తక్కువ ధరలో కియా కొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతుంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అలాగే పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కలిసి EVలకు డిమాండ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పును గమనించిన ప్రముఖ బ్రాండ్లు కూడా వేగంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటీవలే Toyota, Maruti Suzuki భారత మార్కెట్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి EV రేసులో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు Kia కూడా మరింత ఆగ్రెసివ్‌గా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కియా వద్ద ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి. అందులో Kia EV6, Kia Carens Clavis EV, Kia EV9 వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్‌కు చెందినవే.

ఇంత మంచి బైకుకు తగ్గిన ఆదరణ

భారతదేశంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp)కు చెందిన హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ (Hero Super Splendor XTEC) బైక్ ఇప్పటికే లక్షలాది మంది రైడర్ల మనసు గెలుచుకుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే పనితీరు, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో ఈ మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కుటుంబ అవసరాల కోసం నమ్మకమైన బైక్ కోరుకునే వారికి ఇది మొదటి ఎంపికగా మారింది. జనవరి 2026లో కూడా ఈ బైక్ అమ్మకాలు గణనీయ స్థాయిలోనే నమోదయ్యాయి. ఆ నెలలో మొత్తం 13,217 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం చిన్న విషయం కాదు.

ఈ ఎన్‌ఫీల్డ్ బైక్ క్రేజ్ మామూలుగా లేదు!

భారతదేశంలో క్లాసిక్ బైక్‌లకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బ్రాండ్‌లో అత్యంత అందుబాటు ధరలో లభించే మోడల్‌గా హంటర్ 350 (Hunter 350) నిలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనగానే భారీ లుక్, ఘనమైన ఇంజిన్ సౌండ్, ప్రీమియం ఫీలింగ్ గుర్తుకు వస్తాయి. అయితే ఆ బ్రాండ్ అనుభూతిని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన మోడల్ హంటర్ 350 కావడం దీని ప్రత్యేకత. తక్కువ ధర, యూత్‌ఫుల్ డిజైన్, నగర ప్రయాణాలకు అనువైన కాంపాక్ట్ సైజ్ ఈ మూడు ప్రధాన కారణాల వల్ల హంటర్ 350 ప్రతి నెలా భారత మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు భారీ ఆదరణ కనిపిస్తోంది.

లుక్ మార్చింది.. పవర్ పెంచింది.. టాటా పంచ్ EV కొత్త వెర్షన్ రివ్యూ!

టాటా పంచ్ EV సమీక్షలో దాని 468 కిమీ రేంజ్, రెండు బ్యాటరీ ఎంపికలు మరియు స్మార్ట్ ఫీచర్లను చూడండి. ఈ కాంపాక్ట్ SUV నగర ప్రయాణాలకు ఎందుకు ఉత్తమమో తెలుసుకోండి.
Advertisement

పెట్రోల్ స్కూటర్లకు టెన్షన్ స్టార్ట్!

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)కు చెందిన హీరో విడా (Hero Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు నిజంగానే ఇంటింటికీ పరిచయమైన పేరుగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, పెట్రోల్ ధరల భారంతో పాటు పర్యావరణ హితమైన ప్రయాణానికి మళ్లుతున్న ధోరణి ఇవన్నీ కలిసి హీరో విడా అమ్మకాల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. గత నెల జనవరి 2026లో ఈ స్కూటర్ భారీ స్థాయిలో అమ్ముడై రికార్డు సృష్టించింది. ఒక్క నెలలోనే మొత్తం 13,830 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయడం విశేషం. అదే సమయంలో గత సంవత్సరం జనవరి 2025లో 6,669 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మార్కెట్‎ను షేక్ చేసేందుకు టాటా నయా ప్లాన్

