తోంది.
Advertisement

7 మందికి కంఫర్ట్.. ఫీచర్లతో నిండిన విన్‌ఫాస్ట్ EV

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్న విన్‌ఫాస్ట్ (VinFast), ఇప్పుడు భారత మార్కెట్లో కూడా తన ప్రభావాన్ని విస్తరించేందుకు దూసుకెళ్తోంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ఇటీవలే భారతదేశంలో అడుగుపెట్టినప్పటికీ, తక్కువ సమయంలోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఇప్పటికే కంపెనీ తన లైనప్‌లో భాగంగా VinFast VF 6, VinFast VF 7 వంటి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ రెండు మోడళ్లతో SUV సెగ్మెంట్‌లో స్థిరపడే ప్రయత్నం చేసిన విన్‌ఫాస్ట్, ఇప్పుడు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మరో కీలక మోడల్‌ను పరిచయం చేసింది. అదే విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 (VinFast VF MPV 7).

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వారమంతా ప్రయాణం

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఈక్యూఎస్ (EQS)ను సరికొత్త హంగులతో, అదిరిపోయే రేంజ్‌తో అప్‌డేట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 926 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించారు. గాలి వేగంతో దూసుకెళ్లడమే కాకుండా, విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతతో ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.

ఫ్యామిలీ + బిజినెస్‌కు బెస్ట్ ఆప్షన్.. ఈకో సేల్స్ పెరుగుదల

భారతదేశంలో తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించడానికి అనువైన వాహనం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే మోడల్ మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). వాణిజ్య అవసరాలు కావచ్చు, కుటుంబ వినియోగం కావచ్చు, రెండింటికీ సరిపోయే ప్రాక్టికల్ ఎంపికగా ఈ కారు ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY2026) మారుతి సుజుకి నమోదు చేసిన అమ్మకాల గణాంకాలు ఈకోపై ఉన్న డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 1,39,769 యూనిట్ల ఈకో వాహనాలు అమ్ముడవడం, ఈ మోడల్‌పై వినియోగదారుల నమ్మకం ఇంకా బలంగానే ఉందని సూచిస్తోంది.

అదిరిపోయే ఫీచర్లున్నా ఈ కారును మార్చిలో ముగ్గురే కొన్నారు

లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన స్పీడ్, టాప్ క్లాస్ సేఫ్టీ.. ఇవన్నీ ఉన్నా కూడా ఒక కారును కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుంచి వచ్చిన ఐకానిక్ మోడల్ గోల్ఫ్ జీటీఐ (Golf GTI) పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2026 మార్చి నెలలో ఈ కారును దేశవ్యాప్తంగా కేవలం ముగ్గురు మాత్రమే కొనుగోలు చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో అయితే కేవలం ఒకే ఒక్క యూనిట్ అమ్ముడైంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? ఎందుకు దీనికి డిమాండ్ తక్కువగా ఉంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Advertisement

చిన్న కుటుంబానికి చింత లేని కారు

భారతదేశంలో తక్కువ ధరలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం ఎప్పటికప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10). సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ ఇవి కలిపి ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌ను దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలబెట్టాయి. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు) సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాలంలో మొత్తం 93,740 యూనిట్ల మారుతి సుజుకి ఆల్టో కె10 కార్లు అమ్ముడయ్యాయి.

మహీంద్రా ఖాతాలో బంగారు గుడ్లు పెట్టే బాతు ఈ బుజ్జి ఈవీ

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. ముఖ్యంగా మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కంపెనీకి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సాధించిన అమ్మకాలు చూస్తుంటే, భారతీయ వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. కేవలం లుక్ మాత్రమే కాదు, అదిరిపోయే రేంజ్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఈ కారు ఎలక్ట్రిక్ వాహన రంగంలో రారాజుగా దూసుకుపోతోంది.

నెలలో 893 కార్లు మాత్రమే.. హ్యుందాయ్ 7-సీటర్‌కు భారీ షాక్

భారతదేశంలో 5-సీటర్ SUV సెగ్మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta). విడుదలైనప్పటి నుంచే ఈ మోడల్ మార్కెట్లో తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, అమ్మకాల జాబితాలో ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ కలిసి క్రెటాను సాధారణ వినియోగదారులకే కాదు, SUV ప్రేమికులకూ మొదటి ఎంపికగా మార్చాయి. ఇదే విజయాన్ని మరింత విస్తరించాలని భావించిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం Hyundai Motor Company, క్రెటా ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఒక 7-సీటర్ మోడల్‌ను కూడా రూపొందించింది. అదే హ్యూందాయ్ అల్కాజర్ (Hyundai Alcazar). అల్కాజర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు కంపెనీకి భారీ ఆశలే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల పై ఏకంగా రూ.3.45 లక్షల డిస్కౌంట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను ఏలుతున్న టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సామాన్యుడి ఈవీ కలని నిజం చేస్తూ, తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాటా టిగోర్ ఈవీ మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రిక్ కార్లపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.45 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే వర్తిస్తాయి.
Advertisement

ఇంజనీర్లు, డాక్టర్లు ఇష్టపడి కొంటున్న కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అంటే తెలియని వారు ఉండరు. 1999లో లాంచ్ అయినప్పటి నుంచి నేటి వరకు ఇది మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కారుగా నిలుస్తూనే ఉంది. 2019లో వచ్చిన ఈ బిగ్ న్యూ వ్యాగన్ఆర్ మోడల్, అంతకుముందు వెర్షన్లతో పోలిస్తే ఎంతో మారిపోయింది. అప్పట్లో కేవలం 1.0 లీటర్ ఇంజన్‌కే పరిమితమైన ఈ కారు, తొలిసారిగా 1.2 లీటర్ పవర్‌ఫుల్ ఇంజన్‌తో వచ్చి మార్కెట్‌ను ఊపేసింది. నేటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

కారు కొంటే డబ్బులు తిరిగి వస్తాయా?

జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్ (Taigun)లో సరికొత్త మార్పులు చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, ఈసారి కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించేలా ఒక అదిరిపోయే బైబ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. అంటే కారు కొన్న మూడేళ్ల తర్వాత తిరిగి అమ్మేయాలనుకుంటే, షోరూమ్ ధరలో 75 శాతం డబ్బులు వెనక్కి ఇచ్చేలా కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. అసలు ఈ కొత్త టైగన్‌లో ఏయే మార్పులు వచ్చాయో, ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఒక్కసారిగా కుప్పకూలిన టాటా కారు అమ్మకాలు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, నాణ్యత, ఇన్నోవేషన్‌కు ప్రతీకగా నిలిచిన సంస్థ టాటా మోటార్స్ (Tata Motors). ఈ కంపెనీకి చెందిన Tata Curvv (టాటా కర్వ్) భారతీయ మార్కెట్లో కొత్త డిజైన్ ట్రెండ్‌ను తీసుకొచ్చిన మోడల్‌గా చెప్పుకోవచ్చు. సాధారణ SUVల కంటే భిన్నంగా, కూపే-స్టైల్ సిల్హౌట్‌తో ఈ కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్లీక్ రూఫ్‌లైన్, బోల్డ్ ఫ్రంట్ డిజైన్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్ కలిపి ఈ కారుకు ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. తాజాగా ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను చూసినట్లయితే టాటా కర్వ్ గణాంకాలు మాత్రం కొంత మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2026 మార్చి నెలలో ఈ మోడల్ కేవలం 1,602 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేయడం గమనించదగ్గ విషయం.

సాఫ్ట్‎వేర్ ఉద్యోగులంతా ఈ కారే కావాలంటున్నారు

భారతీయ రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల (EV) జోరు పెరిగింది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. మహీంద్రా నుంచి వచ్చిన ఫ్యూచరిస్టిక్ మోడల్ మహింద్రా XEV 9e ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, దానికి తోడు అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సాధించిన అమ్మకాలు చూస్తుంటే, ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో మహీంద్రా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement

టాటా EV గేమ్ చేంజర్.. హారియర్‌తో మార్కెట్ షేక్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చు, పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీ కలిసి ఈవీలను ఎక్కువగా ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. ఈ ట్రెండ్‌ను బలంగా వినియోగించుకుంటున్న కంపెనీల్లో టాటా మోటార్స్ (Tata Motors) ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని, వరుసగా మంచి సేల్స్ నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV) కూడా మార్కెట్లో మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ఈ మోడల్‌కు వస్తున్న డిమాండ్ గమనించదగ్గది.

రేపే ఇండియాలో విన్ఫాస్ట్ VF MPV 7 లాంచ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసి వినియోగదారులను ఈవీల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థల మధ్య పోటీ కూడా గట్టిగా మారింది. ప్రతి కంపెనీ తమదైన స్ట్రాటజీతో కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోటీలో ఇప్పుడు విదేశీ కంపెనీలు కూడా సీరియస్‌గా అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) సంస్థ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టిన ఈ కంపెనీ, ఇప్పుడు భారత్‌లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

కేవలం రూ. 3వేలే తేడా.. పల్సర్ 180cc vs అపాచీ 180ccలో ఏది బెస్ట్

భారతీయ రోడ్ల మీద పల్సర్, అపాచీ బైకుల మధ్య పోటీ అంటే అది కేవలం రెండు బైకుల మధ్య వార్ కాదు.. రెండు వేర్వేరు ఫ్యాన్ బేస్ ల మధ్య జరిగే యుద్ధం. 2022లో ఆగిపోయిన పల్సర్ 180 మళ్ళీ కొత్త అవతారంలో మార్కెట్లోకి రావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. దాదాపు రూ.1.25 లక్షల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ బైక్ కొనాలనుకునే కుర్రాళ్లకు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ బైక్ కొంటే పైసా వసూల్? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.

కైగర్ సేల్స్‌లో భారీ బూస్ట్.. మార్చిలో 55% గ్రోత్ రికార్డ్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా మారింది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ తరహా కార్లు అందుబాటు ధర, మంచి మైలేజ్, స్టైలిష్ డిజైన్ ఈ మూడు ముఖ్య అంశాల కలయికతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కేటగిరీలోనే రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన కైగర్ (Kiger) తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. రెనాల్ట్ కైగర్‌ను ఒకసారి గమనిస్తే, దీని డిజైన్ మొదటనే ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్రంట్‌లో ఉన్న బోల్డ్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ లుక్స్ ఈ కారుకు యూత్‌ఫుల్ అప్పీల్‌ను తీసుకువస్తాయి.
Advertisement

రూ.15 లక్షల లోపు బడ్జెట్లో ఈ ఏడాది లాంచ్ కానున్న బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే నడుస్తోంది. రోడ్డుపై గంభీరంగా కనిపించే లుక్, అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యామిలీ అంతా సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా వీటికే ఓటేస్తున్నారు. మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీ బడ్జెట్ 15 లక్షల లోపే ఉందా? అయితే కొద్ది రోజులు ఆగండి. మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త కార్లు రాబోతున్నాయి. కేవలం 8 లక్షల నుంచే వీటి ధరలు ఉండబోతున్నాయి.