భారతదేశ మధ్యతరగతి ప్రజల కలల కారుగా పేరుగాంచిన టాటా న్యూసెన్స్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును అందించాలనే లక్ష్యంతో వచ్చిన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా నిలిచింది. అయితే, పోటీ పెరుగుతున్న తరుణంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు టాటా మోటార్స్ ఈ కారులో భారీ మార్పులు చేస్తోంది. సరికొత్త లుక్, హైటెక్ ఫీచర్లు, ఊహించని ధరతో టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Facelift) త్వరలోనే భారత రహదారులపై గర్జించనుంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉండగా, బయటకు వస్తున్న లీకులు కార్ల ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్న బుల్లెట్

భారతీయ రైడర్ల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బైక్‌లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350). దశాబ్దాలుగా కొనసాగుతున్న తన వారసత్వం, క్లాసిక్ డిజైన్, ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్ కారణంగా ఈ బైక్‌కు భారత మార్కెట్లో అపారమైన అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఇది అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటిగా ఉండటం వల్ల, మధ్యతరగతి వినియోగదారులకు కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ అందుబాటు ధర, బ్రాండ్ నమ్మకం, క్లాసిక్ స్టైల్ కలిసివచ్చి బుల్లెట్ 350 అమ్మకాలను ప్రతి నెలా బలంగా నిలబెడుతున్నాయి. 2026 జనవరి నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.

ఇండియాలో తొలి CNG స్కూటర్ ఇదేనా? జూపిటర్ భారీ ఎంట్రీ!

భారత టూవీలర్ మార్కెట్లో విశేషమైన స్థానం సంపాదించుకున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) ఒకటి. ప్రారంభం నుంచే కుటుంబాల కోసం, రోజువారీ ప్రయాణాల కోసం సరైన ఎంపికగా నిలిచిన ఈ స్కూటర్, సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. నగర రహదారులపై, చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా జూపిటర్ కనిపించడం సాధారణమే. దీని సౌకర్యవంతమైన సీటింగ్, సాఫ్ట్ సస్పెన్షన్ సెటప్, విశ్వసనీయమైన పనితీరు కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా మారింది. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన Honda Activa కు జూపిటర్ బలమైన పోటీదారుగా నిలవడం కూడా చిన్న విషయం కాదు.
Advertisement

బడ్జెట్ ధరలో అదిరిపోయే అడ్వెంచర్ బైక్స్ ఇవే

సాధారణ రోడ్లపై బైక్ నడపడం ఒక ఎత్తు అయితే, ఎగుడుదిగుడు రాళ్లు, బురద దారులు, కొండ ప్రాంతాల్లో బైక్ రైడింగ్ చేయడం మరో ఎత్తు. దీనినే మనం ఆఫ్-రోడింగ్ అంటాం. ఇలాంటి సాహసోపేతమైన ప్రయాణాలు చేయాలంటే మామూలు బైకులు సరిపోవు. వాటికి పవర్ ఫుల్ ఇంజిన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన సస్పెన్షన్ ఉండాలి. గతంలో ఇలాంటి అడ్వెంచర్ బైకులు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన ఆఫ్-రోడింగ్ బైకులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మీ సాహస యాత్రల కోసం బెస్ట్ అనిపించే టాప్ 5 అఫోర్డబుల్ ఆఫ్-రోడింగ్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

చరిత్ర సృష్టించబోతున్న మహీంద్రా

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరో భారీ విప్లవానికి తెరలేపింది. తన ప్రతిష్టాత్మక బోర్న్ ఎలక్ట్రిక్ (Born Electric) సిరీస్‌లో భాగంగా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2027లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మోడల్ పేరును కంపెనీ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, ఇది గతంలో ప్రదర్శించిన BE.07 కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ అని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ కారు 2026లోనే రావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లాంచ్ టైమ్‌లైన్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కారు మార్కెట్లోకి వస్తే టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 వంటి అంతర్జాతీయ మోడళ్లకు నిద్రలేకుండా చేయడం ఖాయం.

చిన్న కార్లలో పెద్ద పోటీ.. ఆల్టో K10 vs ఎస్-ప్రెస్సో

భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలల కార్లలో ఎప్పుడూ ముందుంటున్న రెండు ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10), మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso). చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, పెద్ద ప్రయోజనాలను అందించే ఈ కార్లు నగర జీవనశైలికి అచ్చంగా సరిపోతాయి. సులభమైన డ్రైవింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ వంటి లక్షణాలు వీటిని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తాయి. ఈ రెండు కార్లలోనూ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు వినియోగదారులకు అదనపు భరోసాను ఇస్తాయి. ఈ కార్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

ఏప్రిల్ నుంచి పెట్రోల్ బంకుల్లో కొత్త పెట్రోల్

భారతదేశ ఇంధన రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. పర్యావరణాన్ని కాపాడటం, విదేశాల నుంచి కొనే ఆయిల్ ఖర్చు తగ్గించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 95 RON (రీసెర్చ్ ఆక్టేన్ నంబర్) ఉన్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20 ఇంధనం) తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం కలగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.
Advertisement

రెండూ యువత మెచ్చే స్కూటర్లే.. మరి ఏది కొనాలి

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రధాన దిగ్గజాలైన టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో తమ ఉనికి మరింత పటిష్టం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ రెండు కంపెనీలు తమ అత్యంత సరసమైన మోడళ్లను రంగంలోకి దించాయి. టీవీఎస్ నుంచి ఆర్బిటర్ (TVS Orbiter), బజాజ్ నుంచి చేతక్ సీ2501 (Bajaj Chetak C2501) మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది కొనడం లాభదాయకం? ఏది మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మోడీ ఇజ్రాయెల్ టూర్‌లో అట్రాక్షన్‌గా ఎన్‌ఫీల్డ్ బైక్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత బలపరిచే ఈ పర్యటనలో ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సాంకేతిక, రక్షణ, వ్యవసాయం, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే దృఢ సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జెరూసలేం నగరంలో జరిగిన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా పాల్గొన్నారు.

పాతికేళ్లలో 50 లక్షల కుటుంబాలకు చేరువైన యాక్టివా

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో స్కూటర్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హోండా యాక్టివా (Honda Activa). రెండు దశాబ్దాలకు పైగా భారతీయుల ప్రయాణాల్లో అంతర్భాగంగా మారిన ఈ స్కూటర్, ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకుంది. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లలో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో యాక్టివా ఏకంగా 50 లక్షల (5 మిలియన్లు) విక్రయాల మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక రాష్ట్రంలోనే ఒక మోడల్ ఇంత పెద్ద ఎత్తున అమ్ముడవడం యాక్టివా బ్రాండ్ పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకాన్ని చాటిచెబుతోంది. హోండా యాక్టివా ప్రస్థానం నేటిది కాదు. గత 25 ఏళ్లుగా ఈ స్కూటర్ నిరంతరాయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2001లో మొదటిసారిగా మార్కెట్లోకి ప్రవేశించిన యాక్టివా, అప్పటి వరకు ఉన్న గేర్ స్కూటర్ల ట్రెండ్‌ను మార్చేసి గేర్ లెస్ విప్లవాన్ని తీసుకొచ్చింది.

ప్రతిరోజూ 1180 మంది ఇదే స్కూటర్‌ కొంటున్నారు

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో యువత మనసు గెలుచుకున్న స్కూటర్లలో ఒకటిగా నిలిచిన టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq 125) ఇప్పుడు అమ్మకాల పరంగా మరోసారి తన సత్తా చాటింది. స్టైలిష్ డిజైన్, స్పోర్టీ లుక్, స్మార్ట్ ఫీచర్లు కలిసొచ్చి ఈ స్కూటర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. అందుకే రోజురోజుకూ దీనిపై డిమాండ్ పెరుగుతూ వస్తోంది. 2026 జనవరి నెలలో ఈ స్కూటర్ భారీ స్థాయిలో అమ్ముడవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఒక్క నెలలోనే మొత్తం 36,596 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడం గమనార్హం. రోజుకు సగటున 1,180 ఎన్‌టార్క్ స్కూటర్లు అమ్ముడవడం అంటే, యువతలో దీనికి ఎంతటి ఆదరణ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.
Advertisement

ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ 2026 విజేతలు వీరే

భారత ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమంగా పేరుగాంచిన ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ (Acer FASTER Awards) 2026 ఐదో ఎడిషన్‌ను గుర్గావ్, ఎన్‌సీఆర్‌లో ఘనంగా నిర్వహించారు. Federation of Auto Scribes of the Electronic Realm (FASTER) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 2025 సంవత్సరంలో భారత ఆటో పరిశ్రమలో ఉత్తమ కార్లు, మోటార్‌సైకిళ్లను గుర్తించారు. ఈ అవార్డులకు ప్రధాన స్పాన్సర్‌గా ఏసర్ ఇండియా వ్యవహరించగా, అదనపు స్పాన్సర్‌గా స్పార్క్ మీడియా లిమిటెడ్ భాగస్వామ్యమైంది. ఈ భాగస్వామ్యంతో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆటోమొబైల్ తయారీ విభాగం మాత్రమే కాకుండా, ఇతర ముఖ్య విభాగాల్లోనూ ప్రతిభ కనబర్చిన మొత్తం 13 మంది విజేతలను సత్కరించారు.

ఈ తేదీ గుర్తుపెట్టుకోండి.. షోరూమ్ ముందు క్యూ కడతారు!

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ (Renault Duster SUV) విప్లవాత్మకమైన రూపంలో ఫ్యాన్స్ ముందు వచ్చింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక లుక్, డజన్ల కొద్దీ ఆవిష్కరణలతో ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రతి SUV ప్రేమికుని ఆకట్టుకునేలా ఉంటుంది. దీని సొగసైన ఎక్స్టీరియర్, డైనమిక్ ప్రొపోర్షన్స్, రోడ్డుపై ప్రత్యేక ప్రెజెన్స్‌తో సరళంగా గుర్తించబడతాయి, అలాగే ఇంటీరియర్‌లో సౌకర్యాలు, టెక్నాలజీ ఫీచర్లు, ప్రీమియం ఫినిషింగ్ కస్టమర్ల అనుభవాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి. రెనాల్ట్ ఇప్పటికే జనవరి 26న ఈ కొత్త SUVని ప్రీ-బుక్ కోసం ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు సమీప షోరూమ్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, రూ. 21,000 అడ్వాన్స్ చెల్లించి ఆర్డర్ చేసుకోవచ్చు.

భారీగా పెరుగుతున్న వాహనాల ధరలు

తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం పెద్ద షాక్‌లా మారింది. ఇప్పటికే పెరుగుతున్న వాహన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, ఇంధన వ్యయం మధ్య ఇప్పుడు మరో అదనపు భారం చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై "రోడ్ సేఫ్టీ సెస్" పేరుతో అదనపు పన్ను విధించేందుకు సిద్ధమైంది. రవాణా శాఖ అధికారికంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఈ రోడ్డు భద్రతా సెస్ మార్చి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే ఆ తేదీ తర్వాత నమోదు చేసుకునే ప్రతి కొత్త వాహనంపై ఈ అదనపు పన్ను వర్తిస్తుంది. ఫలితంగా, కార్లు, బైక్‌లు, SUVలు సహా అన్ని కొత్త వాహనాల ఆన్-రోడ్ ధరలు పెరగనున్నాయి.

దేశంలోనే జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే

ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్త మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara) ఎలక్ట్రిక్ SUV మంచి చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తీసుకున్న ఈ పెద్ద అడుగు కంపెనీకి మాత్రమే కాకుండా, మొత్తం మార్కెట్‌కే ఒక కొత్త దిశను చూపిస్తోంది. ఆధునిక డిజైన్, హైటెక్ ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ కలిపి ఈ ఇ-విటారాపై వినియోగదారుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా సరసమైన ధర శ్రేణిలో ఎలక్ట్రిక్ SUV అందుబాటులోకి రావడం చాలా మందికి ఆకర్షణీయంగా మారింది. అయితే, ఈ డిమాండ్ కారణంగా ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది.
Advertisement

ఇప్పుడు స్కూటర్ కొంటే నక్కతోక తొక్కినట్లే!

జపాన్ దిగ్గజ సంస్థ సుజుకి (Suzuki) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో బలమైన అడుగు వేయడానికి తీసుకొచ్చిన కొత్త సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) ఇప్పటికే వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. జనవరి 9న అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, లాంచ్ అయిన వెంటనే మంచి స్పందన అందుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ చూస్తే, మార్కెట్‌లో దీనికి ఉన్న క్రేజ్ ఎంత అన్నది స్పష్టమవుతోంది. ప్రారంభించిన మొదటి నెలలోనే 201 యూనిట్లు కస్టమర్లకు డెలివరీ చేయబడటం చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్న ఈ సమయంలో, కొత్తగా వచ్చిన మోడల్‌కు ఇంత త్వరగా ఆమోదం రావడం విశేషమే.

ఈ స్కూటర్ మీద లీటరు పెట్రోల్‎తో 59కిమీ పోవచ్చు

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ అంటే కేవలం వాహనాల క్రయవిక్రయాలు మాత్రమే కాదు, అది కోట్ల మంది మధ్యతరగతి ప్రజల భావోద్వేగం. ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో స్కూటర్ అనేది ఇంటి సభ్యుడితో సమానం. కిరాణా సరుకులు మోయాలన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకురావాలన్నా, లేదా ఉదయాన్నే పిల్లలను స్కూల్లో దింపాలన్నా అందరికీ టక్కున గుర్తొచ్చేది గేర్‌లెస్ స్కూటర్లే.

ఎలక్ట్రిక్+పెట్రోల్ పవర్‌తో నడిచే JSW మోటార్స్ తొలి కారు

JSW Groupతో విలీనం తర్వాత MG Motor Indiaలో ఎలక్ట్రిక్ కార్ల హవా మరింత పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తున్న MG ఈవీలు వినియోగదారుల దృష్టిని బలంగా ఆకర్షించాయి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్న ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలోనే JSW గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే, JSW మోటార్స్ అనే ప్రత్యేక ఆటోమొబైల్ కంపెనీని స్థాపిస్తున్నట్టు ప్రకటించడం. భారతదేశ ప్రయాణీకుల వాహన విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న JSW Motors తన ఎంట్రీని చాలా స్టైలిష్‌గా ప్రకటించింది.

సుజుకి యాక్సెస్ స్కూటర్‌కు భారీ డిమాండ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి (Suzuki) భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజీ ఈ మూడు అంశాలు సుజుకి వాహనాలను భారతీయ వినియోగదారులలో ప్రాచుర్యం పొందేలా చేశాయి. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో అయితే, కంపెనీ స్థానం మరింత బలంగా ఉంది. ఆ విభాగంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125). నగర ప్రయాణాలకు అనుకూలమైన డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్, మంచి మైలేజీ, స్మూత్ రైడింగ్ అనుభవం కారణంగా ఈ స్కూటర్ ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది.
Advertisement

కోట్లు పోసి కొన్న టయోటా కారుకు షాక్

ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరుగాంచిన టయోటా (Toyota) కంపెనీకి చెందిన ఒక లగ్జరీ ఎస్‌యూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన పటిష్టమైన నిర్మాణం, మొండితనంతో ఆఫ్-రోడింగ్ కింగ్ అని పిలవబడేటయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Land Cruiser 300) వాహనాలను కంపెనీ వెనక్కి పిలిపిస్తోంది (Recall). కోట్ల రూపాయలు పోసి కొన్న ఈ కారులో టెక్నికల్ లోపం తలెత్తడం ఇప్పుడు వాహన రంగంలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.